భవన నిర్మాణ కార్మికుల నిధులు రక్షణ కోసం నిరంతరం ఆందోళనలు చెయ్యాలి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో భవన నిర్మాణ కార్మికుల జిల్లా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఈనెల17న వినతి పత్రాలు, 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమం, డిసెంబర్ 5న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు తీర్మానం చేయనైనదని జేఏసీ సంఘాల నాయకులు తెలిపారు. ఈసమావేశంలో ఎఐటియూసి, సిఐటియూ, బిఆర్టియూ, ఇతర స్వతంత్య సంఘాలు పాల్గొన్నాయి. రౌండ్ టేబుల్ సమావేశంలో జేఎసి నాయకులు మాట్లాడుతూ కార్మిక సంఘాలతో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అడ్వైసర్ కమిటీ ద్వారా నిధులను మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించాలన్నారు. సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, రెన్యువల్ కానీ పదమూడు లక్షల వెల్ఫేర్ బోర్డు కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ క్లెయిమ్స్ కు నిధులు విడుదల చేయాలనీ, జిల్లాల్లో లేబర్ అధికారుల అవినీతి అరికట్టాలని, ఆఫీసులో బ్రోకర్లు, ఏజెంట్లను పెట్టుకొని పనిచేస్తున ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని, లేబరు కార్డ్స్ నమోదు, రెన్యువల్, క్లెయిమ్స్ నమోదులో అధిక ఫీజు వసూళ్లు చేస్తున్న మీసేవ కేంద్రాలను సీజ్ చేయాలని జిల్లా జేఏసి సంఘాలు తీర్మానం చేశాయి. ఈడిమాండ్స్ సాధనకోసం 17వ తేదిన కార్మిక మంత్రి, లేబర్ కమిషనర్ కి వినతి పత్రాలు అందజేయాలని, ఈనెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేయాలని, డిసెంబర్ 5న చలో హైదరాబాద్ కార్యక్రమం చేస్తున్నామని తెలియచేశారు. ఈకార్యక్రమాల విజయవంతంలో అన్ని రకాల భవన నిర్మాణ కార్మికులు భాగస్వాములు కావాలనివారు కోరారు. ఈరౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ యూనియన్ గౌరవ అధ్యక్షులు బుచ్చన్న యాదవ్, ఏఐటీయూసీ యూనియన్ జిల్లా అధ్యక్షులు గందె కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య సిఐటియూ యూనియన్ జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, బిఆర్టియూ యూనియన్ అధ్యక్షులు ఆకుల మల్లేశం, ప్రధాన కార్యదర్శి బొంకురు రాములు, ఏఐటియూసి నాయకులు రేగుల కుమార్, స్వతంత్ర సంఘాల నాయకులు గామినేని సత్యం, రమేష్, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.
అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు చెల్లించండి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్టు ద్వారా లేఖను రాసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
కరీంనగర్, నేటిధాత్రి:
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యార్థుల చదువులను రోడ్డున పడేసిందని, ప్రజాపాలన అంటే విద్యార్థులు ఇంటి వద్ద, కళాశాలలకు తాళాలు ఉండడమా అని? కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలపై నిర్లక్ష్యం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలపై ఇచ్చిన మాట తప్పారని, రాష్ట్రంలో అందాల పోటీలకు ఉన్న నిధులు ఫీజు బకాయిలకు ఎందుకు లేవని? సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిల కోసం కళాశాలలు బంద్ చేసే పరిస్థితి వచ్చిందని రెండు రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారావు వెంకటేష్ హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కరీంనగర్ లోని పోస్టు ఆఫీస్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్టు ద్వారా లేఖను పంపడం జరిగింది. ఈసందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో విద్యార్థులు ఉండాల్సిన కళాశాలలు మూసిఉన్నాయి, తరగతుల్లో ఉండాల్సిన విద్యార్థులు ఇంటి వద్ద ఉండే పరిస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చాక వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇరవై మూడు నెలలు గడుస్త ఉన్న ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని, గతంలో కళాశాలల వారు బంద్ చేస్తే దసరా దీపావళి లోపు పన్నెండు వందల కోట్లు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పి కేవలం మూడు వందల కోట్లు విడుదల చేశారని, నేటి నుండి కళాశాలలు బంద్ చేస్తామని యాజమాన్యాలు ప్రకటించి పది రోజులు గడుస్తున్న ప్రభుత్వం వారితో చర్చించకుండా వారికి బకాయిలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతుందని, ప్రైవేట్ యాజమాన్యాలకు ఇవ్వాల్సిన బాకాయలు ఇవ్వమంటే ఇవ్వకుండా పెండింగ్ బకాయిలు ఇవ్వమన్నందుకు విజిలెన్స్ తనిఖీల పేరిట ప్రభుత్వం బెదిరింపులు చేయడం సిగ్గుచేటని, ఫీజు బకాయిలని విడుదల చేసిన తర్వాతనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలని, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఎనిమిది వేల కోట్ల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని, ఫీజు బకాయిల విడుదల లేక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు అప్పులు చేసి మరి ఫీజులు కట్టే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు, మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి, పక్క రాష్ట్రాల్లో పత్రిక ప్రకటనలు ఇవ్వడానికి ఉన్న నిధులు విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నేడు కళాశాలలు బంద్ చేసే పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని, కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు పూర్తిగా ఆటంకం కలుగుతుందని, కనీసం ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా ఫీజు బకాయిల విడుదలలో నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నేడు రాష్ట్రంలో ఫీజు బకాయిల విడుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటు ప్రైవేట్ కళాశాలలు సైతం ఫీజు బకాయిల విడుదల లేక కళాశాలల నిర్వహణ చేయలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయించడంలో వైఫల్యం చెందడానీ, విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా ప్రభుత్వం వెంటనే కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి బంద్ విరమింపజేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, కళాశాలల బంద్ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం వెంటనే మొత్తం ఫీజు బకాయిలు విడుదల చేయాలని లేనిపక్షంలో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నగర అధ్యక్షులు కేషబోయిన రాము యాదవ్, నగర నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, శివ, రాజు, మల్లికార్జున్, మని, వరుణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు మేరకు బందునువిజయవంతం చేద్దాం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల. కేంద్రంలో ఈరోజు మార్కండేయ భవన్లో. వివిధ రాజకీయ పార్టీల కుల సంఘాల బీసీ సంఘాల ప్రతినిధులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు రేపు జరిగే బందును అన్ని వర్గాల ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాలు బీసీ సంఘాలు కార్మిక సంఘాలు నేతలు సహకరించాలని బీసీ నేతలను కోరారు దేశంలో రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే మరి ఉన్నత వర్గాల్లో కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టులో పిటిషన్ వేసి నిలుపుదల చేశారని వారికి తగిన గుణపాఠం చెబుతామని నేతలంతా. ముక్తకంఠంతో. హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాజ్యాంగంలో ని. 