మంగపేట మండలం లో స్థానిక ఎన్నికలు జరగడానికి మోక్షo ఎప్పుడో
ఎన్నికల కమిషన్ మంగపేట మండలం మీద చోరువా తీసుకొని స్థానిక ఎన్నికలు జరిగే విదంగా చూడాలి
మంగపేట నేటిధాత్రి
ములుగు జిల్లా మంగపేట మండలం 2013 ఎన్నికల నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చినది కానీ ఇప్పుడు 25 /11/2025 నోటిఫికేషన్ ప్రకారం కోర్ట్ స్టే ఇవ్వలేదు కనుక మంగపేట మండలం లో స్థానిక ఎన్నికలు జరిపించాలి అని ఎస్సి బీసీ ప్రజా సంఘాల నాయకులు స్థానిక ఎన్నికలు లేక సుమారు 20 సంవత్సరాలు లేనట్లేన ఈ సారి స్థానిక ఎన్నికలు జరగకుంటే ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు జరిపిస్తే మంగపేట మండల ప్రజలు ప్రతి ఒక్కరు నోటకే ఓట్ వేస్తామని ప్రజలనుండి మాటలు వినుపిస్తున్నవి ఏదేమైనా సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానికులు ఎవరైనా పరవాలేదు కాను స్థానిక ఎన్నికలు జరుగలి మంగపేట గిరిజనులు మంగపేట ఏజెన్సీ అని గురిజనేతలు మంగపేట మండలం నాన్ ఏజెన్సీ అనీ వివాదం తో 15 సంవత్సరాలు పూర్తి అయింది కానీ కోర్ట్ లో ఉన్న విషయాన్నీ ఇంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఈ విషయం పై స్వందించకపోవడం మంగపేట మండల ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు త్వరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు మంగపేట మండలం విషయం పై స్వంధించి స్థానిక ఎన్నికలు జరిపించే విదంగా చోరువా తిసుకోవాలని గుగ్గిళ్ల సురేష్ మాదిగ విలేకర్ల సమావేశం లో మాట్లాడం జరిగింది సుప్రీం కోర్ట్ లో ఉన్నటువంటి కేసును త్వరగా ప్రభుత్వలు స్వందించి మంగపేట మండల కేంద్రంలో స్థానిక ఎన్నికలు జరిగే విదంగా చూడాలి ప్రజలు ఉద్యోగ పరంగా కానీ మండల అభివృద్ధి పరంగా కానీ ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ప్రజలు వెనుక పడడం జరుగుతుంది ఈ సారి స్థానిక ఎన్నికలు జరకుండా ఉంటే రాబోయే రోజులల్లో ఎమ్మెల్యే ఎన్నికలు గాని ఎంపి ఎన్నికలు గాని ఇంకా ఎ ఎన్నికలు కూడా జరగకూడదు గుగ్గిళ్ల సురేష్ మాదిగ మంగపేట ప్రజా నాయకులు మాట్లాడడం జరిగింది బీసీ మండల నాయకులు గాదె శ్రీనివాస్ చారి, దంతానపల్లి నరేందర్, పరికి శ్రీనివాస్, యాసం హరీష్, ఈసంపల్లి సురేందర్ మాదిగ తదితరులు పాలుగోన్నారు
తెలంగాణ: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, ఎంపీటీసీ ,జెడ్పిటిసి, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.
హరీష్ రావు, కేటీఆర్ లను కలిసిన ఎమ్మెల్యే జహీరాబాద్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ అసెంబ్లీ సభ్యుడు మాణిక్ రావు నేతృత్వంలో, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, ముఖ్యంగా కోహిర్ మండల్ నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రతినిధి బృందం జహీరాబాద్ నగరం నుండి బయలుదేరి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను సందర్శించి, మాజీ రాష్ట్ర మంత్రి మరియు సిద్దిపేట అసెంబ్లీ సభ్యుడు హరీష్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ. రామారావును వారి హైదరాబాద్ నివాసాలలో కలిశారు.
