శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T134333.368.wav?_=1

 

 

శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి యధావిధిగా కొనసాగించడం కోసం సర్క్యులర్ జారీ

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బిజెపి పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ నిర్మాణాల్లో భాగంగా దర్శనాలు
భక్తులకు నిలిపివేస్తూ ఏకాంత సేవలు చేస్తూ అర్జిత సేవలు మరియు భక్తులు రాజన్న దర్శించుకునేదంతా భీమన్న ఆలయంలోకి మార్చడం అన్న విషయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళనను మరియు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ యొక్క సూచనలను తీసుకొని ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బ తినకుండా అదే రకంగా భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా రాజన్న ఆలయ ఆవరణలోనే దర్శనాలను ఏర్పాటు చేస్తూ అదే రకంగా అర్జిత సేవలను కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం ఆహ్వానిస్తూ ఉన్నాం అదే రకంగా భారతీయ జనతా పార్టీ హిందువుల మనోభావాలు భక్తులను నమ్మకాల పట్ల విశ్వాసంతో చేసే కార్యక్రమాలు తప్ప అభివృద్ధికి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది కాంక్షిస్తుంది కానీ అందులో భాగంగా భక్తులకు రాజన్నను దూరం చేస్తాం అంటేనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది భీమన్న ఆలయంలో అర్జిత సేవలను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఆపివేయడం వంటివి చేయడం ద్వారా,నిన్న బిజెపి చేసిన ధర్నాకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దర్శనాలు యధావిధిగా కొనసాగించడం జరుగుతుందని సర్క్యులర్ జారీ చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు మరియు అలాగే నిన్న జరిగినటువంటి ధర్నాకు మద్దతు ఇచ్చినటువంటి హిందూ బంధువులకు మరియు బీజేపీ కార్యకర్తలకు మా ధన్యవాదాలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి పట్టణ అధ్యక్షుడు ధూమాల శ్రీకాంత్,స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్,మోర రవి,కోడం వినయ్, దూడం సురేష్,దేవేందర్ రెడ్డి,మెరుగు శ్రీనివాస్,సిద్ధి దేవరాజు,వేముల వైశాలి,శ్రీనివాస్, శ్రీధర్,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పల్లకి సేవ

ఘనంగా పల్లకి సేవ

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…

రామకృష్ణాపూర్ లో వైభవంగా దుర్గాదేవి శోభాయాత్ర…

మహిళలు, యువతులు అద్భుతమైన నృత్యాలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి విగ్రహాలను శనివారం నిమజ్జనం చేసేందుకు రామకృష్ణాపూర్ పట్టణంలోనీ దుర్గామాతలకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా మండపాల నిర్వాహకులు దుర్గమాత విగ్రహాలను అందంగా అలంకరించి పట్టణంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీదుల గుండా భాజ భజంత్రీలతో, డప్పు చప్పుల్ల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపు చేశారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శరన్నవరాత్రుల సందర్భంగా సిహెచ్పి, బీజోన్ సెంటర్, ఏజోన్, రామాలయం, రాజీవ్ చౌక్, సూపర్ బజార్, సాయిబాబా మందిరం ల వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాలకు శోభాయాత్ర కన్నుల పండువగా చేపట్టారు. చివరి రోజు దుర్గామాత విగ్రహాల నిమజ్జనాన్ని ఆనందోత్సవాల మధ్య భాజాభజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు.మహిళలు దాండియా, కోలాటం ఆడారు. అనంతరం భక్తులు సమీప గోదావరి నది వద్దకు దుర్గామాత నిమజ్జనానికై తరలి వెళ్లారు.

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు…

ముగిసిన దేవీ శరన్నవరాత్రులు

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని చిన్నరేవల్లి గ్రామంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగగా..శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారి వస్త్రాలను, పూర్ణ కలశమును వేలంపాట నిర్వహించారు. పూర్ణ కలశాన్ని సింగిల్ విండో మాజీ చైర్మన్ బత్తుల వెంకటరామ గౌడ్ వేలంపాటలో పాల్గొని కలశాన్ని రూ.51 వేలకు దక్కించుకున్నారు. అమ్మవారిని ప్రతిమను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

కల్వకుర్తిలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు….

కల్వకుర్తిలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు.

రికార్డ్ ధరలకు అమ్మవారి చీరలు వేలం.