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తర్వాత ఎన్నికలకు పోవాలని నాయకులను కోరారు ఈ సందర్భంగా. బీసీ సంఘాల నేతలు ఎగుర్ల కర్ణాకర్. కందుకూరి రామ గౌడ్. బి ఆర్ ఎస్. పార్టీ మండల అధ్యక్షులు రాజన్న. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. బిజెపి నాయకులు గుగ్గిల ఆంజనేయులు . ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొని ప్రసంగించారు ఇట్టి బందుకు వారి పార్టీల పక్షాన జేఏసీ. పిలుపుమేరకు బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కట్ట రవి. శాలి అధ్యక్షులు రాపల్లి ఆనందం. ఎగుర్ల ప్రశాంత్. నేరెళ్ల అనిల్. రంగు ప్రసాదు. గుర్రం తిరుపతి. గాద సత్తయ్య. వెంగళ రమేష్ పలువురు. జేఏసీ నాయకులు తదితరులు బందుకు మద్దతు ప్రకటించారు
భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రభుత్వం
వెల్ఫేర్ బోర్డు క్లైమ్ లను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పజెప్పడం మానుకోవాలి
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 12 ని సవరించాలి
బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
బిల్డింగ్ & అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారి (ALO) నజీర్ సార్ గారికి పలు డిమాండ్లతో వినతి పత్రం అందించడం జరిగినది.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు గీస బిక్షపతి , కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి గార్లు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారని నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల సంక్షేమం కొరకు చేపట్టిన అనేక ఐక్య పోరాటల ఫలితంగా 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం ఏర్పడిందని దేశవ్యాప్తంగా ఈ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలను సాధించుకున్నామని తెలిపారు వెల్ఫేర్ బోర్డులో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విధానాల వలన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వలన నిర్మాణరంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు సరియైన ఉపాధి లేకుండా పోతుందని అన్నారు.ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు నిధులను పక్కదారి పట్టించే విధంగా వెల్ఫేర్ బోర్డు స్కీం లకు సంబంధించి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పే విధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 12 వలన కార్మికులకు తీవ్రమైన నష్టం జరుగుతుందనీ ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 12 ని సవరించాలని లేకుంటే రానున్న రోజుల్లో కార్మికులందరినీ ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఈసంపేల్లి రాజెలయ్య , సావనపల్లి ప్రభాకర్ , దేవయ్య , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఐసి ఏజెంట్లహక్కులు,పాలసీదారుల సంరక్షణ ఏఓఐతోనే..
ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య
ఎల్ఐసి ఏఓఐ నర్సంపేట బ్రాంచ్ నూతన కమిటీ సమావేశం.
నర్సంపేట,నేటిధాత్రి:
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)లో జరుగుతున్న వివిధ మార్పుల నేపథ్యంలో ఏజెంట్ల హక్కులు,పాలసీదారుల సంరక్షణ ఎల్ఐసి ఏఓఐ ఆర్గనైజేషన్ తోటే సాదించుకుంటున్నామని ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య తెలిపారు.నర్సంపేట ఎల్ఐసి బ్రాంచ్ ఎల్ఐసి ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) అధ్యక్షుడు పొనుగోటి సుధాకర్ రావు అధ్యక్షతన నర్సంపేట బ్రాంచ్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగింది.ముఖ్య అతిధులుగా ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య,వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కమటం స్వామి,డివిజన్ కార్యదర్శి పడిదం కట్టస్వామి హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో పోర్టబుల్ విధానం (క్లా బ్యాక్) ను ముందుకు తెచ్చే యోచనలో ఐఆర్డిఏ ఉన్నది. దీనివలన ఏజెంట్ల ప్రయోజనాలకు తీవ్రమైన ముప్పురానున్నదని తెలియజేశారు.ఈ నేపథ్యంలో అవసరమైతే బ్రాంచీలలో నిరవధిక నిరాహార దీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో 100 శాతం ఎఫ్డీఐ బిల్లును ఆమోదం చేస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.దీంతో ఎల్ఐసి సంస్థ పై ఇతర ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం జరగనున్నదని రాంనర్సయ్య పేర్కొన్నారు.ఎల్ఐసి ఏఓఐతోనే హక్కులు సాదించుకుంటున్న నేపథ్యంలో ఎల్ఐసి ఏఓఐ సభ్యత్వం పెంచుకొని ఎల్ఐసి కార్పొరేషన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా వివిధ రకాలుగా పోరాటాలు చేసిన ఫలితంగా ఎల్ఐసి ప్రీమియంలో జీఎస్టీని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 22 న అధికారకంగా సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సుభానుద్ధిన్,కోశాధికారి రవికుమార్,డివిజన్ మాజీ కోశాధికారి, రాష్ట్ర ఈసీ మెంబర్ మొద్దు రమేష్,నర్సంపేట మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పెండ్లి రవి, క్లియా అధ్యక్షుడు రాజబోయిన చంద్రమౌళి రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్,శంకరయ్య ,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు,ఎల్ఐసి ఏఓఐ సభ్యులు పాల్గొన్నారు.
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలి లాభాలవాట 20 వేలు చెల్లించాలి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల విజ్ఞప్తి.
సమస్యల పరిష్కారానికి మంత్రుల హామీ
ఈరోజు ప్రజాభవన్ లో సింగరేణి వ్యాప్తంగా వచ్చిన వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ యొక్క వేతనాలను పెంచాలని, లాభాల వాటా 20, వేలు చెల్లించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారిని ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.
సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలనుండి వందలాదిమంది కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఉదయం ప్రజాభవన్ కు చేరుకున్నారు. కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి , గుమ్మడి నరసయ్య ప్రజాభవన్ కి వచ్చి ప్రజావాణి ఇంచార్జి మాజీ మంత్రి చిన్నారెడ్డి గారితో కలిసి కాంటాక్ట్ కార్మికుల ప్రతినిధులను తీసుకొని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి సమస్యలపై చర్చించడం జరిగింది. సింగరేణిలో కాంటాక్ట్ కార్మికులకు శ్రమతోనే లాభాలు వస్తున్నాయని అటువంటి కాంటాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు రోజుకు 1285 రూపాయలు చెల్లిస్తుంటే సింగరేణిలో కేవలం రూళ541 మాత్రమే చెల్లిస్తున్నారని ఫలితంగా ఒక్కొక్క కాంట్రాక్ట్ కార్మికుడు రోజుకు 744/- రూపాయలు నెలకు 19 344 /-రూ పాయలవు నష్టపోతున్నారని మంత్రిగారికి తెలియజేశారు. ఇతర ప్రభుత్వ , ప్రైవేట్ రంగ పరిశ్రమలైన ఎన్టిపిసి, ఓఎన్జిసి , హెచ్ పి సి ఎల్ , ఐ ఒసిఎల్ , ఏపీఎండిసి స్టీల్ ఐటిసి సిమెంటు తదితర పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల జిఒ కు అదనంగా మూడు వేల నుండి 5000 రూపాయలు చెల్లిస్తున్నారని కానీ సింగరేణిలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని, సెలవులు వైద్య సదుపాయం, ప్రమాద ఎక్స్ గ్రేసియా తదితర చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు చేయడం లేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీస వేతన జీఒల విడుదలలో కూడా జాప్యం జరుగుతున్నదని ఫలితంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు పెరగడం లేదని వారు తెలియజేశారు. ఇతర ప్రభుత్వ పరిశ్రమంలో చెల్లిస్తున్న విధంగా సింగరేణిలో కూడా జీవో కు అదనంగా వేతనాలను చెల్లించాలని దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక రూపాయి కూడా భారం పడదని వారు తెలియజేశారు. సింగరేణి సాధిస్తున్న లాభాలను కాంట్రాక్ట్ కార్మికులకు శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగానే 20 వేలు లాభాల వాటా చెల్లించాలని వారు కోరారు. గతంలో సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చినటువంటి సెలవులు ఈఎస్ఐ, క్యాటగిరి ఆధారంగా వేతనాలు తదితర సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు తెలియజేశారు.
వేతనాల పెంపుదల సమస్యల పరిష్కారానికి ఉపముఖ్యమంత్రి హామీ:
కార్మికుల వినతి పై స్పందించిన ఉపముఖ్య మంత్రి గారు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ ఉన్నదని దానికి అనుగుణంగా వారి యొక్క వేతనాలు పెంచేందుకు,లాభాల వాటా పెంచెందుకు, ఇతర అన్ని రకాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీనికొసం అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను పిలిచి యాజమాన్యం సమక్షంలో చర్చలు జరుపుతానని హామీ ఇచ్చారు.
Singareni
ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి జేఏసీ నాయకత్వం సింగరేణి సి అండ్ ఎండి ఎన్ బలరాం నాయక్ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకట స్వామి ని కలిసి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలు కనీస వేతనాలు జి.ఒల పై చర్చించడం జరిగింది.
త్వరలో జి.ఒ లు ఇస్తాం కార్మిక శాఖా మంత్రి హామి : ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ త్వరలోనే రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను పెంచుతామని. రాష్ట్ర ప్రభుత్వం పెంచాల్సిన వేతనాలను పెంచిన అనంతరం సింగరేణిలో అదనంగా చెల్లించాల్సాన వేతనాల గురించి చర్చిస్తామని. మిగతా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ అనుగుణంగా వేతనాలు అమలు చేస్తామని మిగతా సమస్యలైన ఈఎస్ఐ అమలు, పెయిడ్ హాలిడేస్ , 15 లక్షల నష్టపరిహారం కేటగిరి ఆదారంగా వేతనాలు చెల్లించడం తదితర అంశాలను త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కనీస వేతనాలు సలహా మండల చైర్మన్ ఐన్ టి యు సి నాయకులు జనక్ ప్రసాద్ కార్మికులకు మద్దతు ప్రకటించి మాట్లాడుతూ కనీస వేతనాల బోర్డులో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపామని జీవోలు వచ్చేంతవరకు ప్రభుత్వంపై జిఒశకుళ అదనంగా వేతనాలు పెట్టించేందుకు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తానని, జేఏసీ పోరాటాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, భూపాల్ టియుసిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యంలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు అండగా ఉంటామని తెలియజేశారు.
Singareni
మంత్రులు, సి & ఎండి గార్లు కాంటాక్ట్ కార్మికుల సమస్యలపై స్పందించిన హామీలు ఇచ్చినందుకు సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వారికి ధన్యవాదాలు తెలియజేశరు. ఇచ్చిన హామీలను అమలు చేయని , పక్షంలో హామీల అమలు కోసం భవిష్యత్ పోరాటాలకు కార్మికుల సిద్ధంగా ఉండాలని సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమానికి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బి మధు , యాకూబ్ షా వలి ,కరుణాకర్ ,యాకయ్య , బాబు ,మల్లెల రామనాథం ,రామ్ సింగ్, భూక్యా రమేష్ , వేల్పుల కుమారస్వామి, అరవింద్, మహేందర్, ఒదేలు, రాజశేఖర్ , అరవింద్ , స్వామి , క్రాంతి, శరత్, రఘు, సాజిద్, అనిల్ , విజయ్, మధుసూదన్ రెడ్డి , సమ్మన్న , తిరుపతమ్మ , లక్ష్మి సారయ్య, సక్రం , రాజేష్, క్రాంతి, రాజేందర్ , రవి , రమేష్, నాగేశ్వరరావు, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు.
అభినందనలతో.
సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యారంగ సంవత్సరం వెంటనే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అదునపు కలెక్టర్ అశోక్ కుమార్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలల,కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను వెంటనే అధికారులు గుర్తించి కొత్త భవనాలు నిర్మించాలని , కొత్త పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. యూనివర్సిటీ పీజీ కళాశాల కోసం సొంత భవనాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. సొంత భవనం అయ్యేలోపు పీజీ కళాశాలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు గదులను ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రివర్స్ విడుదల చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు దోపిడి అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని జోసెఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు దొంతరబోయిన అజయ్, మేడి శేఖర్, ఎండి హమీద్, శేఖర్, విష్ణు పవన్ తదితరులు పాల్గొన్నారు
కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
కామెర గట్టయ్య తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ నల్ల చట్టాలకు ఆజ్యం పోస్తున్న గుర్తింపు ప్రాతినిత్య కార్మిక సంఘాలు. సింగరేణిలో కోడ్ ఆఫ్ డిస్ప్లేన్ . అమలు చేస్తూ కార్మికులు కార్మిక సంఘాలు మాట్లాడకుండా హక్కుల గురించి ప్రశ్నించకుండా మాట్లాడే స్వేచ్ఛను కాల రాస్తున్న కార్మికులకు వాక్ స్వాతంత్రం లేకుండా చేసే కుట్రను కార్మిక వర్గం కార్మిక సంఘాలు ఒక తాటిపై నడిచి తిప్పి కొట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్మికులకు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తుంది సింగరేణి యాజమాన్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒకటిగా నిలబడి కార్మికుల శ్రమపై ఆధారపడిన యాజమాన్యం కార్మికుల వాక్కు స్వాతంత్రాన్ని విస్మరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వంత పాడుతున్న సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం కార్మికులను మోసం చేస్తూ పబ్బం గడుపు కుఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్సీల పేరుతో కోట్లది రూపాయలు కడుతున్న కూడా కనికరించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను కార్మికుల నుండి దూరం చేయుటకు సింగరేణి యాజమాన్యం కూడా డిస్ప్లే న్ పేరుతో కార్మిక సంఘం నాయకులు బ్యాలెట్ తో కార్మిక వర్గం దగ్గరికి తమ అభిప్రాయాలను తెలుపాలని వచ్చిన కార్మిక సంఘం నాయకులను గేటు దాటవద్దని హుకుం జారీ చేయడాని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం యాజమాన్యం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది సింగరేణిలో 1998.ఎన్నికల తర్వాత ఒకే సంఘం పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసిన గుర్తింపు సంఘం. ఏఐటీయూసీ మళ్లీ పాత పద్ధతిని 2025 లో అదే నల్ల చట్టాలు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయుటకు కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలనే పోరాటాన్ని నిర్వీర్యం చేయుటకే కానీ కార్మిక హక్కుల్ని కాపాడుకొనుటకు కాదు అనేదాన్ని సింగరేణి కార్మిక వర్గం గ్రహించి గుర్తింపు కార్మిక సంఘం నాయకులను కార్మికులు నిలదీయాలని కోరుతుంది సింగరేణి కార్మికులను పకృతికి విరుద్ధంగా పనిచేసే కార్మికులు బార్డర్ సైనికులతో పోల్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బార్డర్ సైనికునికి ఇచ్చిన గుర్తింపులో సగభాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వడం లేదు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వానికి కూడా టాక్సీల రూపంలో కార్మికులు పన్నులు కడుతూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వాళ్ళ సంక్షేమానికి ఏమీ జవాబుగా నిలిచిందో కార్మిక వర్గం గ్రహించాలి అని కోరుతున్నామని బార్డర్ లో సైనికుని 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సైనికునికి హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలలో రెండు గుంటల జాగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటలు మార్చి దేశానికి వెన్నెముకగా నిలబడితే కార్మికునికి రక్త మాంసాలు ధారపోసి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకొస్తున్న కార్మికులకు నివసించుటకు రెండు గుంటల జాగా అడిగితే కార్మికుడు ఉత్పత్తిలో భాగమే తప్ప సొంత ఆస్తి లేదు సొంత ఆస్తిని ఇవ్వము అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యం వాటికి కొమ్ముకాస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలను కార్మిక వర్గం నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కోరుతుంది దేశంలో ఉత్పత్తి లో భాగమైన విద్యుత్ పరికరంగా మారిన కార్మికుని 40 సంవత్సరాల నుండి తీసుకున్న టాక్సీ లా రూపంలో తీసుకున్న రూపాయలను లెక్కలోకి తీసుకుంటే కార్మికుడు అడిగే రెండు గుంటల జాగా కు సరిపడే రూపాయలు కష్టతరమైన పని కాదని కూడా ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. బే షరతుగా కార్మికులకు రెండు గుంటల జాగా పట్టణ ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పుటకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఈసందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటిపై నిలబడి కార్మిక హక్కులను కాపాడుటకు దోహదపడే విధంగా కార్మిక సంఘాల ఎజెండా ఉండాలని ప్రశ్నించే సంఘాలను అన్ని కూడా ఒక వేదికగా ఏర్పడి కార్మిక హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఒప్పించి సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయుటకు దోహదపడాలని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరింపబడడాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడారు ఈ సమావేశంలో టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు దాసరి జనార్ధన్ కాసర్ల ప్రసాద్ రెడ్డి నామాల శ్రీనివాస్ జయశంకర్ సాజిత్ సలీం నరసింహారెడ్డి యుగంధర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మండల లోని నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి365 పై మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి నది జలాలను ఆంధ్రకు తరలించే కుట్రలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని. కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కలసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నది జలాలను ఆంద్రాకు తన రాజకీయ గురువుకు గురుదక్షిణగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించే తీరు ప్రజలందరికీ అర్థమవుతుందని ఎద్దేవ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకనే సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసి వేయడమేనని అర్థమవుతుంది. నిన్నటి వరకు సిబిఐ పై అనేక ఆరోపణలు చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా మాట ఎందుకు మార్చాడో ప్రజలకు వివరించాలన్నారు. దీని వెనకాల ఉన్న శక్తులు వారి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేసే బాధ్యత రేవంత్ రెడ్డి కి లేదా ఇది కచ్చితంగా కాంగ్రెస్ బిజెపి ఆడుతున్న నాటకం ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడిన బి ఆర్ఎస్ పార్టీ భయపడేది లేదని రాష్ట్ర సాధనలో అనేకసార్లు ప్రజా ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసులను భరించి జైల్లో మగ్గి రాష్ట్రాన్ని సాధించే దిశగా ఉద్యమించిన ఏకైక పార్టీ బి ఆర్ఎస్ పార్టీ . రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగాచారి, నాయకులు గందే శ్రీనివాస్ గుప్తా, నాన బోయిన రాజారాం యాదవ్, మామిండ్ల చిన్న మోహన్ రెడ్డి, పాండవుల రాంబాబు, ఖ్యాతంశ్రీనివాస్, ఊరటి అమరేందర్ రెడ్డి, గుమ్మడి వేణు, మేడిపల్లి రాజు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పట్టణానికి విచ్చేసిన ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్, సిపిఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా గారిని సిపిఐ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సయ్యద్ జిల్లాలుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ, “దేశంలోని కార్మికులకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన చట్టాలను రద్దు చేయడం పూర్తిగా దారుణం” అని అభిప్రాయపడ్డారు. కార్మిక హక్కులను హరించే విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి అజిజ్ పాషా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కార్మిక, రైతు, చిన్న మధ్య తరగతి ప్రజలకు చేటు చేస్తాయని విమర్శించారు. “ప్రజా సమస్యలపై పోరాడటమే సిపిఐ లక్ష్యం” అని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొని జాతీయ నాయకుల అభిప్రాయాలను స్వాగతించారు.
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు
ఎలుకటి రాజయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా విషయంలో మళ్ళీ పాత రోజులు వచ్చాయని, యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి వచ్చిందని, చెప్పులు, ఆధార్ కార్డ్స్ వరుసలో పెట్టి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఉదయం నుండి రాత్రి వరకు ఉన్నా యూరియా దొరుకుతుందో లేదో అనే భయం రైతుల్లో ఉందని,రాష్ట్ర మంతా యూరియా కోసం రైతులు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని,సకాలంలో యూరియా దొరకక వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ శివారు ఉట్టి తండా కు చెందిన రైతు భూక్య బాలు అనే రైతు పత్తి పంటను తీసివేయడం ప్రభుత్వం వైఫల్యనికి నిదర్శనం అన్నారు.గత ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అలోచించి తగినంత యూరియా సరఫరా చేసిందని, కాని ప్రస్తుత ప్రభుత్వం రైతుల గురించి ఏరోజూ ఆలోచన చేయడం లేదని, 2 లక్షల ఋణమాఫీ అని కొంతమందికి మాత్రమే చేసి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగినంత యూరియా సరఫరా చేయాలని, రైతులు అందరికి ఋణ మాఫీ చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేణుకుంట్ల రాము మాదిగ నాయకులు బొజ్జపెల్లి ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు..
ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష???
జహీరాబాద్ నేటి ధాత్రి:
జిల్లా ఇంచార్జి మంత్రి దళితుడే.. ఆరోగ్య శాఖ మరియు జిల్లా మంత్రి మంత్రిదళితడే, నియోజకవర్గం శాసనసభ్యులు దళితుడే కానీ దళితలంటే ఈ అధికారులకు గిట్టదు..
ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష జిల్లా డీ పీ ఓ, మరియు డివిజనల్ పంచాయతీ అధికారి తీరు ఇలా ఉన్నందున తక్షణమే ఈ అధికారుల పైన చర్యలు తీసుకొనేలా చేయాలనీ జహీరాబాద్ నియోజకవర్గం
శాసనసభ్యులకు మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ చెంద్రశేఖర్ లకు దళిత సంఘాల విజ్ఞప్తి చేస్తున్నవి.నెలరోజులు గడవక ముందే సస్పెండ్ అయినా తుంకుంట పంచాయతీ కార్యదర్శి కి వెంటనే పోస్టింగ్ ఇవ్వడం ఎస్. సి కార్యదర్శి లు సస్పెండ్ అయి ఆరు నెలలు గడిచిన నేటికీ పోస్టింగ్ లు ఇవ్వకపోవడం పైన దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుల పైన వివక్ష చూపడం జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారికి తగదని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నారు. అన్ని డివిజనల్ కార్యాలయాలు నియోజకవర్గం లో ఉన్నపుడు డీ ఎల్ పీ ఓ కు ఎందుకు కార్యాలయం ఉండదని కోరుతున్నారు.బి సి లకు ఒక న్యాయం ఎస్ సి లకు ఒక న్యాయమా అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా డీ పీ ఓ మరియు డీ ఎల్ పీ ఓ తీరు మార్చుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తప్పదని
హెచ్చరించారు.ప్పాంపాడ్, రాయికోడ్, ఖర్చల్, ఇందూర్, హస్నాబాద్,ఉల్గేరా, రాయి పల్లి, కుస్ నూర్, రాఘవాపుర్, చాల్కి,డప్పుర్, రత్నపూర్, చిక్కుర్తి, రత్నపూర్, ఉసెల్లి, మొగుడం పల్లి, పార్వతపూర్, దనసిరి, సత్వర్, సరిహద్దు తండాలు, సజ్జపూర్, బిళ్ల్పూర్, గోటిగార్పల్లి, శేఖపూర్, జిర్లపల్లి, ఏడాకులపల్లి, గుంతమర్పల్లి, ఝరాసంగం,కంబాలపల్లి, సిద్ధపూర్, గణేశపూర్ బీదర్ సరిహద్దు గ్రామాలు ఎన్నో తీరుగాల్సిన డీ ఎల్ పీ ఓ కేవలం హైవే పైన ఉన్న గ్రామాలు మాత్రమే తిరుగుతు కార్ ట్యాంక్ ఫుల్, బ్యాగ్ ఫుల్ చేసుకొంటూ కార్యదర్శి ల జెబులు నిల్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. డ్రైవర్ కి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేస్తూ మరి ముఖ్యంగా దళిత కార్యదర్శి లపైన టార్గెట్ చేస్తున్నారనీ అందరు కార్యదర్శి లు ఆందోళన చెండుతున్నారు. ఇలాంటి అధికారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి దళిత సంఘాలు కోరుతున్నాయి. నియోజకవర్గం శాసనసభ్యులు మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ మంత్రి డాక్టర్ చెంద్రశేఖర్ చోరువ తీసుకొని ఆ అధికారి తీరు మారేటట్టు చూడాలని దళిత సంఘాలు కోరుకొంటున్నారు.
ప్రజల ఆస్తులను ద్వసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గత 20 ఏండ్ల నుండి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో “మా ఊరి సంత” పేరుతో నిర్మించిన కూరగాయల రేకుల షేడ్లు, మూత్రశాలలను గురువారం జేసీబీ సాయంతో కూల్చివేసే క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడిన విషయం విధితమే. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గణపురం మండల కేంద్రానికి చేరుకొని కూల్చివేతలు చేపట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగడి నిర్వహించుకునే ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు, అలాగే వారాంతపు సంతలో కూరగాయలు అమ్ముకునే వారికి సౌకర్యవంతంగా ఉండేలా షెడ్లు గత ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే, ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎటువంటి ముందస్తు నోటీసులు,పర్మిషన్ లేకుండా కూల్చివేతలు చేపట్టడం సరైన పద్ధతి కాదని,ప్రజల ఆస్తిని కూల్చివేసిన వారి పై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్, ఐలోని రామచంద్ర రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి,గంజి జనయ, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి,మామిండ్ల సాంబయ్య,రాజిరెడ్డి,మల్లారెడ్డి,జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటుగౌడ్ ,వాజిద్ ,సింహాచలం ,కొమురయ్య,శ్రీనివాస్,యాకయ్య,రఘు,తదితరులు ఉన్నారు
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకరించి ప్రజలపై భారాలు మోపేందుకే నూతన కేంద్ర విద్యుత్ చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రజా వ్యతిరేక నూతన కేంద్ర విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని స్థానిక ఓంకార్ భవన్ లో విద్యుత్ పోరాట అమరవీరులు రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ ల 25వ వర్ధంతి కార్యక్రమాన్ని డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పెద్దారపు రమేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్తురంగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చి నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లు ప్రవేశపెట్టిందని ఈ క్రమంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.తమ ఇష్టానుసారంగా కరెంటు చార్జీలను పెంచేందుకు పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి కనీస చలనం కలగకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలకు లోబడి డిస్కాం లుగా విడగొట్టి ప్రైవేటీకరించేందుకు పూనుకుంటే వామపక్ష పార్టీలు ప్రజలు పెద్ద ఎత్తున పోరాడినారని ఈ క్రమంలో చలో అసెంబ్లీకి పిలుపునిస్తే లక్షలాదిమంది పోరాటంలో పాల్గొన్నారని అప్పటి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి లాఠీలను తూటాలను తుపాకులను ఉపయోగించి రామకృష్ణ విష్ణువర్ధన్ బాలస్వామి ప్రాణాలను బలి కొన్నారని వందలాది మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.