డీసీసీ అధ్యక్షుడికి ఘన సత్కారం

ఇనుగాలకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

పరకాల,నేటిధాత్రి

 

డీసీసీ అధ్యక్షుడిగా ఇనుగాల వెంకటరామిరెడ్డి నియమితులు అయినా సందర్బంగా పరకాల మున్సిపలైటిటి 18వ వార్డు అధ్యక్షుడు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు పసుల శ్రీనివాస్,ఒంటెరు కుమార్,బొచ్చు వినోద్ కుమార్ లు కలిసి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీని మునుముందు రోజుల్లో పెద్ద ఎత్తున బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని శ్రీనివాస్,కుమార్, ఇనుగాలను కోరారు.జిల్లాకు పార్టీ కొత్త అధ్యక్షులు ఇనుగాల నియామకం కావడంతో మర్యాదపూర్వకంగా కలిసి శుభాభినందనలు తెలిపామన్నారు.డిసిసి జిల్లాఅధ్యక్షులు వరంగల్ కూడా చైర్మన్ మరియు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికలలో విజయ డంక మోగిస్తుందని ఆకాంక్షించారు.

పిఆర్పి మంచిర్యాల మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ ఇలియాస్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T150404.565.wav?_=1

 

పిఆర్పి మంచిర్యాల మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా ఎండీ ఇలియాస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులుగా ఎం.డి.ఇలియాస్ ను నియమించారు.జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మనీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.అనంతరం ఇలియాస్ మాట్లాడుతూ..నాపై నమ్మకంతో అప్పజెప్పిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీ అభ్యుదయానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ అవకాశాన్ని కల్పించినందుకు
తీన్మార్ మల్లన్నకి,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ కి,జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి కృషి చేసి,మైనారిటీల సమస్యలు పరిష్కారం దిశగా పని చేస్తానని తెలపడం జరిగింది.వచ్చేది బీసీల రాజ్యమే అని మైనారిటీలు అందరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పై తీన్మార్ మల్లన్న సారధ్యంలో మన రాజ్యాధికారం వస్తుందని విశ్వసిస్తున్నారని తెలిపారు.అనంతరం ఎం.డి.ఇలియాస్ ని శాలువాతో సత్కరించి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు.

ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్‌గా ప్రీతీమ్‌కి శుభాకాంక్షలు…

అల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేషనల్ కోఆర్డినేటర్‌గా నగరాగారి ప్రీతీమ్ నియామకంపై శుభాకాంక్షలు తెలిపిన నరుకుడు వెంకటయ్య

హైదరాబాద్‌లో ప్రీతీమ్ గారిని కలిసిన ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకులు

పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానం
వర్దన్నపేట (నేటిధాత్రి):

 

తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగరాగారి ప్రీతీమ్ గారు ఇటీవల *అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం నేషనల్ కో ఆర్డినేటర్ గా నియమితులైన శుభసందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని వారి స్వ గృహములో కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం రాష్ట్ర నాయకులు & వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమందించి శాలువాతో సన్మానించి హృదయపూర్వక హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమములో
వరంగల్ ఉమ్మడి జిల్లాల ఎస్సీ విభాగం ఇంచార్జి దబ్బెట రమేష్ , ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆర్షం అశోక్ ,ఎస్సీ విభాగం జిల్లా నాయకులు ఆరూరి సాంబయ్య లు పాల్గొనడం జరిగింది.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు…

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీల ఏర్పాటు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాల కమిటీలను నియమిస్తున్నట్లు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ తెలిపారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీని అన్ని జిల్లాలో బలోపేతం చేయడానికి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.యువకులు, నాయకులు పార్టీలో చేరి తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా తమ వంతు కృషి చేసి పార్టీ బలోపేతం చేయాలని కోరారు.అలాగే మంచిర్యాల జిల్లాలోని చున్నంబట్టి లయన్స్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి లను ఏర్పాటు చేయడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అసిఫాబాద్ లో నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం చేపట్టనున్నారు.23న గురువారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మల్ జిల్లాలో నియోజకవర్గం ఇన్చార్జిలను నియమించడం జరుగుతుందని తెలిపారు.

