వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాగణంగా కుంకుమ పూజ కార్యక్రమం.

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాగణంగా కుంకుమ పూజ కార్యక్రమం

చందుర్తి నేటిధాత్రి:

శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రోజున శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణాచారి ఆధ్వర్యంలో మహా ఘనంగా మహిళలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణమాసంలో ఎంతో పవిత్రమైన రోజు శుక్రవారం రోజున ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందాన్ని తెలిపారు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఆలయంలో కనుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆగస్టు 8 రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతము కుంకుమ పూజ మహా ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొగలరని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు మహిళలు పాల్గొన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ..

భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-80.wav?_=1

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం పురపాలక సంఘం ఆవరణంలో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది భారతీయ మజ్దూర్ సంఘం ఏర్పడి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి మునుగంటి సురేష్, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీను గౌడ్, అదేవిధంగా బిఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు రాము, రాఘవేందర్, పురుషోత్తం ప్రవీణ్ మరియు బిఎమ్ఎస్ సభ్యులు నాగారం పురపాలక సంఘ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కచ్చితంగా అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా సురేష్, మాట్లాడుతూ రోజుకు ఎనిమిది గంటలు వారానికి 48 గంటలు పని చేయాలి అంతకుమించి ఎక్కువ పని చేసినట్లయితే వారికి ఓటి ఇవ్వాలి మరియు వారికి ఆదివారం రోజు కచ్చితంగా సెలవుదినంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మోకుదెబ్బ నాయకులు..

వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మోకుదెబ్బ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి:

ద్వారకపేట-సర్వపురం గౌడ సంఘ మాజీ అధ్యక్షులు విలాసారపు సుదర్శన్ గౌడ్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ నాయకులు హాజరైనారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ వరంగల్ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,రాష్ట్ర నాయకులు శీలం వీరన్న గౌడ్,మద్దెల సాంబయ్యగౌడ్,గంధంసిరి సామ్రాజ్యంగం,బూరుగు సాయి గౌడ్,విలసారపు నరేందర్ గౌడ్, వేముల రవి గౌడ్, పులి తిరుపతి గౌడ్, బురుగు కట్టనగౌడ్, దొనికల వెంకన్న గౌడ్, మెరుగు కమలాకర్ గౌడ్, కుమారస్వామి గౌడ్,సృజన్ గౌడ్ పాల్గొన్నారు.

ముస్లింల షాదీఖాన శంఖుస్థాపన కార్యక్రమానికి

ముస్లింల షాదీఖాన శంఖుస్థాపన కార్యక్రమానికి ముస్లింలందరు తరలిరావాలి

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండల ముస్లిం కుల సంఘం మరియు మండల ముస్లింల షాదీఖాన నిర్మాణ కమిటీల సమావేశం సోమవారం కేసముద్రం విలేజ్ మసీదులో నిర్వహించడం జరిగింది. కుల సంఘం అధ్యక్షులు షేక్ ఖాదర్ మరియు షాదిఖాన నిర్మాణ కమిటీ అధ్యక్షులు షేక్ మహ్మద్ అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసముద్రం మండల ముస్లిం ప్రజల సౌకర్యార్ధం షాదిఖానా నిర్మాణానికి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి, శంఖుస్థాపన చేస్తున్న ముఖ్య మంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం మండల షాదీఖాన శంఖుస్థాపన కార్యక్రమం ఉన్నందున కేసముద్రం మండలంలోని ముస్లింలందరు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కుల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ నయీం, షాదిఖానా నిర్మాణ కమిటీ కోశాధికారి షేక్ అక్బర్, కేసముద్రం విలేజ్ దర్గా సదర్ మహ్మద్ అమీర్ పాష, మాజీ సదర్ షేక్ యాకుబ్ పాష, కల్వల గ్రామ సదర్ మహ్మద్ పాషా, మహ్మద్ సైదులు, మహమ్మద్ గఫార్, షెక్ యూసుఫ్, షేక్ మహ్మద్, షేక్ అజారుద్దీన్, షేక్ సైదులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ

38వ వార్డు ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్.

నేటి ధాత్రి సిద్దిపేట:

 

 

 

 

స్థానిక సిద్దిపేట 38వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుగా ఎంపికైన గాదగోని జయ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందించారు.

ఈ సందర్భంగా మంగళవారం ఇల్లు నిర్మాణం పనులు మొదలు పెడుతూ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మరియు నిర్మాణానికి తొలిమెట్టు అయిన ముగ్గు పోయడం జరిగింది.

