నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలిక జూనియర్ కళాశాల నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు.రెండు కోట్ల యాభై ఐదు లక్షల సమగ్ర శిక్ష నిధులతో నూతన భవన నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధి పైన దృష్టిసారించి ఉన్నత విద్యను అందిస్తుందని,అన్ని విధాలుగా విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేశారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏండ్లుగాఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యానికి రూపాయలు 500 బోనస్ ప్రకటించారని అన్నారు రైతుల పండించిన పంటను 17% తేమ మించ కుండా ప్రభుత్వం ద్వారా కేటా యించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల న్నారు రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టు బాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారు లకు ఎమ్మెల్యే సూచించారు.
లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
శాయంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.62,07,192 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేద, నిరుపే ద కుటుంబాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభు త్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుం దని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
శాయంపేటమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 16 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.5,70, 600 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకో లేక ఆర్ధిక ఇబ్బందులు పడు తున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమ యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అనంతరం రైతులకు మొక్కజొన్న సబ్సిడీ విత్తనా లను అందజేశారు. ఈ కార్యక్ర మాలల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా, మం డల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్సీ,ఎస్టీ జేఏసీ మండల కో ఆర్డినేటర్ చుక్క రత్నాకర్
పరకాల,నేటిధాత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలులో వైఫల్యం చెందిందని బీసీ ఎస్సీ,ఎస్టీ జేఏసీ పరకాల మండల కో ఆర్డినేటర్ చుక్క రత్నాకర్ అన్నారు.సోమవారం నాడు స్థానిక అమరదామంలో మండల అధ్యక్షులు బొచ్చు నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హాజరై ఆక్రోషసభ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చుక్క రత్నాకర్ మాట్లాడుతూ బీసీ 42శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో పెట్టకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తుందని,బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడకపోవడం ఏమిటని,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల రిజర్వేషన్ల పట్ల నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డికరేషన్లో బీసీ బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి,ఇంతవరకు బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మోసం చేసిందన్నారు.బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ మూడు పార్టీలు బీసీల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం లేకుండా కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు.జస్టిస్ ఈశ్వరయ్య,రిటైడ్ ఐఏఎస్ చిరంజీవులు,డా.విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో జరుగబోయే కామారెడ్డి ఆక్రోశసభకు మండలం వ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు బొచ్చు హరీష్,కృష్ణ మహారాజ్, తిరుపతి,దిలీప్,బాలు, తదితరులు పాల్గొన్నారు.
◆:- 420 హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.
◆:- రైతు ప్రభుత్వం అంటూనే రైతుల పొట్ట కొడుతోంది.
◆:- బోరేగావ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేందర్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ ఎన్నికల పైన ఉన్న, శ్రద్ద పట్టింపు రైతుల పైనా గ్రామ పంచాయతీ ల పైనా మంత్రివర్గంనకు లేకపాయె అని ఝరాసంగం మండల బోరేగావ్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేందర్ పటేల్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ మరియు ప్రభుత్వం రైతు సంక్షేమం కాంక్షిస్తామన్నా కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వం మాటలు నీటి మూటలయ్యాయి. రైతులకు సరిగా రుణమాఫీ చెయ్యలేదు, రైతు బంధు ఇవ్వలేదు. ఇస్తామన్న బోనస్ ను సైతం ఇప్పటికి రైతులకు అందించలేదు. అన్నం పెట్టిన రైతులే అధికారాన్ని కులగొట్టే పరిస్థితి ఏర్పడింది. నీళ్లు కరెంట్ ఇచ్చి పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసిన నాయకుడు కేసీఆర్ ఆనవాళు ఏ చేరిపివెయ్యడం ఎవరి తరం కాదు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామి ఒక్కటీ నెరవేర్చలేదు. 420 హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. ప్రజల కడుపు నింపే రైతుల కడుపు కొట్టకుండా వాళ్ళకైనా రైతు భరోసా వేసి అండగా నిలవాలని కోరుతున్నాము.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి
పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి..
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుందని, ఇప్పటివరకు విద్య రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింద ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో 9000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, పెండింగ్ బకాయలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దుర్మార్గమని అది సరి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్య రంగ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని కళాశాల హాస్టల్ భవనానికి సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ కళాశాలల బాయ్స్ హాస్టల్ కు సొంత భవనం లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే సొంత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నాకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రవీణ్, పోతుల పవన్, రమాకాంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, సురేష్, వంశీ, కృష్ణ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.