ఎన్ హెచ్ ఆర్ సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లపోతుల రమేష్ బాబు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T154501.817.wav?_=3

 

ఎన్ హెచ్ ఆర్ సి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లపోతుల రమేష్ బాబు

నియమించిన జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

– ఏపీ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది కదిరి రాము

 

“నేటిధాత్రి”,అమరావతి/

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ చైర్మన్ స్వప్న.యం. ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా బాపట్ల జిల్లాకు చెందిన పల్లబోతుల రమేష్ బాబును జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియమించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, న్యాయవాది కదిరి రాము తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్, ప్రోటోకాల్ సిస్టంతో పేద ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎన్ హెచ్ ఆర్ సి. కేంద్ర, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పని చేయాలని, అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేయాలని కదిరి రాము సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియామకమైన పల్లపోతుల రమేష్ బాబు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పదవిని అప్పజెప్పిన నేషనల్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సార్ కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది కదిరి రాము, కేంద్ర కమిటీ సభ్యులు పి. పూర్ణచంద్రరావు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థను బలోపేతం చేయడానికి అన్ని జిల్లా కమిటీలను పూర్తిచేస్తామని పేర్కొన్నారు. రమేష్ బాబు నియామకంతో గుంటూరు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని మేధావులు, విద్యావంతులు, సామాజిక ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.

మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T113156.165.wav?_=4

 

మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా మహమ్మద్ ఫక్రుద్దీన్ ను నియమించడం జరిగింది ఫక్రుద్దీన్ నియమించిన పెద్దలను హృదయపూర్వకంగా ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ చైర్ పర్సన్, పెద్దలు సునితాహన్మంత్ రావు పాటిల్,యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు, మా తాత ముత్తాతల నుండి కాంగ్రెస్ పార్టీని పనిచేసిన మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ నాయకులు నాపై దృష్టి పెట్టి ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అప్పగించారు పార్టీని బలపలించినందుకు నాతో అయినంత కృషి చేస్తామన్నారు,

బిజెపి జిల్లా కార్యదర్శిగా మహేందర్ గౌడ్…

బిజెపి జిల్లా కార్యదర్శి గా రామగౌని మహేందర్ గౌడ్ నియామకం

తాండూరు(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా రామగౌని మహీధర్ గౌడ్ నీ శుక్రవారం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ నియమించి నియామక పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా బిజెపి మంచిర్యాల జిల్లా కార్యదర్శి మహీధర్ గౌడ్ మాట్లాడుతూ.. నాపైన ఎంతో నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు కల్పించినందుకు బిజెపి పార్టీకి నా శక్తి మేర కృషి చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.అలాగే బిజెపి రాష్ట్ర నాయకులకు,జిల్లా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం…

యూత్ కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ నియామకం

కొత్తగూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ యూత్ మండల
కో కోఆర్డినేటర్ రామన్న గూడెం చెందిన యువనాయకుడు భూక్యా రాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
వజ్జ సారయ్య మరియు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి తెలిపారు నా ఈ యొక్క ఎన్నిక కు సహకరించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుకు జిల్లా నాయకులకు సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కు
నా ప్రత్యేక కృతజ్ఞతలు..అని
భూక్యా రాజు తెలిపారు

వర్ధన్నపేట నూతన ఎస్సై సాయిబాబాకు ఘన స్వాగతం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T114241.463.wav?_=5

వర్ధన్నపేట నూతన ఎస్సై సాయిబాబాకు ఘన స్వాగతం

వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్ధన్నపేట నియోజక వర్గం , వర్ధన్నపేట మండల కేంద్రంలో వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సాయిబాబా ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆబిడి రాజీరెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు ఎలికట్టే చిన్న రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-5.wav?_=6

