ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా రత్నం శైలేందర్

ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా రత్నం శైలేందర్

పరకాల,నేటిధాత్రి

పట్టణానికి చెందిన రత్నం శైలేందర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినట్లు అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిన్న రాము తెలియజేశారు. రత్నం శైలేందర్ గత 30 సంవత్సరాల నుండి వివిధ దళిత సంఘాలలో పనిచేస్తూ దళితులను సామాజికంగా చైతన్యం కొరకు వారిని మేల్కొల్పడం జరుగుతుంది రత్నం శైలేందర్ గత కొంతకాలంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీకి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారని ఈయన చేస్తున్న పలు కార్యక్రమాలను దళితులకు చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని ఇతనిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు జాతీయా అ ధ్యక్షులు తెలిపారు.ఈ సందర్భంగా రత్నం శైలేందర్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాల దాటుచున్న అప్పటికి పేదవాడు మరింత పేదవాడు గానే ఉంటున్నారని ధనికులు మాత్రం పైపైకి ఎదుగుతున్నారు దీనికి అనేకమైనప్పటికీ ఈ అంతరాలను సేదించడానికి స్వతంత్ర భారత్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల,మత వర్గా లింగ వేదం లేకుండా ప్రతి భారత పౌరుడు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ ఓసి ఆయా కేటగిరీల వారిగా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి అందరికీ సమన్యాయం చేయాలని అన్నారు.

నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి…

నేటి బీసీ ధర్నాను విజయవంతం చేయాలి

బీసీ ఆజాద్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు క్యాతం మహేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

బీసీల రిజర్వేషన్ కోసం 24నా జరగనున్న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు క్యాతం మహేందర్ ప్రైవేట్ వేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 24 వ తేదీన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించాలని జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు, విశారదన్ మహరాజ్ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీసీ సంఘాలు, కుల సంఘాలు బీసీ కులస్తులు గ్రామస్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గత 75 సంవత్సరాలుగా బీసీ ప్రజానీకం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఎందుకు నష్టపోతున్నాం ఎలా నష్టపోతున్నాం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకొని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. ఇప్పటివరకు నష్టపోయింది చాలు ఇకనుంచి అయిన వారి పిల్లల భవిష్యత్తు కోసం నిస్వార్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా నాయకులు కృష్ణ, రమేష్, బిక్షపతి, సలీం ,లక్ష్మణ్ కుమార్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా…

ఈనెల 24న చలో ఇందిరా పార్క్ ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24న హైదరాబాదులో జరగబోయే ధర్నా కార్యక్రమం గురించి బీసీ జేఏసీ కన్వీనర్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుటకు సిరికొండ మధుసూదన చారి జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ బాలరాజు గౌడ్ అన్ని బీసీ సంఘాల మద్దతుతో ఇందిరా పార్కు వద్ద హైదరాబాదులో నిర్వహిస్తున్న భారీ ధర్నా కార్యక్రమానికి బీసీ లందరూ ఐక్యంగా పాల్గొని ధర్నాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ధర్నా కార్యక్రమంలో భవిష్యత్తు ప్రణాళిక మహా పోరాటాన్ని ప్రకటించనున్నందున బిసి, ఎస్సీ ఎస్టీ లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టేకుమట్ల ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకినపల్లి శ్యామ్ , వర్తక సంఘం అధ్యక్షులు బొడ్డు సదానందం, ముదిరాజ్ మండల నాయకులు ఎలవేణి రాజేందర్ ,పద్మశాలి మండల అధ్యక్షుడు మాచర్ల మహేందర్, నాయిని బ్రహ్మ మండలం అధ్యక్షుడు మేడిపల్లి నరేష్ ,విశ్వకర్మ నాయకులు ఆపోజి దేవేందర్ నాయకులు,పద్మశాలి మండల నాయకులు బండిరాజేంద్రప్రసాద్, మైనారిటీ మండల నాయకులు ఎండి కాజా, యాదవ సంఘం నాయకులు రాజయ్య,రజక సంఘం ఉపాధ్యక్షుడు నిమ్మల స్వామి, మండల నాయకులు వారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ….

