అప్పం కిషన్ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జీఎస్సార్….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T135721.287.wav?_=1

 

అప్పం కిషన్ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ పుట్టిన రోజు సందర్భంగా కిషన్ ని ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్సార్ మాట్లాడుతూ కిషన్ నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయం….

పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలు చిరస్మరణీయం

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

 

శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు.అనంతరం ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,కె. ఆర్ నాగరాజు,వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,స్నేహ శబరిష్,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి,ఎన్డిపిసిఎల్ సి యండి వరుణ్ రెడ్డి,ఎన్సిసి గ్రూప్ కమాండర్ కర్నల్ సచిన్ అన్నారావు,.

కర్నల్ రవి,వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్,అదనపు డిసిపిలు సురేష్ కుమార్, ప్రభాకర్ రావు శ్రీనివాస్, బాలస్వామి,రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యుడు ఈ.వి శ్రీనివాస్ రావుతో పాటు ఏసిపిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్ఐలు,ఎస్ఐలు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ఐ స్పర్జన్ సారధ్యంలో సాయుధ పోలీసులు ‘శోక్ శ్రస్త్ చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది,అమరవీరుల కుటుంబ సభ్యులు మౌనం పాటించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్చించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు

పాటుపడాలన్నారు. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారన్నారు. వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే ఉంటామని చెప్పారు. అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి మిషన్ హస్పటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో శాసన సభ్యులు,పోలీసులు,అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం

సభ్యులు పాల్గొన్నారు.

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు…

సింగరేణి లో సిఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు

జైపూర్,నేటి ధాత్రి:

 

సింగరేణిలో సీఐఎస్ఎఫ్ పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. సింగరేణి కమాండెంట్ సంచల్ సర్కార్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ జరిపించారు.విధి నిర్వహణలో భాగంగా ప్రాణ త్యాగాలు అర్పించిన పోలీస్ వీరులకు కమాండెంట్ చంచల్ సర్కార్ నివాళులు అర్పించారు.సెప్టెంబర్ 1. 2024 నుండి ఆగస్టు 31.2025 మధ్యకాలంలో ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి మొత్తం 191 పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాలని వారు తెలిపారు. అలాగే అమరవీరులైన పేర్లను చదివి వినిపించి వారి గౌరవం సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్ బలగాల ధైర్య సహసాలను అంకిత భావాన్ని గౌరవించడం వారి సంక్షేమం దేశ భద్రత పట్ల మన నిబంధతను తెలియజేయడమే మన లక్ష్యము అని తెలిపారు.

ధమ్మచక్ర పరివర్తన దినం…

ధమ్మచక్ర పరివర్తన దినం

-బహుజన సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోజ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూర్వ భారత దేశ పూర్వ మత మైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి శుభదినం ఈరోజు ఆయన నాగపూర్ పట్టణంలో బౌద్ధాన్ని స్వీకరించినటువంటి శుభదినా రోజునా పర్లపెల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పుష్పాలంకరణ కార్యక్రమం బహుజన సమాజ్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మనోజ్ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రత్న భాస్కర్ , బీసీ సంఘం నాయకులు ఆకుతోట రమేష్, పొన్నం రమేష్, నియోజకవర్గ అధ్యక్షులు పుల్యాల భగత్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యకమం లో మనోజ్ మాట్లాడుతూ…ధమ్మచక్ర పరివర్తన దినం అంటే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ , ఆయన అనుచరులు హిందూ మతం నుండి బౌద్ధమతాన్ని స్వీకరించిన రోజును సూచిస్తుంది. ఈ సంఘటన 1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లోని దీక్షాభూమిలో జరిగింది, అప్పటి నుండి ఈ రోజును బౌద్ధ పండుగగా జరుపుకుంటారు.

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలువనున్న సీఎం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రానున్నారు.ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ రాక ఖరారు అయ్యింది.ఐతే వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఈ నెల 4 అనారోగంతో మరణించిన విషయం తెలిసిందే.కాగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఫోన్ ద్వారా అదే రోజు పరామర్శించారు.ఈ నేపథ్యంలో 15 న కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమం హన్మకొండలో ఏర్పాటు చేయనున్నారు.ఐతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని స్వయంగా పరామర్శించేందుకు గాను ఈ నెల 15 న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికార ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎమ్మెల్యే డోలా రోహన కార్యక్రమంలో ఆశీర్వదించారు

