ఆ.. ఉపాధ్యాయునికి జీతమేందుకు సారూ..!

ఆ.. ఉపాధ్యాయునికి జీతమేందుకు సారూ..!

తెరువని స్కూల్..విద్యార్థులు లేని టీచర్.

2016 లో మూతపడ్డ స్కూల్ కు టీచర్ నియామకం

ప్రభుత్వ జీతంతో గ్రామంలో ఎంజాయ్…

బర్ల కొట్టంగా మారినా ప్రాథమిక పాఠశాల భవనం

డీఈఓ నుండి ఆర్డర్ వచ్చేవరకు గ్రామంలోనే ఉండాలే..

నిర్లక్ష్యపు టీచర్ కు వత్తాసు పలుకుతున్న ఎంఈఓ..

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

నిరుపేదలు చదువుకునే ప్రభుత్వ బడిని నిర్లక్ష్యంతో గాలికి వదిలేసిన ప్రభుత్వ ఉపాధ్యాయునికి జీతం ఎందుకు సారూ…అని జిల్లా విద్యాశాఖ అధికారిని గ్రామస్తులు అడుగుతున్నారు. 2016 సంవత్సరంలో మూతపడిన మా పాఠశాలకు టీచర్లు ఎలా కేటాయించారు అని విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. బర్ల కొట్టంగా మారిన ప్రభుత్వ పాఠశాల నేడు విషపురుగులకు నిలయంగా మారడంతో కొన్ని ఏళ్లుగా ప్రైవేటు సదువుల కోసం గ్రామస్తుల పిల్లలు పట్టణాలకు చదువుబాట పట్టారు. చదువులు చెప్తానని గ్రామానికి వచ్చిన ప్రభుత్వ టీచర్ గ్రామంలో తిరుగుతూ ప్రభుత్వ జీతంతో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అమానుష సంఘటన వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం లైనుతండ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదుతో పాఠశాలను సందర్శించిన నేటిధాత్రి ప్రతినిధికి పిచ్చి మొక్కలు, గడ్డివాములు, ఆరేసిన బట్టలు,పశువులు కట్టేస్తున్న ఆనవాళ్లు,చెత్తాచెదారంతో దర్శనమిచ్చింది. కనీసం రికార్డులను భద్రపరిచే గదితాళం కూడా ఆ ఉపాధ్యాయుని వద్ద ఉండకపోవడం విశేషం. పిల్లలు లేరు.. చదువు చెప్పను.. కానీ నేను ఊర్లోనే తిరుగుతా.. అంటూ పాఠశాల ఉపాధ్యాయుడు బలరాముడు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఆ పాఠశాల పట్ల మండల విద్యాశాఖ అధికారిని చరవాణి ద్వారా వివరణ కోరగా జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం ఇచ్చాం ఆర్డర్ వస్తేనే వేరే స్కూల్ కు వెళ్లాలి.. లేదంటే స్కూల్ ముందరే కూర్చోవాలి అని ఆ ఉపాధ్యాయునికి ఎంఈఓ వత్తాసు పలకడం విద్య వ్యవస్థ ఎటువైపు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది.

ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: మండల కేంద్రంలోని మో
డల్ స్కూల్లో కాంట్రాక్ట్ పాతిపదికన ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టీనావ తి ఓ ప్రకటనలో గురువారం పేర్కొన్నారు. పిజీటి ఫిజిక్స్, టీ జీటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపల్ తె లియజేశా రు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 4వ తేదీన పాఠశాలలో నిర్వ హించే డెమో క్లాస్కు హాజరు కావాలన్నారు. తప్పనిసరిగా ఒ రిజినల్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలన్నారు.

200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు హిందీ ఉపాధ్యాయ..

200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు హిందీ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి.

