ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ హైస్కూల్లో ఘనంగా అమ్మకు వందనం.

ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ హైస్కూల్లో ఘనంగా అమ్మకు వందనం.

కోదాడ, నేటి ధాత్రి :

 

విద్యార్థు ల్లో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని విశ్రాంత ఉపన్యాసకులు సాహితీవేత్త శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని నయా నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ హైస్కూల్ లో అమ్మకు వందనం కార్యక్రమం సందర్భంగా పాఠశాల చైర్మన్ యం.డి షేర్ అలీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ. విద్యార్థుల్లో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే అమ్మ కు వందనం కార్య క్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. నైతిక విలువలకు పునాది పాఠశాల అని , నైతిక విలువలు విద్యార్ధుల్లో పెంపొందించేందు కు ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ చేస్తున్న కృషి ప్రశంస నీయం అన్నారు. ఒక మంచి తల్లి వంద మంది ఉపాధ్యాయుల తో సమానం అన్నారు.తల్లి దండ్రులు దైవం తో సమానం అన్నారు. మరో ముఖ్య అతిథి రచయిత సంఘం అధ్యక్షుడు పుప్పాల కృష్ణ మూర్తి మాట్లాడుతూ అమ్మ విలువ అందనంత దూరంలో వున్నప్పుడే అర్ధం అవుతుందన్నారు. తల్లి దండ్రుల ను మరవద్దన్నారు. తల్లి దండ్రుల ను చూసే బాధ్యత పిల్లల దే అన్నారు. తల్లి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేని దన్నారు. అనంతరం తల్లి దండ్రులకు విద్యార్ధులు పాద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ గూడెం హై స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సత్తార్, పీఎం శ్రీ జిల్లా పరిషత్ స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు శ్రీమతి షేక్ రెహానా బేగం విద్యార్ధుల తల్లి దండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కాలిన్సీ ఎరోస్పేస్ *ఆధ్వర్యంలో…

విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కాలిన్సీ ఎరోస్పేస్ *ఆధ్వర్యంలో

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో కాలిన్సీ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు రామారావు, విశాల్ గారులు మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 190 మందిక విద్యార్థులకు బ్యాగులు,నోట్ బుక్కులు, పెన్నులు ,పెన్సిళ్లు మరియు ఇతర స్టేషనరీ పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు భాగ్యశ్రీ గారు అధ్యక్షత వహించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కాలింగ్ చేరోస్పేస్ వారు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా జీవితంలో పురోగమించాలని అభిలసించారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధిలు,మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించుటకై మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరము విద్యాభివృద్ధికై ఇతోదికంగా సహాయ చేయడం జరుగుతుందని , అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా కావలసిన వసతులను సమకూర్చడంలో మా సంస్థ ముందు ఉంటుందని ఇంకా ఏదైనా సదుపాయాలు అవసరం ఉంటే మాకు తెలియజేసిన, వెంటనే మీకు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల వెంకన్న గారు మాట్లాడుతూ తను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఎరోస్పేస్ ప్రతినిధి రామారావు గారిని అభినందించడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ రాజయ్య గారు మాట్లాడుతూ గత సంవత్సరము పాఠశాలకు అందించిన స్పోర్ట్స్ మెటీరియల్ ద్వారా పలువురు విద్యార్థులను జాతీయ స్థాయిలో రాష్ట్రస్థాయిలో క్రీడాకారులుగా రాణించుటకు ఉపయోగపడిందని
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్,రాజు, ప్రవీణ్ ,విజయభాస్కర్, కళ్యాణి, పద్మ, రాజయ్య, లలిత,చందర్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ వృత్తి గొప్ప ది…

ఉపాధ్యాయ వృత్తి గొప్ప ది

సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్

వనపర్తి నేటిదాత్రి .