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : భవాని మందిర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు స్వచ్ఛంద బంద్ కు బీసీ బంధువులు మరియు అన్ని పార్టీల బీసీ కార్యకర్తలు తమ తమ మద్దతు తెలుపాలని మనం బీసీలు అందరం ఏకతాటికి రావాలని మనకు జరిగినా అన్యాయాన్ని ఈ బంద్ ధార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీసీ జేఏసీ నెంబర్లు కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాలు మరియు బిఆర్ఎస్ పార్టీ బీసీ సోదరులు మరియు బిజెపి పార్టీ బీసీ సోదరులు జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జహీరాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల నుండి బీసీ బందులు. ఈరోజు అతిధి హోటల్లో బీసీ తాలుక జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది
రేపు జరగబోయే బంద్ కు తమ తమ మద్దతు తెలుపుతున్నామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ ,, కోహిర్ మండల్ మాజీ జెడ్పిటిసి , నర్సింలు,, కొండాపురం నరసింహులు, విశ్వనాథ్ యాదవ్ బిజెపి, తట్టు నారాయణ , బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేశం బిఆర్ఎస్ జర సంఘం మండల్ మొహమ్మద్ఇమ్రాన్, బీసీ మైనార్టీ, సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు, శంకర్ సాగర్ బి సి,,. జగన్ బిజెపి,మాదినం శివప్రసాద్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదిపర్లు పాల్గొనడం జరిగింది

బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి….

బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డా.సిరికొండ శ్రీనివాసాచారి

పరకాల నేటిధాత్రి

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ల కోసం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు,విద్యావేత్త ఎస్వీ విద్యాసంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ ఓ 9 కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ,రిజర్వేషన్ ల బిల్లును షెడ్యూల్ 9 లో చేర్చాలని ఇందు కోసం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.30 బీసీ సంఘాల వాదనలు వినకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన తరువాత హైకోర్ట్ స్టే ఇవ్వడం బీసీ లను మోసం చేయడమేనని అన్నారు.ఇట్టి రిజర్వేషన్ సాధించేవరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొసం చేసిన తరహ ఉదృతమైన ఉద్యమాలు,పోరాటాలు సాగిస్తామని తెలిపారు.
ఇందుకోసం ఈ నెల 18 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బీసీ ల బంద్ ను అన్నివర్గాల ప్రజలు,కులాలు,మతాలకు అతితంగా స్వచ్చందంగా బంద్ పాటించి,సహకరించి బంద్ ను విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమము లో బీసీ రాష్ట్ర నాయకులు ఎడ్ల సుధాకర్,బసాని సోమరాజుపటేల్,డా.శివదేవ్,సూత్రపు శివాజీగణేష్ నాయి,సూర సతీష్ పటేల్,అల్లం మధుసూదన్ ముదిరాజ్,మహిళా నాయకులు దుంపేటి యశోద,మౌనిక,తూముల అనిత,లక్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ…

సింగరేణి ఆధ్వర్యంలో వోల్వో శిక్షణ

ఏరియా జియం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

వోల్వో డంప్ ట్రక్కు ఆపరేటర్ కోసం పదవ తరగతి ఉత్తీర్ణులై, కనీసం మూఢు సంవత్స రాల,అనుభవం కలిగివున్న హెవీ గూడ్స్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి నిరుద్యోగ యువకులైన సింగరేణి ఉద్యోగుల పిల్లలు, మాజీ ఉద్యోగుల పిల్లలు, పరిసర గ్రామాల ప్రజలు, భూనిర్వాసితుల కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు . దీనికి ముడునెలలకు ఒక బ్యాచ్ కు 60 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు పదవ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన సంవత్సరం, మెరిట్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు . ఎస్సీ, ఎస్టీ వారికి రూల్ ఆఫ్ రిజర్వేషన్, వయస్సు మినహాయింపు ఉంటుందని తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారికి ఎటువంటి స్టెఫండ్ కానీ భృతి కానీ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శిక్షణ పూర్తిగా వారి సొంత పూచికత్తు మీదనే ఆధారపడి ఉంటుందని తెలియజేశారు.ఈ దరఖాస్తులను అక్టోబర్ 20 లోపు సంబంధిత భూపాలపల్లి సింగరేణి ఎంవీటీసీ (మైన్ వోకేషనల్ ట్రైనింగ్ సెంటర్) లో అందజేయాలని తెలియజేశారు .