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య

గణపురం నేటి ధాత్రి :

గణపురం మండలం
భూపాలపల్లి జిల్లా బీజేపీ నూతన కమిటీలను ప్రకటించింది.జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కమిటీలను ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామ్ చందర్రావు ఆదేశాలతో నూతన కమిటీని ప్రకటించినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు. గణపురం మండలానికి చెందిన జిట్టబోయిన సాంబయ్యను జిల్లా కార్యదర్శిగా ప్రకటించారు. జిల్లా నూతన కమిటీలో స్థానం పొందిన సాంబయ్య రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-2.wav?_=7

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్యామల మధుసూదన్ రెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా శ్యామల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నా నియమాకానికి సహకరించిన బిజెపి పార్టీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న నన్ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పగించారు కావున బిజెపి పార్టీ జిల్లాలో మరింత అభివృద్ధి చెందింది నా వంతు కృషి చేస్తాను

బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T131256.308-1.wav?_=8

 

బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొంగల రాజేందర్ నియమితులయ్యారు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి నియమాకాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దొంగల రాజేందర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి నాగపూర్ రాజమౌళి గౌడ్ జిల్లా అధ్యక్షుడు నిషేధర్ రెడ్డికి మండల అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భూపాలపల్లి జిల్లాలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు గెలవడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-6.wav?_=9

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్‌గా ఊరటి మునెందర్ నియమితులయ్యారు.బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు,జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఊరటి మునెందర్ మాట్లాడుతూ “బీజేపీ భావజాలాన్ని,కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్వచ్ఛందంగా చేరవేయడం, పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయడం నా ప్రధాన బాధ్యత అని జిల్లా లోని ప్రతి గ్రామం,ప్రతి మండలానికి పార్టీ స్వరం చేరేలా కృషి చేస్తాను”అని అన్నారు.జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ… మునెందర్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు అని మీడియా విభాగంలో ఆయన అనుభవం పార్టీకి మరింత బలాన్నిస్తుంది అని అభిప్రాయపడ్డారు.ఈ నా పార్టీ పదవికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న కి కన్నం యుగదీశ్వర్ కు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల నియామకం..

*మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల నియామకం *

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T114528.955.wav?_=10

* మహాదేవపూర్ జులై 28( నేటి ధాత్రి *

జయశంకర్ జిల్లా కాటారం మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ నియమించడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపీట వేశారు ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు మహాదేవపూర్ ఉమ్మడి మండలానికి ఐదు డైరెక్టర్ పదవులులభించాయి మండల కేంద్రానికి చెందిన ఇర్ఫాద్ అహ్మ ద్, పోత రామకృష్ణ తో పాటు మండలంలోని సూరారం గ్రామానికి చెందిన ముల్కల శ్రీనివాస రెడ్డి చండ్రు పెళ్లి కి చెందిన గోమాస సడవలి పలిమల మండలం నుండి దాసరి సంతోష్ లకు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు దీంతో ఉమ్మడి మండల వ్యాప్తంగా హర్ష వ్యక్తం చేస్తున్నారు తమ నియమకానికి సహకరించిన రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శీను బాబుకు కృతజ్ఞతలు తెలిపారు

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ.

డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

మందమర్రిలో 14 మంది డిపెండెంట్లకు నియామక పత్రాల పంపిణీ – సింగరేణి భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్న మంత్రి డా. వివేక్ వెంకటస్వామి గారు
ఈరోజు మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గౌరవ డా. వివేక్ వెంకటస్వామి గారు, 14 మంది బొగ్గుగని కార్మికుల డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు

ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం శ్రీ దేవేందర్ , ఏఐటీయూసీ అధ్యక్షుడు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

 

Singareni

 

 

“బొగ్గుగని కార్మికులంటే మా కాకా డా. వెంకటస్వామి కి అమితమైన ప్రేమ ఉండేది. ఆయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ మూసివేయకుండా అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తో చర్చించి, ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లు రుణం ఇప్పించి సంస్థను ఆదుకున్నారు. లక్షలాది కార్మిక కుటుంబాలకు బాసటగా నిలిచారు.”

