ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం..

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

 

తంగళ్ళపల్లి మండలం గోపాలరావు.పల్లి గ్రామంలో. ప్రభుత్వం. ప్రత్యష్టకముగా. ప్రవేశపెట్టిన. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఈరోజు .గోపాలరావు.పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేయడం జరిగిందని అందులో భాగంగా గోపాలరావుపల్లి గ్రామంలోని కొండవీటి .లావణ్య .అనిల్. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని అందులో ఈరోజు లబ్ధిదారులు గృహప్రవేశం చేయడం జరిగిందని. ఎందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ మా చిరకాల స్వప్నం సొంత ఇంటి కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తూ మాకు ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లురావడానికి నిర్మాణానికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. జలగం ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. ఇందిరమ్మ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఎంసి. డైరెక్టర్ .కలిపెల్లి.తిరుపతిరెడ్డి. గ్రామ శాఖ అధ్యక్షులు.కడారి సునీల్ రెడ్డి. మండల నాయకులు మీరాల శ్రీనివాస్. యాదవ కమిటీ సభ్యులు కొండ వీని రవి. ఎడ్ల ప్రేమ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ….

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్. భరత్ నగర్ .గ్రామంలో మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. భవన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగాపనిచేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో .దూసుకెళ్తున్నారని అలాగే ఇదివరకు చేసిన పాలకులు రాష్ట్రాన్ని ప్రజలనుకోలుకో లేకుండా .రాష్ట్రాన్ని అప్పుల.పాలు చేశారని దానిని అధిగమించుకుంటూ. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకు వస్తున్నారని ఇందులో భాగంగా మహిళ అభివృద్ధి ప్రత్యేక లక్ష్యంగా మహిళా సంఘ భవనానికి .ఈజీఎస్ నిధుల ద్వారా మహిళా సమైక్య భవనానికి 10 లక్ష రూపాయలు మంజూరు కాగా ఈరోజు భవన నిర్మాణానికి సర్పంచి చిట్యాల దేవేంద్ర వెంకన్న చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని ఇట్టి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన కాంగ్రెస్ పెద్దలకి నాయకులకు ప్రతి ఒక్కరికి మహిళా .సౌమ్యక్య సభ్యులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు. గ్రామపంచాయతీ పాలకవర్గం బిక్షపతి. శిరీష.ఏపిఎం. చంద్రయ్య.సీసీలు. బాలరాజు.యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాయకులు .మునిగేలరాజు. భాను. నాగరాజు. మహిళా సమ్మెక్యసంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి పర్యటన విజయవంతం కావాలి

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భూపాలపల్లికి రానున్నారని, వారి పర్యటనను భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈమేరకు (శనివారం) ఎమ్మెల్యే జీఎస్సార్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి గణపురం మండలం చెల్పూరు గ్రామ శివారులోని కర్నాలకుంట చెరువు పక్కన ఉన్న ఖాళీ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ నాయకులకు, పోలీసులకు పలు సూచనలు చేశారు. సభా వేదిక ఏర్పాటు, హెలీ ప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గణపురం సిఐ కరుణాకర్ రావు, ఎస్సై అశోక్ తో చర్చించారు.

కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం కలియ తిరుగుతూ, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచనలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన రేగొండ కొత్తపల్లిగోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. రెండు మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రాజేందర్ రావు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఇరవై గ్రామాలు ఉండగా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పదకోండు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఒంటి చేత్తో గ్రౌండ్లో ఉండి గెలిపించానని ముఖ్యమంత్రి కి రాజేందర్ రావు వివరించారు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కరీంనగర్ రూరల్ కొత్తపెల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి సాధించానని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వారి గెలుపు కోసం అర్ధరాత్రి వరకు ప్రచారం నిర్వహించానని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా వారికి అన్ని రకాలుగా వెన్ను దన్నుగా ఉండి పదకోండు మంది సర్పంచులను గెలిపించానని తెలిపారు. కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ రూరల్ కొత్తపెళ్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రౌండ్లో ఉండి వర్క్ చేస్తున్నానని ముఖ్యమంత్రికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, సర్పంచుల గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజేందర్రావును ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. రాజేందర్ రావు పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో కరీంనగర్ నగర పాలక సంస్థ పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం లక్ష్యంగా పనిచేయాలని రాజేందర్ రావుకు ముఖ్యమంత్రి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మేయర్ పీఠం దక్కించుకునేలా క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చెప్పారని రాజేందర్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరం వేళ కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు సర్పంచ్ ఎన్నికల్లో పదకోండు మందిని గెలిపించడంపై సీఎం రేవంత్ రెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహించి సంతోషం వ్యక్తం చేశారని రాజేందర్ రావు పేర్కొన్నారు.

సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి..

సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత చేరువై ప్రజలకు సేవలందించాలని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆకాంక్షించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాదులో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చాడ వెంకటరెడ్డి. ఈసందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మానవ హక్కుల భంగం కలగకుండా, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని, గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఐతో అవగాహన చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ ఏర్పాటులో సిపిఐ కార్యకర్తల కృషి ఉందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు దాటిందని, ప్రజా పాలన పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వ కృషి చేయాలని, సంక్షేమ పథకాలు అసలైన అర్హులకు అందించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రాల హక్కులను హరిస్తున్నప్పటికీ ఎంతో ధైర్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను ముందుకు తీసుకెళ్తుందని ఈనూతన సంవత్సరం నుండి మరో మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని భావించి ప్రజలకు సుపరిపాలన అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిశగా అడుగులు వేస్తారనే ఆశాభావాన్ని చాడ వెంకటరెడ్డి వ్యక్తం చేశారు.

సింగరేణి నిధులను దుర్వినియోగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

సింగరేణి నిధులను దుర్వినియోగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు ఉండే సంస్థ సింగరేణి సంస్థ దానిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణిలో ఉన్న నిధులు అన్నిటిని వాడుకొని సంస్థను నిర్వీర్యం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మెస్సితో కలిసి ఫుట్ బాల్ గేమ్ ఆడటానికి సింగరేణి సంస్థ నుండి 10 కోట్ల రూపాయల నిధులు తీసుకొని ఆటలు ఆడాడు కానీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరపడానికి నిధులు లేవు అంటున్నారు సింగరేణి ఉద్యోగులు కార్మికులు కార్మికుల కుటుంబాలు ప్రతి సంవత్సరం ఘనంగా సింగరేణి ఆవిర్భావ నిర్వహించుకునేటివి కానీ నేడు వాటికి నిధులు కేటాయించకుండా తూతూ మంత్రంగా ఆవిర్భావ దినోత్సవాలను జరపడం జరిగింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాజీ ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ సిద్దు పట్టణ అధ్యక్షుడు జనార్దన్ బీబీచారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు

డిసెంబర్ 5 న నర్సంపేటకు సీఎం రేవంత్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-29T142104.950.wav?_=1

 

డిసెంబర్ 5 న నర్సంపేటకు సీఎం రేవంత్

ముఖ్యమంత్రి సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

డిసెంబర్ 5 న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నర్సంపేటలో పర్యటించనున్నారు.సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పట్టణంలోని పాఖాల రోడ్డులో గల జిల్లా మెడికల్ కాలేజీ ఆవరణలో గల స్థలాన్ని బహిరంగ సభకోసం పరిశీలించారు.అదే విధంగా మరో రెండు స్థలాలను కూడా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి,ఆర్డీఓ ఉమారాణి,నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,పలువురు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T145837.753.wav?_=2

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

 జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎన్నికల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈరోజు (సోమవారం) హరీష్ రావు ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌ను (సీఈవో) బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పోలీసులు, అధికారులు తొత్తులుగా మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ పంపిణీ చేస్తోన్న చీరలు, మద్యం పంపిణీ వీడియోలను ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఇచ్చినట్లు తెలిపారు. యూసుఫ్‌గూడాలో పోలింగ్ కేంద్రం పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయన్నారు. రెండేళ్ళుగా ఆరు గ్యారెంటీల అమలుపై రివ్యూ చేయని సీఎం.. ఈరోజే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ ఓటమిని అంగీకరించారు… అందుకే ఆరు గ్యారెంటీలపై రివ్యూ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఓటర్లను మభ్యపెడ్తున్నారని ఆరోపించారు.

హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-29T131947.636.wav?_=3

 

హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రఖ్యాత మత పండితుడు మరియు జమియత్ ఉలేమా తెలంగాణ మరియు ఆంధ్ర అధ్యక్షుడు హాజీ హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (అల్లాహ్ ఆయనపై దయ చూపాలి) షాహీన్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి తన తండ్రి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా, హఫీజ్ పర్ ఖలీక్ అహ్మద్ సాబిర్ (జమియత్ ఉలేమా తెలంగాణ ప్రధాన కార్యదర్శి) ముఖ్యమంత్రిని హృదయపూర్వకంగా స్వాగతించారు మరియు ఆయన సానుభూతి మరియు సంతాపానికి ధన్యవాదాలు తెలిపారు. సంతాప సమావేశంలో, తెలంగాణ మరియు ఆంధ్రలోని వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు జమియత్ యొక్క అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు. జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి తరపున హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ సబూర్ ఖాస్మి (జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి జనరల్ సెక్రటరీ) మరియు హఫీజ్ అక్బర్ సాహిబ్ (జమియత్ ఉలేమా జిల్లా సంగారెడ్డి ట్రెజరర్) కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని రాజకీయ మరియు సామాజిక సమస్యలను కూడా బహిరంగంగా చర్చించారు మరియు పరస్పర సహకారం మరియు సమన్వయం ద్వారా ప్రజా సంక్షేమం మరియు స్థిరత్వం కోసం ఉమ్మడి ప్రయత్నాలపై ప్రాధాన్యత ఇవ్వబడింది. సమావేశం ఆహ్లాదకరమైన మరియు గౌరవప్రదమైన వాతావరణంలో జరిగింది, దీనిలో మరణించిన వ్యక్తి యొక్క మతపరమైన మరియు జాతీయ సేవలకు నివాళులు అర్పించారు మరియు అతని లక్ష్యాన్ని కొనసాగించాలనే దృఢ సంకల్పం కూడా వ్యక్తమైంది.

బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో వచ్చే నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవములు(జాతర) – 2025 గోడ పత్రికను ఈరోజు ఉదయం గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

 

రెండో తిరుపతిగా పేరుగాంచిన బుగులోని వెంకటేశ్వరస్వామి వారి జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. భక్తి, సేవ, సాంస్కృతిక పరంపరలను ప్రతిబింబించే ఈ జాతర ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యార్థం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రూ.200 లక్షల నిధులు కేటాయించినట్లు, అట్టి అన్ని పనులు పూర్తి కావస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135254.537.wav?_=4

 

చేతిలో లేని అధికారంతో బీసీ రిజర్వేషన్ పెంపు.

42 శాతం బిసి రిజర్వేషన్లను అమలు చేయాలి

రాష్ట్రవ్యాప్త బిసి బంద్ లో పాల్గొన్న తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు

దుగ్గొండి,నేటిధాత్రి:*

ఎన్నికల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోలేని అధికారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టగా ఆ రిజర్వేషన్ పట్ల సుప్రీంకోర్టు స్టే విధించిందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి ముదిరాజ్ ఆరోపించారు. బీసీ బందు కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామం ప్రధాన రహదారిపై ముదిరాజ్ మహాసభ దుగ్గొండి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మొగిలి మాట్లాడుతూ విద్య ఉద్యోగాలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్ బిల్లు మంచిదే కానీ.. అది అమలు కాకపోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని ఆరోపించారు. రిజర్వేషన్ల అమలు కోసం వివిధ బిసి కుల సంఘాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ బీసీ వర్గాలకు ఇలాంటి రిజర్వేషన్ల ప్రకారం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి కేంద్రంలో ఉన్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు బిసి రిజర్వేషన్ల పట్ల ఆలోచించాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం మొగిలి కోరారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్,దుగ్గొండి మండలం అధ్యక్షులు పల్లె రమేష్ ముదిరాజ్, సార రాములు ముదిరాజ్, బీసీ జాక్ కన్వీనర్ బండారి ప్రకాష్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ నేదురి రాజేందర్ ముదిరాజ్, వరంగంటి తిరుపతి, నీరటి మురళి, ఒరంగంటి కుమారస్వామి, గొర్రె శీను, దండు రాజు, మేక అనిల్, జెట్టబోయిన రాజు, తెప్ప శంకర్, పొన్నం వంశీ తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం..

ముగ్గురు పిల్లల జీవో రద్దు పై హర్షం.

