*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో..
+ఘనంగా 77.వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు..
తిరుపతి(నేటి ధాత్రి:
తిరుపతిలోని గాంధీ రోడ్డులో కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చమంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా. పి.సి. రాయులు మాట్లాడుతూ, కస్తూర్భా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జనవరి 26ను దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలతో మనంగా జరుపుకుంటారని చెప్పారు. దాదాపు 200 సంవత్సరాల బొటిష్ పాలన అనంతరం 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో సంపూర్ణ స్వయంప్రభుత్వం లభించిందని గుర్తు చేశారు. ఆనాటి నుండి నేటి వరకు భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతర దేశాలతో పోటీపడుతూ ముందుకు సాగుతోందన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కస్తూర్భా గాంధీ ట్రస్ట్ పేదలు, వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. గాంధీ స్మృతి & దర్శన్ సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్ పేదలు, అవసరమైన వారికి సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ సమితి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుండగా, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చైర్మన్ గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షులు చమంతి శ్రీనివాస్, గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. సమానత్వం, న్యాయం. స్వేచ్ఛ. ఆర్థిక స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరి అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, గత నేతలు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా ముందుకెళోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప మేయర్ ఆర్.సి. ముని కృష్ణ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ వేడుకలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యాలయ సిబ్బంది. బండి మధుసూదన్ రెడ్డి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల లోని పర్లపల్లి గ్రామ పంచాయతీ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన *పర్లపల్లి గ్రామ – సర్పంచ్ “జోరుక సదన్న” * వారితిపాటు గ్రామ *ఉప సర్పంచ్ “దిండిగల సత్యనారాయణ” గారు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ జోరుక సదయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించిన మహాత్ర గ్రంథం అని రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి భారతీయుని బాధ్యతని అన్నారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అవసరం ఉందని పేర్కొన్నారు అభివృద్ధి సామాజిక న్యాయం ప్రజాస్వామ్య పర్యవేక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ లు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, విద్యావంతులు, యువకులు, RMP వైద్యులు, గ్రామ కుల సంఘాల పెద్దలు, మహిళా మండలి సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, ఇతరులు పాల్గోనడం జరిగింది.
మున్సిపల్ఎన్నికలలో ఆర్యవైశ్య లు పోటీ చేయాలి న్యాయ వాది రామకృష్ణ
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈకార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బిజెపి నేత బచ్చురాo కోశాధికారి ఏపూరి శ్రీనివాసులు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజ్ లగిశేట్టి అశోక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కోట్ర రామకృష్ణ న్యాయవాది దార వెంకటేష్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ మాజీ వర్తక సంగం అధ్యక్షులు లగిశెట్టి నరసింహ లగిశెట్టి సాయి ప్రసాద్ వర్తక సంగం ట్రెజరర్ వై వెంకటేష్ దోమ శివ కె.బి శ్రీనివాసులు బొడ్డు శంకర్ చుక్కయ్య వజ్రాల సాయిబాబా కాలూరి భాస్కర్ కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పిన్నo వసంత నరేందర్ మాజీ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ ఆర్యవైశ్యులు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈసందర్భంగా న్యాయవాది కొట్ర రామకృష్ణ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు ఏ పార్టీ తరఫున పోటీ చేసిన తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఆర్యవైశ్యులు మున్సిపల్ 33 వార్డులో పోటీ చేయుటకు ముందుకు రావాలని నామినేషన్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయంగా ఆర్యవైశ్యులు బలోపేతం కావాలని కోరారు గత మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ గద్వాల్ మున్సిపాలిటీలో ఆర్య వైశ్యులు మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించారని కౌన్సిలర్లుగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు .మున్సిపల్ కౌన్సిలర్లు గా ఆర్యవైశ్యులు విజయం సాధించి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు
#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