 

Singareni

 

“ఈరోజు సింగరేణి సంస్థ లాభాల బాటలోకి రావడానికి, కార్మికుల క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం ప్రధాన కారణం. తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.”

“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, సంస్థ అభివృద్ధికి తగిన ప్రయత్నం జరగలేదు. కేవలం నిధుల వాడకానికే పరిమితమైంది. ఇకపై కొత్త గనులు, కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంపై దృష్టి పెడతాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే టెండర్లలో సింగరేణి సంస్థ నేరుగా పాల్గొనగలిగే విధంగా చర్యలు తీసుకుంటాం.”

 

Singareni

 

 

ఈ కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న కుటుంబాలు మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగావకాశం వారి జీవితాలకు మేలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

హరిత సేన నియోజకవర్గం మండల కమిటీల నియామకం.

హరిత సేన నియోజకవర్గం, మండల కమిటీల నియామకం

గంగాధర నేటిధాత్రి:

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నెపథ్యంలో, చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, నియోజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులను మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగృహంలో సోమవారం ప్రకటించారు.
మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జిగా మామిడిపెల్లి అఖిల్, గంగాధర మండల అధ్యక్షుడిగా జెలెందర్ రెడ్డి, రామడుగు మండల అధ్యక్షుడిగా బైండ్ల మధు, బోయినిపల్లి మండల అధ్యక్షుడిగా కన్నం సాగర్, మల్యాల మండల అధ్యక్షుడిగా అరుణ్, కొడిమ్యాల్ మండల అధ్యక్షుడిగా ఇంతియాజ్, చొప్పదండి మండల అధ్యక్షుడిగా భక్తు విజయ్ కుమార్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఇనుగుర్తి శ్రీనివాస్, గర్రెపల్లి సతీష్, నూతికడి బోజనరాయణ, కమల్ గౌడ్ తదితరులు నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించాలి అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని అందించవచ్చని తెలియజేశారు. ఆఖరులో కమిటీ సభ్యులు మొక్కలు నాటడమ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరితసేన సభ్యులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ..

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుని నియామకం

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ చట్టబద్ధత కల్పించాలి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షునిగా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన పందుల సారయ్య ను జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షులు పులిగిల్ల బాలయ్య ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ నత్తి కోర్నేల్ నియామకం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన పందుల సారయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా ఆలు పెరగకుండా చేస్తున్నామని ఇట్టి ఉద్యమానికి ఎన్నో ఉడుదులుకులు జరిగిన ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు తీర్పుకు శిరసా వహిస్తూ అసెంబ్లీలో కమిటీని వేసి అదేవిధంగా షమీం అత్తరు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేసి దానిపై సర్వే చేయించి వర్గీకరణ చేయించి మంత్రివర్గంతో ముసాయిదా తీర్మానం చేయించడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి మాదిగలు మాదిగ ఉపకులాలు ఎల్లవేళలా రుణపడి ఉంటాయని అసెంబ్లీ ద్వారా చట్టబద్ధత కల్పించి అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేస్తామని 19 96లో వర్గీకరణ చేస్తానని ప్రకటించిన బిజెపి నాలుగు పర్యాయాలు అధికారంలోకి వచ్చి వారు ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని అన్నారు. ఇలాంటి బీజేపీని ప్రజలు పాతాళని తొక్కే రోజు దగ్గరలో ఉందని బిజెపి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పందుల సారయ్య అన్నారు.
నా నియమానికి సహకరించినటువంటి దళితరత్నం దొబ్బటి రమేష్ టి పి సి సి కార్యదర్శి పాముల రమేష్, డాక్టర్ శరత్, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, దయాకర్, రావుల మురళి, మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఘనపురపు అంజయ్య, మిట్ట కడుపుల జలంధర్, బ్లాక్ కాంగ్రెస్ బైరు వెంకన్న, పలువురికి అభినందనలు తెలిపారు.

డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం.

ఎల్లాపూర్ లో డిహెచ్పిఎస్ నూతన గ్రామ కమిటీ నియామకం

జగిత్యాల,నేటిధాత్రి:

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామంలో గురువారం దళిత హక్కుల పోరాట సమితి నూతన గ్రామ కమిటీని దళిత హక్కుల పోరాట సమితి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగురాళ్ల భూమేశ్వర్ ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులుగా మోదుంపల్లి రాజు, ప్రధాన కార్యదర్శిగా మచ్చ అంజయ్య, ఉపాధ్యక్షులుగా మోదుంపల్లి లక్ష్మణ్, ఎండపల్లి భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా మహంకాళి కిరణ్, మోదంపల్లి నరసయ్య, కోశాధికారిగా ఆరెల్లి కనకయ్యను ఎన్నుకున్నట్లు భుమేశ్వర్ తెలిపారు.
ఈసందర్భంగా భుమేశ్వర్ మాట్లాడుతూ దళితులకు రాజ్యాంగ హక్కులు నేటికీ దళితులకు అందని ద్రాక్షలాగానే మిగిలాయన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై అణిచివేత దాడులు మహిళలపై అత్యాచారాలు హత్యలు కులవివక్షత, అంటరానితనం కొనసాగుతుందన్నారు.
ఈకార్యక్రమంలో శనిగరపు ప్రవీణ్, మోదుంపల్లి మల్లయ్య, మల్లారపు నర్సయ్య, ఆరేపల్లి మల్లయ్య, ఆరేపల్లి రాజయ్య, మోదుంపల్లి అంజయ్య, దీకొండ రాములు, మల్లారపు చిన్న నర్సయ్య, మోదుంపల్లి నర్సయ్య, మోదుంపల్లి అంజయ్య, మల్లారపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులు నిర్వహించు సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం ఐడిఓసి కార్యాలయంలో గ్రామ పంచాయతి, మండల, జిల్లా ప్రజా పరిషత్తు ఎన్నికలు నిర్వహణకు సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, మాస్టర్ ట్రైనర్లుతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించుటకు సిబ్బందికి శిక్షణ అత్యంత కీలకమని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను సమగ్రంగా అర్థం చేసుకుని, సక్రమంగా విధులు నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు అత్యంత ముఖ్యమని తెలిపారు. ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిని సకాలంలో నియమించి, వారికి విధుల నిర్వహణ ప్రక్రియపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు భూపాలపల్లి, కాటారం డివిజన్లు వారిగా షెడ్యూల్ తయారు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగహన కలిగి ఉండాలని, అపుడే ఎన్నికలను ఎలాంటి పొరపాటుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, భూపాలపల్లి ఆర్డీఓ రవి, అన్ని మండలాల ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసి యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి నియామకం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు పాత శ్రీకాంత్ ని శనివారం రోజున ఆదివాసి యువజన జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నామని ఆదివాసి నాయకత్వం హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న తెలియజేశారు.ఈ సందర్భంగా గంజి రాజన్న చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాత శ్రీకాంత్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియపరిచారు.76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నాయక పోడు జాతి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉందని,నాయకపోడు నివాసాలు ఉండే గ్రామాలలో తాగునీటి సమస్య,గ్రామాలకు రోడ్డు లేక విద్య వైద్యం ఉపాధి లేక నిరుపేదరికంలో జీవనం సాగిస్తూ బ్రతుకుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.తన జాతిని చైతన్యపరిచి ప్రభుత్వ పథకాలు అందే విధంగా విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలు అందరికీ అందే విధంగా నిరంతరం గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసి వారు అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.మండలంలోని యువ కాంగ్రెస్ నాయకుడికి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో తన అభిమానులు కార్యకర్తలు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియపరిచారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version