ఈ సందర్భంగా, హరీష్ రావు మరియు కేటీ. రామారావు జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంతో, ముఖ్యంగా సమీపంలో జరుగుతున్న సంస్థలతో వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు.స్థానిక ఎంపీటీసీలు, జెడ్పీపీసీలు, సార్-ఎ-ఇంచాస్ కౌన్సిల్లు ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉన్న అభ్యర్థుల విజయానికి వ్యూహాలను రూపొందించడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా, రైల్వే అడ్వైజరీ బోర్డు మాజీ సభ్యుడు అల్హాజీ షేక్ ఫరీద్, మాజీ సయ్యద్ మొహియుద్దీన్, నాదన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నర్సింలు యాదవ్, అధ్యక్షుడు బీఆర్ అరైన్, కోహిర్ మండలం ముహమ్మద్ కలీముద్దీన్, మాజీ ప్రతినిధి సర్, మీర్ మహమ్మద్ ఫిర్దౌస్, ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్, బీర్నౌ మహమ్మద్ వాజిద్ జబీహ్, మాజీ సభ్యుడు వారిద్, కోహిర్ గ్రామ పంచాయతీ సయ్యద్ అజ్మత్ హత్, అధ్యక్షుడు బీఆర్ఎస్, కోహిర్ మహ్మద్ అర్బాజ్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద సిఐ దేవయ్య ఆదేశాల మేరకు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య పటిష్ట బంధవస్తు నిర్వహించారు. పై అధికారుల ఆదేశాల మేరకు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశామని తెలిపారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్సై లు హెచ్చరించారు.అలాగే తాండూర్ మండల కేంద్రంలో గురువారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.
బి.ఆర్.ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం ఆశావహుల జాబితాను అధిష్టానానికి పంపిన నేతలు కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల
నేటిధాత్రి ఐనవోలు :-
Vaibhavalaxmi Shopping Mall
అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో బుధవారం వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మరియు అయినవోలు మండల పార్టీ సూచన మేరకు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల సమావేశం బుధవారం గ్రామ పార్టీ అధ్యక్షులు మామిండ్ల సంపత్ అధ్యక్షతన గ్రామ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పార్టీ ఎన్నికల ఇన్చార్జి మున్సిపాలిటీ పరిధి నుండి మేకల రాణి డివిజన్ పార్టీ అధ్యక్షులు కాంటెస్ట్ కార్పోరేటర్& అయినవోలు మండలం నుండి గ్రామ పార్టీ ఎన్నికల ఇన్చార్జిగా ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ కట్కూరి రాజు హాజరై రాబోయే జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచి వార్డు సభ్యుల ఎన్నికల గెలుపు కొరకు పార్టీ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసి కార్యకర్తలను ప్రోత్సహించినారు. అనంతరం కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసినారు. మరియు ఎంపీటీసీ జనరల్ మహిళ ఆశావాహ పోటీ చేసే అభ్యర్థుల నుండి పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ సంపత్, మాజీ ఎంపీటీసీ కడూరి రాజు, నందనం సొసైటీ డైరెక్టర్ రాజారాపు కుమార్, సతీషు, రమేషు, భాస్కరు, ప్రతాపరెడ్డి, సమ్మయ్య, రాజు, రాజిరెడ్డి, రాజేషు, అశోకు, కుమారు, రాజు, రమేషు, రాజబాబు, కుమారు, ప్రతాపు, రాజశేఖర్, మరియు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
రేషన్ డీలర్లూ అర్హులే .. స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ గైడ్లైన్స్
జడ్పీటీసీ అభ్యర్థి ఖర్చు లిమిట్ రూ.2.50 లక్షలు, ఎంపీటీసీకి రూ.1.50 లక్షలు
సర్పంచ్కు జనాభాను బట్టి రూ.2.50 లక్షలు, రూ.1.50 లక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్అయింది. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండినోళ్లు అర్హులు.
పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పోటీకి అనర్హులు.