బహుజనులం రాజ్యాధికారం సాధించుకోవాలి…

బహుజనులం రాజ్యాధికారం సాధించుకోవాలి.

పొన్నం భిక్షపతి గౌడ్
బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థగత ఎన్నికల దృష్ట్యా బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని స్థానాల గ్రామ వార్డు సభ్యులు గ్రామ సర్పంచులు అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో బీఎస్పీ ఉంటుందని
పొన్నం భిక్షపతి గౌడ్
బిఎస్పి భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు
రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీట్లను కేటాయించి పోటీ చేయబోతున్నామని అగ్రవర్ణాల రాజకీయ కుట్రలను పసిగట్టి వారిని ప్రజల్లో ఎండ కడతామని రాజ్యాధికారం యొPonnam Bhikshapathi Goud
BSP Bhupalpalli District Presidentక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా ఇంటింటికి ప్రచారాన్ని తీసుకెళ్తామని రాష్ట్రంలో 92 శాతం ఉన్న బహుజనులను రాజ్యాధికార పీఠం మీద కూర్చోబెట్టడమే లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారమే అణచివేయబడ్డ బహుజన కులాలకు విముక్తి కలిగిస్తుందని సమాజం యొక్క మార్పు కోరుకునే వారందరూ ఏకతాటిపైకి రావాలని ఎన్నికలలో పోటీ చేయకపోతే మన ఆస్తిత్వాన్ని కోల్పోయి అణచివేతకు గురైతామని కాబట్టి ఈ ఎన్నికలను మన భవిష్యత్తుగా భావించాలని ఈ సందర్భంగా అన్నారు

ఈసారి ఛాన్స్ రాలే……తమ్ముళ్ల అసంతృప్తి…

ఈసారి ఛాన్స్ రాలే……తమ్ముళ్ల అసంతృప్తి…!

◆:- తమ్ముళ్ల తలరాతలు మార్చిన రిజర్వేషన్లు

◆:- పదవులపై ఆశలు వదులుకున్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే చాన్స్ రాలే.. ఏం చేద్దాం ఉన్నదాంట్లో సర్దుకు పోదాం.. అంటూ వివిధ పార్టీల తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారు. రిజర్వేషన్లు ఒక్కసారిగా తమ్ముళ్ల తలరాతలను మార్చేశా యి. ఇక ఆశలన్నీ నామినేటెడ్ పదవుల పైనే.. అంటూ గల్లి నుంచి జిల్లా దాకా తమ్ముళ్ల చర్చ జోరుగా సాగుతుంది. వివరాల్లోకి వెళితే..
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో జారీ చేయడంతో కొన్ని సామాజిక వర్గాల తమ్ముళ్ల తలరాతలు ఒక్కసారిగా మారిపోయాయి. గల్లి నుంచి జిల్లా దాకా కొన్ని సామాజిక వర్గాల నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జిల్లా మండల స్థాయిలో పదవులు దక్కించుకోవాలని తీవ్రంగా కృషి చేశారు. ఆయా పార్టీలో పని చేస్తున్న చోట నాయకులంతా తమ ఉనికిని చాటుకోవడానికి వివిధ గ్రామాల్లో అనేక సామాజిక కార్యక్రమా లను చేపడుతూ ప్రజల మధ్య ఉండి సేవలందించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏదో ఒక ప్రాంతం నుంచి పోటీచేసి పదవులు దక్కించుకోవాలని ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో ఇతర సామాజిక వర్గాలకు వాళ్ల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు జరిగింది.