డోలా రోహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మొగుడంపల్లి మండల కేంద్రంలో జరిగిన గారి వార్డ్ మెంబర్ ప్రభు గారి కుమారుడి డోలా రోహన కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్,మాజి సర్పంచ్ లు ఈశ్వర్ రెడ్డి,సీతారాం రెడ్డి,నాయకులు ఓంకార్ రెడ్డి,గోపాల్, సంజీవ్ పవార్, దేవిదాస్ జాదవ్, రాంశెట్టి, లింబాజీ, జ్ఞానేండ్, నరేశ్ చౌహన్, సుభాష్ చందర్, కిరు, బిక్కు,
గ్రామ నాయకులు అంజన్న ,రాములు,జెట్టప్ప,వెంకట్ ,నర్సింలు,నాగన్న తదితరులు ..

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

మెట్ పల్లి ప్రెస్ క్లబ్ లో ఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం…

మెట్ పల్లి ప్రెస్ క్లబ్ లో ఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం

మెట్ పల్లి అక్టోబర్ 4 నేటి ధాత్రి

మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కు నూతనంగాఎన్నికైన ఉపాధ్యక్ష కార్యవర్గ సభ్యులకు సన్మానం
మెట్ పల్లి గత రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లకు ఐ జేయు ఎన్నికలు జరుగగా ఆ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డా జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ సాజిద్ పాషా, బాసెట్టి హరీష్ లను శనివారం రోజు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజేఐజేయు అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మమ్మద్ అజీమ్ ల ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది.
వారితోపాటు మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షులు , మహమ్మద్ అఫ్రోజ్,కార్యవర్గ సభ్యులు బొల్లం రాజు, ఓంకారీ శ్రీనివాసులను కూడా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జంగం విజయ్, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్ , గౌరవ సలహాదారులు దాసం కిషన్,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజరి శివ,ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, యస్ పి రమణ కార్యవర్గ సభ్యులు పోనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, ముత్యాల రమేష్ ,విజయసాగర్, సభ్యులు ఆగ సురేష్,ఆదిల్ పాషా, ఏసమేని గణేష్, ఎండి అభిద్, రాజశేఖర్, అమ్ముల ప్రవీణ్, తేలు కంటే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక…

మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ, అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెత్తందార్ల దురాగతాలను,ఆనాటి నిరంకుశ రజాకార్లకు,దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు.మహిళా చైతన్యానికి,ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,ఏ ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ లు భీమేష్,ఆర్ఐ లు దామోదర్,శ్రీనివాస్, వామన మూర్తి,సీపీఓ సిబ్బంది,వివిధ వింగ్స్ సిబ్బంది,ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

నూతన జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ దేవుజా గారికి స్వాగతం పలికిన…

నూతన జహీరాబాద్ రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ దేవుజా గారికి స్వాగతం పలికిన

◆:- పి.రాములు నేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాగో తెలంగాణ వ్యవస్థాపకులు జహీరాబాద్ నూతన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ గా విచ్చేసిన అధికారి గారికి జాగో తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు పి.రాములు నేత గారు వారి కార్యవర్గంతో వెళ్లి ఘనంగా స్వాగతం పలికారు తర్వాత కార్యక్రమంలో జహీరాబాద్ లో తిష్ట వేసిన కొన్ని సమస్యలపై చర్చించగా సానుకూలంగా స్పందించిన రెవిన్యూ డివిజన్ అధికారి త్వరలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసి దశలవారీగా సమస్యలను అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినారు కార్యక్రమంలో జాగో తెలంగాణ వ్యవస్థాపక ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ మహమ్మద్ ఫసియోద్దీన్ అరవింద్ పేర్ల దశరథ్ పాల్గొని రెవిన్యూ డివిజనల్ అధికారికి శాల్వా పూలమాలతో సన్మానించినారు,

అభివృద్ధి ప్రదాతలకు పాలాభిషేకం…

అభివృద్ధి ప్రదాతలకు పాలాభిషేకం

వజ్జ సారయ్య

కొత్తగూడ,నేటిధాత్రి:

 

 

కొత్తగూడ మండల కేంద్రం లో నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పల్లెలు పట్టణాల్లాగా తయారవుతాయని..ప్రజలు భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన పూర్తి ఫలాలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ ప్రజలు నమ్మకాన్ని నిజం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మంత్రివర్గానికి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు సంక్షేమ శాఖ ధనసరి అనసూయ సీతక్క ప్రత్యేక కృషితో
ఏజెన్సీ మండలం మండలమైన కొత్తగూడ మండల కేంద్రంలో సుమారు 12 కోట్ల రూపాయలతో
సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయడం జరిగిందని..
త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే పల్లెల మరియు పట్నాలు అభివృద్ధి చెందుతాయని మరోసారి రుజువైందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,* మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ధనసరి అనసూయ సీతక్క
చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు..

