పెరుగుతున్న చలి తీవ్రత.. స్వెటర్లు కొనుక్కున్నారా…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T162710.067.wav?_=1

 

పెరుగుతున్న చలి తీవ్రత.. స్వెటర్లు కొనుక్కున్నారా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం,మెదక్ సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం పూట కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది. రాగల రెండు రోజుల్లో రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో 2 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు, రేపు వాతావరణం పాక్షికంగా మేఘావ్రుతమై ఉండే అవకాశం ఉంటూ, ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉపరితలంపై వీచే గాలులు ఉత్తరం లేదా ఈశాన్యం దిశ నుండి గంటకు సుమారు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి లోని కొన్ని మండలాల్లో ఝరాసంగం జహీరాబాద్ న్యాల్కల్ మొగడంపల్లి కోహిర్ అత్యల్పంగా 8 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

జాగ్రత్తలు:

పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని వాతవారణ శాఖ తెలిపింది. వెచ్చని దుస్తులు ధరించాలి. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో ఉన్ని దుస్తులు, స్వెటర్లు, టోపీలు తప్పనిసరిగా ధరించాలని, ఉదయం పొగమంచు పూర్తిగా తగ్గిన తర్వాతే బయటకు వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

 భూ వివాదం.. తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు…

 భూ వివాదం.. తుపాకీతో కాల్చి పారేస్తామని బెదిరింపు

 

భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి.

మెదక్, నవంబర్ 6: భూ వివాదంలో తుపాకీ కలకలం సృష్టించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో రైతు సిద్దమ్మకు గ్రామంలో కొందరితో భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి సిద్దమ్మ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రత్యర్ధులు.. గ్రామ శివారులోని పొలం వద్ద సిద్దమ్మ సహా ఆమె కుటుంబీకులను తుపాకీతో బెదిరించారు. భూమి వద్దకు వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదురింపులకు దిగారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. తమను బెదిరించారని, కాల్చేస్తామంటూ బయపెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎంపీడీవో రాజిరెడ్డి….

కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎంపీడీవో రాజిరెడ్డి

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నార్లపూర్ గ్రామంలో గురువారం రోజున ఎంపీడీవో రాజిరెడ్డి ఇందిరమ్మ ఇండ్లను అలాగే కొనుగోలు కేంద్రాలను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ రకం ధాన్యానికి 2389గా ,బీ రకం ధాన్యానికి 2869గా
చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లను సందర్శించారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల పనులకు తొందరగా పూర్తిచేయలున్నారు.ఇండ్ల లబ్ధిదారులకు దశలవారీగా డబ్బులు బ్యాంకులో జమ అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు

రాయలాపూర్ గ్రామ రైతుల వినతి పత్రం సమర్పణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download.wav?_=2

 

రైతుల ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం కేటాయించాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
రాయలాపూర్ గ్రామ రైతుల వినతి పత్రం సమర్పణ..

రామాయంపేట అక్టోబర్ 9 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలంలోని రాయలాపూర్ గ్రామ రైతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను వెల్లడించారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు తాము కోత కోసిన వడ్లను ఎండబెట్టేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సీజన్‌లో రాయలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని రైతులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉన్న సంఘ స్థలం చాలక రోడ్డుపై, పొలాల్లో ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రోడ్డుపై ధాన్యం పోస్తే రవాణాకు ఆటంకం కలుగుతోందని, పోలీసు అధికారులు కూడా అడ్డుకుంటున్నారని రైతులు వివరించారు. ఈ నేపథ్యంలో రాయలాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి, హనుమాన్ గుడి ముందు ఉన్న సర్వే నెం. 881లోని ప్రభుత్వ భూమిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్ రజనీకుమారిని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
రోడ్డుపై వడ్లు ఆరబెట్టడం వాహనదారులకు ఇబ్బందికరమని, ప్రమాదం కూడా ఉందని రైతులు పేర్కొన్నారు. కనుక ప్రభుత్వమే తక్షణం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి తమ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ మదర్సాలో పుడ్ పాయిజన్ కలకలం..

మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ మదర్సాలో పుడ్ పాయిజన్ కలకలం..

రామాయంపేట సెప్టెంబర్ 22 నేటి ధాత్రి (మెదక్)

చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలోని మదర్సాలో పుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది.ఈ సంఘటనలో 10 మంది చిన్నారులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.వెంటనే సమాచారం అందుకున్న అధికారులు వారిని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఆసుపత్రిలో వైద్యులు,సిబ్బంది పర్యవేక్షణలో చిన్నారులు చికిత్స పొందుతూ,ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం.