రాజ్యాంగం మన భారతదేశానికి దిశా నిర్దేశం అని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక మహా గ్రంథమని స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడు లో దేశభక్తి ఐక్యత సోదర భావాన్ని మరింత బలపరిచే పర్వదినం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మాసంపల్లి అఖిల్, నాయకులు బత్తిని మల్లయ్య, పరికి త్యాగరాజు, మాసంపల్లి ప్రభాకర్, బిక్షపతి, హరీష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ,జాతీయ జెండాను ఆవిష్కరించిన
జహీరాబాద్ నేటి ధాత్రి:
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఝరాసంగం గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని,వార్డ్ మెంబర్లు నవీన్ కుమార్, సంగమేష్ ప్రవీణ్, ప్రకాష్ సింగ్, తేజమ్మ,మాలి పటేల్ సంతోష్ కుమార్, నాగేశ్వర్ సజ్జన్,మాలి పటేల్,ఎజాస్ బాబా, మాలి పటేల్ శ్రీనివాస్,తమ్మలి విజయ్ ప్రకాష్ సింగ్ కుమార్, మహమ్మద్ అజరు, గోపాల్ కుమారి,లక్ష్మీకాంత్,ఉమేష్, ఠాగూర్ సంజు, గాజుల కృష్ణ,పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
◆-: ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్:సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు మానవ హక్కుల మూల సూత్రమని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ 2026 క్యాలెండర్ ను ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా కొనసాగాలంటే మానవ హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.ప్రతి పౌరుడికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, విద్య, ఆరోగ్యం, ఉపాధి, న్యాయం పొందే హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని ఆయన గుర్తు చేశారు. అయితే సమాజంలో ఇప్పటికీ పేదలు, మహిళలు, బాలలు, దళితులు, గిరిజనులు, కార్మికులు, వృద్ధులు అనేక సందర్భాల్లో హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కులు కేవలం చట్టపరమైన అంశం మాత్రమే కాదని, అవి మానవత్వానికి ప్రతీకలని అన్నారు. ఇతరుల హక్కులను గౌరవించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మానవ హక్కులపై అవగాహన లేకపోవడం వల్లనే అనేక అన్యాయాలు జరుగుతున్నాయని, అందుకే గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంస్థ దేశవ్యాప్తంగా హక్కుల ఉల్లంఘనలపై పోరాటం చేస్తూ, బాధితులకు న్యాయం అందించేందుకు కృషి చేస్తోందని వివరించారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ వ్యవస్థల వద్ద బాధితులకు సహాయం అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, యువత అందరూ కలిసి మానవ హక్కుల పరిరక్షణకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన హక్కులపై అవగాహన పెంచుకోవడంతో పాటు, ఇతరుల హక్కులను కూడా గౌరవించే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు.న్యాలకల్ మండలం మల్గి గ్రామంలో ప్రజలకు నష్టం కలిగించే కంపెనీ ఏర్పాటు జరగకుండా సంస్థ తరపున గట్టి పోరాటం చేశామని , గ్రామ ప్రజల భద్రత, జీవనాధారాలను కాపాడాలనే ఉద్దేశంతో సంస్థ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.అలాగే సిగచి కంపెనీ ప్రమాదంలో గాయపడిన 53 మంది బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సంస్థ పోరాటం చేసిందని, ఆ క్రమంలో ప్రతి బాధిత కుటుంబానికి రూ. లక్ష చొప్పున పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ అంశమైనా ఎదురైతే సంస్థ తరపున పోరాటం కొనసాగిస్తామని, ప్రజల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం ముందుండి పోరాడతామని వారు స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని నవోదయ సిద్దు కోరారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చట్టాలపై సరైన అవగాహన ఉంటేనే హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలమని తెలిపారు. ప్రత్యేకంగా ప్రజలు తమ హక్కులు, విధులు తెలుసుకొని న్యాయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయవాది చీఫ్ అడ్వైజర్ పుట్ట పద్మారావు, జేఎన్జీఓయూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు బిట్ల ప్రభాకర్, బి. క్రాంతి కిరణ్, ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ అడ్వైసర్ వెంకట్ దాస్, ప్రొఫెసర్ సీబీఐటి చీఫ్ అడ్వైసర్ ఎం. స్వామి దాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డిగ్గే బాబు, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు వి మోహన్ రావు, రాష్ట్ర కార్యదర్శులు దత్తా రెడ్డి, ఆనంద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి కుమార్, రాష్ట్ర అడ్వైజర్ ప్రశాంత్ గాంధీ, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ ఫెరోజ్, సహాయ కార్యదర్శులు ఏ. ప్రదీప్ కుమార్, ఆందోల్ మల్లేశం, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్, బోరంచ సాయిలు, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.ఏ ఖైసర్ తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్..