రాయికల్, జూలై 30, నేటి ధాత్రి:

సర్దుబాటు, డిఫ్యూటేషన్, నియామకాల్లో, సర్దుబాటు, డిప్యూటేషన్స్ లలో 200 పైన సంఖ్య గల పాఠశాలలకు అదనపు తెలుగు, హిందీ, అన్ని సబ్జెక్టులకు పోస్టులు మంజూరు చేయాలని భూపతిపూర్ ఉన్నత పాఠశాల లో జరిగిన రాయికల్, మేడిపల్లి, భీమారం మండలాల హిందీ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం విరామ సమయంలో హిందీ ఉపాధ్యాయులందరు మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులుకు ప్రాతినిధ్యం చేసారు. కాంప్లెక్స్ సమావేశం ను సందర్శించిన మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసి పలు సమస్యలు దృష్టికి తీసుకపోయారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో హిందీ నీ ప్రవేశపెట్టి తెలుగు హిందీ పండితులను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణీ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, పిఆర్టీయు మండల ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, వసంతరావు, సయీద్ పాషా, జోంగోని రాజేశం, శంకరయ్య, నీలిమ, జంగిలి రాజేశం, కూరగాయల సురేష్, సుజాత, ధనలక్ష్మి, నారాయణ, రమేష్, గంగాధర్, మారుతి, నరహరి కాంప్లెక్స్ హిందీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే..

గుణాత్మక విద్య బాధ్యత ఉపాధ్యాయులదే-

డిఇఓ. వాసంతి

శాయంపేట నేటిధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి వాసంతి అన్నారు. 25-7-2025 రోజున జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల పత్తిపాక కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొని వచ్చే విధం గా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమకొం డ జిల్లా సమగ్ర శిక్ష గుణాత్మక విద్య కోఆర్డినేటర్ డాక్టర్ మన్మో హన్,మండలవిద్యాశాఖ అధి కారి భిక్షపతి, ఉన్నత పాఠ శాల ఇన్చార్జి ప్రధానోపా ధ్యాయులు అనిత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు లు శ్రీనివాస్,ఆర్ పిలు అం జని, నారాయణ, అశోక్, మనోజ్, సురేందర్, పాఠ శాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మా టీచర్లు మాకే కావాలి..

మా టీచర్లు మాకే కావాలి
• డిప్టెషన ను నిలిపివేయాలి
• గేటు ముందు గ్రామస్తుల నిరసన

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-25T123542.285.wav?_=1

నిజాంపేట: నేటి ధాత్రి

ప్రభుత్వ పాఠశాలలను నమ్మి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలలోకి పంపిస్తే డిప్టేషన్ పేరిట ఉపాధ్యాయులను బదిలీ చేయడం సరికాదని నిరసిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 55 మంది విద్యార్థులకు గాను 4 టీచర్లు ఉండగా డిప్టేషన్పై ఇద్దరూ ఉపాధ్యాయులను వేరొక ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఇప్పుడు ఉపాధ్యాయులను తీసివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థుల చదువులు నాశనం చేసినట్లు అవుతుందన్నారు. ఈ విషయమై నిరసిస్తూ గంటపాటు గేటు ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. డిప్టేషన్ నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చూస్తామన్నారు. కార్యక్రమంలో బుర్ర సంతోష్ గౌడ్, అందే సిద్ధ రాములు, మ్యాదరి కుమార్, భూపతి రెడ్డి, బురాని నర్సాగౌడ్, నాగభూషణం తదితరులు ఉన్నారు.

ఎమ్మార్వో కి వినతి పత్రం అందించిన ఉపాధ్యాయుల సంఘం.

ఎమ్మార్వో కి వినతి పత్రం అందించిన ఉపాధ్యాయుల సంఘం
జమ్మికుంట (నేటిధాత్రి)
జమ్మికుంట తాసిల్దార్ వెంకటరెడ్డికి కరీంనగర్ జిల్లా డి టి ఎఫ్ అధ్యక్షుడు ఆవాల నరహరి ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రం అందించారు ఉపాధ్యాయులకు రావలసిన మెడికల్ బిల్లులు GPF బిల్లులు క్లియరెన్స్ లు పూర్తి చేయాలని కోరారు ఉపాధ్యాయ సమస్యలపై పోరాట కమిటీ ఆగస్టు 1న అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా, ఆగస్టు 23న హైదరాబాదులో మహాధర్నా కార్యక్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు.