కల్వకుర్తి/ నేటి ధాత్రి.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో గత తొమ్మిది రోజులుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారము అమ్మవారి లడ్డును వేలంపాట నిర్వహించారు. ఉర్కొండ మండలం ఇప్పపహట గ్రామానికి చెందిన వీరమల్ల బాలస్వామి రూ.82,116 వేలకు దక్కించుకున్నారు. అలాగే అమ్మవారి చీరలను వేలంపాట నిర్వహించారు మొదటి రోజు ధాన్యలక్ష్మి దేవి చీరను గార్లపాటి శ్రీనివాసులు రూ.58, 116, రెండవ రోజు గాయత్రీ దేవి అలంకరణ చీరను బాదం గణేష్ రూ.53,1 16, మూడవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ చీరను రామస్వామి రూ.65, 116, నాలుగవ రోజు కాత్యాయన దేవి అలంకరణ చీరను గంప వెంకటేష్ రూ.49, 116, ఐదవ రోజు ధనలక్ష్మి దేవి అలంకరణ చీరను1,35,116, ఆరవ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ చీరను పోలా పర్వతాలు రూ.77,116, ఏడవ రోజు శాకాంబరి అలంకరణ చేరను కూన శ్రీనివాసులు రూ. 61,116 ఎనిమిదవ రోజు సరస్వతి దేవి అలంకరణ చీరను గంప శ్రీనివాసులు రూ.61, 116, తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకరణ చీరను కొరివి శ్రీనివాసులు రూ.92, 116 పదవరోజు మహిషాసుర మర్ధిని దేవి అలంకరణ చీరను వీరమల్ల పాండు రూ.70, 116 11వ రోజు పుష్పలంకరణ చీరను గంప సురేందర్ రూ.55, 116, అమ్మవారి వడిబియ్యం వేముల శ్రీనివాసులు రూ. 46,116 వేలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాఠం లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణవాసులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.

పెద్ద మందడి మండలం లో అమ్మవారి ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే…

పెద్ద మందడి మండలం లో అమ్మవారి ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం సందర్భంగా పెద్దమందడి మండలంలో మణిగిల్ల అల్వవాల
గ్రామలలో దసర శరన్నవరాత్రి సందర్భంగా అమ్మ వారి విగ్రహలను ఏర్పాటు చేశారు ప్రత్యేక పూజలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పాల్గొన్నారు పూజ

కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాజీ జెడ్పీ టిసి వెంకటస్వామి, మణిగిల్ల గ్రామ నాయకులు తిరుపతిరెడ్డి, మద్దిలేటి, సురేష్ , నరసింహ రెడ్డి, వెంకయ్య, చావ్వ రాములు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్….

వల్లబ్ నగర్ లో దుర్గ మాత పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డ్
వనపర్తి నేటిదాత్రి .

 

వల్లబ్ నగర్ 33 వార్డులో రామ్ సేన యూత్ మహిళా సంఘం సభ్యులు దసరా ఉత్సవాలలో సందర్భంగా దుర్గామాత ప్రత్యేక పూజలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమాల్ తెలిపారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు పూజలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ అలేఖ్య గులాం సూర్యవంశం గిరి సునీల్ వాల్మీకి చిట్యాల రాము బీచుపల్లిసాగర్ రాఘవేంద్ర క్రాంతి తదితరులు పాల్గొన్నారని తిరిమాల్ ఒక ప్రకటన లో తెలిపారు

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లోఅమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ…

శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం లోఅమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అలంకరణ తో భక్తులకు దర్శనం ఇచ్చారు పట్టణ ఆర్యవైశ్య సంగం అధ్యక్షులు బచ్చు రాం గౌరవ అధ్యక్షులు నాగబంది యాదగిరి యూవజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి పిన్నం వసంత ఆర్యవైశ్య మహిళలు భక్తులు పాల్గొన్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ పూజలు చేయిస్తున్నా రు

వైభవంగా చండీయాగం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T141753.181.wav?_=2

వైభవంగా చండీయాగం

రాయికల్ అక్టోబర్ 1: నేటి ధాత్రి:

రాయికల్ పట్టణంలోని శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన చండీయాగం భక్తుల్ని ఆకట్టుకుంది. ఉదయం నుండి ప్రారంభమైన యాగ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వేదపండితుడి మంత్రోచ్చారణల నడుమ జరిగిన యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులందరికీ యాగ దర్శనం కనుల విందుగా నిలిచింది. సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను అందజేశారు.

 ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

 ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు(Kanaka Durga Navaratri) ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాలు నేటితో పదవ రోజుకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ… పదవ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.నవరాత్రి మహోత్సవాల్లో వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ముఖ్యంగా అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిలకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో భక్తులకు మంచి నీరు, పండ్లను అందజేశారు. ప్రతీరోజు ఒక్కో అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-29T135842.230.wav?_=3

 

దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న

◆:-తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆:- -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్ పట్టణంలోని భవానీ మాత దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు.వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ&భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన చివరి రోజు భజన పోటీలను వీక్షించి భజన పోటీలో నెగ్గిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు,భజన భక్తులు పాల్గొన్నారు.

కనకదుర్గాదేవి మండపాలలో అన్న ప్రసాద కార్యక్రమాలు…

కనకదుర్గాదేవి మండపాలలో అన్న ప్రసాద కార్యక్రమాలు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్, గద్దెరాగడి ఏరియాలలో ఘనంగా కనకదుర్గ దేవి మండపాలలో నిర్వాహకులు కుంకుమ పూజ అభిషేకము అన్న ప్రసాద కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

శ్రీనివాస్ నగర్, తిలక్ నగర్, భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలలో అమ్మ వారి సన్నిధిలో మహా అన్న ప్రసాద కార్యక్రమాలు జరిగాయి. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే తూడి….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-27T125559.574.wav?_=4

 

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలో పాల్గొన్నారని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం తెలిపారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ పూరి బాల్ రాజ్ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ శ్రీకృష్ణ ప్రింటర్స్ యజమాని వెంకటరమణ శ్రీనివాసులు నాగబంది వెంకటరమణ బచ్చు వెంకటేష్ మారం గోవిందు గుప్తా వై వెంకటేష్ కొండ మహేష్ కొండ కిషోర్ కంది కొండ సాయిరాం కూన శ్రీకాంత్ పట్టణ ఆర్యవైశ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు

5వ వార్డులో అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్న ప్రసాదం….