ఆ విద్యుత్ పోరాట ఫలితంగా అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైందని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు విద్యుత్ చార్జీల జోలికి రాలేదని అదే గుణపాఠం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పదని ఇప్పటికైనా కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు, వంగల రాధసుద,జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, డివిజన్ నాయకులు కర్నే సాంబయ్య, భైరబోయిన నరసయ్య, గడ్డం స్వరూప, గుర్రం రవి,గణిపాక బిందు, కందికొండ సాంబయ్య,అజయ్,విజయ, లక్ష్మి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతతో గురువారం రోజున ఆర్ అండ్ బీ అతిథి గృహం ముందు రైతులు ధర్నా నిర్వహించారు,మరిపెడ మండల నికి 45 నుండి 50 గ్రామపంచాయతీలు అనుసంధానం గా ఉండడంతో ప్రతి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులకు ఒక్కసారిగా యూరియా అవసరము పడడంతో యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, వర్షాకాలం కావడం తో రవాణా సదుపాయం చురుగ్గా లేకపోవడం సమయానికి యూరియా అందుబాటు కాలేకపోవడంతో యూరియా కొరత ఏర్పడింది. దూర ప్రాంతం నుండి వచ్చిన రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా షాపుల ముందు లైన్లో నిలబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు రైతులు వాపోయారు. పైమందులు తీసుకుంటేనే యూరియా బస్తా ఇస్తామని షాపు యజమానులు ఇబ్బందులు పడుతున్నారన్నారు,గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు యూరియా సరిపడా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు ఒక రైతుకు రెండు బస్తాలనే ఇస్తున్నారని ఇచ్చిన యూరియా బస్తాలు వ్యవసాయానికి సరిపోక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదని సదరు రైతులు వాపోయారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని యూరియా కొరతను తీర్చి ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన అధికారులని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా నేటికీ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని హామీల అమలుకై పంచాయతీ కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధమవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం గుమ్మడవెల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వేతనాలు క్రమం తప్పకుండా బ్యాంకు ద్వారా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు వారికి పిఆర్సి అమలు చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ ,రిటైర్మెంట్ బెనిఫిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా గుమ్మడవెల్లి కృష్ణ, అధ్యక్షులుగా గాంధర్ల ధనంజయ్, ప్రధాన కార్యదర్శిగా చర్ప సాంబశివరావు ట్రెజరర్ గా ఉప్పలి సాంబశివరావు లతోపాటు పదిమంది ని కమిటీ సభ్యులుగా కంగాల సురేష్, వడ్లకొండ శ్రీను, కొమరం ప్రశాంత్, మెంతిని శంకర్, కల్లూరి రమేష్ నిట్టా ప్రసంగిలను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కొమరం కాంతారావు పాల్గొన్నారు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య..
నర్సంపేట,నేటిధాత్రి:
స్థానిక సమస్యలపై సర్వేలు చేసి సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య అన్నారు.నర్సంపేట పట్టణంలో సీపీఎం జిల్లా స్థాయి గ్రామీణ ప్రాంత వర్క్ షాప్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.నాగయ్య మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని మంచినీరు,రోడ్ల ధ్వంసం,డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు,కుక్కల,కోతుల బెడద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీల అమలు నెరవేర్చలేదని ఆరోపించారు.అందుకు జిల్లావ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, నమిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య మండల నాయకులు అక్కపెల్లి సుధాకర్, పుచ్చకాయల నర్సింహ రెడ్డి, ఎస్కె అన్వర్, పెండ్యాల సారయ్య, కందికొండ రాజు, కొంగర నర్సింహ స్వామి, కలకోట అనిల్, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ ఉదయగిరి నాగమణి బిట్ర స్వప్న గణిపాక విలియం కెరీ, జన్ను రమేశ్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆఫీసు కల్వకుర్తిలో ప్రెస్ మీట్ నిర్వహించారు ముందుగా కార్యక్రమంలో మొగలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…ఈనెల ఆరో తారీఖున కల్వకుర్తి పట్టణంలో జరిగిన బిజెపి ధర్నా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ మాజీ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హామీని ప్రజల సాక్షిగా నిలదీయడంతో రాబోయే స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని భయాందోళనలకు గురై కంగుతిన్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ కుమార్ 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండాతో పని చేస్తున్న,ఉద్యమనేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పోరాటాల సూర్యుడు, తల్లోజు ఆచారిని ఆరుసార్లు ఓడిపోయావని బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేసి లోన్లు తేలేదని కించపరుస్తూ తిట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం…ఆచారి ఆరుసార్లు ఓడిపోయాడని అంటున్న నువ్వు ఒక్కసారి వెనుక తిరిగి నీ వీపు నువ్వు చూసుకో… మొదటిసారి కాటన్ మిల్ ఎలక్షన్లలో చిత్తరంజన్ దాసు గారి కాళ్లు పట్టుకొని గెలిచావు గుర్తులేదా…?