ఇట్టి కార్యక్రమానికి లబ్ధిధారైన గాధగోని జయ సిద్దిపేట స్థానిక కాంగ్రెస్ నాయకులు బైరి ప్రవీణ్ కుమార్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ , 17 వార్డు ఇంచార్జీ, వెంకటేశ్వర గుడి డైరెక్టర్ బైరి నాగమణి మరియు మార్క సతీష్ లను ఆహ్వానించగా వారి ఆధ్వర్యంలో లబ్ధిదారుకు శుభాకాంక్షలు తెలిపి కొబ్బరికాయ కొట్టిన స్థానిక 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బైరి ప్రవీణ్ కుమార్ భూమి పూజ చేయడం జరిగిందనీ తెలిపారు.

 

Praveen Kumar.

 

 

ఇట్టి కార్యక్రమంలో 38వ వార్డ్ మున్సిపల్ అధికారి, 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు 38వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చేర్యాలలో కాసుల రమేష్ ఉద్యోగ పదవి విరమణ సభ.

చేర్యాలలో కాసుల రమేష్ ఉద్యోగ పదవి విరమణ సభ

ముస్తాల ఆరోగ్య కేంద్రం హెల్త్ ఆఫీసర్ గా సేవలు

చేర్యాల నేటిధాత్రి:

ముస్తాల ఆరోగ్య కేంద్రం హెల్త్ ఆఫీసర్ గా సేవలందించిన కాసుల రమేష్ పదవి విరమణ సభను చేర్యాల పట్టణంలో కళ్యాణి గార్డెన్లో నిర్వహించారు ఈ సందర్భంగా వారు పనిచేసిన ఆరోగ్య కేంద్రాల సిబ్బంది మరియు బంధు మిత్రులు అతని చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి అతని సేవలను కొనియాడారు సమాజంలో వైద్య వృత్తి కి ప్రత్యేక స్థానం అలాంటి వృత్తిలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ చేర్యాల పరిసర ప్రాంతాల్లో కరీంనగర్ మారుమూల కాలేశ్వరం పరిసర ప్రాంతాలలో పేద ప్రజలకు వైద్య సేవలు అందించి మంచి వైద్యాధికారిగా పేరు తెచ్చుకున్న కాసుల రమేష్ ను పలువురు అభినందించారు మరియు విశ్వకర్మ సంఘాలు స్వర్ణకార సంఘాలు నాయకులు వారిని శాలువాతో సత్కరించి కొనియాడారు ఈ సందర్భంగా కాసుల రమేష్ మాట్లాడుతూ నా ఉన్నతికి కారణం నా తల్లిదండ్రులు మరియు నా సహోదరుడు కి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అన్నారు మరియు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా అర్ధాంగిని శ్రీలత సేవలను కొనియాడారు మరియు వారి కొడుకులు కోడళ్లను అయినా ,విక్రాంత్, నిహారిక, సుమంత్, చందన నా ఉన్నతికి అదృష్టం అన్నారు సుదీర్ఘ నా జీవిత ప్రయాణంలో నాతో కలిసి వచ్చిన బంధుమిత్రులు మరియు ఆత్మీయులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం

ఘనంగా రైతు భరోసా సంబరాలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేట నేటి ధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పాలాభిషేకం చేసి, ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారు లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో 9000 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ కావడం ఎంతో సంతోషకరం.ఈ కార్య క్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, మహి ళలు, ప్రజలు, రైతులు అధిక మొత్తంలో పాల్గొన్నారు

హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న నాయకులు.

హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న నాయకులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలం చిలపల్లి మాజీ ఎంపీటీసీ హఫీజ్ భాయ్ సోదరుని రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్ మరియు ఉదయ్ శంకర్ అశ్విన్ పటేల్ మొహమ్మద్ జఫర్ ప్రసాద్ ఫక్రుద్దీన్ సద్దాం హుస్సేన్ రవి శీను పార్టీ పెద్దలు, నాయకులు,యుత్ కాంగ్రెస్ నాయకులు. పాల్గొన్నారు.

సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన.

సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల శంకుస్థాపన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

భూపాలపల్లి నేటిధాత్రి:

shine junior college

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమాన్ని వెనకబడనివ్వం.. అభివృద్ధిని ఆగనివ్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామంలో నూతనంగా రూ. 140 లక్షలతో నిర్మించిన సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం మొరంచపల్లి నుండి మంజూరునగర్ వరకు వరకు సాగిన పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించగా, ఈ ర్యాలీలో అతిథులు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం మంజూరునగర్లో నవాబుపేట, ధర్మారావుపేట, మంజూరునగర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా వేల కోట్లతో సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం క్యాబినెట్ నిరంతరం కృషి చేస్తుందన్నారు.ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. రూ.22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నామని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. మేం అధికారంలోకి రాగానే సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామున్నారు. 