సీఎం ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అంబేద్కర్ చౌరస్తాలో *సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలు సంతానం ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయుట అనర్హులని జీవో తీసుకువచ్చినప్పటి నుండి ముగ్గురు సంతానం కలిగిన వారు రాజకీయానికి దూరంగా ఉన్నారు,సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు పిల్లలుంటే పోటీకి అర్హులని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముగ్గురు పిల్లల జీవోను రద్దుచేసి ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలున్న ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చని ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో…..
ఈ రాష్ట్రంలో ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లలు సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులని జీవోను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కి మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు గండ్ర సత్యనారాయణ రావు చిత్రపటాలకుశుక్రవారం రోజున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ జీవోను తీసుకొచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే మరియు ముఖ్యమంత్రివర్యులకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు రాజేష్ ఖన్నా, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టికే రవీందర్, నల్లబెల్లి విజేందర్ ,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరిపురం కుమారస్వామి కొర్రి సాంబశివుడు ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండె పు రెడ్డి రవీందర్ రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, దేవేందర్ రావు ,బొమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం….

తంగళ్ళపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. చేపట్టిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని. నిన్ననే ప్రారంభోత్సవం చేసి ఈరోజు కొనుగోలు కేంద్రాలను.మహిళా సంఘాల ఆధ్వర్యంలో. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని. అలాగే ప్రభుత్వం గుర్తించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోలు చేయాలని మహిళల అభివృద్ధి ధ్యేయంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఐకెపి సెంటర్లద్వారా వడ్ల కొనుగోలు చేయడంతో పాటు మహిళలకు ఐకెపి సెంటర్ల ద్వారా. ఉపాధి కల్పిస్తున్నట్టు తెలియజేస్తూ మహిళా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారని అలాంటిది రైతులు పండించిన ధాన్యాన్ని. రైస్ మిల్లులో గాని. దళారుల గాని అమ్మి మోసపోవద్దని. ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకు రైతులు ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని. ప్రజలను. ఆర్థికంగా. నిండా ముంచి వెళ్ళాయని ఎన్ని కష్టనష్టాలు వచ్చినా. రాష్ట్రాన్ని. అభివృద్ధి వైపు నడిపిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్. వెలుపుల. స్వరూప తిరుపతి రెడ్డి. వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్. ఏపీఎం.. డైరెక్టర్లు తిరుపతి రెడ్డి. నక్క నరసయ్య. సత్తు శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మునిగిల రాజు. శ్రీనివాస్ రైతులు మహిళా సంఘ సభ్యులు ఐకెపి సెంటర్ నిర్వాహకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జగిత్యాల ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం…

జగిత్యాల ఇందిరా భవన్ లో మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం

 

రాయికల్, అక్టోబర్ 13, నేటి ధాత్రి:

 

 

అధిక లాభాపేక్షతో పెట్టుబడులు పెట్టి అమాయక ప్రజలు మోసపోతున్నారు.

ఫేక్ యాప్ ల ద్వారా అధిక లాభాపేక్షను ఎర చూపి, గ్రామీణ ప్రజలతో పాటు వివిధ హోదాల్లో ఉన్నవారు సైతం
మెట్ ఫండ్, యు బిట్ లలో చైన్ విధానంలో
పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు.

పెట్టుబడి దారులకు విదేశీ టూర్లు, లక్సరీ వసతుల పేరిట అమాయక ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు.

గతంలో ఫైనాన్స్ కంపెనీలు రెగ్యులేటరీ లేదు..ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరిట నకిలీ యాప్లు, వెబ్సైట్లు విస్తరించాయి.

ఆర్ బి ఐ అనుమతులు లేకుండా చేపట్టే ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా చట్ట విరుద్ధమే.

కేవలం జగిత్యాల జిల్లా లోనే సుమారు 1000 కోట్లు మోసపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.

పెట్టుబడులు పెట్టిన వారికి ఏవిధమైన రశీదులు లేకుండానే పెట్టుబడులు పెడుతున్నారు.

క్షణాల వ్యవధిలో యాప్ లు తొలగిస్తూ ఆధారాలు లేకుండా చేస్తున్నారు.

జగిత్యాల పోలీసు యంత్రాంగం కేసులు నమోదు చేయడం అభినందించదగ్గ విషయం.

నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోయిన వారు పోలీసుల దృష్టికి వచ్చేది ఒక్క శాతం కూడా లేదు.. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు..

రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, జూదం అరికట్టేందుకు చర్యలు చేపడుతోంది.

చట్ట పరమైన చర్యలు తీసుకోవడం తో పాటు, రికవరీ అవుతుందో లేదో అని భయపడి కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదు.

నకిలీ యాప్ లలో అమాయక ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించిన వారి ఆస్తులు జప్తు చేయాలి.

పోలీసులు కేసులు నమోదు చేయడంతోపాటు రికవరీ చేస్తామనే విశ్వాసం బాధితుల్లో కల్పిస్తేనే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తారు.

