పంచమ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన బిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మ్యాథరి ఆనంద్ తల్లి మ్యాథరి మానెమ్మ గారు ఇటీవలే మరణించడం జరిగింది.. శుక్రవారం రాజనెల్లి గ్రామంలో జరిగిన వారి పంచమ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన నామ రవి కిరణ్ నివాళులర్పించాను..ఆమెకు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నాను…. “
కొమరం భీం విగ్రహానికి నివాళులర్పించిన మాజీ జెడ్పిటిసి
మహాదేవపూర్ అక్టోబర్ 22 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని కొమరం భీమ్ జయంతి సందర్భంగా విగ్రహానికి బుధవారం రోజున మాజి జెడ్పిటిసి నివాళులర్పించారు. కొమరం భీమ్ 124వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని విగ్రహానికి మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారు మాట్లాడుతూ కొమరం భీమ్ చేసిన త్యాగాలను మరువలేనివని ఆయన సమాజం కోసం తోడ్పడిన పలు సందర్భాలను ప్రజలతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు.అనంతరం ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,కె. ఆర్ నాగరాజు,వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,స్నేహ శబరిష్,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి,ఎన్డిపిసిఎల్ సి యండి వరుణ్ రెడ్డి,ఎన్సిసి గ్రూప్ కమాండర్ కర్నల్ సచిన్ అన్నారావు,.
కర్నల్ రవి,వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్,అదనపు డిసిపిలు సురేష్ కుమార్, ప్రభాకర్ రావు శ్రీనివాస్, బాలస్వామి,రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి శ్రీనివాస్ రావుతో పాటు ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్ఐలు,ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ఐ స్పర్జన్ సారధ్యంలో సాయుధ పోలీసులు ‘శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది,అమరవీరుల కుటుంబ సభ్యులు మౌనం పాటించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్చించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు
పాటుపడాలన్నారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారన్నారు. వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే ఉంటామని చెప్పారు. అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి మిషన్ హస్పటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో శాసన సభ్యులు,పోలీసులు,అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం
సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు
జైపూర్,నేటి ధాత్రి:
సింగరేణిలో సీఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి కమాండెంట్ సంచల్ సర్కార్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ జరిపించారు.విధి నిర్వహణలో భాగంగా ప్రాణ త్యాగాలు అర్పించిన పోలీస్ వీరులకు కమాండెంట్ చంచల్ సర్కార్ నివాళులు అర్పించారు.సెప్టెంబర్ 1. 2024 నుండి ఆగస్టు 31.2025 మధ్యకాలంలో ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మొత్తం 191 పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాలని వారు తెలిపారు. అలాగే అమరవీరులైన పేర్లను చదివి వినిపించి వారి గౌరవం సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్ బలగాల ధైర్య సహసాలను అంకిత భావాన్ని గౌరవించడం వారి సంక్షేమం దేశ భద్రత పట్ల మన నిబంధతను తెలియజేయడమే మన లక్ష్యము అని తెలిపారు.
ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి..
అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ జిల్లా (నేటిధాత్రి):
సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి చేసిన సేవ స్మరించుకున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. వారు దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించి అపారమైన ధైర్యసాహసానికి నిదర్శనంగా నిలిచారు. అమరవీరులు చూపిన త్యాగమార్గం ప్రస్తుత పోలీసు సిబ్బందికి, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రభుత్వం ఎల్లప్పుడూ పోలీసు శాఖ సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజి రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు, నక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి అన్వర్ కాంగ్రెస్ నాయకులు బండారి మొగిలి, చాందరాజు సంతోష్, మల్లాడి తిరుపతి రెడ్డి, వీరబోయిన రవి, బైరి సునీల్, లింగారెడ్డి, రవి, స్వర్ణలత, రావుల శ్రీకాంత్ తో హసన్పర్తి పోలీస్ స్టేషన్ సిఐ చేరాలు, ఎస్సై రవి, సిబ్బంది తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….