Groundbreaking ceremony

ఏడాదిన్నర కాలంలో 57వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసాం, మరో 30 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులు వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహించేందుకు తొమ్మిది వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మొదటి ఏడాదిలోనే చేసిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ కోసం రూ. 21,500 కోట్లు ఖర్చు చేసామన్నారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సగభాగంగా ఉన్న మహిళలు రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, గుడికి, లేదా పిల్లల బడికి వెళ్లేందుకు ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలల్లో గుమ్మడి శ్రీదేవి అప్పం కిషన్ విస్లావత్ దేవన్ పిప్పాల రాజేందర్ సుంకర రామచంద్రయ్య పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన ‘రైతునేస్తం’ కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించబడి ఉండగా, తాజాగా మరో 1,034 వేదికల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మరియు కప్పుడ్ రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించడం జరిగింది.

దీనిలో భాగంగా ప్రస్తుతం మండలానికి ఒక రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా దీనికి అదనంగా తాజాగా మండలానికి మరో 2 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించి ప్రతీ మంగళవారం నిర్వహించే రైతునేస్తం ద్వారా శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఆదర్శరైతుల అనుభవాలు, కొత్త పంటల సాంకేతికతపై చర్చలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు స్థానిక వ్యవసాయ అధికారి వెంకటేశ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి సుధాకర్, మండల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్,ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పటేల్ ఛైర్మన్ , పాక్స్ చైర్మన్ గౌస్ ఉద్దీన్, మాజీ ఎంపీపీ దేవదాస్, వ్యవసాయ విస్తరణ అధికారులు సుకుమార్, సంపత్ కుమార్, ఙ్ఞానం, రేణుక, వేదవతి భారతి, హరికృష్ణ, తాజా మాజీ ప్రజాప్రతినిధులు
శ్రీకాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఆరిఫ్, శ్రీనివాస్ రెడ్డి, స్వామి,ఇతర రైతులు పాల్గొన్నారు..

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా.

14వ వార్డులో ఇందిరమ్మ గృహ ఇండ్ల భూమిపూజా

 

పరకాల నేటిధాత్రి

 

 

shine junior college

 

 

 

పరకాల పట్టణంలోని 14 వార్డులో ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన లబ్ధిదారులకు భూమిపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పట్టణ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ సోద అనితా రామకృష్ణ కాంగ్రెస్ పట్టణ అద్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,కుంకుమేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి,మాజీ మైనారిటి సెల్ అధ్యక్షులు ఎండీ అలీ హాజరై కొబ్బరికాయ కొట్టి నూతన నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటి సబ్యులు కొక్కిరాల స్వాతి,ఎండీ అమీనా,ఆకుల అశోక్,ఎండీ షఫీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

Shine Junior Colleges

భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పద్దెనిమిది మంది లబ్దిదారులకు ఉత్తర్వుల మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అంతకుముందు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుడైన పాలకుర్తి తిరుపతి – స్వప్న ఇంటి నిర్మాణ పనులను ఎమ్మెల్యే టెంకాయ కొట్టి, మట్టి తీసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తిరుపతి దంపతులకు ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో.

నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం మాజి ఎంపీటీసీ రజినీ సంతోష్ మల్లిపాటెల్ గార్ల ఆహ్వానం మేరకు కక్కర్వాడ గ్రామంలో నిర్వహించిన నూతన వ్యవసాయ క్షేత్ర ప్రారంభోత్సవ ,పూజ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఝరసంఘం పట్టణ అధ్యక్షులు ఎజాస్ బాబా,మాజి సర్పంచ్ భోజి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

శివాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ.

శివాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య.

దేవరకద్ర నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ సిజీఎఫ్ నిధులు రూ.40 లక్షలతో చేపట్టిన శివాలయం పునర్నిర్మాణంకు సంబంధించి బుధవారం దేవాలయం వద్ద చేపట్టిన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో.. గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రో” జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Shiva temple

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరు చదువుకోవాలని లక్ష్యంతో. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన టీచర్లున్నారని, విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని, ఇప్పటికే అన్ని స్కూళ్లకు యూనిఫాం లు, పాఠ్యపుస్తకాలను చేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్గొన్నారు.

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.

 

 

 

 

Whether you choose to walk or run, you are a child.
Whether you choose to walk or run, you are a child.

ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున
ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.

ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.

రైతుల పండుగ ఎరువక.

ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక

 

నేటిధాత్రి

 

 

 

 

* అంగరంగ వైభవంగా జరగనున్న కార్యక్రమం
* ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సౌకర్యం
* భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రం
* సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ వేడుక

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభుదేవా, ముఖేశ్ రిషి తదితరులు హాజరయ్యారు. కాసేపట్లో హీరో మంచు విష్ణు కూడా హాజరుకానున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ‘కన్నప్ప’ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరులో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా సినిమా ట్రైలర్ లేదా కొత్త పాటలను విడుదల చేసే అవకాశం ఉంది.

నేడే విస్తరణ.

నేడే విస్తరణ.

 

 

నేటిధాత్రి

 

 

 

 

 

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా.. అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

మధ్యాహ్నం 12.19కు రాజ్‌భవన్‌లో ప్రమాణం

ఆరు ఖాళీల్లో.. మూడు మాత్రమే భర్తీచేసే అవకాశం

బీసీ, ఎస్సీ వర్గాలకే మంత్రివర్గ విస్తరణ పరిమితం!

బీసీల నుంచి వాకిటి శ్రీహరికి క్యాబినెట్‌ బెర్తు పక్కా

ఎస్సీల్లో మాల, మాదిగలకు ఒక్కొక్కరి చొప్పున..

మాల సామాజివర్గం నుంచి జి.వివేక్‌కు చాన్స్‌

మాదిగల్లో కవ్వంపల్లి, అడ్లూరి లక్ష్మణ్‌లలో ఒకరికి!

ఎస్టీల నుంచీ ఒకరికి ఇవ్వాలంటున్న సీఎం రేవంత్‌

ఓసీల నుంచి సుదర్శన్‌రెడ్డి పేరూ ప్రతిపాదన

విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా.. తుది జాబితాలో ఎవరెవరు ఉంటారన్న ఉత్కంఠ

 

అందుబాటులో ఉండండి: సీఎం

మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వేముల వీరేశం, కాలె యాదయ్య, మందుల సామేలు శనివారం రాత్రి సీఎం రేవంత్‌ను కలిశారు.

విస్తరణలో తమ సామాజికవర్గానికి స్థానం కల్పించాలని కోరారు.

‘ఆదివారం అందుబాటులో ఉండండి. మీలో ఒకరికి మంత్రి పదవి వస్తుంది.

ఎవరికి వచ్చినా.. ఇప్పుడు కలిసివచ్చినట్లే కలిసి ఉండాలి, కలిసి రావాలి’ అని వారితో సీఎం అన్నట్లు సమాచారం.

కాగా, ఈ ఐదుగురిలో కవ్వంపల్లి పేరు తొలి ప్రాధాన్యంగా ఉండగా..

అడ్లూరి లక్ష్మణ్‌ పేరూ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

 

చివరికి ఇన్నాళ్లకు జరగబోతోంది.

ఆశావహులు, సామాజిక సమీకరణలు వంటి అంశాలతో ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

ఆదివారం మధ్యాహ్నం 12.19 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా..

అన్నీ కాకుండా ప్రస్తుతానికి పాక్షికంగా మాత్రమే భర్తీ చేయనున్నారు.

ఈ దఫాలో కేవలం ముగ్గురినే తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

అది కూడా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకే చోటు దక్కనుంది.

బీసీల నుంచి నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం లభించనుంది.

ముదిరాజ్‌ సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు.

ఆ వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే శ్రీహరే కావడంతో ఈయనకు బెర్త్‌ ఖాయమైంది.

ఇక ఎస్సీల నుంచి మాల సామాజికవర్గానికి చెందిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.వివేక్‌కు అవకాశం దక్కనుంది.

మరో బెర్తును కూడా ఎస్సీల నుంచే భర్తీ చేయనున్నారు.

ఈ అవకాశం మాదిగ సామాజికవర్గానికి చెందిన కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గానీ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు గానీ లభించనుంది.

ఇలా ఎస్సీల నుంచి మాల, మాదిగలకు ఒక్కొక్కరికి చొప్పున ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

3 బెర్తులూ కొత్త ఎమ్మెల్యేలకే..

క్యాబినెట్‌లో భర్తీ చేయబోయే మూడు స్థానాలకూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారినే తీసుకుంటుండడం గమనార్హం.

వీరిలో జి.వివేక్‌ 2009-2014 మధ్య ఓసారి ఎంపీగా పనిచేసినా..

ఎమ్మెల్యేగా ఎన్నికయింది మాత్రం తొలిసారే.

వాకిటి శ్రీహరి, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.