‘బీసీ ఓట్ల శాతం గల్లి నుంచి జిల్లా దాకా. అధికంగా ఉండడంతో ఎంపీటీసీ జెడ్పిటిసి గ్రామ సర్పంచ్ పదవుల

అధికంగా జనాభా ప్రతిపాదికన బీసీ సామాజిక వర్గాలకు అధిక రిజర్వేషన్లు దక్కాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వికారాబాద్ పరిగి కొడంగల్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు అధిక పదవులు దక్కే అవకాశం ఉంది.

రిజర్వేషన్లలో భారీగా మార్పు జరిగింది. దీంతో గ్రామపంచాయతీ నుంచి మండల జిల్లా స్థాయి వరకు ముఖ్యమైన కీలక పదవుల్లో రిజర్వేషన్లు ఒక్కసారిగా మారిపోయాయి. రెండువేల జనాభా. ప్రకారం అప్పట్లో గ్రామపంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ రిజర్వేషన్లు ఒక సామాజిక వర్గానికి అందే విధంగా ఉండేది. కానీ 2025 బీసీ జనాభా ఓటర్ల ప్రతిపాదికన అన్ని సామాజిక వర్గాల్లో రిజర్వేషన్ల మార్పు జరిగింది. దీంతో తాము పోటీ చేయాలనుకుంటున్నా పదవి రిజర్వేష స్ ఇతర సామాజిక వర్గాలకు కేటాయించడంతో వాళ్ల ఆశలు నీరు కారిపోయాయి. అధికంగా జనాభా ప్రతిపాది కన బీసీ సామాజిక వర్గాలకు అధిక రిజర్వేషన్లు దక్కాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ వికారాబాద్ పరిగి కొడంగల్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు అధిక పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ సామాజిక వర్గాలు సర్పంచు లుగా జెడ్పిటిసి ఎంపీటీసీ అభ్యర్థులుగా గెలుపొంది మండల స్థాయిలో ఎంపీపీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకునే అవకాశం ఏర్పడింది. దీంతో ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న కొన్ని సామాజిక వర్గాల నాయకులు నామినేటెడ్ పదవులు లేదా వివిధ రాజకీయ పార్టీల కీలక పదవులను ఆశించే పనిలో పడ్డారు. రిజర్వేషన్ ఈ వర్గానికి వచ్చిన పార్టీ పరంగా మద్దతు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకొని అత్యధికంగా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి తీవ్రంగా కృషి చేయాలని ఆయా పార్టీల నాయకులకు అధిష్టాన వర్గం దశ దశ నిర్దేశం చేసింది. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలై ‘ కారణంగా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.. అక్టోబర్ 9న అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికలు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అప్పటిలోగా తమ అభ్యర్థులను ఖరారు చేసుకోవడానికి గ్రామాల వారీగా నాయకుల జాబితా కోసం పార్టీల కసరత్తు జరుగుతుంది. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఆయా పార్టీలో బలం ఎంతో ఎన్నికలు తర్వాత ఓటింగ్ లో భవతం తేలనుంది అప్పటివరకు వేది రూద్దాం…

రిజర్వేషన్ ఖరారుతో పల్లెల్లో ఎన్నికల సందడి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T125441.448.wav?_=1

 