గురుదేవ్ విద్యాలయం నందు ఐఎల్ఎమ్ బెంగళూరు టీచర్స్.

గురుదేవ్ విద్యాలయం నందు ఐఎల్ఎమ్ బెంగళూరు టీచర్స్ చే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం

నేటిదాత్రి చర్ల

చర్ల మండల కేంద్రంలోని ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ అయిన గురుదేవ్ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులలో ఆంగ్లభాష యందు చక్కని అవగాన కల్పించాలన్న సత్సంకల్పంతో ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఎంతో వ్యయంతో కూడుకున్నదే అయినా కూడా ఐఎల్ఎమ్ బెంగుళూరు వారితో ఒప్పందం కుదుర్చుకుని ఐఎల్ఎమ్ బెంగుళూరు వారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ప్రారంభించడమైనదని పత్రికా ప్రకటన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు ఈ విద్యా సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల కు చక్కని శిక్షణ ఇచ్చుటకు బెంగుళూరు నుండి కుమారి సౌజన్య శిక్షకులుగా నియమించబడ్డారు ఈ రోజు ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి సుబ్రహ్మణ్యం జి శ్రీనివాస్ మరియు ఐఎల్ఎమ్ బెంగుళూరు నుండి విచ్చేసిన సందీప్ చేతుల మీదుగా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సమక్షం లో లాంఛనంగా ప్రారంభించబడినది ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చుటకు ఎంతో సుదూరాల నుండి వచ్చేసిన కుమారి సౌజన్య సందీప్ కు మరియు మన పాఠశాలకు తమ సహకారాన్ని అందిస్తున్న ఐఎల్ఎమ్ బెంగుళూరు సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు పత్రికా ముఖంగా తెలిపారు

51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సి అమలు చేయాలి

*51 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సి అమలు చేయాలి*

*డి ఏ లు,జూలై 2023 నుండి అమలు కావలసిన పిఆర్సి ఇంకా పెండింగ్ లోనే….!!*

*ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు.*

*ఉచితాలకు పెద్దపీట వేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయులు కొట్లాడి తెచ్చుకున్న ఆర్థిక హక్కులను కాలురాస్తున్న ప్రభుత్వాలు.*

*కోరి తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం సత్వరమే తగిన చర్యలు గైకొనాలి.*

*తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ డిమాండ్*

*కేసముద్రం/ నేటి ధాత్రి*

జూలై 2023 సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన పిఆర్సిని 51 శాతం ఫిట్మెంట్తో తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాస్టి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల నేతృత్వంలో కేసముద్రం మండలంలోని వివిధ పాఠశాలలను సందర్శిస్తూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ డిఏలు, మెడికల్ రీయంబర్స్మెంట్, జిపిఎఫ్ ఉపసంహరణ లతో పాటు 2023 జూలై నుంచి అమలు కావల్సిన పి ఆర్ సి ఇంతవరకు అమలు చేయకపోవడం బాధాకరమని తద్వారా ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఇవ్వకూడని హామీలు ఇస్తూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఉచితాల హామీలను నెరవేర్చడానికి నానా తంటాలు పడుతున్నారని, కానీ ఉపాధ్యాయ,ఉద్యోగ వర్గాలకు హక్కుగా ఇవ్వాల్సిన డి ఏలు, పిఆర్సీలు మొదలగు వాటిని ఆమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఏరి కోరీ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే వీటిని అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, అంతేకాదు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

అనంతరం మండల శాఖ అధ్యక్షులు అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ రెండో రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్, కల్వల తాళ్లపూసపల్లి ఉన్నత పాఠశాలలను, అన్నారం ప్రాథమికొన్నత పాఠశాలలను సందర్శించామని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండలశాఖ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, జిల్లా శాఖ ఉపాధ్యక్షులు చీకటి వెంకట్రామ్ నర్సయ్య, మండల శాఖ ఉపాధ్యక్షులు ఆంజన్న, కొమ్ము రాజేందర్, కార్యదర్శులు బి విజయ్ చందర్, జీ.మోహనకృష్ణ, బబ్బులు సురేష్ , పి రామారావు తదితరులు పాల్గొన్నారు.

గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు

గురువులను సన్మానము చేసిన బిజెపి మహిళా మోర్చా నేతలు

వనపర్తి నేటిదాత్రి :

గురుపౌర్ణిమ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం ము ఎన్ టి ఆర్ లలిత కళాతోరణం లో తెలంగాణ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర పిలుపుమేరకు గురువులను మహిళ మోర్చా నేతలు గురువులు రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీవెంకటేశ్వర ఆలయ చైర్మన్ అయ్యలూరి రంగనాథచార్యులు విజయకుమార్ శ్రీమతి శ్యామల,

స్వర్ణముకి అకాడమీ చైర్మన్ నాట్యకలా వి నీరజ దేవి లను ఘనంగా సన్మానము చేశారు వారు గురువుల ఆశీర్వాదం తీసున్నారు సన్మానము చేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి శ్రీమతి నారాయణదాసు జ్యోతి రమణ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కవిత మాజీ జిల్లా అధ్యక్షురాలు మహిళా మోర్చా కల్పన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుమిత్రమ్మ, ప్రధాన కార్యదర్శి సుగూరు లక్ష్మి, అర్చన తదితరులు.ఉన్నారు

సిఐటియులో చేరిన అంగన్వాడీలు.

సిఐటియులో చేరిన అంగన్వాడీలు.

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నల్లబెల్లి మండలంలోని అంగన్వాడి టీచర్లు, ఆయాలు మంగళవారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి సమక్షంలో సిఐటియులో చేరారు.ఈ సందర్భంగా కాసు మాధవి మాట్లాడుతూ కార్మికుల మెడపై కత్తిలా వేలాడుతున్న లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక వర్గం ఉద్యమిస్తున్న తరుణంలో అంగన్వాడీలు సిఐటియులో చేరడం అభినందనీయమని, పోరాడే శక్తిని పెంచుతుందని, ఉద్యమాలకు ఊతమిస్తుందని తెలిపారు.అంగన్వాడీల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసి విజయాలు సాధించింది సిఐటియు మాత్రమేనని ఆమె తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని విజయాలు సిఐటియు ఆధ్వర్యంలో సాధించడానికి ఈ చేరికలు మరింత బలాన్ని చేకూరుస్తాయని, ఉద్యమ శక్తిని పెంచుతాయని చేరిన అంగన్వాడీలను అభినందించారు.బుదవారం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీలు భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రాజెక్టు ఆఫీసులో సమ్మె నోటీసు అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్ పాల్గొన్నారు సిఐటియులో చేరిన అంగన్వాడి నాయకుల్లో జాటోత్ సుజాత, పిన్నింటి రజిత, ఉదయ, జమున, భాగ్యమ్మ, సుమలత, కల్పన, శీలాభాయి, ఎండి అస్మత్ తదితరులు ఉన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం.

ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం

మంచిర్యాల నేటి ధాత్రి:

తెలంగాణ ఉద్యమకారుడు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మంచిర్యాల జిల్లా రెవిన్యూ డివిజనల్ ఆఫీసుకు విచ్చేసిన సందర్భంగా వారికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జి.శ్రీనివాసరావు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి శుక్రవారం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగినది.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తో ఉద్యోగ,ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.ప్రస్తుత స్థితిగతులను,పరిస్థితులను వివరంగా ప్రొఫెసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.వారు సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ,ఆర్డిఓ ఆఫీస్ పరిపాలన అధికారి బి.రామచందర్ రావు,కార్యాలయ సిబ్బంది పద్మశ్రీ,అరుణ,లక్ష్మి ,రవి కిషోర్,జనార్ధన్,సతీష్,మహేందర్,సదయ్య,స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.

ఫిబ్రవరిలో నియామకమైన 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.

ఐదు నెలలుగా అందని జీతాలు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు.

2008 డిఎస్సి లో సెలెక్ట్ అయి డీ.ఎడ్ రిజర్వేషన్ తో నియామకం నిలుపుదల.