మళ్లన్న నారి శక్తి లోగో ఆవిష్కరణ…

హైదరాబాద్ లో రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగోని లాంచ్ చేసిన ఎం ఎల్ సి తీన్మార్ మల్లన్న

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ కి చెందిన “నారి శక్తి” సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ జ్యోతి పండాల్ గారి ఆధ్వర్యంలో హైదరబాద్ లోని బిసి పొలిటికల్ జె.ఏ సి రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారిచే రాష్ట్ర “నారి శక్తి” సంస్థ లోగో ను ఆవిష్కరించి తీన్మార్ మల్లన్న జ్యోతి పండాల్ ను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడతూ మహిళలు సాధికారత సాధించినప్పుడే దేశం,రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పొలిటికల్ జె.ఏ సి కోఆర్డినేషన్ కమిటి చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, జె.ఏ సి నాయకులు కొనదొడ్డి నర్సింహ్మ (జహీరాబాద్ ఇంచార్జ్), తీన్మార్ మల్లన్న టీం శ్రీకాంత్, జగన్నాథ్, నాయకులు శ్రీ బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సింగారం రవీందర్ కొట్ల వాసుదేవ్ సుతారపు రంగన్న తదితరులు పాల్గొన్నారు

మండల పాఠశాల కరస్పాండెంట్లులను ఘన సన్మానం…

మండల పాఠశాల కరస్పాండెంట్లులను ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఝరాసంగం మండల్ లోని ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయ బృందాన్ని జహీరాబాద్ ట్రస్మ తరఫున ఉపాధ్యాయులందరినీ సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము ఉపాధ్యాయులందరిని సన్మాన సత్కారము జరుపబడుతుంది అదేవిధంగా ఈసారి కూడా ప్రతి పాఠశాల ఐదుగురు ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ లను సన్మాన సత్కారము చేయబడింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్దలు ట్రస్మా ప్రెసిడెంట్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా స్కూల్ ల
కరస్పాండెంట్లు విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ నాగన్న అక్షర భారతి కరస్పాండెంట్ శ్రీనివాస్ మరియు హాని టెక్నో పాఠశాల కరస్పాండెంట్ శరణప్ప ట్రస్మా ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి మోహన్ రెడ్డి దశరథ్ రెడ్డి మరియు సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది,

పరకాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్ వర్ధంతి ఘనంగా…

https://youtu.be/FNA9Z2jcGNY?si=L8S4XeiEOx4ctZ5w

కొయ్యాడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి

అనంతరం సాయుదపోరాట యోధులకు నివాళులు అర్పించిన నాయకులు

పరకాల నేటిధాత్రి

పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రక్కల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి లు రాజశేఖర్ రెడ్డికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ గుండెల్లో నిలిచిన నాయకుడు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషిచేసి ఈరోజు దేశంలోనే ఎవరూ చేయలేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన మహా గొప్ప నేత ఆరోగ్యశ్రీ కార్డుతో దేశంలోనే గొప్ప పేరుగాంచిన మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక ఎంపీ లోని గెలిపించుకొని దేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మహానాయకుడని నాటి నుంచి నేటి వరకు రాజశేఖర్ రెడ్డి గుర్తులు ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నాయని అన్నారు.ఆ మహానీయుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరమని కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.సెప్టెంబర్ 2 తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు,పరకాల అమరవీరులకు వర్గాల అమరధామంలో వారిని స్మరిస్తూ నివాళులర్పించడం జరిగింది.నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పరకాల ప్రాంతంలో పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పట్టుకుని పరకాల ప్రాంతంలో తిరుగుతున్న వారిని నిజాం ప్రజకారులు కాల్పులు జరిపి ఎంతో మందిని చిత్రహింసల గురిచేసి మహిళలు వృద్ధులు చిన్నపిల్లలను చూడకుంట విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నటువంటి రజాకారులను ఎదిరించి పోరాడిన మహనీయులను స్మరిస్తూ తెలంగాణ కోసం పరకాల ప్రాంతానికి చెందిన అమరులు ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకొని వారికి స్మరించడం జరిగింది కొయ్యడ శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో
సమన్వయ కమిటీ సభ్యులు చిన్నల గునాథ్,ఒంటేరు రామ్మూర్తి,పోరండ్ల సంతోష్,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,పసుల రమేష్,దుబాస్ వెంకటస్వామి,పాడి ప్రతాప్ రెడ్డి,సదానందం గౌడ్,బొచ్చు బాబు,నల్లల అనిల్,ఒంటేరు శ్రావణ్ కుమార్,పాలకుర్తి శ్రీనివాస్,బొచ్చు మోహన్
తదితరులు పాల్గొన్నారు.

మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు…

మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు

గణపతి మండపంలో ఘనంగా పూజలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 10 వార్డు పోచమ్మ ఆలయంలో పోచమ్మతల్లి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ,ఆ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేపట్టి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు హాజరైయ్యారు.పూజారి రామకృష్ణ ప్రత్యేక పూజలు చేపట్టారు. మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని గణనాధున్ని వేడుకొన్నట్లు తెలిపారు.ఈ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ శీలం సత్యనారాయణ, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, కడారి కుమారస్వామి, ఎల్ల స్వామి, బిక్షపతి, పి.కృష్ణ,స్థానిక వ్యాపారులు బండి సుధాకర్, శ్రీనివాస్,కోడమ్ సారంగం, నాగిశెట్టి ప్రవీణ్ తదితరులు స్థానికులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో బిజెపి నాయకులకు ఘన సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T161743.003.wav?_=2

నూతనంగా ఎన్నికైన బిజెపి నాయకులకు ఘనంగా సన్మానం

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని దొంగల రాజేందర్ అన్నారు
స్థానిక బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి జిల్లా నూతన పదవులు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం స్థానిక బిజెపి నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది
నూతనంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఊరటి మునిందర్ రూరల్ మండల అధ్యక్షుడు పులి గుజ్జరాజు కి భూపాలపల్లి స్థానిక బిజెపి నాయకులు బిఎంఎస్ కార్యాలయంలో ఘనంగా పూల పుష్పం ఇచ్చి శాలువాలతో సన్మానించడం జరిగింది అనంతరం స్వీట్స్ పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భట్టు రవి కంబాల రాజయ్య కంచం నరసింహమూర్తి అజ్మీర రాజు నాయక్ జంజాల సురేష్ తుమ్మేటి దామోదర్ బాణాల మధు ఆవుల సంతోష్ తాండ్ర హరీష్ తోట్ల స్వామి సిలోజు సాగర చారి తదితరులు పాల్గొన్నారు

జహీరాబాద్‌లో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గౌరవం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T121121.910-1.wav?_=3

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్సి కార్పోరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాహిరాబాద్ పట్టణంలోని ఎన్.కన్వెన్షన్ హాల్ లో ఈ రోజు జరిగిన వికలాంగుల,వృద్ధుల, వితంతువుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్,మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్,సామెల్, శివప్ప,బి.దిలీప్,తదితరులు ఉన్నారు

సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ధర్మ సమాజ పార్టీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T155236.360-1.wav?_=4

 

సర్కిల్ ఇన్స్పెక్టర్ ను కలిసిన ధర్మ సమాజ పార్టీ

డి.ఎస్.పి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

 

 

గణపురం మండల కేంద్రంలో నూతనంగా మూడు మండలాలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన సీఐ కర్ణాకర్ రావు ని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చా నీ అందించి, శాలువాతో సన్మానించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ,గాంధీ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇంజపెల్లి విక్రమ్, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ ,ఖండే సదయ్య తదితరులు పాల్గొన్నారు

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-7.wav?_=5

పోత్కపల్లి ఎస్ఐకి ఉత్తమ సేవ పురస్కార అవార్డు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్పై
ది కొండా రమేష్ కు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవ పురస్కారం అవార్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఐకి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును
అందించారు.

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్..

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొయినాబాద్ జెపిఎల్ కన్వెన్షన్ లో జరిగిన పస్తాపూర్ వాస్తవ్యులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంగారెడ్డి గారి కుమారుడు శంకర్ రెడ్డి (సి.ఆర్.పి.ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్) & మనీషా రెడ్డి (ఐ.పి.ఎస్.) గార్ల వివాహ విందు వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్విర్
వారితో పాటు మాజీ కౌన్సిలర్లు మోతిరామ్ జహంగీర్ యూనస్ రాములు నేత నాయకులు శ్రీకాంత్ బి జి సందీప్ అరుణ్ బాల్రెడ్డి పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version