 

ప్రైమరీ స్కూల్ బిజ్వరం మండల ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి న నామ్ దే వ్ పదవి విరమణ వేడుకలలో సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షులు పలాస శంకర్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఉపాధ్యాయ వృత్తి గొప్పది అన్నారు. 37ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తికి నామ్‌దేవ్ విద్యార్థులకు విద్యా బోధ సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శేఖర్ గ్రామ సర్పంచ్, ఉపాధ్యాయ సంఘాలు కెసి వెంకటేష్, రాములు, నరేష్ రాంనాయక్,రాజలింగం,
పాఠశాల ఛైర్మన్,రాములమ్మ, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు,తధితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి…

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన తపస్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ )భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు,ఉద్యోగులు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న పలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంఘ నాయకులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పి ఆర్ సి కమిటీ రిపోర్టు ను ప్రభుత్వం తెప్పించుకొని పి ఆర్ సి నీ వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఇతర పెండింగ్ బకాయిలన్నింటిని త్వరితగతిన ఉపాధ్యాయులకు చెల్లించాలని ఎమ్మెల్యే ను సంఘ నాయకులు కోరారు.
ఉపాధ్యాయులకు,ఉద్యోగులకు , విశ్రాంత ఉద్యోగులకు రావలసిన బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ హామీలను నెరవేర్చాలని కోరారు.
రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటిని ప్రస్తావించి వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొనే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షులు ములుకల్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర బాధ్యులు మారబోయిన మహేందర్, సంగెం శ్రీనివాస్, రేగొండ డివిజన్ ఇంచార్జి కొడకండ్ల శ్రీకాంత్, చిట్యాల మండల ప్రధాన కార్యదర్శి లకుం రంజిత్ కుమార్, మహాదేవపూర్ మండల అధ్యక్షులు నస్పూరీ సంతోష్ కుమార్,జిల్లా కార్యదర్శిలు గౌరిశెట్టి రవీంద్రనాథ్, మూడికె శ్రీనివాస్, జంగిలి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌

నేడు జరిగే జాతీయ సెమినార్‌కు సర్వం సిద్ధం

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్,నిర్వహణ కార్యదర్శి డాక్టర్ రాంబాబు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో మంగళవారం జాతీయ స్థాయిలో సెమినార్‌ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు. సెమినార్ కు సంబంధించిన బ్రోచర్లను సెమినార్ కార్యదర్శి డాక్టర్ రాంబాబుతో అధ్యాపక బృందంతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రీసెంట్ అడ్వాన్స్ ఇన్ ప్లాంట్ సైన్స్- ఇష్యూస్ అండ్ ఛాలెంజ్స్ ఇన్ క్రాప్ ఇంప్రుమెంట్ అనే అంశంపై జాతీయ సెమినార్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.

ఈ సెమినార్ నిర్వహణకు రూసా స్పాన్సర్‌షిప్ అందించడం విశేషమని చెప్పారు.కళాశాలలో సభా వేదిక, అతిథుల స్వాగతం, పాల్గొనే అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం అవసరమైన సౌకర్యాలు సమకూర్చబడ్డాయని పేర్కొన్నారు.సదస్సు కు కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ చీఫ్ పేట్రన్ దేవసేన,ఆర్జేడీ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్, ఆర్జేడీ జోన్ II బాల భాస్కర్, రుసా డైరెక్టర్ సౌందర్య జోసెఫ్ రానున్నారని అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి ను ఆహ్వానించమని తెలిపారు.మహారాష్ట్ర,ఆంధ్రా ప్రదేశ్,తెలంగాణ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఉపన్యాసకులు, ప్రముఖ వక్తలు సదస్సుకు పాల్గొంటున్నారని వివరించారు.వందకు పైగా పరిశోధన పత్రాలు సమర్పనకు ఉన్నాయని నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.సెమినార్ నిర్వహణ కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ జాతీయ సెమినార్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.పాల్గొనే వారు కార్యక్రమ మార్గదర్శకాలను పాటిస్తూ సమయానికి హాజరుకావాలన్నారు.సెమినార్ శాస్త్రీయ చర్చలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం కళాశాల అధ్యాపకులు, నిర్వాహక బృందం, సిబ్బంది సహకారంతో విజయవంతం కానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం టేకుమట్ల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు, పెన్సిళ్లను గోనె వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిని,విద్యార్థులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా గోనె వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అలాగే ప్రాథమిక పాఠశాలకు ఏ అవసరం ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా టేకుమట్ల గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు నేర్పించే విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో నిలిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, వేణుమాధవ్,గ్రామ సర్పంచ్ బల్ల వెంకటేష్,ఉప సర్పంచ్ గోనె ప్రవీణ్,వార్డ్ మెంబర్లు అశోక్,తరుణ్,కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రాలలో సరుకుల పంపిణీ…