స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ ఖరారుతో.. పల్లెలో సాగుతున్న ఆప్యాయత పలకరింపులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ఖరారుతో
నోటిఫికేషన్ విడుదల కంటే ముందే పల్లెలో నెలకొంటున్న ఎన్నికల వాతావరణ సందడి, సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో 33 సర్పంచ్ స్థానాల రిజర్వేషన్, 13 ఎంపీటీసీ స్థానాలకు 4 ఎస్సి,6 బీసీ 3 జనరల్ గా ఖరారు చేయగా ఎంపీపీ బీసీ మహిళకు కేటాయించారు. జడ్పీటిసి బీసీ జనరల్ ఖరారు చేసినట్లు చేయడంతో ఎప్పుడెప్పుడా ఆశావహులు ఎగిరి గంతేశారు. అని అధికారులు స్పష్టం ఎదురుచూస్తున్న పల్లెలో మొదలైన ఏం తమ్మి, ఏం అన్న అంత కుశలమేనా ఇంట్లో అందరూ ఎట్లున్నారు ఊరికి సరిగ్గా దర్శనిమిచ్చుడే లేదు అప్పుడప్పుడు ఊరికి రావాలి అందరూ వస్తు పోతూ ఉంటేనే బాగుంటుంది.. రా చాయి తాగుదాం అంటు పలకరిస్తూ జీవనాధారం కొరకు పట్నంలో ఉంటూ పండగకు వచ్చిన ప్రజలకు, మర్యాదలు కురిపిస్తున్నారు.ఇక గ్రామాల్లోనే ఉన్న ప్రజలకు ఫోన్లు చేసి మరి కనిపిస్తాలేవు ప్రొద్దున నుంచి అంటూ ఫోన్లో సంభాషణలు చేస్తున్నారు..ఇది ఇలా ఉండగా ఇన్నాళ్లు ఎదురుచూసిన ఆశావాహుల్లో రిజర్వేషన్ అనుకూలంగా లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి ఝరాసంగం మండలంలో స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ తో పల్లెలో ఎన్నికల వాతావరణ సందడి నెలకొంది.. ఇరుపార్టీల నాయకులు పోటీలో నెగ్గేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రామాల్లో కొత్త రాజకీయ ట్రెండ్.. కార్యకర్తలకు హెచ్చరికలు

పార్టీ కోసం కష్టపడని వారు, పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలవని వారు ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ వంటి స్థానాలకు పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారు కార్యకర్తలను పట్టించుకోకుండా, పార్టీ పేరుతో తమ పెత్తనం చూపాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్థాయిలో చర్చ నడుస్తోంది.కార్యకర్తలు మరియు ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వీరిని ప్రోత్సహించడం అంటే మనకే మనం నష్టం చేసుకోవడం అవుతుందని సూచనలు వెలువడుతున్నాయి. పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ నిజమైన కార్యకర్తలకే ప్రజల మద్దతు లభించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

“తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తులు రేపటి నుంచి..

రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు *రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు.. అప్లికేషన్స్ కు అనర్హులు వీరే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త మద్యం (New Liquor Shops) దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాబోతోంది. రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతుల కోసం ఇప్పటికే ఎక్సెజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నోటిఫికేషన్ కు అనుబంధంగా ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధరించారు. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తారు. ఎక్సెజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు మద్యం దుకాణాలు పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. దుకాణాల కేటాయింపుల్లో గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈమేరకు రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి జతచేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్లు ఈ ఏడాది నవంబర్ చివర వరకు గడువు ఉంది.

బార్లలో బీర్ల తయారీ లైసెన్స్ కు నేడే ఆఖరు తేదీ:

హోటల్ లేదా రెస్టారెంట్లలోనే బీర్లు తయారు చేసి విక్రయిచేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ లైసెన్స్లు జారీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన లైసెన్స్ కోసం దరఖాస్తులకు ఇవాల్టితో ఆఖరు గడువు ముగియనుంది. 2బి బార్లు, ఎలైట్ బార్లు, సీ1- క్లబ్, టిడి1, టీడీ2 లాంటి లైసెన్స్ కలిగిన హోటల్, రెస్టారెంట్లలో మైక్రో బ్రూవరీ యూనిట్లు ఏర్పాటు కోసం రూ. 1 లక్ష రుసుముతో దరఖాస్తులను అబ్కారీ శాఖ ఆహ్వానించింది.ఈ దరఖాస్తులకు ఇవాల్టితో గడువు పూర్తి ముగియనుంది. tgbcl.telangana.gov.in వెబ్ సెట్ ను సందర్శించాలని సూచించింది. వివరాలకుదరఖాస్తులు.. అప్లికేషన్స్ కు అనర్హులు వీరే*

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త మద్యం (New Liquor Shops) దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాబోతోంది. రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతుల కోసం ఇప్పటికే ఎక్సెజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నోటిఫికేషన్ కు అనుబంధంగా ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధరించారు. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తారు. ఎక్సెజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు మద్యం దుకాణాలు పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. దుకాణాల కేటాయింపుల్లో గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈమేరకు రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి జతచేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్లు ఈ ఏడాది నవంబర్ చివర వరకు గడువు ఉంది.