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు తగ్గిపోయి, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.

ఆర్ బి ఐ అనుమతులు లేకుండా
నిర్వహిస్తున్న ఆర్థిక కార్యకలాపాలు
దేశ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.

దేశ రక్షణ తో పాటు ఆర్థిక వ్యవస్థ రక్షణ కూడా ప్రధానం.

రాష్ట్ర పరిధిలో ఏ మేరకు నిలుపుదల చేస్తాం.. అని పరిశీలించి ఆర్థిక మోసాలు అరికట్టేలా చర్యలు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

కేంద్ర హోమ్ శాఖ, ఆర్థిక శాఖ సైతం నకిలీ యాప్ లు, వెబ్సైట్ లలో పెట్టుబడులను అరికట్టేలా చొరవ తీసుకోవాలి..

నకిలీ యాప్ లలో పెట్టుబడులు పెట్టీ మోసపోవడం జగిత్యాల జిల్లాకే పరిమితం కాలేదు. బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు.

పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని, ఆర్థిక నేరాలు చేసిన వారి ఆస్తులు జప్తు చేయాలి.

పోలీసులు సుమోటోగా విచారణ చేపట్టాలి..

రాష్ట్ర స్థాయిలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ఆర్థిక నేరాల వ్యవహారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్న..

రేగొండలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..

రేగొండలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.370 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బస్టాండు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… రేగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యార్థం నూతన బస్టాండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రేగొండ మండల కేంద్రం పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందన్నారు. రేగొండ నుండి వివిధ ప్రాంతాలకు నిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారన్నారు. అదేవిధంగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ఇప్పటివరకు రూ.186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆర్టీసీకి రూ.6,210 కోట్లు చెల్లించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఎన్ఎస్ఆర్ సంపత్ రావు ఇప్ప కాయల నరసయ్య పున్నం రవి ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ..

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫోర్త్ సిటీ.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

ఫోర్త్ సిటీ కాదు.. ఉన్న సిటీని సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మెట్రోను రద్దు చేసి.. రేవంత్‌రెడ్డి ఫోర్త్ సిటీకి మెట్రో అంటున్నారని విమర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై కాంగ్రెస్ నేతలు దొంగమాటలు చెప్పి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట సమతా కాలనీలో కేటీఆర్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. ఇంటింటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీ ఏమైంది.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నివర్గాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ఫోర్త్ సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనపై కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.

రాష్ట్ర బీసీ ప్రజలకు నా శుభాకాంక్షలు…

రాష్ట్ర బీసీ ప్రజలకు నా శుభాకాంక్షలు

ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్.

మరిపెడ నేటిధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కొత్త మైలురాయి.
బీసీలకు 42% రిజర్వేషన్లతో జీవోనెంబర్9 విడుదల బీసీ వర్గాల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి, సామాజిక న్యాయం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో జీవోనెంబర్ 9 ని విడుదల చేసింది,వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్నిపెంపొందిస్తూ వారి భవిష్యత్ తరాలకు భరోసా అందించడమే లక్ష్యంగా తీసుకున్నఈ నిర్ణయం గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో బీసీలకు 42% సీట్ల రిజర్వేషన్ కల్పిస్తూ వెనుకబడిన వర్గాల ప్రజలకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని, ఇది వెనుకబడిన వర్గాల ప్రజలకు భరోసా అన్నారు,అన్ని వర్గాల ప్రజలను అక్కునచేర్చుకుంటుందని మరోసారి ఋజువు చేసింది అన్నారు,బీసీ సమాజం సమగ్రాభివృద్ధి దిశగా ముందడుగు వేయాలని కోరుకుంటూ..బీసీవర్గాల ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.

అభివృద్ధి ప్రదాతలకు పాలాభిషేకం…

అభివృద్ధి ప్రదాతలకు పాలాభిషేకం

వజ్జ సారయ్య

కొత్తగూడ,నేటిధాత్రి:

 

 

కొత్తగూడ మండల కేంద్రం లో నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పల్లెలు పట్టణాల్లాగా తయారవుతాయని..ప్రజలు భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన పూర్తి ఫలాలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ ప్రజలు నమ్మకాన్ని నిజం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మంత్రివర్గానికి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు సంక్షేమ శాఖ ధనసరి అనసూయ సీతక్క ప్రత్యేక కృషితో
ఏజెన్సీ మండలం మండలమైన కొత్తగూడ మండల కేంద్రంలో సుమారు 12 కోట్ల రూపాయలతో
సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయడం జరిగిందని..
త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే పల్లెల మరియు పట్నాలు అభివృద్ధి చెందుతాయని మరోసారి రుజువైందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,* మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ధనసరి అనసూయ సీతక్క
చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు..

