అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు: సీఎం ఫడ్నవీస్…

అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు: సీఎం ఫడ్నవీస్

 

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.

 మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటని చెప్పుకొచ్చారు.

వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్‌ తనకు మంచి స్నేహితుడని ప్రస్తావించారు. మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ కృషి చేస్తున్న తరుణంలో ఆయన అకాల మరణం తీరని లోటని తెలిపారు. పవార్ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. మరికాసేపట్లో బారామతికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే వెళ్లనున్నారు. వారి కుటుంబ సభ్యులను సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. అనంతరం అజిత్ పవార్‌కు నివాళులు అర్పించనున్నారు.

అజిత్ పవర్ గొప్ప వ్యక్తి: ఆశిష్ షెలార్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ మృతిపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ ఆశిష్ షెలార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌ సేవలను కొనియాడారు. అనంతరం మీడియాతో ఆశిష్ షెలార్ మాట్లాడారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా హఠాన్మరణం చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.అజిత్ పవార్ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని కీర్తించారు. కరోనా సంమయంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రత్యేకమైన ముద్ర వేశారని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచే ఆయన ప్రజల కోసం అందుబాటులో ఉండే వారని కీర్తించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా అజిత్ పవార్ ఉన్నారని తెలిపారు. అజిత్ పవర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఆ పరమేశ్వరుడు ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆశిష్ షెలార్ పేర్కొన్నారు.

మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్…

మా నానమ్మకి ఏం కాలేదు: అమన్‌జోత్

 

మహిళల ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అమన్‌జోత్ తన నానమ్మ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించింది. ఆమె బాగానే ఉన్నారని, అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంట్లో అమన్‌జోత్ పట్టిన క్యాచ్ ఆట గతిని మార్చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇచ్చిన క్యాచ్ బౌండరీ లైన్ దగ్గర అమన్ అద్భుతంగా అందుకుంది. చరిత్రలో నిలిచిపోయే ఈ క్యాచ్‌తో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడేలా భారత్‌ను తొలిసారి ఛాంపియన్‌గా నిలిపింది. మ్యాచ్ అనంతరం ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై అమన్‌జోత్ క్లారిటీ ఇచ్చ

‘అమన్‌జోత్(Amanjot Kaur) కెరీర్ వెనక మా అమ్మ భగవంతి మూలస్తంభంలా నిలబడింది. మొహాలీలో అమన్ వీధుల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు ఆమెనే తీసుకెళ్లేది. బలోంగిలో నాకు కార్పెంటరీ షాప్ ఉంది. అమన్‌తో వెళ్లేందుకు నాకు వీలయ్యేది కాదు. కానీ ఇంటి ముందు, పార్క్ వద్ద అమన్ మగపిల్లలతో ఆడేటప్పుడు బయట కూర్చొని చూస్తూ ఉండేది. చాలామంది అమ్మాయిలూ ధైర్యంగా వారితో ఆడేవారు. ప్రపంచ కప్ సమయంలో మా అమ్మకు గుండెపోటు వచ్చింది. అయితే ఆ విషయాన్ని అమన్‌కు చెప్పలేదు. ఆమె దృష్టి మారకుండా ఉండాలనే అలా చేశాం’ అని అమన్ తండ్రి భూపిందర్ సింగ్ తెలిపారు.

తన నానమ్మ విషయంలో తండ్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భిన్నంగా ప్రచారం అవ్వడంపై అమన్ స్పందించింది. ‘మా నానమ్మ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నా. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. బయట ప్రచారం అవుతున్నట్లు ఎలాంటి సమస్యా లేదు. ఇలాంటి వాస్తవాలు నమ్మొద్దు. ప్రచారం చేయొద్దు. మా కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అమన్ వెల్లడించింది.

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం..

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై గందరగోళం..

◆:- స్పందించిన రాజ్‌భవన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

హైదరాబాద్: తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన న్యూస్‌ అవాస్తవమని రాజ్‌భవన్ అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో.. విలీనం చేస్తూ.. జారీ చేసిన మెమోతో ఈ గందరగోళం నెలకొందని వివరించారు.

అయితే.. గత కొన్ని గంటలుగా.. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయ్యిందని.. సోషల్ మీడియాలో, ప్రముఖ టీవీ ఛానల్స్‌లో ప్రచారం అయ్యింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోదం తెలిపినట్లు, 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ మేరకు స్పందించిన రాజ్‌భవన్ అధికారులు ఇదంతా అవాస్తవమని తేల్చి చెప్పారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version