బార్లలో బీర్ల తయారీ లైసెన్స్ కు నేడే ఆఖరు తేదీ:

హోటల్ లేదా రెస్టారెంట్లలోనే బీర్లు తయారు చేసి విక్రయిచేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ లైసెన్స్లు జారీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన లైసెన్స్ కోసం దరఖాస్తులకు ఇవాల్టితో ఆఖరు గడువు ముగియనుంది. 2బి బార్లు, ఎలైట్ బార్లు, సీ1- క్లబ్, టిడి1, టీడీ2 లాంటి లైసెన్స్ కలిగిన హోటల్, రెస్టారెంట్లలో మైక్రో బ్రూవరీ యూనిట్లు ఏర్పాటు కోసం రూ. 1 లక్ష రుసుముతో దరఖాస్తులను అబ్కారీ శాఖ ఆహ్వానించింది.ఈ దరఖాస్తులకు ఇవాల్టితో గడువు పూర్తి ముగియనుంది. tgbcl.telangana.gov.in వెబ్ సెట్ ను సందర్శించాలని సూచించింది.

బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T133616.863-1.wav?_=2

 

బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ..

◆:- ఐలమ్మ ఆశయాల స్పూర్తితో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులఘణన :

◆:- ఝరసంఘం లో ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత, నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ …
బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఝరసంగం మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.ఈ సంధర్బంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు.బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఆమె స్పూర్తితో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ హక్కులు,ఉద్యోగ అవకాశాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గాను తెలంగాణ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది అని అన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త మల్లికార్జున్ పాటిల్ ,నవాజ్ రెడ్డి తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ నియోజక వర్గ ఇంచార్జి నర్సింలు,మరియు రజక సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణ్,రజక సంఘం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్,రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాకలి శివకుమార్ , క్రిష్ణ,రాజు,మారుతి, పాండు,యాదగిరి, రాజు బోపనపల్లి,యువజన నాయకులు కొమారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం టెండర్లలో గౌడులకు 25% వాటా కావాలి..

మద్యంటెండర్లో గౌడులకు 25 శాతం వాటా ఇవ్వాలి

మోకుదెబ్బ రమేష్ గౌడ్ డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మద్యం టెండర్లలో గౌడ కులస్తులకు 25 శాతం వాటా ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ డిమాండ్ చేశారు.పట్టణంలో బుదవారం మోకుదెబ్బ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం గౌడ కులస్తులకు మద్యం దుఖాణాలలో 15 శాతం మాత్రమే కెటాయించడం జరిగిందన్నారు. కామారెడ్డిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మేనిపెస్టోలో గౌడ కులస్తులకు మద్యం దుఃఖణాల కేటాయింపులో 25 శాతం ఇస్తామని వాగ్దానం చేసిందన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ లో గౌడ్స్ కు ఇచ్చిన హామీని ప్రకారంగా 25 శాతం వాటా డిక్లరేషన్ విస్మరించడం సరికాదన్నారు.మధ్యం టెండర్లలో 3 లక్షలు కాకుండా 2 లక్షలకు కుదించాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. రెండేళ్లుగా తాటిచెట్ల పైనుంచి పడి చనిపోయిన, గాయపడిన 7 వందల మంది గీత కార్మికులకు పెండింగ్ లో 7 కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని తెలిపారు. జనగామ జిల్లా కు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, 50 యేండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి ఫెక్షన్ మంజూరు చేయాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