5వ వార్డులో అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్న ప్రసాదం
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శివ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని శివ తెలిపారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పాపిశెట్టి శ్రీనివాసులు ఆర్ఎంపీ డాక్టర్ డానియల్ కాగితాల లక్ష్మీనారాయణ సురేందర్ కన్నా భక్తులు పాల్గొన్నారు

“కాత్యాయిని అవతారంలో దుర్గామాత భక్తులకు దర్శనం…

శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దుర్గామాత……… విశ్వంలో ధర్మాన్ని కాపాడే, భగవంతుని శక్తి స్వరూపిణి దుర్గామాత

-బోల్లేని వెంకటేశ్వర్ రావు

-దుర్గామాత సేవలో పరితపిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు

-4వ రోజు కాత్యాయని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

-కనులారా వీక్షించిన భక్తులు
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

విశ్వంలో ధర్మాన్ని, నైతిక క్రమాన్ని కాపాడే శక్తిగా, భగవంతుని శక్తి స్వరూపిణిగా దుర్గమాతని భావిస్తామని ప్రముఖ వ్యాపారవేత్త బోల్లేని వెంకటేశ్వర్ రావు అన్నారు. బతుకమ్మ-దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాంబశివ సామూహిక దేవాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి..మొక్కులను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం తన కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని, అమ్మవారి దయతో..చల్లని దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి..పంటలు బాగా పండి..ప్రజలంతా అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, సుఖశాంతులతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని ఆ దుర్గామాత అమ్మవారిని వేడుకున్నట్లు బోల్లేని సరోజన-వెంకటేశ్వర్ రావు దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బోల్లేని సుజాత-రాజ్ కుమార్, బోల్లేని లక్ష్మీ-శ్రీనివాస్ రావు, బోల్లేని లక్ష్మీ-రవి కుమార్ దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు ధన్యులయ్యారు. కాగా 4వ రోజు శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయ అర్చకులు భైరవ పట్ల వెంకటేశ్వర శర్మ అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించగా..దుర్గామాత అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దుర్గామాత…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T152441.774.wav?_=5

 

శ్రీ కాత్యాయని దేవి అవతారంలో దుర్గామాత

దుర్గామాత ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి, మంజూరు నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా దుర్గామాత అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అని అన్నారు

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకo…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T132830.504.wav?_=6

 

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అభిషేకo
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి పట్టణంలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు అమ్మవారికి అభిషేకం ధైర్యలక్ష్మీగా భక్తులకు దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త అయ్యలూ రిరఘునాథచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు .ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు నవరాత్రులలో అమ్మవారి కి అభిషేకము ఉంటుందని అమ్మవారికి ఒక్కరోజు అర్చన చేయించుకునే భక్తులు 100 రూపాయలు ఆలయంలో చెల్లించాలని వారు పేర్కొన్నారు మహిళలచే ప్రతి రోజు సాయంత్రం బతుకమ్మ సంబరాలు ఉంటాయని వారు తెలిపారు 33 వార్డు మాజి కౌన్సిలర్ తిరుమల్ బీచుపల్లి యాదవ్ కట్టసుబ్బయ్య భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు

దుర్గామాత స్వాములకు బిక్ష ఏర్పాటు..

దుర్గామాత స్వాములకు బిక్ష ఏర్పాటు..

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలో దుర్గామాత దీక్ష తీసుకున్న స్వాములకు బుధవారం గ్రామానికి చెందిన జిపి.స్వామి స్వగృహంలో అన్నదాన బీక్షను స్వాములకు అందించారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు చల్మెటి నాగరాజు, ఉపాధ్యక్షులు తుమ్మలి రమేష్, కోశాధికారి బజార్ చిన్న తిరుమల్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, సదాశివలింగం, నాయిని వెంకటేశం,సిద్ధరాంరెడ్డి, రంజిత్ గౌడ్, నాయిని లక్ష్మణ్, నవీన్,శివ,కర్ణాకర్,వినయ్ గౌడ్,మహేష్,ప్రశాంత్, బూరుపల్లి శివకుమార్,చంద్రకాంత్ గౌడ్, దుర్గామాత స్వాములు తదితరులు పాల్గొన్నారు.

దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు…

దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు.

శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
దుర్గామాతను దర్శించుకున్నారు
ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉగ్యోగి వెలంగదుల శంకరయ్య సుజాత దుర్గామాత కి చేయించిన మకర తోరణంను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుల వారికి అందచేయడం జరిగింది.
భూపాలపల్లి మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, అర్చన చండీ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version