కోర్టు నాశ్రయించిన బాధితులు, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం

కోర్టు అనుకూల తీర్పుతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చి తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం.

ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం సమంజసం కాదు

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్.

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

shine junior college

 

 

 

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నియామకమైన డీఎస్సీ 2008 కాంట్రాక్టు ఉపాధ్యాయులకు నియామకమైన నెల నుండి నేటి వరకు ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదని, తక్షణమే ప్రభుత్వం వారికి జీతాలు చెల్లించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్ చేశారు. కేసముద్రం విలేజ్ ప్రాథమిక పాఠశాలలో భోజన విరామ సమయంలో టి పి టి ఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘ మండల శాఖ అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ..
డీఎస్సీ 2008లో సెలెక్ట్ అయి,నియామకం పొందే సమయంలో డి.ఎడ్ వారికి 30% రిజర్వేషన్ ఇవ్వాలన్న నిర్ణయంతో ఈ నియామకం ఆగిపోయిందని, ఈ విషయమై ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ప్రభుత్వం వీరికి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో వీళ్ళు కోర్టు ను ఆశ్రయించి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి 15 సంవత్సరాలుగా పోరాటం చేశారని వివరించారు. చివరకు వీరికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వీరిని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా కాకుండా కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా నియమించి వారికీ తీరని అన్యాయం చేశారని ఆయన వాపోయారు. ఈ పదిహేను సంవత్సరాలు వారు ఎంతో మనోవేదనకు గురయ్యారని, శారీరకంగా ఆర్థికంగా వారు ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరికి కాంట్రాక్టు ఉద్యోగాన్ని అంటగట్టిన ప్రభుత్వం నియామకమైన ఫిబ్రవరి నెల నుండి నేటి వరకు సుమారు ఐదు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, ఎందుకీ వివక్ష అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరంతా ఐదు నెలలుగా తమ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారని, కానీ జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయారని అన్నారు.

ప్రభుత్వం వీరికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని హితువు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి జీతాలు ఇవ్వడానికి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని సురేందర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ కార్యదర్శి వీసం నర్సయ్య, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజులు పాల్గొన్నారు.

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను.

భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల బోధనను సులభతరం చేస్తాయి

ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి.

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

shine junior college

మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కోమటి కొండాపూర్ లో ప్రొఫెసర్ “జయశంకర్ బడిబాట “లో భాగంగా FLN LIP దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా ఉపాధ్యాయులు తయారుచేసిన భోధనాభ్యసన సామాగ్రి(TLM) వివిధ తరగతులలో ఆశించిన అభ్యసన ఫలితాల చార్థులు ప్రదర్శించి,వీటి గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇట్టి ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతు భోధనాభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుల భోదన సులభతరం చెయ్యడమే కాకుండా,TLM ద్వారా భోదిస్తే విద్యార్థులు బడి పట్ల ఆకర్షితులై హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులచే గత సంవత్సరం వారు చదివిన కథల, పాఠ్య పుస్తకాలు చదివించి బాగా చదివిన వారికి “నేను బాగా చదువగలను “అనే గుర్తింపు బ్యాడ్జ్ తో అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధిక, ఉపాధ్యాయులు సుధారాణి, విశాల్, నర్మదా, రాసూరి రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

కేజీబివిలో అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం.

కేజీబివిలో అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం.

స్పెషల్ ఆఫీసర్, ఎంఈఓ ప్రకటన..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (ఎంఎల్టి ) గ్రూపులో
తాత్కాలిక పధతిలో విద్యా బోధన చేయడానికి మహిళా విద్యాపకుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,పాఠశాల ప్రత్యేక అధికారిని మంజుల ఒక సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మంజుల మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల కళాశాలలో టిజిసిఆర్టి ఇంగ్లీష్ ఫస్ట్ ఒకటి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఒకటి లకు గాను దరఖాస్తు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ పీజీసిఆర్టి పోస్ట్ కు గాను అభ్యర్థి విద్య అర్హత ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ అర్హత ఉండాలి, ఎంఎల్టి పోస్ట్ కు గాను
ఎండి పాతాలోజి, బీఫార్మసీ, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంబిబిఎస్, బిహెచ్ఎంఎస్, పిజిడి క్లినికల్ బయో కెమిస్ట్రీ అర్హతలు గల అభ్యర్థులు వారి వారి దరఖాస్తులను పాఠశాలకు నేరుగా వచ్చి ఈనెల 14 నుండి 18 తారీకు లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె తెలియజేశారు.