ఇప్పటికీ 9 సార్లు ఓడిపోయిన నువ్వు నీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో… కౌన్సిలర్ గా ఓటమి… ఎంపీటీసీ గా ఓటమి… సర్పంచ్ గా ఓటమి… కాటన్ మిల్లు ఓటమి… 100 నుంచి 1000 ఓట్ల ఎలక్షన్లలో ఓడిపోయిన నువ్వు ఆచారి గారిని అనే అంత గొప్పోడివా…? మొదటి ఎలక్షన్లలో 8500 ఓట్లు రెండవ ఎలక్షన్లలో 52 వేల ఓట్లు మూడవ ఎలక్షన్లలో 29 వేల ఓట్లు నాల్గవ ఎలక్షన్లలో 42 వేల ఓట్లు ఐదవ ఎలక్షన్లలో 60 వేల ఓట్లు ఆరోసారి ఎలక్షన్లలో 70 వేల ఓట్లు కల్వకుర్తి ప్రజల చేత మన్నన పొంది కల్వకుర్తి ప్రజల ప్రేమాభిమానాలు ఆస్తులుగా సంపాదించిన తల్లోజు ఆచారీని కించపరుస్తావా…?బిజెపి నుండి కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ నుండి టిడిపిలోకి టిడిపి నుండి స్వతంత్ర అభ్యర్థి వైపు అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ వైపు ఇప్పుడు టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వైపు ఇప్పుడు చెప్పండి ఇంకా ఏ పార్టీ మిగిలింది మీకు..?6సార్లు పార్టీలు మారిన నీచరిత్రను తిరిగేస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది కాదా…? నునుగు మీసాల వయసు నుంచి 45 ఏళ్లుగా ఒకే పార్టీ ఒకే జెండా ఒకే అజెండా ఒకే పార్టీలో పనిచేస్తూ ఎన్ని గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా కలలో కూడా పార్టీ మారే ఆలోచన చేయకుండా నిరంతరం కల్వకుర్తి ప్రజల గురించి తప్పా తన వ్యక్తిగత జీవితం కూడా మరచి కల్వకుర్తి ప్రజల కోసం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు తల్లోజు ఆచారిని అవమానిస్తావా…? తల్లోజు ఆచారి బీసీ కమిషన్ ద్వారా ఏం న్యాయం చేశాడని ప్రశ్నించిన ఆనంద్ కుమార్ అసలు బీసీ కమిషన్ అంటే ఏంటో తెలుసా…? ఒక ఉన్నత విద్యావంతుడిని అని చెప్పుకుంటావు కదా..? బీసీ కమిషన్ కు నిధులు ఉండవన్న సంగతి నీకు తెలియదా…? బీసీ కమిషన్ అనేది కేవలం బీసీలకు న్యాయం చేయడానికి మాత్రమే ఏర్పడ్డ ఒక రాజ్యాంగ వ్యవస్థాని నీకు తెలియదా…? ఆచారి గారు బీసీ కమిషన్ మెంబర్ అయిన తర్వాతనే ఈ దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, లా యూనివర్సిటీలో, ఎంబీబీఎస్ సీట్ల విషయంలో బీసీలకు 27% రిజర్వేషన్లు, అమలుపరిచారన్న సంగతి నీకు తెలియదా…? బీసీ కమిషన్ ద్వారా దక్షిణ భారతదేశంలో ఎంతోమంది బీసీ ఉద్యోగులకు బీసీ ప్రజలకు న్యాయం చేశాడన్న సంగతి మరిచిపోయావా…?మాట్లాడితే బీసీ బిడ్డ అని చెప్పుకుంటావు కదా కల్వకుర్తి పట్టణంలో గత 30 ఏళ్ళ నీ రాజకీయ చరిత్రలో ఏ ఒక్కరికి న్యాయం చేసావో..?ఏ ఒక్క బీసీని ఉద్ధరించావో చూపిస్తావా…? ఒక్క బీసీ నైనా రాజకీయ నాయకుడిగా ఎదగనిచ్చావా…?ఖబర్దార్ ఆనంద్ కుమార్ నీ తప్పు తెలుసుకుని తల్లోజు ఆచారి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను…. అన్నారు. తదనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..పదవుల కోసం పార్టీలు మారే మీరు అలుపెరుగని పోరాటయోధులైన తల్లోజు ఆచారి గారి గురించి మాట్లాడడం హాస్యాస్పదం…మొన్న ఆరో తారీకు జరిగిన ర్యాలీలో 100 మంది పాల్గొన్నారు.అనడం నీఅవివేకం ర్యాలీలో పాల్గొన్న వందలాది మంది అర్హులైన లబ్ధిదారులను కించపరచడం మీఅహంకారానికి నిదర్శనం…మీకాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ 2000 పెంచను 4000 చేస్తాం అనలేదా…?వికలాంగుల పింఛన్ 4000 రూపాయలను 6000 రూ” చేస్తాం అనలేదా..? ప్రతి మహిళకు నెల నెల 2500/-రూ ” ఇస్తాం అనలేదా..? ఆడపిల్ల పెళ్ళికి లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తాం అనలేదా..? ప్రతి రైతుకు రెండులక్షల రూ రుణమాఫీ హామీ మీరు ఇచ్చింది కాదా..?ఎకరాకు ప్రతి సంవత్సరం 15000/- రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వలేదా…?మీరు ఇచ్చిన 6గ్యారంటీల దొంగ హామీల మీద మాట్లాడితే ఆచారిని తిడతారా..? ఈ ప్రాంతంలో ఆచారి గారి ప్రజా ఉద్యమాలు గుర్తులేదా..?KLI.. కోసం ఆమనగల్ నుంచి కల్వకుర్తి మీదుగా ఎడ్లబండ్లతో పాలమూరు కలెక్టర్ ముట్టడి మరిచినావా…KLI.. పూర్తి కోసం సీఎం ఇల్లు ముట్టడి కోసం రైతులతో చలో హైదరాబాద్ పేరుతో ప్రభుత్వంతో చేసిన యుద్ధం గుర్తులేదా..?రైతులకు 9 గంటల నిరంతర విద్యుత్తు కోసం 4రోజుల దీక్ష గుర్తులేదా…? RDO.. కార్యాలయం కోసం ఏడు రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి సాధించింది మరిచిపోయావా..?కొట్ర నుండి కల్వకుర్తి మీదుగా తిరుపతి వరకు 1000 కోట్ల రోడ్డును మోడీ గారితో మాట్లాడి పట్టుబట్టి తీసుకొచ్చింది మర్చిపోయావా..?ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ జడ్చర్లకు తరలిస్తే అప్పటి ప్రభుత్వంతో యుద్ధం చేసి కల్వకుర్తికి తెచ్చింది గుర్తులేదా..? కల్వకుర్తి ప్రాంతంలో ఏది సాధించాలన్న ఉద్యమాలకు ఊపిరి పోసి తన ప్రాణాలను అడ్డుపెట్టి మరి సాధించే ఏకైక నాయకుడు తల్లోజు ఆచారి అని తెలుసు కదా..?కల్వకుర్తిలో 20 సీట్లు గెలుస్తామని గొప్పలు మాట్లాడిన నీవు గత ఎన్నికల్లో కౌన్సిలర్ ఎందుకు ఓడినావు..?కల్వకుర్తి పట్టణంలో గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ సాధించిన బిజెపి పార్టీ ఎదుగుదలను భరించలేకనే కుట్రతో మాట్లాడుతున్నావని మాకు అర్థమవుతుంది…2014-2016-2023 ఆచారికి కల్వకుర్తి పట్టణం లీడు వచ్చింది నిజం కాదా…? నిజాలని గుర్తుంచుకొని మాట్లాడితే మీకే మంచిది ప్రశాంతమైన కల్వకుర్తిలో ఉద్దేశ పూర్వకంగా చిచ్చులు పెట్టాలని చూసే మీ కుటిల రాజకీయం ఇకపై చెల్లదు మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తల్లోజు ఆచారి కి క్షమాపణ చెప్పాలనిడిమాండ్ చేసారు…ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ సీనియర్ నాయకులు, సూర్య కృష్ణ గౌడ్,నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నరేడ్ల శేఖర్ రెడ్డి, బోడ నరసింహ, పాలకూర్ల రవి గౌడ్, సురేందర్ గౌడ్, గుండోజు గంగాధర్, నాప శివ,కొల్లూరు శ్రీధర్,తగుళ్ల వెంకటేష్ యాదవ్, లక్ష్మీ నరసింహ, సాయి,తోడేటి అరవింద్ రెడ్డి, వాకిటి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట చెడ్డీపై బాధితుడి నిరసన.