మండల మైనార్టీ నాయకులు అజారుద్దీన్ ను మంత్రి పదవి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
గత నెల 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అయితే హోం శాఖ కోసం అజా రుద్దీన్ ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనకు కేటాయించబోయే పోర్ట్ పోలియోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ఆయనకు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం కేటాయించింది,ఝరాసంగం మండల మైనారిటీ డైనమిక్ లీడర్ మొహమ్మద్ ఫక్రుద్దీన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు మొదటిసారి మంత్రి పదవి కేటాయించాలని హర్షం వ్యక్తం చేశారు
సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన, గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని గండ్ర సత్యనారా యణరావు సూచించారు. పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పత్తి కొనుగో లు కేంద్రాన్ని ఎమ్మెల్యే లిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వేరు వేరుగా మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు.
8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నా రని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాల న్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయా లనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొను గోలు చేసేలా రైతులకు సహక రించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపో యిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుం దని, అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివే దిక అందించేలా సహకరిం చాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించా రు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు
గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై
◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం నిర్వహించారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహ్మత్ నగర్ డివిజన్ లోని వివిధ బూత్ లలో ప్రచారం నిర్వహించారు.ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, *కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని,తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే కెసిఆర్ పాలన రావాలని అందుకు ఈ ఎన్నిక గెలుపుతో ఆరంభం కావాలని ఈ గెలుపుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బూత్ ఇంచార్జులు ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట నుండి వంద మంది విద్యార్థులు హలో విద్యార్థి చలో కలెక్టరేట్ విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగినది ముట్టడిలో భాగంగా పోలీసులకు విద్యార్థి నాయకులకు విద్యార్థులతో తోపులాట జరిగినది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం జరిగినది సిటీ పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించడం జరిగినది మీరు ఎన్ని అక్రమ అరెస్టులు కేసులు చేసిన విద్యార్థులకు ఇచ్చిన హామీలు మరియు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి లేనియెడల మరో ధర్నాలు రాస్తారోకోలు చేయడనికైనా సిద్ధం హెచ్చరించడం జరిగినది ఈ కార్యక్రమంలో జమ్మికుంట బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు కొమ్ము నరేష్ ,ఆవుల తిరుపతి, జవాజీ అనిల్, వొల్లాల శ్రీకాంత్ , నల్లగాశ హరీష్ యాదవ్,చింతల కౌశిక్, వెనిశెట్టి నాగరాజు, నరిండ్ల శివ భాస్కర్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ,గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(ఐకెపి)ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని,కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. ఏ గ్రేడ్కు రూ.2389, కామన్ రకానికి రూ.2369ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాణి,ఎంపీడీవో రామకృష్ణ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్,మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్, ఏపిఎం నాగేశ్వరరావు, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నేం తిరుపతిరెడ్డి, చాడ తిరుపతిరెడ్డి,గోల్కొండ సదానందం,రామకృష్ణ పురం మాజీ సర్పంచ్ పెండ్లి రాజు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు పెండ్లి లింగారెడ్డి,రాయిడి జీవన్ రెడ్డి,ఐకేపీ సభ్యులు గోనె చైతన్య,పెండ్లి సునీత,పద్మ,యార రజిత, ఎరుకల సుక్కపాల,బిజెపి మండల అధ్యక్షులు ఎరుక దివాకర్,తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
ఈనెల 30న విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ్ కుమ్మరి రాజు
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జిల్లా కేంద్రంలో 300 విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ్ కుమ్మరి రాజు మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అని వారు అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధుల విద్యా రంగానికి కేటాయిస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసింది అని వారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిరసన కార్యక్రమం చేశారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు అదేవిధంగా ఈనెల 30వ తేదీన జరిగే రాష్ట్రవ్యాప్తంగా బందును సంబంధించి డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రొఫెషనల్ కళాశాలలో డిప్లమో కళాశాల యూనివర్సిటీలు బంధుని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సకినాల వికాస్ జిల్లా కమిటీ సభ్యుడు వంశీ తదితరులు పాల్గొన్నారు
శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశా లలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ జర్నలి స్టులపై దాడి హేయమైన చర్య మహిళా జర్నలిస్టులని కూడా చూడకుండా వారిపై దుర్భాష లాడుతూ దాడి చేయడం సిగ్గుమాలిన చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ప్రజాపాలన కొన సాగించాలని రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రాబోయే కాలంలో విద్యార్థులు యువ కులు ప్రజల చేతుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చ రించారు. ఇప్పటికైనా ఇటు వంటి చర్యలు మానుకోవాలని కొనియాడారు లేనిపక్షంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపు తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి సీనియర్ జిల్లా నాయకులు బెరుగుతరుణ్ గోపి కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు అభిలాష్ ,సిద్దు, శివకుమార్, ప్రశాంత్, వినయ్, వంశీ, సాయి కృష్ణ తేజ ,గణేష్ ,మున్ని, నాని మేఘనాథ్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నిర్మాణాల్లో భాగంగా దర్శనాలు భక్తులకు నిలిపివేస్తూ ఏకాంత సేవలు చేస్తూ అర్జిత సేవలు మరియు భక్తులు రాజన్న దర్శించుకునేదంతా భీమన్న ఆలయంలోకి మార్చడం అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనను మరియు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ యొక్క సూచనలను తీసుకొని ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బ తినకుండా అదే రకంగా భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా రాజన్న ఆలయ ఆవరణలోనే దర్శనాలను ఏర్పాటు చేస్తూ అదే రకంగా అర్జిత సేవలను కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం ఆహ్వానిస్తూ ఉన్నాం అదే రకంగా భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు భక్తులను నమ్మకాల పట్ల విశ్వాసంతో చేసే కార్యక్రమాలు తప్ప అభివృద్ధికి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది కాంక్షిస్తుంది కానీ అందులో భాగంగా భక్తులకు రాజన్నను దూరం చేస్తాం అంటేనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భీమన్న ఆలయంలో అర్జిత సేవలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఆపివేయడం వంటివి చేయడం ద్వారా,నిన్న బిజెపి చేసిన ధర్నాకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దర్శనాలు యధావిధిగా కొనసాగించడం జరుగుతుందని సర్క్యులర్ జారీ చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు మరియు అలాగే నిన్న జరిగినటువంటి ధర్నాకు మద్దతు ఇచ్చినటువంటి హిందూ బంధువులకు మరియు బీజేపీ కార్యకర్తలకు మా ధన్యవాదాలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి పట్టణ అధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్,స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్,మోర రవి,కోడం వినయ్, దూడం సురేష్,దేవేందర్ రెడ్డి,మెరుగు శ్రీనివాస్,సిద్ధి దేవరాజు,వేముల వైశాలి,శ్రీనివాస్, శ్రీధర్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
* ఈ ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు
* రైతు రుణమాఫీ మధ్యలోనే ఆపారు
యూరియా సకాలంలో రాలేదు
ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు రాలేదు
రాజీవ్ యువశక్తి మొదలే పెట్టలేదు
మహిళలకు 2500 రానేలేదు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ్ పార్టి భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీ.సీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హడావిడిగా ఎన్నికలు నిర్వహించుటకు సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టి న్యాయం చేస్తే మేం స్వాగతిస్తాం. కానీ న్యాయ నిపుణులతో చర్చించకుండా?సాధ్య , అసాధ్యాయులు అంచనా వేయకుండా? ఎన్నికల జీ.వో తీసుకురావడాన్ని హైకోర్టు స్టె ఇచ్చింది. దీనివల్ల ప్రజలు అధికారులు అసహనానికి గురవుతున్నారు. ప్రజాధనం వృధా అవుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. అసమర్థ పాలనతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన? అని విసిగిపోతున్నారు. ఏ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు. రైతు రుణమాఫీ అందరికి జరగలేదు. యూరియా సకాలంలో రాలేదు. రాజీవ్ యువ శక్తి లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు అందలేదు. బతకమ్మ చీరలు లేవు. సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ప్రజలకు అవసరమైన ఆయకట్టు రోడ్లు లేవు. అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుటకు కారణం మేధావులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయం తీసుకోక పోవడమే ఇప్పటికైనా సంపూర్ణ పరిపక్వ నిర్ణయాలతో ప్రజలకు సేవ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ప్రభుత్వానికి సూచించారు.