అంగన్వాడి కేంద్రాలలో సరుకుల పంపిణీ

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

మండలంలోని డబ్బా గ్రామంలో
నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ పుప్పల లక్ష్మి మహేష్, ఉప సర్పంచ్ రాపల్లి మహేష్ కు అంగన్వాడి టీచర్లు ఘనంగా స్వాగతం పలుకుతూ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలలో ఆరు నెలల నుండి మూడు సంవత్సరం లోపు పిల్లలకు బాలమృతం, కోడిగుడ్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ రా పెళ్లి రవళి ప్రధానోపాధ్యాయులు తగుకుల రమేష్,, యువ నాయకుడు కోటి అరుణ్, అంగన్వాడీ టీచర్లు సుందరగిరి గంగామణి, వై సంజీవరాణి ,ఆశ కార్యకర్తలు రజిత, జ్యోతి అంగన్వాడి ఆయా గుండు శ్యామల, విమల, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు,

వార్షిక పరీక్షలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన

వార్షిక పరీక్షలకు..
విద్యార్థులను సిద్ధం చేయాలి..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నిజాంపేట: నేటి ధాత్రి

వార్షిక పరీక్షలు త్వరలో జరగనున్న నేపథ్యం లో ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చెయ్యాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. నిజాంపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. ప్రత్యేక తరగతుల వల్ల నాణ్యమైన విద్య అందుతుందని దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన శైలిని పరిశీలిస్తూ.. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్, వార్డు సభ్యులకు అభినందనలు

ఆత్మీయ అభినందన సభ

చందుర్తి, నేటిదాత్రి:

 

జోగాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇటివల గ్రామపంచాయతీ ఎలక్షన్స్ లో ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు ఆత్మీయ అభినందన సభను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యెలిగేటి శ్రీలత గారు మరియు ఉపాధ్యాయ బృంధం ఏర్పాటు చేసి,ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు యెలిగేటి శ్రీలత గారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గ సభ్యులు పాఠశాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించగలరని, గ్రామంలో ఉన్న బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చొరవ చూపించాలని, విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి షహనాజ్ షమీర్ గారు మాట్లాడుతూ ఈ పాఠశాలకు మా వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తామని తెలియజేశారు. మా మా పిల్లల్ని ఇదే పాఠశాలలో చేర్పించామని రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షహనాజ్ సమీర్, ఉపసర్పంచ్ గంట మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అమరబండ సాయి, విలేజ్ సెక్రటరీ కే మారుతి
వార్డు సభ్యులు
గద్దరాశి రాజు
ఓల్లం లావణ్య తిరుపతి, గొల్లపల్లి నారాయణ,
పల్లి ప్రశాంత్,
చక్రాల మంగ,
అమర బండ రమ్యశ్రీ జలంధర్,
టేకుమల్ల రేణుక,
ముద్దాల ప్రవీణ్,
చింతం రాధా శంకర్
ఉపాధ్యాయులు ఎడ్ల కిషన్, పాము వెంకటేశ్వర్లు, గుడిపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ రవి తదితరులు పాల్గొన్నారు.