మతసంబంధమైన సంస్థల చైర్మన్లు, సభ్యులకు అవకాశం లేదు. సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు కాకుండా ఇతర ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వ్యక్తి..
శిక్ష విధించిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హుడవుతాడు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీకి అనర్హులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా (గుత్తేదారులు) పోటీకి అర్హత ఉండదు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చెంతంటే?
అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను ఎస్ఈసీ నిర్ధారించింది. జడ్పీటీసీ అభ్యర్థి రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఇక 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.
అలాగే 5 వేల కంటే జనాభా ఎక్కువున్న పంచాయతీలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5 వేల కంటే తక్కువుంటే రూ.30 వేల వరకు ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాల కోసం తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి.
ఖర్చుల నివేదికను సమర్పించాలి. అంతేకాకుండా, అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, అనర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులు, అప్పులు విద్యా వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇందులో ఏదీ లేకపోయినా నామినేషన్ తిరస్కరిస్తారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
డిపాజిట్ తప్పనిసరి..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి బ్యాంకు డిపాజిట్ చేయాలి. జడ్పీటీసీ పదవికి పోటీచేసే అభ్యర్థి (జనరల్) రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు రూ. 2,500 డిపాజిట్చేయాలి. ఎంపీటీసీగా చేసేవారు రూ.2,500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.1,250, సర్పంచ్అభ్యర్థి రూ.2 వేలు (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.వెయ్యి, వార్డు సభ్యుడికి రూ.500 (జనరల్), ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250. పోటీచేసే అభ్యర్థులు పంచాయతీల పన్ను బకాయిలు, కరెంట్ బిల్లులు కూడా క్లియర్ చేసి ఆ రసీదులు తీసుకోవాలి. అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.
పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం బంద్..
ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి మూడు రోజుల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనున్నది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడకూడదు. సమావేశాలు, ర్యాలీలు, ఇతర ప్రదేశాల్లో మీటింగ్ కు అనుమతి తప్పనిసరి. అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలపాలి. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపై ఆంక్షలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగే అవకాశం ఉంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయవద్దు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం.. దొంగ ఓట్లను ప్రోత్సహించడం నేరం. అలాగే అభ్యర్థి డిపాజిట్ తిరిగి పొందాలంటే తనకు పోలైన మొత్తం ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు సాధించాలి. లేదంటే డిపాజిట్ రాదు.
లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్..
రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీల జాబితా, వారికి కేటాయించిన గుర్తులతో పాటు ఎలాంటి కేటాయింపులు లేని ‘లిస్ట్ ఆఫ్ ఫ్రీ సింబల్స్’ జాబితాను తెలంగాణ గెజిట్లో ఎస్ఈసీ ప్రచురిస్తుంది. తమ వద్ద రిజస్టర్ అయ్యి ఎలాంటి గుర్తు కేటాయించని పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు ‘ఫ్రీ’ గుర్తులను కేటాయించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
న్యాల్ కల్ మండలం వడ్డి గ్రామం లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ మండలం మాజీ అధ్యక్షులు ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నుండి పార్టీ మార్పు చేసిన నాయకులపై ఫైర్ అయ్యారు కితకో పార్టీ మార్పు చేస్తున్న నాయకులకు ప్రజలు యూవకులు గమనిస్తున్నారు అని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికీ చిత్తూ చిత్తూ గా ఒడిస్తాం అని వారు ఫైర్ అయ్యారు రానున్న ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు పోటి చేపిస్తాం జడ్పీటీసీ కీ కూడ గెలుపే లక్ష్యంగా అందరు పని చెయ్యాలని ఎవరు ఆ ధైర్యం పడొద్దు అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో మండలం ప్రధాన కార్యదర్శి రాహుల్ పలింకార్ నర్సప్ప సచిన్ లక్ష్మన్ షేర్ అలీ సంజుకుమార్ రాజు తదితరులు ఉన్నారు,
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి
సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ కానాలకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నది కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా ప్రజల కొరకు పనిచేసిన దాకాలు లేవు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అయిన తర్వాత హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కేయడం పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారింది చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్న పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు ఇసుక మాఫియా. ప్రకృతి సంపద దోచుకోవడం. రోజురోజుకు పెరిగిపోతాయి ప్రశ్నించే గొంతుక లేకపోవడం వలన అవినీతి రాజ్యమేలుతుంది ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి.నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి. కోడం రమణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర సిపిఎం నాయకులు,సందు పట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.