ఈ నెలలో పెరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికలు రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ వేసిన నేపద్యంలో హైకోర్టు స్టే విధించడం పట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి సామ్రాజ మల్లేశం అధ్యక్షతన నర్సంపేట పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్టే తేవడం అనేది అగ్రవర్ణాల కుట్రగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి స్టేలకు, కోర్టులకు వెళ్లలేదని తెలిపారు.మా ఓట్లు మీకు అవసరంకాబట్టే ఇలాంటి కుట్ర పన్నుతున్నారని తస్మాత్ జాగ్రత్త అని అగ్రవర్ణాలను సోల్తి సారయ్య హెచ్చరించారు.హై కోర్టు స్టే పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే బీ.సీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు బందులో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాలపూర్ నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోల్తి రవి,నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గండు రవి,ఉపాధ్యక్షుడు చీర వెంకట్ నారాయణ,జిల్లా యువ నాయకులు బైరి నాగరాజు, సోల్తి అనిల్,సోల్తి పెద్ద సాంబయ్య,సోల్తి చిన్న సాంబయ్య అఖిల్,అనీష్,రాజు,రమేష్,సంపత్ సతీష్ ,రాంబాబు, కే సాంబయ్య తదితరులు తెలిపారు.
భారతీయ జనతా పార్టీలో చేరికలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి
మహాదేవపూర్ అక్టోబర్ 8 నేటి ధాత్రి *
Vaibhavalaxmi Shopping Mall
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి అధ్యక్షతన మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కంకణాల రాజిరెడ్డి మెరుగు లక్ష్మణ్ సారంగపని బీజేపీ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్బంగా చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎలక్షన్స్ దృష్ట్యా బీజేపీ పార్టీలో చేరికలు అవ్వడం శుభపరిణామం అని, భారత ప్రధాని గౌ ‘శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకలు, వారి పరిపాలన ఆకార్షితులై బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 22 నెలలు అవుతున్న కానీ ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని, రాబోయే రోజులలో తెలంగాణనలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో మహాదేవపూర్ అన్నీ స్థానాలలో పోటీ చేసి, గెలిచి తిరుతామణి,కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని,అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక భారీ మూల్యం చెల్లించుకుంటుందని వారు చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్,కార్యదర్శి సంతోష్, మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య యాదవ్, చాగర్ల రవీందర్,దాడిగేలా వెంకటేష్,కొక్కు రాకేష్, రాము, బల్ల శ్రావణ్ కార్యకర్తలు పాల్గొన్నారు,
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రె స్ ప్రభుత్వంలో విసుగు చెందారు
బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ
శాయంపేట నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
శాయంపేట మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో భూపా లపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మరి యు వరంగల్ జిల్లా మాజీ జెడ్పిచైర్ పర్సన్& బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారంబిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది.
రైతులకి ఇస్తామని చెప్పిన రైతు బంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు,
మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దుల కు, వితంతువులకి, వికలాం గులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు ఇవ్వ లేదు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల కు ఇదిగో మా బాకీ కార్డు,మా కు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని కోరారు.
BR
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మేకల వెంకన్న మరియు మాజీ ఎంపిటిసి మేకల శ్రీనివాస్, అట్ల రమేష్ అట్ల తిరుపతి మామిడి శంకర్ గారు మాజీ సర్పంచ్ తోట కుమారస్వామి పసునూటి రాజయ్య సామల విజయ్ చాడ రాజిరెడ్డి కొమురాజు ప్రశాంత్ దీండిగాల నాగార్జున్ కర్రు రవి, ఆకుల శంకర్, కొప్పుల బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు పోతుల విష్ణు,మాస్ అనిల్, బండారి ఆనందం, ఆకుతోటరాజు పసునూటిరాజు, గరిగరమేష్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు ఘంటా శ్యాంసుందర్ రెడ్డి, పత్తిపాక ముఖ్య నాయకులు బి.నారాయణరెడ్డి, పెద్దిరెడ్డి ఆదిరెడ్డి, వైద్యుల తిరుప తిరెడ్డి, సాంబరెడ్డి, చల్లా సమ్మిరెడ్డి, తుడుం వెంకటేష్, గజ్జి రమేశ్, పోతుగంటి సుభాష్, నక్క రాజు మరియు కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు
ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్
కరీంనగర్, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.
రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిందలు వేస్తూ రేవంత్ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.
ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అయితే..
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.
బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని, వివక్షను ఎదురిస్తూ సాగిన నాటి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడి ఉన్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్ లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే చాకలి ఐలమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ పోరాట యోధులను సమున్నత రీతిలో స్మరించుకున్నట్లు తెలిపారు. సబ్బండ కులాలు, మహిళల అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయన్నారు. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. భూపాలపల్లి బస్టాండ్. భూపాలపల్లి బస్టాండ్ ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు రజక కులస్తులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.