 

మరో 25 మంది పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు.చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు.అనంతరం అయన మాట్లాడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారులందరూ బాగానే ఉన్నారు.వైద్యులు అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి,సరైన వైద్యం అందిస్తున్నారు.

ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు పిల్లలకు ఎల్లప్పుడూ నాణ్యమైన ఆహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు కూడా వంటగదులు పరిశుభ్రంగా ఉంచుతూ,ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి అని స్పష్టం చేశారు.అదేవిధంగా ఆహారం విషయంలో నాణ్యత నిబంధనలు పాటించని హోటళ్లపై,రెస్టారెంట్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.అయన వెంట ఇంచార్జి డిఎంహెచ్వో సృజన,ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ లింబాద్రి,జిల్లా స్పెషల్ ఆఫీసర్ కోఆర్డినేటర్ శివ

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

“నేటిధాత్రి”, బిగ్ బ్రేకింగ్

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

యూరియా కై..రాత్రి వేళలో పడిగాపులు.

లోడ్ వచ్చిన పంపిణీ. జరగడం లేదు.

అధికారులు స్పందించి.. పంపిణీ చేయాలని వేడుకోలు.

కుండ పోత వర్షం పడిన రైతులు పడిన కాపులు కాస్తున్నారు.

రైతు వేదిక వద్ద కరెంటు సప్లై లేకున్నా ఫోన్ లైట్ ద్వారా చూసుకుంటూ పడిగాపులు కాస్తున్న రైతులు.

“నేటిధాత్రి”,నిజాంపేట, మెదక్

రైతు యూరియా పొందడం అంటే ఓ యుద్ధం చేసినట్టుగా మారింది. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు యూరియా లోడ్ రావడం జరిగింది.

urea shortage in Nizampet, Medak

సమాచారం తెలుసుకున్న రైతులు గ్రామంలో గల రైతు వేదికలో యూరియా పంపిణీ చేస్తారెమొనని వేచి ఉన్నప్పటికీ యూరియా పంపిణీ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి భారీ వర్షం కురవడంతో కరెంటు బంద్ అయినప్పటికీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చీకటిలో, చెప్పులతో సహా క్యూలైన్లో ఉన్నారు.

urea shortage in Nizampet, Medak

యూరియా పంపిణీ జరగకపోవడంతో తెల్లవారితే.. క్యూలైన్ పెరుగుతుందని రైతులు రాత్రి వేళలో క్యూ లైన్ కట్టారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి యూరియాను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.

urea shortage in Nizampet, Medak
urea shortage in Nizampet, Medak

రామాయంపేట పట్టణంలో బతుకమ్మ సంబరాల సన్నాహాలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-18T160504.326-1.wav?_=3

 

రామాయంపేట పట్టణంలో బతుకమ్మ సంబరాల సన్నాహాలు..

రామాయంపేట, సెప్టెంబర్ 18 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకన్నగారి చెరువు వద్ద బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించి సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. చెరువు కట్టపైకి వచ్చే మహిళలు సౌకర్యంగా పూల బతుకమ్మలు నిమజ్జనం చేయగలిగేలా ప్రత్యేకంగా మెట్లు తయారు చేయడంపై మున్సిపల్ సిబ్బంది పట్టు పట్టారు.
ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో మహిళలు చెరువుకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే భద్రతా చర్యలతో పాటు సౌకర్యాల కల్పనకు ముందస్తుగానే పనులు ప్రారంభించారు.
విద్యుత్ దీపాలు, త్రాగునీటి సదుపాయం, చెరువు పరిసరాల్లో శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలందరూ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకునేలా మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని పేర్కొన్నారు.
పట్టణంలో బతుకమ్మ వేడుకలు మరింత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరగాలని మున్సిపల్ సిబ్బంది ఆకాంక్షిస్తున్నారు.”

ఝాన్సీ లింగాపూర్‌లో టార్ప్లిన్ పంపిణీ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T124555.486.wav?_=4

 

ఝాన్సీ లింగాపూర్‌లో టార్ప్లిన్ పంపిణీ..

వర్షంలో ఇల్లు కూలి ఇబ్బందులు..