న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సమావేశాన్ని నిర్వహించిన
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా ఏ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మాజీ మంత్రివర్యులు డా||ఏ.చంద్రశేఖర్ అధ్యక్షతన న్యాలకల్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రి డా||చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంగా ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయమై న్యాలకల్ మండల కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశగా ఉన్నావారు,పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసినవారు మీ మండల అధ్యక్షులు తెలియజేసిన వెంటనే వారు మండలంలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులను పరిశీలించి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నా వారి పేర్లను ఇంచార్జ్ డా౹౹చంద్రశేఖర్ ద్వారా జిల్లా పార్టీ అధిష్టానానికి పంపించడం జరుగుతుంది.మరియు కచ్చితంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మరియు గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను ప్రతి గ్రామంలో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని, నాయకులకు వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి పిఏసిఎస్ ఛైర్మెన్ సిద్దిలింగయ్య ఏ.యం.సి.వైస్ ఛైర్మెన్ తురుపతి రెడ్డి మాజీ జడ్పీటీసీ చంద్రప్ప మాజీ ఎంపీపీ రత్నం కాంగ్రెస్ నాయకులు మాక్సూద్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ గౌడ్ ఎస్సి సెల్ అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు..
స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో పల్లెల్లో ఎన్నికల సందడినెలకొంది ఆశావాహులు రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి సిద్ధమ వుతున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు పార్టీ లకు అతీతంగా జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను గెలుచు కుని జెడ్పి,ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.
చేసింది చెప్పాలని కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారెంటీలతో రూపొం దించిన పథకంలో భాగంగా రైతు భరోసా,సన్నబియ్యం, బోనస్,మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి,చేయూత ప్రభు త్వం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం చూస్తుంది ఎమ్మెల్యే పార్టీ నేతలకు మార్గదర్శకాలు చేయనున్నారు.
సాధ్యమైనన్ని గెలవాలి భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలవాలని చూస్తుంది పార్టీ పెద్ద నేతలు దిశానిర్దేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు భూపాలపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయా లని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని చూస్తున్నారు.
వైఫల్యాలను ఎండగట్టా లని బీఆర్ఎస్ పార్టీ కసరత్తు
టిఆర్ఎస్ నేతలు అభ్యర్థుల గెలుపునకు ప్రణాళికలు రచిస్తున్నారు మండల గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమయతమవుతున్నారు మండల గ్రామ స్థాయిలో సమస్యలపై ప్రభావం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయనున్నట్లు దాసరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ కు మండల సమస్యలపై మంచి పట్టు ఉండటం వలన మౌలిక సదుపాయాల అభివృద్ధి కై కృషి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ సీట్ కోసం రసవత్తరంగా పోటీ ఉండనున్నట్లు తెలిపారు.రాజకీయాల్లోకి చదువు కున్న యువతి, యువకులు రావాలని, అప్పుడే అన్ని గ్రామాలలో అభివృద్ధి మెరుగవుతుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.
ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే చాన్స్ రాలే.. ఏం చేద్దాం ఉన్నదాంట్లో సర్దుకు పోదాం.. అంటూ వివిధ పార్టీల తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారు. రిజర్వేషన్లు ఒక్కసారిగా తమ్ముళ్ల తలరాతలను మార్చేశా యి. ఇక ఆశలన్నీ నామినేటెడ్ పదవుల పైనే.. అంటూ గల్లి నుంచి జిల్లా దాకా తమ్ముళ్ల చర్చ జోరుగా సాగుతుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయడంతో కొన్ని సామాజిక వర్గాల తమ్ముళ్ల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. గల్లి నుంచి జిల్లా దాకా కొన్ని సామాజిక వర్గాల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జిల్లా మండల స్థాయిలో పదవులు దక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేశారు. ఆయా పార్టీలో పని చేస్తున్న చోట నాయకులంతా తమ ఉనికిని చాటుకోవడానికి వివిధ గ్రామాల్లో అనేక సామాజిక కార్యక్రమా లను చేపడుతూ ప్రజల మధ్య ఉండి సేవలందించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీచేసి పదవులు దక్కించుకోవాలని ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో ఇతర సామాజిక వర్గాలకు వాళ్ల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు జరిగింది.
‘బీసీ ఓట్ల శాతం గల్లి నుంచి జిల్లా దాకా. అధికంగా ఉండడంతో ఎంపీటీసీ జెడ్పిటిసి గ్రామ సర్పంచ్ పదవుల
అధికంగా జనాభా ప్రతిపాదికన బీసీ సామాజిక వర్గాలకు అధిక రిజర్వేషన్లు దక్కాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వికారాబాద్ పరిగి కొడంగల్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు అధిక పదవులు దక్కే అవకాశం ఉంది.
రిజర్వేషన్లలో భారీగా మార్పు జరిగింది. దీంతో గ్రామపంచాయతీ నుంచి మండల జిల్లా స్థాయి వరకు ముఖ్యమైన కీలక పదవుల్లో రిజర్వేషన్లు ఒక్కసారిగా మారిపోయాయి. రెండువేల జనాభా. ప్రకారం అప్పట్లో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు ఒక సామాజిక వర్గానికి అందే విధంగా ఉండేది. కానీ 2025 బీసీ జనాభా ఓటర్ల ప్రతిపాదికన అన్ని సామాజిక వర్గాల్లో రిజర్వేషన్ల మార్పు జరిగింది. దీంతో తాము పోటీ చేయాలనుకుంటున్నా పదవి రిజర్వేష స్ ఇతర సామాజిక వర్గాలకు కేటాయించడంతో వాళ్ల ఆశలు నీరు కారిపోయాయి. అధికంగా జనాభా ప్రతిపాది కన బీసీ సామాజిక వర్గాలకు అధిక రిజర్వేషన్లు దక్కాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వికారాబాద్ పరిగి కొడంగల్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు అధిక పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ సామాజిక వర్గాలు సర్పంచు లుగా జెడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులుగా గెలుపొంది మండల స్థాయిలో ఎంపీపీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న కొన్ని సామాజిక వర్గాల నాయకులు నామినేటెడ్ పదవులు లేదా వివిధ రాజకీయ పార్టీల కీలక పదవులను ఆశించే పనిలో పడ్డారు. రిజర్వేషన్ ఈ వర్గానికి వచ్చిన పార్టీ పరంగా మద్దతు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకొని అత్యధికంగా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేయాలని ఆయా పార్టీల నాయకులకు అధిష్టాన వర్గం దశ దశ నిర్దేశం చేసింది. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై ‘ కారణంగా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.. అక్టోబర్ 9న అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికలు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అప్పటిలోగా తమ అభ్యర్థులను ఖరారు చేసుకోవడానికి గ్రామాల వారీగా నాయకుల జాబితా కోసం పార్టీల కసరత్తు జరుగుతుంది. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఆయా పార్టీలో బలం ఎంతో ఎన్నికలు తర్వాత ఓటింగ్ లో భవతం తేలనుంది అప్పటివరకు వేది రూద్దాం…
బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు,స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ఆర్థికంగా ఆడుకోవాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం కె.రామస్వామి, నియోజకవర్గ బీసీ కన్వీనర్ పాడాటి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కులు కల్పించి వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ,జెడ్పిటిసి సర్పంచు, ఎన్నికల్లో ప్రతి గ్రామంలో 42 శాతం రిజర్వేషన్ కోటా ప్రకారం స్థానాలు కల్పించాలని అన్నారు. రాష్టంలో అత్యధికంగా బీసీలు ఉన్నారని వారి అభివృద్ధికి బీసీ బందును ప్రవేశపెట్టి బడ్జెట్లో అధికనిధులు కేటాయించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్రం బీసీలకు ఇతర వర్గాలకు ఇండ్లు మంజూరులో ఇంటికి 10 లక్షలు రూపాయలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వాలు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని అన్నారు. నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.రైతులు యూరియా కోసం గత 20 రోజులగా అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి సకాలంలో ఎరువులను అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి బీసీ సంఘాల నాయకులు ఎం. సుధాకర్ గౌడ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, నియోజకవర్గం బీసీ కన్వీనర్ పాడాటి వెంకటయ్య, కో కన్వీనర్ జీ నరసింహులు, మొయినాబాద్ మండల సిపిఐ కార్యదర్శి కే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం
◆:- యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక సంస్థ ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి గారికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ వినతిపత్రం త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ కోరారు. సంగారెడ్డి పట్టణంలోని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ తో పాటు మున్సిపల్ ఎన్నికలలో 20శాతం కోట యువతకు కేటాయించాలన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. నిర్మల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. వివిధ నియోజకవర్గం అధ్యక్షులు నవీన్, నాగిరెడ్డి, వెంకట్ జింగ, సిద్ధారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, వసిం, ప్రధాన కార్యదర్శులు అక్బర్, శ్రీహరి గౌడ్, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది కాక బాగున్నారా.. మావ ఎక్కడ పోతున్నవు, ఓ అక్క ని బిడ్డ మంచిగా ఉన్నాదా… మంచిగా చదువుతుందా…. బాపు యూరియ దొరికిందా చల్లినవా పొలంలో… తాత పాణం బాగుందా.. ఇలా రక రకాల పలకరింపులు తో పల్లెల్లో పులకరిస్తున్నాయి. ఈ యెడు అంత మాట్లాడని వారు, వరుస లు కలుపుతూ పలకరిస్తుండడంతో ప్రజలు ఉబ్బి తబ్బి పోతున్నారు.. కొందరు ఇదేంరా బాబు ఎన్నడూ లేని వీడు వరుసలు కలవుతున్నాడని లోలోపల గోనుగుతున్నారు.. ఓటర్లకు దగ్గర అయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు వరుసలు కలుపుకొని జనాలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాగా కొందరు మీరు జిమ్ముక్కులు మాకు తెలుసులే అని అంటున్నారు కొందరు పార్టీతో పనిలేకుండా ఓటర్లను వలకరిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.
Local Election Buzz
కూడగట్టుకుంటున్న మద్దతు
సర్పంచు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ఆశావహులు ఇప్పటి సుంచే గ్రామాల్లో కలియదిరుగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వారంతా యువత, ఆయా కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. మరి కొంత మంది విందులు ఏర్పాటు చేస్తూ పలుకుబడి ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకుంటున్నారు. కులాల వారీగా సమీకరణాలను అంచనా వేసుకుంటున్నారు
నేతల చుట్టూ చెక్కర్లు.
సర్పంచ్ బరిలో నిలిచేవారి పేర్లు ప్రచారంలోకి వస్తుండడంతో గ్రామాల్లో రోజుకొకరు పోటీ పడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. తద్వారా ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పార్టీల వారీగా టికెట్ల కేటాయింపు ఉండడంతో నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ అధ్యక్షులతో నిరంతరం టచ్లో ఉంటూ వారి ఆశీస్సులు పొందడానికి పాకులాడుతున్నారు.
Local Election Buzz
ఓటరు జాబితా ప్రచురణ
ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీచేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పటు చేశారు.. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరించి ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేశారు. దీనికి తోడు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పల్లెలో పంచాయతీ సందడి కనిపిస్తుంది.