అయితే ఇదే తుది జాబితా కాదన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

బీసీ, ఎస్సీలతోపాటు ఒక ఎస్టీకి, అదే సమయంలో ఓసీల నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికీ అవకాశం ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్‌ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ఎస్టీల నుంచి లంబాడ సామాజికవర్గానికి చెందిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌తోపాటు మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ ఎమ్మెల్యే జాటోత్‌ రాంచందర్‌నాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

కాగా, నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఖాయమని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.

అయితే తుది జాబితాలో ఆయన పేరు ఉంటుందా? లేదా? అన్నది సస్పెన్స్‌గానే మారింది. మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించి, విస్తరణ ముహూర్తం కూడా ఖరారైౖనా..

జాబితాపై మాత్రం అర్ధరాత్రి వరకు తుది చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో బెర్తుల ఖరారులో మార్పుచేర్పులు కూడా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా..

ప్రస్తుతం జరిగేది మంత్రివర్గ విస్తరణా? పునర్‌వ్యవస్థీకరణా? అన్న చర్చ కూడా నడిచింది.

అయితే ప్రస్తుతానికి విస్తరణ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవ ఉత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిసాయి. కార్యక్రమంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాన మహోత్సవానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే చేతుల మీదుగా యంత్రచేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండి దైవకార్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అభివృద్ధి విషయంలోనూ ఏకతాటిపై ఉండాలని సూచించారు.ఆలయ ప్రాంగణంలో సీసీ నిర్మాణం చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి శిష్యులు కిడాంబి నరసింహ దేశికనచార్యులు యాగ్గిక బృందం, ఆలయ చైర్మన్ చెన్నూరి కిరణ్ రెడ్డి జంగా జనార్దన్ రెడ్డి కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్ రెడ్డి రామ్ రెడ్డి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి వివిధ కుల సంఘాల బాధ్యులు ఆలయ కమిటీ బాధ్యులు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే.

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం బడంపేట గ్రామం రాచన్న స్వామి ఆలయంలో ఓ వివాహ వేడుకలో శుక్రవారం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు మాణిక్ రావు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, గ్రామ పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా, దీపక్ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం..

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం..

విజేతలకు నగదు షీల్డ్ అందజేసిన సిరికొండ ప్రశాంత్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం జన్నె యుగంధర్ అధ్యక్షతన జరగగా ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పార్టీలకతీతంగా యువత కోసం ఎక్కడైనా వస్తానని ప్రాణమై నిలుస్తానని

ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆటలకు యువత దూరమవుతున్న నేటి పరిస్థితులలో క్రీడలను ప్రోత్సహించాలని సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ క్రీడలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

క్రీడలు అంటే తనకు పంచ ప్రాణమని క్రీడలు ఆడేవారన్న చాలా ఇష్టమని అందుకనే పార్టీలకతీతంగా క్రీడలకు సహకరిస్తానని ఆయన తెలిపారు భూపాలపల్లి ని జిల్లా చేయడంతో పాటు అద్భుతమైన అభివృద్ధి చేసిన మాజీ స్పీకర్ బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తనయుడిగా ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషిచేయడమే కాకుండా ప్రజల కష్టాలలో పాలుపంచుకుంటానని తెలిపారు గత వారం రోజులుగా క్రికెట్ క్రీడలను కొనసాగిస్తూ విజయవంతం చేసిన నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ గెలుకున్న విజేతలకు ప్రశాంత్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

విజేతలు మొదటి విజేతలుగా కేకేఆర్ జట్టు నిలువగా రెండవ విజేతలుగా విక్టరీ లేవన్ జట్టు మూడవ విజయంశాలుగా ఛాలెంజర్ జట్టు నాలుగవ విజేతలుగా ఎలిమినేటర్ జట్టు నిలిచాయి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విజేతగా దాసరపు మహేష్ నిలిచారు కాగ మొదటి జట్టుకు ట్రోఫీతో పాటు 40 వేల రూపాయల నగదును ద్వితీయ బహుమతిగా 20వేల రూపాయల నగదు షీల్డ్ ను సిరికొండ ప్రశాంత్ విజేతలకు అందించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ శశికాంత్ గౌడ్ జన్నె యుగంధర్ మాజీ సర్పంచ్ రాములు కార్యక్రమం నిర్వాహకులు వేల్పుల రాజ్ కుమార్ గడ్డం నితిన్ లవన్ బాబులు రంజిత్ వెంకన్న ప్రకాష్ కన్నా పూర్ణ యాదవ్ గురుకుంట్ల కిరణ్ సంగా రాజేందర్ కోడెల రాజమల్లు కోడెల నంది గొల్లపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version