రామాయంపేట సెప్టెంబర్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

https://youtu.be/P-tFvsSUVDg?si=1meRL81t9whuSFKi

 

 

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తుడుం జీవన్ కుమార్ కుటుంబం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిన్న రాత్రి మరోసారి వర్షం కురవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇది తెలుసుకున్న
సానీక్ష ఫౌండేషన్ ముందడుగు
పేద కుటుంబం పరిస్థితిని గమనించిన సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివ తక్షణమే స్పందించారు. కుటుంబ అవసరాలపై స్థానికులు సమాచారం అందించగా, శివ స్వయంగా ముందుకు వచ్చి సహాయం కల్పించే ప్రయత్నం ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన దాతలు రాజశేఖర్ రెడ్డి, మేఘన నండూరి (ఇక్షణ ఫౌండేషన్) సానుభూతితో స్పందించారు. వారి సహకారంతో శుక్రవారం టార్ప్లిన్ పంపిణీ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివతో పాటు కాంగ్రెస్ యువ నాయకుడు నవీన్ రెడ్డి, సభ్యులు శ్రీకాంత్, బాధితుడు తుడుం జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ సహాయం పేదలకు నిజమైన అండగా నిలుస్తుంది. ఇలాంటి సమయంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం అని తెలిపారు.

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ…

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ

రామాయంపేట సెప్టెంబర్ 10 నేటి ధాత్రి (మెదక్)

 

 

మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్‌డీఓ గారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో యూరియా పంపిణీ పరిస్థితులు, 22-ఎ సమాచారం, భూభారతి పనులు, రెవెన్యూ సభల్లో ఫైళ్ల పరిష్కారం, మీ సేవ డాష్‌బోర్డ్‌ వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. అదేవిధంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.
తదుపరి సిబ్బందితో మాట్లాడిన ఆర్‌డీఓ గారు సమయపాలన కచ్చితంగా పాటించాలని, దరఖాస్తులు, అభ్యంతరాలపై ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమై రెవెన్యూ సంబంధిత పనులపై మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు మహమ్మద్ గౌస్. గోపి. సిబ్బంది సుష్మ. సౌమ్య. రోజా. సునీత. తదితరులు పాల్గొన్నారు

తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T151154.040-1.wav?_=5

 

తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

మెదక్ జిల్లా, రామాయంపేట, సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ప్రముఖ కవి,స్వాతంత్ర్య సమరయోధుడు,ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దారు రజిని కుమారి మాట్లాడుతూ, “కాళోజి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష పాత్ర పోషించారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకాలు. ఆయన స్ఫూర్తితో మనమంతా తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి” అని పేర్కొన్నారు.
అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కోసం వేడినీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నవీన్. మండల ఆర్ఐ గౌస్ మయినుద్దీన్, రూరల్ ఆర్ఐ గోపి, సుష్మ. రోజా. చంద్రకళ సౌమ్య. మండల రెవెన్యూ సిబ్బంది పద్మ.తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట: యూరియా కోసం రైతుల ఆందోళన..

రామాయంపేట: యూరియా కోసం రైతుల ఆందోళన..

రామాయంపేట సెప్టెంబర్ 8 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడి యూరియా బస్తాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

 

నెల రోజులుగా తగినంత యూరియా లభించక పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సరిపడా యూరియా సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

యూరియా కొరతపై రైతుల ఆందోళన..

యూరియా కొరతపై రైతుల ఆందోళన..

రామాయంపేట సెప్టెంబర్ 8 నేటి ధాత్రి (మెదక్)

 

చేగుంట మండలంలో యూరియా కొరత రైతులను రోడ్డెక్కేలా చేసింది. మూడు రోజులుగా ఎరువులు అందకపోవడంతో సోమవారం చేగుంట గాంధీ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఇటీవల 440 బస్తాల యూరియా మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు పంపిణీ జరిగి, మిగతా వారికి అందలేదు. ఈరోజు యూరియా వస్తుందని తెలిసి తెల్లవారుజామున మూడు గంటలకే రైతులు రైతు వేదిక వద్దకు చేరుకున్నారు.

అయితే యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన వారు ప్రధాన కూడలి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరగంట పాటు సాగిన రాస్తారోకోతో మెదక్–హైదరాబాద్, నిజామాబాద్ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి మంగళవారం యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్

నిర్మాణ రంగ కార్మికులకు అండగా రేవంత్ సర్కార్

రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు వర్తింపు

యాక్సిడెంట్ డెత్ ఎక్స్గ్రేగే షియా రూ.5 లక్షల నుంచి రూ10 లక్షలకు

సహజ మరణానికి రూ 1.30 లక్షల నుంచి 2 లక్షలకు పెంచిన ప్రభుత్వం

ఐఎన్ టి యు సి శాయం పేట మండల అధ్యక్షుడు మారపెల్లి రాజేందర్

శాయంపేట నేటిధాత్రి:

 

 