దారుస్సలాంలో అసదుద్దీన్ ఓవైసీ కౌసర్ మొహియుద్దీన్ కు జహీరాబాద్ ఏఐఎంఐఎం నాయకులు సమస్యలపై మెమోరాండం అందించిన
◆:- జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ,
◆:- దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, ఏఐఎంఐఎం క్రియాశీల నాయకుడు, జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ మరియు దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్, హైదరాబాద్లోని దారుస్సలాంలో అధ్యక్షుడు మజ్లిస్-ఇ-వర్కర్ పార్లమెంట్ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు అసెంబ్లీ సభ్యుడు మరియు మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ కౌసర్ మొహియుద్దీన్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో జహీరాబాద్ రాజకీయ వాతావరణంలో కొత్త కదలిక వచ్చింది. ఈ సెషన్ కేవలం పరిచయ కార్యక్రమం కాదు. జహీరాబాద్లోని వివిధ మున్సిపల్ వార్డుల పరిస్థితి, ప్రజా సమస్యలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని చర్చించాల్సి ఉంది, అది జహీరాబాద్ అయినా లేదా కోహిర్ అయినా. వాజిద్ చర్చను లోతుగా చేస్తూ, ఎంపీటీసీ, జడ్పిటిసి గ్రామ పంచాయతీ మరియు వార్డు సభ్యుల పనితీరుపై వెలుగునింపారు మరియు షేఖాపూర్, మాడ్గి, దగ్వాల్ మరియు ఝరాసంగం యొక్క సర్పంచ్లు మరియు ఎన్నికైన ప్రతినిధులు ఈ ప్రాంత అభివృద్ధి మరియు అభివృద్ధిలో అందించిన గత సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు కౌసర్ మొహియుద్దీన్ జమాత్ ఈ అంశాలను తీవ్రంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో జమాత్ ప్రతినిధులకు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించినట్లే, ఈసారి కూడా వ్యవస్థీకృత మరియు ఉత్సాహభరితమైన ప్రచారంతో రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని వారు తమ ప్రసంగంలో చెప్పారు. రాబోయే రోజుల్లో జహీరాబాద్ మరియు కోహిర్ ఝరాసంగం లలో ఏఐఎంఐఎం రాజకీయ కార్యకలాపాలు మరింత ముమ్మరం అవుతాయనే వాస్తవానికి ఈ సమావేశం ఒక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య జన్మదిన వేడుకలు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో.. సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చించోడు అభిమన్యు రెడ్డి హాజరై శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి పలువురికి పంచారు. ముందుగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మండలంలో ఎర్ర జెండా ఎగురవేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలి- పంజాల శ్రీనివాస్
కరీంనగర్, నేటిధాత్రి:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని, చిగురుమామిడి మండలంలో సీపీఐ పూర్వవైభవం కోసం మండలంలో ఎర్ర జెండా ఎగురవేయడానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున మండలంలోని ఇందుర్తి గ్రామంలో గల అమరజీవి కూన ముత్తయ్య స్మారక భవన్ సీపీఐ కార్యాలయంలో ఇందుర్తి రెవిన్యూ పరిధిలోని రెండు ఎంపీటీసీ స్థానాల గ్రామాలైన ఇందుర్తి, ఓగులాపూర్, గాగిరెడ్డిపల్లె, గునుకులపల్లె గ్రామాల సీపీఐ ముఖ్య నాయకుల సమావేశం సీపీఐ ఇందుర్తి గ్రామశాఖ కార్యదర్శి ఎం.డి.