పాఠశాల లో విద్యార్థులకు ఉపాధ్యాయలు పుష్ప గుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు.

మల్లాపూర్ జూన్ 12 నేటి ధాత్రి:

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం లోని మొగిలిపేట మండల పరిషత్ ప్రైమరీ. పాఠశాల లో విద్యార్థులకు ఉపాధ్యాయలు పుష్ప గుచ్చలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో హెచ్ఎం శ్రీనివాస్ ఉపాధ్యా యులు రాజేందర్, సుమిత్ర దేవి, కృష్ణవేణి, ఆఫీస్ సభర్డినేట్ రాకేష్, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.

చిన్న బోనాల, ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో.

చిన్న బోనాల, ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి

మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని చిన్న బోనాల మరియు ముష్టిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా బోధన తీవ్రంగా ప్రభావితమవుతోంది. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాలంటూ 10 వార్డ్ మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ చిన్న బోనాల అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ మరియు ముష్టి పెళ్లి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్, DEO, MEO లకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాజీ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ..
చిన్న బోనాల పాఠశాలలో 65 మంది విద్యార్థులకు కేవలం 4 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా, ఇద్దరు డిప్యూటేషన్‌పై, ఒకరు రిటైర్డ్ అయ్యారు. అలాగే ముష్టిపల్లి ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జీవో నెం.25 ప్రకారం ఈ సంఖ్యకు తగినట్టు అదనపు టీచర్లను నియమించాలి అని ప్రజావాణిలో అధికారులకు తెలిపారు.ఈ వినతిపత్ర సమర్పణలో బండారి భాగ్య, గుగ్గిల లావణ్య లలిత, బి.వినోద్, నరాల లత, సరోజ,అనన్య,లింబ్బవ్వ,సురేష్,మహేష్, బాబు,పరశురాములు, రమేష్, శివ, కుమార్, అనిల్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల.!

పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు అనైతికం.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ప్రభుత్వం కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే బడిబాట కంటే ముందే సర్దుబాటు ఏంటి…..?

ప్రయత్నం చేయకుండానే పాఠశాలల మూసివేతలా…?

ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కావాలి కానీ ఏదో కారణంతో మూసివేయడం కారాదు.

ప్రభుత్వం ఈ సర్దుబాటు నిర్ణయాన్ని వెంటనే పునః పరిశీలించాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం సరికాదని,ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ సర్దుబాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా సురేందర్ మీడియాతో మాట్లాడుతూ…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆయా వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయులను మరొక పాఠశాలలో సర్దుబాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

ఇటీవలే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి, పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని,బడిబాటలో అత్యధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయాలని సూచించిన ప్రభుత్వం, కనీసం ఉపాధ్యాయులకు ఆ ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకుండానే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం ప్రకటించడం అనైతికమని విమర్శించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జూన్ 6వ తేదీ నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఉపాధ్యాయ లోకం కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అత్యధికంగా చేర్పించాలనే కసితో ఉన్నారని, ఇప్పటికే పలుమార్లు గ్రామాల్లో బడిబాట ర్యాలీలు తీయడం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం కూడా జరిగిందని వివరించారు.

ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే సంకల్పం, పట్టుదలతో ఉపాధ్యాయులు ఉన్నారని, చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు.