బోరేగావ్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

*ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ…*

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

బోరేగావ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ పాఠశాలను మండల విద్యాధికారి శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయులు ఈలియాస్ మరియు గ్రామ సర్పంచ్ నాగేంద్ర పటేల్ గ్రామ ఉపసర్పంచ్ నర్సింలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు

సి ఆర్ పి చిరంజీవి రాజు శివ మరియు గ్రామస్తులు తో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు గా పి సబితా ఆయాగా సమిన, నియమించడం జరిగింది గ్రామంలో మూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ప్రీ ప్రైమరీ పాఠశాలలో అడ్మిషన్ చేయవలసిందిగా మండల విద్యాధికారి తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోగ్రామస్తులు పాల్గొనడం జరిగింది,

సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు…

సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయినీయులు,రంగవల్లులు వేసి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను చాటిచెప్పారు.
విద్యార్థులు సంప్రదాయ పండుగ వాతావరణాన్ని సృష్టించగా, పాఠశాల యాజమాన్యం సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందుతుందని విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలిపారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి…

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాలనేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థినీ, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూ అమలు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.విద్య అజ్ఞానాన్ని దూరం చేస్తుందని తెలియజేస్తూ బాలిక విద్యను ప్రోత్సహించారని,మహిళల హక్కుల కోసం తన వంతు కృషి చేశారని తెలిపారు.మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పీఆర్టీయు టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…

పీఆర్టీయు టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…

కేసముద్రం/ నేటి ధాత్రి

 

సెంటర్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘం కేసముద్రం మండల అధ్యక్షులు గోపాల శ్రీధర్ మాట్లాడుతూ..వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు.ఇప్పటికే చాలా కాలయాపన జరిగిందని, పీఆర్సీ సమయం దాటి రెండు సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటివరకు రావాల్సిన 5 డిఏ లను వెంటనే ప్రకటించాలని గోపాల శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సంఘం కేసముద్రం మండల ప్రధాన కార్యదర్శి బీరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని,పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ,ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహా యింపు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా బాధ్యులు ఉపాధ్యాయులు శ్రీనివాస్, భాస్కర్, హరినాథ్, గోపాల్, రాహుల్ కుమార్, హరి సింగ్, సత్యనారా యణ,రఫీ భాష, శోభ, పద్మశ్రీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్…

పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున రాష్ట్ర విద్యాశాఖ అనుదేశానుసారంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించినట్టుగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఎదిగే పిల్లలకు అన్ని రకాల పౌష్టికాహారాన్ని అందించినప్పుడే పిల్లల్లో ఎదుగుదల కనిపించి ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థుల కోసం వివిధ రకాలైన వంటకాలను చికెన్, చికెన్ బిర్యాని,తెలంగాణ వంటకాలు,పులిహోర గులాబ్ జామ్,సేమ్యా,పుల్కా, సర్వపిండి,నువ్వుల ముద్దలు,
పల్లి పట్టీలు,పేలాల ముద్దలు, రాఫుడ్, వివిధ రకాలైనటువంటి పండ్లు తీసుకువచ్చి వారి పిల్లలకు తినిపించారు‌.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్, పుల్లూరి రామకృష్ణ, అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి,అంగన్వాడి టీచర్ బీముడి లక్ష్మి,సుమారు 40 మంది తల్లులు పాల్గొనడం జరిగింది.

ఆదర్శ పాఠశాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T143659.733.wav?_=1

 

ఆదర్శ పాఠశాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల కళాశాలలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ మేకల రమేష్ గారి ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వాసాల వెంకటేశ్వర్లు సంరక్షణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రూపశిల్పి అని దేశ ఐక్యత కోసం దేశం అభివృద్ధి కోసం దేశంలో ఉండేటటువంటి ప్రజల అందరి న్యాయం కోసం రాజ్యాంగంలో ఎన్నో సంస్కరణలు రూపొందించిన గొప్ప మేధావి అని అన్నారు నా భారత దేశంలో ప్రతి పౌరుడు ఆకలితో చావకూడదని అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పిస్తున్నానని అదే దేశ అభివృద్ధికి సూచికగా మారుతుందని అన్నారు దేశం ముందంజలో ఉండాలంటే కులమత వర్గ విభేదాలు ఉండకూడదని అందరూ ఐక్యతతో సమానత్వంతో కలిసి మెలిసి ఉండాలని అన్నారని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రం లోపిల్ల లకు అక్షరాభ్యసo..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T170957.745.wav?_=2

