బ్రెయిన్ ట్యూమర్ బాధితురాలికి ఎల్ఓసి అందజేత.

బ్రెయిన్ ట్యూమర్ బాధితురాలికి ఎల్ఓసి అందజేత…

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగడి ఏరియాలో గల ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎనగందుల స్వాతి అనే పేద మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా బాధపడుతూ తగిన చికిత్స అందుకోలేని పరిస్థితిలో ఉన్న సమాచారం చెన్నూరు శాసన సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి కి తెలియడంతో వెంటనే స్పందించి, ఆమె చికిత్స కోసం అవసరమైన ఎల్ఓసి ని మంజూరు చేశారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు బుదవారం బాధిత మహిళకు ఆమె నివాసంలో ఎల్ఓసి ని కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడారు.పేద ప్రజల పట్ల ఎమ్మెల్యే వివేక్ కు ఉన్న ప్రేమ వెలకట్టలేనిదని అన్నారు.స్వాతి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వివేక్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ, తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి ప్రయాణమయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మొట్టె సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గుర్రం అనిల్ కుమార్, యువజన నాయకులు కునారపు శివకుమార్ , ఊటూరి చంద్రయ్య, యాదగిరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

75 వేల రూపాయలు ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారాం మండలంలోనీ ఓడేడు గ్రామానికి చెందిన కట్కూరి సుజాత నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే స్పందించి సి ఎమ్ ఆర్ ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వీరికి డెబ్బది ఐదు వేల ఎల్ ఓ సి మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది
డెబ్బది ఐదు వేల రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

ఎల్వోసి అందజేసిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.

దేవరకద్ర /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన డి. వంశీకుమార్ వైద్యం నిమిత్తం హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి సీఎం సహాయ నిధి ద్వారా.. రూ.2 లక్షల ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు అయ్యే ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందాలన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version