విద్యార్థులను పాఠశాలలో చేర్పించే అసలు బడి బాట కార్యక్రమం ముందే ఉండగా, కనీసం ఉపాధ్యాయులను బడిబాట కార్యక్రమ ప్రయత్నం చేయనివ్వకుండానే కొన్ని పాఠశాలలను మూసివేస్తామనడం, ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామనడం ప్రభుత్వ దమననీతికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. కనీస ప్రయత్నం చేయించకుండానే పాఠశాలలను ఎలా మూసివేస్తారని, ఏ ప్రాతిపదికన ఉపాధ్యాయ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కావాలి కానీ పాఠశాలలను ఏదో ఒక కారణంతో మూసివేయడం కారాదు అని సూచించారు.

ఒకవేళ బడిబాట కార్యక్రమ అనంతరం కూడా అడ్మిషన్లలో ఎలాంటి పురోగతి లేనట్లయితే అప్పుడు ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

అంతే కాదు చాలా పాఠశాలల్లో త్రాగు నీటి సౌకర్యం లేదని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి త్రాగునీటి సౌకర్యం కల్పించేలాగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు .

ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం తీసుకొచ్చేలాగా ప్రభుత్వం పనిచేయాలని ఈ సందర్భంగా సురేందర్ డిమాండ్ చేశారు.

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి
విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి

మొగులపల్లి నేటి ధాత్రి

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విద్యా ప్రమాణాలు పెంపొందించాలని మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి అన్నారు.

శనివారం మండలంలోని మొట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహించబడుతున్న ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ శిక్షణలో నూతనంగా పరిసరాల విజ్ఞానాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత మరింతగా పెరుగుతుందన్నారు.

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు నమోదు పెంచుటకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు.

గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, అంగన్వాడి సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో బడిబాట కార్యక్రమం నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచడానికి భాగస్వాములను చేయాలన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్దిష్టమైన చదువు హామీ ఇచ్చి నెరవేర్చేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు.

Students Education Officer

 

ఉపాధ్యాయులు శిక్షణలో పొందిన విధంగా విద్యార్థులను ఆకట్టుకునేలా, ఆసక్తిని పెంచేలా బోధన ప్రక్రియ కొనసాగాలన్నారు.

అనంతరం బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు పొందిన ఉపాధ్యాయులు కోటేశ్వర్లు, సునీతా దేవినీ ఎమ్మార్పీలు వ్యవహరించిన వేణుమాధవ్, నాగరాజు, రామకృష్ణ, రాజ్ కుమార్, స్వామి, రాము, చంద్రయ్యలకు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎం ఆర్ సి సిబ్బంది, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సమ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులే..

సమ సమాజాన్ని నిర్మించేది ఉపాధ్యాయులే..

#శిక్షణ శిబిరాన్ని సందర్శించిన డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br

 

 

సమ సమాజాన్ని నిర్మించే నిర్మాతలు ఉపాధ్యాయులే అని వరంగల్ డీ ఈ వో మామిడి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరుగుతున్న 5 రోజులు ప్రైమరీ ఉపాధ్యాయుల శిక్షణను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియ పెంచాలని కోరారు. ఐదు రోజులుగా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాల గొప్పతనాన్ని గ్రామాల ప్రజలకు వివరించి పిల్లల నమోదును పెంచడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన సాంకేతిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలని అన్నారు. పాఠశాలల్లో నమోదును ఎలా పెంచాలో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రానున్న కాలంలో విద్యా రంగంలో మార్పులు రానున్న తరుణంలో ఆ దిశగా బోధనలో మార్పులు తీసుకురావాలని కోరారు. బెస్ట్ టీచర్స్ యొక్క పని విధానాన్ని అందరికీ వివరించారు. వృత్యుంతర శిక్షణను వినియోగించుకోవాలని అన్నారు.

Training Camp.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ అనురాధ,కాంప్లెక్స్ హెచ్ ఎం లు, ఎం ఆర్పిలు, ఎస్ఆర్పీలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, ఉపాధ్యాయులు, ఎం ఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం

శిక్షణ అందించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్. మే 20:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ఐదు రోజుల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.

Collector Sandeep Kumar

 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు గీత నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని, విద్యార్థులను గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version