 

అంగన్వాడీ కేంద్రం లోపిల్ల లకు అక్షరాభ్యసo.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండలం లోని శాంతినగర్ లో మంగళవారం రోజున రజిత టీచర్ అంగన్వాడీ కేంద్రం లో చిట్యాల సెక్టార్ సమావేశం కు ఐ సి డి ఎస్ సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం లో తుమ్మల అనిల్ తేజ దంపతుల కూతురు అను అనే బాలికకు అక్షరాబ్యాసం చేయించి పిల్లలతో టీచర్స్ అందరూ కలిసి ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఆట పాట పిల్లలతో చేయించడం మరియు ఎజెండా అంశాలను చదివి వినిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 30 మంది అంగన్వాడీ టీచర్స్ ఆయా కోమల పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల వినియోగంపై ప్రతిజ్ఞ – మండల విద్యాధికారి లింగాల కుమారస్వామి

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T155711.883.wav?_=3

మాదకద్రవ్యాల వినియోగంపై ప్రతిజ్ఞ – మండల విద్యాధికారి లింగాల కుమారస్వామి

మొగులపల్లి నేటి ధాత్రి

 

ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు జడ్పీహెచ్ఎస్ మొగుళ్లపల్లి పాఠశాల ఆవరణలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు భాగ్యశ్రీ ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించనైనది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలలో మాదకద్రవ్యాల వినియోగం ఒకటాని దాన్ని నిర్మూలించుటకు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అందులో విద్యార్థులను పాల్గొని మారకద్రవ్యాల వినియోగం అమ్మకం కొనడం నేరమని ఈ విద్యార్థులకు సూచించారు. మారకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అలా వినియోగించే వారిని అధికారులకు సమాచారం ఇచ్చి అరికట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి వెంకన్న వై సురేందర్ ఏ వి ఎల్ కళ్యాణి అనిల్ కుమార్ ప్రవీణ్ రాజు పద్మ లలిత విజయ భాస్కర్ రాజయ్య శ్రీకాళ అంగన్వాడీ టీచర్స్ చందర్ బజార్ వేణు ఎన్సిసి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T135956.499-1.wav?_=4

 

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారముగా మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఆవరణలో చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని,డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్,పుల్లూరి రామకృష్ణ, అంగన్వాడీ టీచర్ భీముడి లక్ష్మి,గ్రామస్తులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అంగన్వాడీ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లల పట్ల నెహ్రూ కి ఉన్న ప్రేమను స్మరించుకుంటూ, 1954 నుండి ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుతున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వన్ సెంటర్ దోమల యశోద, టు సెంటర్ జి లలిత.ఆయా పద్మ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎల్లూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T143815.403.wav?_=5

 

ఎల్లూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు

వనపర్తి నేటిదాత్రి .

 

కొల్లాపూర్ నియోజకవర్గo ఎల్లూరు జెడ్పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజవర్డన్ రెడ్డ్ ఆదేశాల మేరకు మొక్కలు నాటమని ఎల్లూర్ గ్రామంలో ప్రభుత్వ జెడ్పీ హెచ్ ఎస్ పాఠాశాలలో చదివిన పాఠశాల కు వెళ్లి కవిత సంపుటి కాల గమనం పుస్తకాలను పంపిణీ చేశామని రచయిత డాక్టర్ కంటే నిరంజన్ య్యా ఒక ప్రకటన లో తెలిపారు
ఈకార్యక్రమంలో.ఎల్లూర్ మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డ్. ఉపాధ్యాయులు శ్రీనయ్యా బ్రహ్మ చారి నీలంరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఈమేరకు నిరంజ నయ్యను శాలువతో సన్మానించారు కొల్లాపూర్ గాంధీ మెమెరియల్ హైస్కూలు లో ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి కి పుస్తకాలు ఇచ్చామని తెలిపారు తెలుగు ఉపాధ్యాయురాలు అనిత కాలగమనం పుస్తకం లో 55 కవితలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు వివరించారని నిరంజనయ్యా తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version