33 వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు…

33 వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరు
వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 33 వ వార్డు జనరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ ఎల్ ఎన్ మాధవి బిజెపి తరపున బచ్చ సౌజన్య బీఆర్ఎస్ తరపున అలైఖ్య పోటీలో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ సతీమణి మాధవి 33 వ వార్డు నుండి కౌన్సిలర్ గా విజయం సాధిస్తే మున్సిపల్ చైర్మన్ పఫవి దక్కించుకుంటారని ప్రజలు రాజాకీయా పరిశీలకులు అంటున్నారు

చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి…

చేర్యాల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులనే గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముస్తాల తేజ

చేర్యాల నేటిదాత్రి

 

చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చేర్యాల మున్సిపల్ చైర్మన్ 2 వార్డ్ అభ్యర్థి ముస్తల తేజ అన్నారు ఈ సందర్భంగా తన సొంత వార్డులో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు ప్రజలందరి మనసును దోచుకున్నదని చేర్యాల మున్సిపల్ మేము హస్తగతం చేసుకుంటామని

అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలను వివరిస్తూ గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు మరియు ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పేదలకు సన్న బియ్యం వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు చేర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందు ఉంచుతానని మరియు ప్రజలందరికీ సేవ చేయడానికి మీ ముందుకు వచ్చానని రెండో వార్డ్ కౌన్సిలర్ గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణాన్ని అగాధంలో నెట్టివేశారని అన్నారు ఈ కార్యక్రమంలో భూమి గారి మనోహర్ ముస్తాల స్టీవెన్ కాటం సంజీవయ్య చెవిటి లింగం భూమిగారి మహేందర్ ముస్తాల కిష్టయ్య పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో ఏక్స్ ఆఫీ షియో…

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లో ఏక్స్ ఆఫీ షియో హోదా లో ఒకే మున్సిపాలిటీ ని ఎంపిక చేసుకోవాలి
వనపర్తి నేటిధాత్రి .

 

 

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులు ఎక్స్ అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకొని ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణీ కుముది సూచించారు సెక్షన్ 5, 20 ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీలు తాము ఎన్నికైన 30 రోజుల్లోపు ఏదో ఒక మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించేందుకు ఆప్షన్ ఇచ్చుకొని ఉండాలని, అలా కాకుండా ఇంతవరకు ఆప్షన్ ఇవ్వని పక్షంలో నిబంధన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు అయిన 30 రోజుల్లో ఆప్షన్ ను సంబంధిత మున్సిపల్ కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ జారి చేసి ప్రజాప్రతినిధుల నుండి ఆప్షన్ తీసుకోవాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ లు జారీ చేసి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈవీ డియో
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్యడిఆర్డీఒ పి.డి. ఉమాదేవి, సి.పి. ఒ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు

 మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం..

 మరో మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం

 

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.

కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని Post) తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. అయితే, ఎక్స్ అఫీషియో హోదాలో ఓటు హక్కు ‌ వినియోగించుకున్నారు ఎంపీ అంబికా లక్షీనారాయణ, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడంతో తెలుగు తుమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. టపాసుల మోతతో కళ్యాణదుర్గం సందడిగా మారింది. ఈ క్రమంలో తలారి గౌతమికి టీడీపీ హై కమాండ్ శుభాకాంక్షలు తెలిపింది.

కాగా, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాళ(గురువారం) జరిగింది. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉండగా… వైసీపీకి 12 మంది కౌన్సిలర్ల బలం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషీయో ఓటుతో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది.మరోవైపు.. రామగిరి ఎంపీపీ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది రామగిరి ఎంపీపీ ఎన్నిక. నాలుగోసారి రామగిరి ఎంపీపీ ఎన్నిక ఈరోజు (గురువారం) జరగనుంది. ఇప్పటికే రామగిరి ఎంపీపీ ఎన్నికను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మూడుసార్లు కోరం లేక రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది . గురువారం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరగనుండటంతో హాట్‌టాపిక్‌గా మారింది.

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

– ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్ భరోసా

– ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఆటోడ్రైవర్ల తో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ భరోసా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పించామని కార్మికుల పక్షపాతి కేసీఆర్‌ అన్నారు. అధికారంలో లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందని వారి వెన్నంటే ఉండి వారి సమస్యలపై పోరాడుతామన్నారు.
కేసీఆర్‌ను మరోసారి గెలిపిద్దామని ప్రజలు అనుకుంటున్నరని ఆటోడ్రైవర్లను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను అన్ని విధాలుగా తప్పుడు ప్రచారాలు చేసి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.

ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య, కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్, వేములవాడ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు, బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మాజీ టెక్స్టైల్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి,సిరిసిల్ల బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,
ఆటో యూనియన్ అధ్యక్షులు అల్లే శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్, కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ చైర్మన్ చిక్కాల రామారావు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు ఆటో యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం…

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో, నాయకులు ఎన్నికల వ్యూహాలు, అట్టడుగు స్థాయిలో సంస్థను బలోపేతం చేయడం మరియు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పార్టీ కేడర్‌ను సమీకరించడం గురించి చర్చించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి హజ్ కమిటీ మెంబర్ యూసఫ్ ,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ యువ నాయకులు మిథున్ రాజ్, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.

గొర్రెల, మేకల సంత ప్రారంభం…

గొర్రెల, మేకల సంత ప్రారంభం

వ్యాపార రంగంలో అగ్రగామిగా ఎదగాలి

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

 

జడ్చర్ల మున్సిపాలిటీలోని కావేరమ్మపేటలో ఏర్పాటు చేసిన కొత్త గొర్రెల, మేకల సంతను శనివారం జనంపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు, కాపరులు, స్థానిక వ్యాపారులకు ఉపయోగపడే విధంగా సంతను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. పశువుల పెంపకం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకలాంటిదని, ఈ సంత ద్వారా వ్యాపార లావాదేవీలు సులభతరమవుతాయని, కాపరులకు తగిన మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు, మున్సిపల్ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version