పోలీసుల సేవలు త్యాగాలు చిరస్మరణీయం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
దేశ భద్రత, ప్రజారక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని, అవి సమాజానికి నిత్య స్పూర్తిదాయకమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.మంగళవారం భూపాలపల్లి పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ కరే తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనం స్వేచ్ఛగా,భయరహితంగా జీవించగలుగుతున్నామంటే అది పోలీసుల నిబద్ధతతో కూడిన సేవల ఫలితం అన్నారు.
అమరులైన పోలీస్ వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే వారి సేవలు ఎనలేనివి అన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో పోలీసులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల భద్రత కోసం కృషి చేస్తున్నారు”అని ప్రశంసించారు.ప్రజలు కూడా పోలీసుల విధులకు సహకరించి,సమాజ శాంతి భద్రత కోసం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు.అమరవీరుల స్థూపానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అమర వీరుల కుటుంబాలకు బహుమతుల ప్రధానం చేశారు. అనంతరం రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.తర్వాత రక్త దానం చేసిన పోలీస్ అధికారులకు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ డీఎస్పీ సంపత్ రావు సిఐ నరేష్ కుమార్ పోలీస్ అధికారులు, జిల్లా అటవీశాఖ అధికారి,అమరవీరుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పట్టణానికి చెందిన రెవ.రే.భూమన్ సుందర్ రాజ్ 17-10-2025 రోజు అమెరికా దేశంలో స్వర్గస్తులైనరు వారి అంత్యక్రియలు అక్కడే జరుగును జహీరాబాద్ పట్టణంలోని వారి నివాసంలో వారి బంధుమిత్రులు,ఆప్తుల తో కలసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించి,నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతు వారి మృతి బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్తించారు,ఈ కార్యక్రమంలో ఇండిపండెంట్ పాస్టర్ రమేష్ బాబు,మోహన్, రవీందర్ పాల్,ప్రకాష్, రత్నం,ధన్ రాజ్, సురేష్,పాల్,సునీల్, పాస్టర్స్ బృందం, తదితరులు పాల్గొన్నారు,
ఘనంగా మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి వేడుకలు.
#నివాళులు అర్పించిన ఎం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సాంబయ్య మాట్లాడుతూ దొరలకు వ్యతిరేకంగా భూస్వాములపై పోరాటం చేసి పెత్తందార్ల గుండెల్లో మనకు పుట్టించి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి ఓంకార్ అలాంటి వ్యక్తి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని యువకులు ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్త నాగరాజు, సుభాష్, సుదర్శన్, వెంకటయ్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మొగిలి పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి
పరకాల,నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మడికొండ మొగిలి గుండెపోటుతో అకాల మరణం చెందగా టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య గురువారం మడికొండ మొగిలి పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ పరామర్శలో పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్ బొజ్జం రమేష్,టీపీసీసీ ఎస్సిసెల్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,మడికొండ సంపత్ కుమార్,బిసి సంఘం నాయకుడు అముదాలపల్లి మల్లేశం గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుల్యాల గాంధీ,మండల ఎస్సిసెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ నాయకులు పాడి వివేక్ రెడ్డి,బొచ్చు భాస్కర్,బొచ్చు జితేందర్,బొచ్చు రవి,ఒంటెరు వరుణ్,బొచ్చు అనంత్,బొచ్చు రవి కుమార్,లాదేళ్ల బిక్షపతి,మడికొండ రాజు తదితరులు ఉన్నారు.
కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – “డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దిగవంతనేత మాజీ మంత్రి ఎండి ఫరీదోద్దీన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మానవతావాది #ఉమ్మడి_ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_మాజీ_మంత్రి_వర్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎమ్మెల్సీ(“కీర్తిశేషులు స్వర్గీయ మహమ్మద్ ఫరిదుద్దిన్ జయంతి”)సందర్బంగా అభిమానుల అధ్వర్యంలో ఉదయం 11 గంటలకు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు,బాలింతలకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బిజీ సందీప్ గోవర్ధన్ రెడ్డి బాలిరెడ్డి నవీద్ నిజాం అలీ మాజీ సర్పంచ్ నరేష్ మాజీ సర్పంచ్ రాజు శ్రీనివాస్ నాయక్ జైరాజ్ బాలరాజ్ కవేలి కృష్ణ ఇక్బాల్ వసంత్ భార్కత్ ముబీన్ రామానుజన్ రెడ్డి ప్రణీష్ రావు అభిమానులు పాల్గొన్నరు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత మహమ్మద్ ఫలితద్దీన్ ప్రజల గుండెల్లో ఉన్నారని వారు పేర్కొన్నారు. అనునిత్యం ప్రజల కొరకే తపించే మంచి నాయకుడిని కోల్పోయామని వారు వివరించారు. కుల మతాలకతీతంగా ప్రతి వ్యక్తికి నేనున్నానంటూ ధైర్యం చెప్తే మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయామని వారు ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు,
టియూడబ్ల్యూజేే జిల్లా ప్రధాన కార్యదర్శి,ప్రజాపక్షం ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ తోట సుధాకర్ మాతృమూర్తి తోట వెంకటమ్మ ఇటీవల మృతి చెందగా గురువారం పలువురు సుధాకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు.ఈ సందర్భంగా హవ్రాను జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చేరుకుని తొలుత తోట వెంకటమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంకటమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో సీపీఐ,బీసీ హక్కుల సాధన సమితి నాయకులు, జర్నలిస్టు నాయకులు ఉన్నారు.పరామర్శించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి,బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రంలో కార్యదర్శి ఎన్. రాజమౌళి,వరంగల్ జిల్లా నాయకులు పనాస ప్రసాద్, ల్యాదెళ్ల శరత్,సీనియర్ జర్నలిస్టులు ఎస్.శోభన్ బాబు,వెంకట్,మారుతి, ముత్యాల రఘు, కనకరాజు,పి.కిషోర్ కుమార్,టి.రజినీకాంత్,జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్ల రవి తదితరులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని చే గువేరా వర్ధంతి సందర్భంగా ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ చే గెవారా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14 న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు.
1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు చేగువేరా భావించాడు ఎన్నో పోరాటాలు చేసిన అతడు 39 సంవత్సరాలు అనేక ప్రజా పోరాటాలు చేసినారు 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రోసారియా అనే పట్టణంలో జన్మించిన చెగువేరాను.. 1967 అక్టోబర్ 9న బొలీవియాలోని లా హిగువేరాలో అమెరికా సీఐఏకు బలైపోయారు. ఆయన్ని ఓ పాఠశాలలో బంధించి కాల్చి చంపారు. ఓ మహా ప్రస్థానానికి ముగింపు పలికారు. కావున చేగువేరా ఆశయాలను కొనసాగించాలి
ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ అనారోగ్యంతో గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్జయ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత కొన్ని రోజుల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే తల్లీ దొంతి కాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డిని హనుమకొండలోని తన నివాసంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,పెండెం రామానంద్ మర్యాదపూర్వంగా కలిసి పరమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నెక్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు మోటం రవికుమార్, చిప్ప నాగ, నాడేం నాగేశ్వర్లు, నాడేం ప్రదీప్ కన్నా, తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ , కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
అనుపర్తి యాకయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు వర్దన్నపేట (నేటిధాత్రి)
Vaibhavalaxmi Shopping Mall
వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్ లోని 1వ వార్డు కు చెందిన అనుపర్తి యాకయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే వెంట ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి భాను ప్రసాద్, వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుల్లా రవి, మాజీ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, కాంగ్రెస్ నాయకులు బెజ్జం పాపరావు, సిలువేరు శ్రీధర్, పులి శ్రీను, వెంకట్, ఎండి అన్వర్, చిటూరి రాజు, పాక సుజాత తో పాటు తదితరులు పాల్గొన్నారు..
మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం ద్వారా వారి మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు అనడానికి వాల్మీకి మహర్షి జీవితం నిదర్శనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.కలెక్టరేట్ లో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు.వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడని, స్వాతంత్రోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని తెలిపారు. రాజకీయరంగంలో వివిధ పదవులలో ప్రజా శ్రేయస్సుకు ఎనలేని సేవలు అందించారని, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని,తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమాలలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు.మహనీయుల జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని,వారు చూపిన సన్మార్గంలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.