డా,,దూడపాక రమేష్ ను సన్మానించిన మంద కృష్ణ మాదిగ…

డా,,దూడపాక రమేష్ ను సన్మానించిన మంద కృష్ణ మాదిగ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సు లో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేతులమీదుగా మొగుళ్ళపల్లి మండలం ఆకినపల్లి గ్రామానికి చెందిన దూడపాక రమేష్ ఇటీవల గోవా రాష్టంలో నిర్వహించిన సాహిత్య రంగంలో. డ్రీం అచీవ్ మెంట్ అవార్డ్స్ 2025 రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ అఫ్ రికార్డు తో పాటు 21వ సెంచరీ బుక్ అఫ్ రికార్డు వారు గోవా రాష్ట్రంలో నిర్వహించిన సదస్సులో డాక్టరేట్ ను పొందిన సందర్భంగా డాక్టర్. దూడపాక రమేష్ ను శాలువాతో గౌరవంగా సత్కరించటం జరిగింది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ గౌరవమైన డాక్టరేట్ విడివిధానాలను గూర్చి తెలుసుకొని మాట్లాడుతూ. పేద కుటుంబంలో నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి డాక్టరేట్ పొందడం చాల సంతోషంగా ఉందని మంద కృష్ణ మాదిగ దూడపాక రమేష్ ను ఆప్యాయంగా అభినందనలు తెలియజేసారు. దూడపాక రమేష్ సాహిత్య రంగంలో తన సాహిత్యంతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందాలని మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని మంద కృష్ణ మాదిగ ఘనంగా సన్మానించారు. అనంతరం డా,,దూడపాక రమేష్
(యువకవి మద్దాలి అవార్డు గ్రహీత) మాట్లాడుతూ. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత. మంద కృష్ణమాదిగ అన్న చేత సన్మానం పొందడం గొప్ప అనుభూతి గా ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ. మంద కృష్ణ దీవెనలతో నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్న, ఆశీర్వాదంతో అలాగే నా స్నేహితుల ప్రోత్సాహంతో నేను ఎంచుకున్న రంగంలో మరింత ఉన్నత స్థాయికి రావడానికి తప్పకుండా కృషి చేస్తానని దూడపాక రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు జీడి సంపత్, దూడపాక శ్రీనివాస్, అడ్వికెట్ భిక్షపతి, ఎం ఆర్ పి ఎస్. గ్రామ అధ్యక్షుడు గడ్డం రమేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం…

డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం
తొలి గ్రహీతగా డా. చిటికెన కిరణ్ కుమార్ ఎంపిక

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందిస్తూ కవిగా, రచయితగా, విమర్శకుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సిరిసిల్ల వాస్తవ్యులైన డా. చిటికెన కిరణ్ కుమార్ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ జాతీయ సాహిత్య పురస్కారం తొలి గ్రహీతగా అఖిల భారత పద్మశాలి సంక్షేమ సంఘం ఎంపిక చేసింది.డా. కిరణ్ కుమార్ సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. చైతన్య స్ఫూర్తి వంటి ప్రథమ గ్రంథం, ఓ తండ్రి తీర్పు లఘు చిత్రకథ, వందలాది పత్రికలలో వెలువడిన అనేక కవితలు,వ్యాసాలు, సమీక్షలు, సంపాదకీయాలు—ఇవి అన్నీ తెలుగు పాఠకలోకంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి గర్వకారణంగా నిలిచింది.
ఈ అవార్డు, పద్మశాలి కుల భూషణులు, వేలాది లలితగీతాలు రచించిన సుప్రసిద్ధ సినీ గేయరచయిత, జాతీయ మహాకవి స్వర్గీయ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ స్మారకార్థం సంస్థ స్థాపించింది. తెలుగు సాహిత్యానికే కాదు, సంగీత, సినీ ప్రపంచానికీ ఆయన అందించిన విలువైన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తుంది.
ఈ అవార్డును మొదటిసారిగా డా. చిటికెన కిరణ్ కుమార్ అందజేయడం తమ సంఘానికి గర్వకారణమని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు తుమ్మ సత్యనారాయణ, సూరేపల్లి రవికుమార్ లు ఒక ప్రకటనలో తెలియజేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో, ప్రముఖుల సమక్షంలో ఈ పురస్కారం ఘనంగా ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఎలగొండా రవి, ప్రధాన కార్యదర్శి ఆడెపు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బూర దేవానందం, యువజన కార్యదర్శి అంకారపు రవి, కవులు,కళాకారులు, రచయితలు అభినందించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version