ఉస్మాన్ పాషా అధ్యక్షతన జరిగింది. చిగురుమామిడి మండల కేంద్రంలోని అమరజీవి ముస్కు రాజిరెడ్డి స్మారక భవన్ లో చిగురుమామిడి ఎంపీటీసీ స్థానం సమావేశం అల్లేపు జంపయ్య అధ్యక్షతన జరిగింది. సుందరగిరి ఎంపీటీసీ స్థానం సమావేశం మావురపు రాజు అధ్యక్షతన జరిగింది. లంబాడిపల్లి, సీతారాంపూర్ గ్రామాల ఎంపీటీసీ స్థానం సమావేశం కయ్యం తిరుపతి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరుగా ఉన్న చిగురుమామిడి మండలంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎంతోమంది త్యాగదనులు ప్రాణాలు సైతం కోల్పోయారని, ఈప్రాంతంలో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని వారంతా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం వారి, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారని వారి ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకు పోవడం కోసం మండలంలో ఎర్రజెండాను ఎగురవేసి తిరిగి గత వైభవం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై నాయకులపై ఉందని, నిరంతరం ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించడం కోసం పార్టీ నాయకత్వం ముందుండాలని, పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే పార్టీ ప్రజాపతినిధులు గ్రామ, మండల స్థాయిలో గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వం, ఈప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేసినట్లుగా లేవని, ఆయా పార్టీ నాయకులకే, కార్యకర్తలకే పథకాలు అందాయని, అర్హులైన వారికి అందలేదని, కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు ఉంటేనే పేదలకు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని, న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ అన్నారు. ఈసమావేశాల్లో జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి బూడిద సదాశివ, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, గోలి బాపురెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, గ్రామశాఖ కార్యదర్శులు ఎం.డి.ఉస్మాన్ పాషా, ఇల్లందుల రాజయ్య, అల్లేపు జంపయ్య, ఎలగందుల రాజు, కయ్యం తిరుపతి, బోట్ల పోచయ్య, నాయకులు కూన లెనిన్, రాకం అంజవ్వ, గంధె కొమురయ్య, తాల్లపెల్లి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
టిడిపి మాజి ఎంపీటీసీ ఎమ్మెల్యే మెగారెడ్డి సమీక్ష ములో కాంగ్రెస్ పార్టీ లో చేరిక
వనపర్తి నేటిదాత్రి :
గోపాల్ పేట్ మండల కేంద్ర నికి చెందిన టిడిపి మాజీ ఎంపిటిసి రామచంద్రయ్య వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో టిపిసిసి వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొంకి వెంకటేష్,ఉమ్మడి గోపాల్ పేట్ మండలలా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పోలికపాడు సత్య శీలా రెడ్డి,.మాజీ జెడ్పిటిసి మంద భార్గవి కోటిశ్వర్ రెడ్డి, శివన్న,గంట వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.గోపా.ల్ పేట యాదవ సంఘము అధ్యక్షులు శ్రీశైలంమును శాలువతో ఎమ్మెల్యే మెగారెడ్డి.సన్మానించారు తెలుగుదేశం పార్టీనేత రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి న oదుకు ఎమ్మెల్యే మెగారెడ్డి అభినందించారు
రైతు బంధు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎంపిటిసి వాసాల రామస్వామి
జమ్మికుంట :నేటిధాత్రి
shine junior college
రైతుబంధు నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు, మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి,, ఇ సందర్బంగా మాట్లాడుతూ..ఎకరాలతో సంబంధం లేకుండా రైతులు సాగు చేసిన అన్ని ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, పంటకు ఎకరాకు 6 వేలు చొప్పున సోమవారం రైతు నేస్తం కార్య క్రమంలో పాల్గొని రైతు బందు నిధులు విడుదల చేయడం పట్ల దన్యవాదాలు తెలుపుతున్నం అని జమ్మికుంట కాంగ్రెస్ నాయకులు, తనుగుల తాజా మాజీ ఎంపీటీసీ వాసలా రామస్వామి మాట్లాడారు.ప్రస్తుత పంట సాగు ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్త రైతులకు ఈ బెట్టుబడి సహాయం ఎంతో లబ్ధి చేకూరుతుందని రామస్వామి అన్నారు. నిజానికి రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.