మోకుదెబ్బ జిల్లా ప్రచార కార్యదర్శి గా శ్యామ్ సుందర్ గౌడ్

దుగ్గొండి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్యామ్ సుందర్ గౌడ్ ను మోకుదెబ్బ హన్మకొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా నియమించినట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ తెలిపారు. గత రెండేళ్లుగా శ్యామ్ కుమార్ గౌడ్ గౌడ కులస్తులకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ పదవిలో నియమించినట్లు రమేష్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు తోటకూరి రాందాస్ గౌడ్, గోపగాని వెంకట్ గౌడ్, జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,జిల్లా కార్యదర్శి బోడిగే మల్లేశంగౌడ్,మేరుగు మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రముచట్ట భద్రత కల్పించాలలి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రముచట్ట భద్రత కల్పించాలలి
తెలంగాణ జన సమితి
వనపర్తి నేటిదాత్రి .
తెలంగాణ రాష్ట్రంలోబీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత భద్రత కల్పించాలని తెలంగాణ
జనసమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష డిమాండ్ చేశారు వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ జనసమితి నేతలు మాట్లాడారు
తెలంగాణలోబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని వారు కోరారుతెలంగాణ జనసమితి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం పార్లమెంట్ లో చట్టంచేసి తొమ్మిదవ షెడ్యూల్ ఈసమావేశంలో పిక్కిలి బాలయ్యశాంతారామ్ నాయక్
కె రమేష్. తదితరులు ఉన్నారు

వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలి.

వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలి.

చిట్యాల, నేటిధాత్రి :

దేశ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తప్పనిసరి అవకాశం ఉన్నకాడ రిజర్వెన్లలోపోటీ చేయడానికి అవకాశం కల్పించాలని వికలాంగుల సంఘం నాయకుడు పుల్ల మల్లయ్య* కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరారు
శమనవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తూన్నాయని అన్నారు . ఈ ప్రభుత్వాలు కొత్త పించలు సంక్షేమ పథకాలు, , అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు , భూమి కొనుగోలు పథకాలు వికలాంగులకు రావలసిన అనేక పథకాలలో అన్యాయం జరుగుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బంధులను, అవస్తలను ప్రభుత్వాలు గుర్తించి 5% శాతం రిజర్వేషన్లు కల్పించారని ,త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 5 శాతం రిజర్వేషన్లు సంబంధించిన కేంద్ర , రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేసి వికలాంగుందరికి అవకాశం కల్పించాలని కోరారు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి

కొండా చరణ్ బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు

నేటిధాత్రి చర్ల

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలలో 42 శాతం బీసీ బిల్లును ఆమోధించి 9వ షెడ్యూల్ లో చేర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా చరణ్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ను ఆమోధించి 9 షెడ్యూల్ లో పెట్టాలని కొండా చరణ్ కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేసారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు వాక్యాలు ను ఖండిస్తూ బీసీ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని వారు తెలిపారు
బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలనీ మహిళా రిజర్వేషన్ లలో బీసీ కోటను అమలు చేయాలి
మండల్ సిపార్సులను వెంటనే అమలు చేయాలి
చట్ట సభల్లో విద్య ఉద్యోగం లలో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలనీ 50 శాతం నిధులతో బీసీ సబ్ ప్లాన్ ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలి ఈ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్ ను రద్దు చేయాలనీ
కొండా చరణ్ పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేసారు తెలంగాణ బీజేపీ ఎంపి లు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు ను అమోదించే విధంగా బాధ్యత తీసుకోవాలి అని లేకపోతె తెలంగాణ బీజేపీ నాయకులు బీసీ సమాజం ముందు దోషిగా మిగిలిపోతారు అని తెలిపారు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం ఒక వరం.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం ఒక వరం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నవాబుపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య

శంకర్ పల్లి, నేటిధాత్రి :