నిర్మాణ రంగ కార్మికుల ఎక్స్ గ్రేషియా పెంపు వలన రాష్ట్రంలో పదిహేను లక్షల మంది వర్కర్లకు ఉపయోగ ఉంటుందని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ తెలిపారు.మండల అధ్యక్షుడు మాట్లాడుతూ యాక్సిడెంటల్‌ చనిపోతే ఎక్స్‌గ్రేషియా రూ ఆరు లక్షల నుంచి రూ పది లక్షలకు, సహజ మరణానికి రూ లక్ష ముప్పై వేల నుంచి రూ రెండు లక్షలకు ప్రభుత్వం పెంచింది అన్నారు. దీనివలన భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నరు అన్నారు. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణ యించిందని అన్నారు.ఇందు లో భాగంగా యాక్సిడెంటల్‌ డెత్‌ ఎక్స్‌గ్రేషియాను రూ పది లక్షలకు, సహజ మరణానికి ఇచ్చే సాయాన్ని రూ రెండు లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ నిర్ణయించిందని అన్నా రు . వివిధ నిర్మాణ పనులు చేస్తున్న వారు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుం బాలకు అండగా నిలిచేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించ నుంది. ఎక్స్‌గ్రేషియా పెంచాల ని గత సర్కార్‌ హయాంలో ఎన్నో సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని పెంచడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. వీరితో పాటు వెల్డర్లు, వాచ్‌మ న్లు, టన్నెల్‌వర్కర్స్‌,బావి పూడిక తీసేవాళ్లు, మార్బుల్, టైల్స్‌ వర్కర్లు, రాళ్లు కొట్టేవా ళ్లు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పంపు ఆపరేటర్స్, మున్సిపల్‌ డ్రైనేజీ వర్కర్స్‌, మిక్సర్‌ డ్రైవ ర్లు, మెకానిక్, ల్యాండ్ స్కేపింగ్‌ వర్కర్స్ తదితర యాభై నాలు గు రకాల కేటగిరీల కార్మికులు ఉన్నారు. వీళ్లలో అరవై ఏండ్ల లోపు ఉండి లేబర్‌కార్డు కలిగి న వారందరికీ ఈ బీమా వర్తిం చనుంది అన్నారు. వీటితో పాటు భవన నిర్మాణ కార్మికుల కూతురి పెండ్లికి రూ ముప్పై వేలు, వర్కర్ భార్యకు లేదా కూతురు ప్రసూతికి రూ ముప్పై వేలు, ప్రమాదవశాత్తు గాయ పడి ఇక పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే రూ నాలుగు లక్షలు, పూర్తిగా వికలాంగులైతే రూ ఐదు లక్షలు అనగా భవన నిర్మాణ కార్మికుల యాక్సిడెంట ల్‌ డెత్‌, సహజ మరణానికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా పెంపుపై కార్మికులు కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌ ఎక్స్‌గ్రేషియా ను పెంచడం ఆనందంగా ఉందన్నారు.రిజిస్ట్రేషన్‌ కు అర్హతలివే తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు కింద సభ్యులుగా పద్దెనిమిది ఏండ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు గల నిర్మాణరంగ కార్మికులు మాత్రమే అర్హులు అన్నారు. వీరు ఏడాదిలో కనీసం తొంబై రోజులు నిర్మాణ రంగంలో పనిచేసిన అనుభవం ఉండాలి అన్నారు.రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, వయస్సు నిర్ధారణ కు రుజువుగా స్కూల్‌ సర్టిఫికే ట్‌ లేదా డాక్టర్‌ సర్టిఫికెట్‌ను సమర్పించి మెంబర్‌ షిప్‌
సంబంధిత అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌కు అందజేసి లేబర్‌ కార్డును పొందొచ్చు అన్నారు . లేబర్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత రెన్యూవల్‌ చేసుకో వాలి అన్నారు. ప్రభుత్వం నిర్మాణరంగ కార్మికులకు ఎక్స్ గ్రేషియా పెంచడం పట్ల ఐఎన్ టి యు సి మం డల అధ్యక్షు డు మారపల్లి రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.

అప్పాజీపల్లి గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో గణేశ్ ప్రతిష్ట..

అప్పాజీపల్లి గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో గణేశ్ ప్రతిష్ట..

రామాయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

సగర సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో గణేశుని ప్రతిష్టించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మండపానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శనమిచ్చారు. గణేశ్ వద్దకు వచ్చిన భక్తులకు సగర సంఘం గుర్తింపుగా ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ చైర్మన్ సంధిల సత్తయ్య సగర, జిల్లా అధ్యక్షులు సంధిల సాయిలు సగర, గ్రామ అధ్యక్షులు శంకురి సాయిలు సగర, ఉపాధ్యక్షులు రుక్కముల సంగయ్య సగర, మాజీ అధ్యక్షులు చెట్టుకింది సాయిలు సగర, మాజీ సర్పంచ్ మర్క రాములు సగర, సగర బంధువులు ఎల్లంపల్లి జగన్ సగర, చెట్టుకింది లక్ష్మయ్య సగర తదితరులు పాల్గొన్నారు.