ప్రభుత్వం చేసే పనులను ఓర్వలేకనే తప్పుడు ప్రచారం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T124523.826.wav?_=5

 

 

ప్రభుత్వం చేసే పనులను ఓర్వలేకనే తప్పుడు ప్రచారం

గణపురం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం జరిగింది.
రాజేందర్ మాట్లాడుతూ భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గండ్ర సత్యనారాయణ రావు పై తప్పుడు ఆరోపణ చేయడం, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్యనారాయణ రావు చేస్తున్న అభివృద్ధిని కోరవలేక సత్యనారాయణ రావు మీద తప్పుడు ఆరోపాలు చేయు వారిని ఖబర్దార్ అని హెచ్చరించాడు.
తన సొంత అవసరాల కోసం పార్టీ మారి కాంగ్రెస్ కార్యకర్తలను నిలువునా ముంచిన మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కి కొంచమైనా సిగ్గుండాలని, తన భార్య పదవి కోసం పార్టీ మారిన వ్యక్తిన ఈరోజు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి,
మీ సొంత అవసరాల కోసం ఇసుకను జిఎంఆర్ కన్స్ట్రక్షన్ కోసం వాడుకోలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
పెట్రోల్ ట్యాంకర్లలో కర్రను ఎక్స్పోర్ట్ చేసింది నిజం కాదని ప్రశ్నిస్తున్నాను,
మీ ప్రభుత్వ హయాంలో తెగిన చెరువులను కట్టలను మరమ్మత్తులు చేయించి రైతులకు అండగా నిలిచిన నాయకుడు జి.ఎస్.ఆర్ మీ స్వలాభం కొరకు మైలారం గుట్టపై ఉన్న 200 ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకొని ఆయిల్ ఫామ్ పెట్టాలనుకున్నది మీరు. వాటిని మా ఎమ్మెల్యే ప్రజా పాలన కొరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్క్ హబ్ గా ఏర్పాటు చేశారు మైలారం గుట్టలను కబ్జా చేసింది ఎవరు? కబ్జాల కూర నుండి విడిపించి ఎడ్యుకేషన్ అబ్బుగా మార్చారు మా ఎమ్మెల్యే
విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసి గత పది సంవత్సరాలుగా మండలాలలో ఎంఈఓ లను కూడా నియమించలేదు మీ ప్రభుత్వం.
గెలిచిన 20 నెలల వ్యవధిలో ఇంటర్నల్స్ రోడ్స్ ఆయకట్ట రోడ్స్. వేసిన ఘనత మా ఎమ్మెల్యే ది మా ప్రభుత్వం ది. మా ప్రభుత్వము గానీ మా ఎమ్మెల్యేని గాని దూషించే ముందు ఒకసారి మీరు చేసిన పనులను గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వైస్ చైర్మన్ దూడపాక శంకర్ చోటే మియా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరు శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి మామిళ్ళ మల్లికార్జున గౌడ్, సీనియర్ నాయకులు బోనాల రాజమౌళి, ఉమ్మడి వెంకటేశ్వర్లు, మోతపోతుల శివ శంకర్ గౌడ్, దూడపాక దుర్గయ్య,పుప్పాల రామారావు, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఓరుగంటి కృష్ణ, మాజీ వార్డ్ మెంబర్ గంధం సుధాకర్
మాజీ వార్డ్ మెంబర్ గంధం ఓధాకర్, దూడపాక శ్రీనివాస్, మహమ్మద్ సైదులు, ఎస్.కె మౌలా, తదితరులు పాల్గొన్నారు

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్..

రామాయంపేట, సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ₹8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రామాయంపేట శాఖ డిమాండ్ చేసింది.
స్థానిక బస్టాండ్‌ వద్ద గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ –
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ నిధుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించకపోగా కేవలం డైవర్షన్ రాజకీయాలతోనే రోజులు గడుపుతున్నారని విమర్శించారు.
అతను హెచ్చరిస్తూ, విద్యార్థుల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ విస్తృత స్థాయి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలిపారు.
ఈ నిరసనలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అర్జున్, హరిహర, ఆదర్శ్, చందు, మల్లికార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version