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-3.wav?_=3

బీసీల రిజర్వేషన్ 42 శాతనికి పెంచడం బీసీ ప్రజలకి ఒక గొప్ప వరమని నవాబుపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అత్యధికంగా ఉన్న బీసీ ప్రజల కోసం వారి యొక్క ఉద్యోగాల్లో గానీ స్థానిక సంస్థల పదవుల్లో గానీ ఉన్నత స్థానం కల్పించాలనే సదుద్దేశంతో 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సహచర మంత్రులకు బీసీ సంక్షేమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గడిచిన గత పది సంవత్సరాలలో ఏనాడు కూడా
బి ఆర్ యస్ పార్టీ, బీసీల గురించి ఆలోచించ లేదు కదా వారికీ కనీస విలువ కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజులలోనే బీసీ ల పట్ల చూపించిన గౌరవానికి ఎల్లపుడు పార్టీ కి రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు జూలకంటి శ్రీధర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

42 శాతం రిజర్వేషన్ తోబీసీలకు సామాజిక న్యాయం

42 శాతం రిజర్వేషన్ తోబీసీలకు సామాజిక న్యాయం
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

42% శాతం రిజర్వేషన్ తో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని మొగుళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కాత్య రాజు రమేష్ తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని అన్నారు.

క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలు స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు చేయాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించి బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించినది. విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో జరిగిన సమావేశాల్లో బిల్లులకు శాసనసభ ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి నివేదించిన విషయం తెలిసిందే 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగ్గ విషయమని ఆయన అన్నారు

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చేసిన “జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి” అన్న డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. బిసి డిక్లరేషన్ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మాట నిలబెట్టుకునేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అలాగే మంత్రివర్గ వర్గ సభ్యులందరికీ మరియు మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, సామజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలోకి .

ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలోకి వెళ్ళుటకు 42 శాతం రిజర్వేషన్ లుబీసీలకు కల్పించాలి

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి డిమాండ్

వనపర్తి నేటిదాత్రి .

బీసీలకు ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసి చట్టసభలోకి వెళ్ళుటకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వ ని కి చిత శుద్ది ఉంటే నిరూపించుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్ బీఆర్ఎస్ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎంపిటిసి జెడ్పిటిసి లోగా పోటీ చేయుటకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఊరూరా సంబరాలు జరుపుకోవడం విడ్డూరమని వారు విమర్శించారు.

 

 

 

ఎంపీటీసీలు జెడ్పిటిసిలకు ఒక కార్యాలయం గానీ కూర్చోవడానికి కుర్చీ గాని ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదని వారు విమర్శించారు కనీసం ఎంపీటీసీలకు ప్రభుత్వం నుండి వచ్చే నిధులు వాటి వివరాలు వారికి తెలియడం లేదని వారికి ప్రభుత్వం నుండి మర్యాదలు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ స్థానిక సంస్థల ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పిటిసిల ఓట్లు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ రూపొందించిందని వారు ఘాటుగా విమర్శించారు . కాంగ్రెస్ పార్టీ వారి ప్లాన్లు ప్రజలు నమ్మేస్థితి లో లేరని వారు ఇచ్చిన హామీలు అన్ని గమనిస్తున్నారని వారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెండం కురుమూర్తి యాదవ్ బొల్లెద్దుల బాలరాజ్ పృధ్వి నాథ్ పెబ్బేరు కర్రే స్వామి వడ్డే ఈశ్వర్ కడుకుంట్ల శ్రీను జోహేబ్ హుస్సేన్ చిట్యాల రాము టి సురేష్ గుండె కృష్ణ మెంటపల్లి రామకృష్ణ భగవంతు యాదవ్ రహీం బండారు కృష్ణ సవాయిగూడెం రాము కృష్ణ తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి.

స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి

◆ జట్గొండ మారుతి డిమాండ్ చేశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలలో
న్యాల్కల్ మండల మల్గి గ్రామానికి చెందిన మాజీ తాజా సర్పంచ్ తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని
స్థానిక సంస్థ ఎన్నికలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి తెలంగాణ బీసీ సంక్షేమ సమితి విద్యార్థి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన.

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికల నిర్వచించాలి
టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్
బీసీలను దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

shine junior college

 

 

 

దళితులనుమోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మొగుళ్లపల్లిమండల బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరి కుమార్ విమర్శించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version