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T122515.833-1.wav?_=6

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

యూత్ కాంగ్రెస్ నేత రమేష్ చారి పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 2 నేటి ధాత్రి (మెదక్)

కాట్రియాల గ్రామానికి చెందిన కట్ట శ్రావణ్ కుమార్ (25) అనారోగ్యంతో నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మృతి చెందాడు. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లి నర్సవ్వ, తమ్ముడు శివతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
శ్రావణ్ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న నాలుగు నెలల కాలంలో తల్లి అప్పులు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్మరి రమేష్ చారి గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంతంగా 50 కిలోల బియ్యం అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కట్ట చంద్రం, కిష్టయ్య, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల నరేష్, నవీన్, రాజు, విజయ్, నరేష్, నిఖిల్, కమల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్లమ్మ గడ్డ కాలనీవాసులకు..

ఎల్లమ్మ గడ్డ కాలనీవాసులకు..

– సౌండ్ బాక్స్ మైక్ సెట్ ను అందజేసిన మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

 

 

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ గ్రామంలో ని ఎల్లమ్మ గడ్డ కాలనీ వాసులు అడగగానే వెంటనే మాట ఇచ్చిన ప్రకారం మారుతి అసోసియేషన్ చందాయిపేట గారికి గణపతి ఉత్సవాలకు గ్రామప్రజల ఆశీర్వాదంతో ని సుమారు 9500 రూపాయలు సెట్ హాంప్లివేర్ పుంగి సౌండ్ బాక్స్ మైక్ సెట్ ను బహుకరణ సభ్యులకు తలారి రమేష్, జింక స్వామి కి అందజేయడం చేయడం జరిగింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-28T153306.328-1.wav?_=7

 

 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…

– మరో మూడు రోజులు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…..

– జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్…

కొల్చారం,( మెదక్)నేటి ధాత్రి:-

 

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ కోరారు. పాత ఇళ్లలో ఉన్నవారు కూలిపోయే దశలో ఉన్న ఇళ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. నదులు,చెరువులు,వాగులు లోతట్టు ప్రాంతాలు,కల్వర్టులు వంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు అని సూచించారు.
అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఇంకా మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. కావున రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ తడిచిన చేతులతో తాకకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు అని భాగ్యరాజ్ తెలిపారు.

మూడవ వార్డులో మురుగు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-74-1.wav?_=8

రామాయంపేట మూడవ వార్డులో మురుగు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణ మూడవ వార్డులోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి శారద ఫంక్షన్ హాల్ వరకు మురుగు నీరు పారడానికి తగిన మోరీలు,సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో కొద్ది ఇండ్లు మాత్రమే ఉండడంతో చిన్న చిన్న మోరీలు నిర్మించగా,ప్రస్తుతం ఈ ప్రాంతంలో గృహ నిర్మాణాలు భారీగా పెరగడంతో పాత మోరీలు సరిపోవడం లేదు.దీంతో మురికి నీరు వీధుల్లో నిల్వ అవుతూ దోమల వృద్ధి,దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Sharada function hall.

అదనంగా రాత్రిపూట లైట్లు లేకపోవడం,చెత్త బండి ప్రతి రోజు రాకపోవడం వల్ల చెత్త పేరుకుపోతూ సమస్య మరింత తీవ్రంగా మారింది.ఈ పరిస్థితిని తక్షణమే అధికారులు గమనించి మురుగు నీటి పారుదల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో హస్నోద్దీన్, జమీర్,సల్మాన్,ఆరిఫ్, సయ్యద్,మొయిన్ తదితరులు పాల్గొన్నారు.

మై భారత్ మేరా భారత్ ఏక్ పెడ్ కార్యక్రమం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-71-1.wav?_=9

మై భారత్ మేరా భారత్ ఏక్ పెడ్ కార్యక్రమం..

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)

 

లో భాగంగా రామాయంపేట యువ జ్యోతి స్పోర్ట్స్ క్లబ్ నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట సహా కారంతో ఏక్ పెడ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని హై స్కూల్ ఆవరణంలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయురాలు

 

నిర్మల విజయ మొక్కలు నాటారు ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో వృక్షాల అవసరం ఎంతైనా ఉందని ప్రాణవాయువు విడుదలకు మొక్కలు ఆమె కోరారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ వ్యాధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version