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు రికార్డులో పేరు ఎక్కించి పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం(Abdullapurmet Tehsildar Office) ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేటకు చెందిన శంకర్రెడ్డి 2000లో అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టిఅన్నారంలోని సర్వే నంబర్ 109,110లో 6 ఎకరాలను 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. అనంతరం 2002లో సదరు భూమిని కొనుగోలు చేసేందుకు పట్టాదారుల వద్ద అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య భూ వివాధం తలెత్తడంతో ఇరువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ద్వారా ఫీజు చెల్లించి 2016లో శంకర్రెడ్డి 6 ఎకరాలను రిజిస్ర్టేషన్ చేసుకున్నాడు.
దీంతో శంకర్రెడ్డి పేరుపై రెండు ఎకరాల భూమి రికార్డులో నమోదు అయి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. మిగతా నాలుగు ఎకరాలకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉన్నది. అయితే అప్పటి నుంచి నాలుగు ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాసుబుక్ల కోసం శంకర్రెడ్డి కుమారుడు గంగిరెడ్డి గిరిధర్రెడ్డి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.కాగా 2022లో ఆమోద డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం శంకర్రెడ్డికి చెందిన 6ఎకరాల భూమిని తప్పుడు పత్రాలు సమర్పించి రికార్డులో శంకర్రెడ్డి పేరును తొలగించి ఆమోద డెవలపర్స్పై పేరును నమోదు చేయించి పట్టాదారు పాస్బుక్లను పొందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శంకర్రెడ్డి కుమారుడు గిరిధర్రెడ్డి తమకు ఎలాంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండా రికార్డుల నుంచి తమ పేర్లు ఎలా తొలగిస్తారని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
సదరు భూమిపై స్టేట్సకో ఉండగా రికార్డులో మార్పులు ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్, తహసీల్దార్ డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా రికార్డు మార్పులు చేశారని గిరిధర్రెడ్డి ఆరోపించారు. మూడు ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరగడం లేదని శుక్రవారం గిరిధర్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు విప్పి చెడ్డీపై కూర్చుని నిరసనకు దిగారు. కోర్టు ఆదేశాల మేరకు 6 ఎకరాలకు వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గిరిధర్రెడ్డిని పోలీ్సస్టేషన్కు తరలించారు.ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నది: తహసీల్దార్తట్టిఅన్నారంలోని సర్వే నంబర్ 109,110లోని భూమి కోర్టు పరిధిలో ఉన్నది. ప్రస్తుతం దానిపై స్టేటస్ కోఆర్డర్ ఉన్నది. కేసు కోర్టు పరిధిలో ఉండగా రికార్డులో పేరు మార్చి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని గిరిధర్రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని గత నెల 21న గిరిధర్రెడ్డికి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్ సుదర్శన్రెడ్డి తెలిపారు.
లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి
ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
లేబర్ కోడ్స్ రద్దు,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ,ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్స్ విధానాన్ని అమలు చేయాలని కనీస పెన్షన్ Rs/- 9000 ఇవ్వాలని, స్కీం వర్కర్లు ను కార్మికులుగా గుర్తిస్తూ కనీస వేతనం అమలు చేయాలని హమాలి,బీడీ,భవన నిర్మాణం, ఆటో అండ్ మోటార్,తదితర రంగంలో పనిచేస్తున్న సంఘటిత కార్మికులకు సామాజిక బాధ్యత కల్పించాలని ఈ.ఎస్.ఐ,ఈ.పి.ఎఫ్, ఇన్సూరెన్స్,సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్లపై మే 20 న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు కార్మిక వర్గనికి పిలుపునిస్తుంది.
అలాగే మే 20న జరగవలసిన సమ్మెను దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సార్వత్రిక సమ్మెను వాయిదా వేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని,కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
కానీ సరిహద్దుల్లో కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించిన నేపథ్యంలో దేశంలో సాధారణ పరిస్థితిలో నెలకొన్న స్థితిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వాయిదా వేయటం సరికాదని ఐ ఎఫ్ టి యు భావిస్తుంది.
ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే కేంద్ర కార్మిక సంఘాలు మే 9న ఢిల్లీలో సమావేశమైన సందర్భంలోనే నాటి నిర్దిష్ట పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటే కార్మికులకు వాయిదా వేయాల్సిన విషయాన్ని అర్థం చేయించడానికి అవకాశం ఉండేది.దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగి కార్మికులు సమ్మెకు సన్నద్ధమై ఉన్న తరుణంలో అకస్మత్తుగా సమ్మెను వాయిదా వేయడం వలన కార్మికులను నిరాశ నిస్పృహ గురి చేసుకున్నది.
ఈ నిర్ణయం కార్మిక వర్గంలో కార్మిక సంఘాల పట్ల విశ్వాసం సన్నగిల్లడం కోసం దోహదపడుతుంది.
భవిష్యత్తు కాలంలో కార్మిక వర్గం సమ్మెలకు దూరంగా ఉండే ప్రమాదం ఉంటుంది.కేంద్రం మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడిని మరింత ముమ్మరంగా చేయడానికి అవకాశం ఇప్పటికే టోకెన్ సమ్మెలు, ఒక్కరోజు సమ్మె వలన కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై తాగిన ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం లేకుండా పోతున్న తరుణంలో కార్మిక వర్గంలో క్రమంగా మిలిటేన్సిని పెంచుతూ నిరవధిక సమ్మెల వైపు కార్మిక వర్గాన్ని సన్నద్ధం కర్తవ్యాన్ని కలిగి ఉండి కార్మిక సంఘాలు ముందుకు పోవాల్సిన తరుణంలో ఈ తరహా సమ్మేలను కూడా నిర్మాణాత్మకంగా నడపకపోతే కార్మికుల నుండి కార్మిక సంఘాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.సమ్మె వాయిదా పట్ల ఐ ఎఫ్ టి యు కు భిన్నభిప్రాయం ఉన్నప్పటికీ ఐక్య కార్యక్రమం పట్ల ఉన్న గౌరవం ఐక్య ఉద్యమాలకు ఉన్న ప్రాధాన్యత దృశ్య ఐక్య కార్యచరణలో నిర్దేశించుకున్న పద్ధతులకు కట్టుబడి ఉండే సంస్థగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ ఉమ్మడి పిలుపులో మా సంస్థ కూడా భాగస్వామిగా ఉన్నందున మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేస్తూ చేసిన నిర్ణయానికి కట్టుబడి మే 20 న జరగాల్సిన,నిరసన ప్రదర్శన కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్ని జిల్లాల్లో మా సంస్థ అన్ని జిల్లాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ రాష్ట్రంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐ ఎఫ్ టి యు కార్మికులను విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.