భూపాలపల్లి నేటిధాత్రి
బడుగు, బలహీన వర్గాలకు భారతదేశంలో రక్షణ కల్పించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అహింసా మార్గాన్ని ఎంచుకొని పరిపాలన వ్యవస్థను మార్చడంతో పాటు సమానత్వంపై ప్రత్యేక శ్రద్ధ చూపించారన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించారన్నారు. గ్రామాల్లో కుల, మత అనే బేధాలు లేకుండా అందరూ సమానమే అనే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. భారతీయులకు ఆరాధ్యుడు బీ.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత భారతదేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా నిష్పత్తికి సమానంగా రిజర్వేషన్లు (సీట్లు) కల్పించాలి
ములుగు టౌన్ నేటి దాత్రి
ములుగు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, కానీ 2011-2025 ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరిగి అనేక వేల మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందారని ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రాక రాజకీయ రంగంలో కూడా వారి వెనుకబడిపోయి వివక్షతకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోయి బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానం వల్ల రాజకీయ రంగంలో కూడా అవకాశాలు కోల్పోతారని, భారత రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి, సీట్లు కేటాయించాలని ఉందని, అలాగే ప్రభుత్వాలు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని అయినా నేటి పాలకులు అవేమీ పట్టించుకోకుండా బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం అంటే ముమ్మాటికి వారిని అవమానించడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైనదని వెంటనే ఈ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవరించి రాష్ట్రవ్యాప్తంగా మరియు ములుగు జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి నిరసనగా నవంబర్ 1న ‘చలో హైదరాబాద్’ దళిత ఆత్మగౌరవ మహా ర్యాలీ
నేటి ధాత్రి,పటాన్ చెరు:
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవం, న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం నవంబర్ 1వ తేదీన ‘చలో హైదరాబాద్’ మహా ర్యాలీని విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్,ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహా ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లపై పటాన్ చెరు నియోజకవర్గంలోని ఎంఆర్పిఎస్, ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం పొట్టోల్ల వెంకటేశం మాదిగ ఎంఎస్పి రాష్ట్ర సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ, సీజేఐ గవాయి పై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ఇది భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, దళితుల ఆత్మగౌరవం మరియు అస్తిత్వంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. నవంబర్ 1న హైదరాబాద్లో జరగబోయే ఈ భారీ బహిరంగ ర్యాలీలో నియోజకవర్గం నుంచి లక్షలాది మంది పాల్గొనాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గరలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గం నుండి దళిత వర్గాలు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు, నియోజవర్గ బాధ్యులు, మండల ఇన్చార్జులు పూర్తి సమయం కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నల్లోల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి, వెలుమల ప్రమోద్ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, క్యాసారం నటరాజ్ మాదిగ ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి, కొంగేరి కృష్ణ మాదిగ ఎంఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి, ముక్క గళ్ళ ఆంజనేయులు మాదిగ ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు, కందుకూరి ఏసయ్య మాదిగ ఎంఆర్పిఎస్ అమీన్పూర్ మండలం ఇంచార్జి, బందెల రవికుమార్ మాదిగ ఎంఆర్పిఎస్ ఆర్సి పూర్ టౌన్ కన్వీనర్, దర్బార్ రమేష్ మాదిగ కో కన్వీనర్, కర్రెనుల బాలేష్ మాదిగ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గత వారం రోజుల క్రితం ఈ దేశ ఉన్నత సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ సుప్రీం కోర్టు జే ల్ యు డి ఈ సిజిఐ గావాయ్ పైన జరిగిన దాడికి నిరసనగా కోహిర్ మండలం ఎన్ ఆర్ పి ఎస్ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కోహిర్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి ఇలాంటి చర్యకు పాల్పడిన న్యాయవాదిని శిక్షించాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాట్లాడుతు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైన జరిగిన దాడి అంటే రాజ్యాంగం పై దాడి అని ప్రజాస్వామ్యం పై దాడి అని దేశ దళిత బహుజనుల పై దాడి రాజ్యాంగాన్ని అవమానించడమేనని మతోన్మాద విష సంస్కృతితో నే ఇలాంటి భౌతిక దాడులు జరుగుతున్నాయి ఈ దేశాన్ని మనువాద కోణంలో పరిపాలించాలనే దురుద్దేశంతో కొంతమంది మనువాదులు దళితుల పట్ల చూపే రాజకీయవాదులు చేసే కుట్రలను మేము ఖండిస్తున్నాం,ఈ సంఘటనను దళిత గిరిజన బహుజనులు వెనుకబడిన వర్గం మేధావులు ప్రజలు వ్యతిరేకించాలని వారు తెలిపారు.
గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కెటిపిపి ప్రధాన ముఖద్వారం అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఎస్సీ & ఎస్టీ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ఈ దాడి దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో చీకటి రోజని, భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని దాడికి పాల్పడిన వారికీ తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు సనతన దర్మం పిచ్చి ఎంత ముదిరింది అంటె దళితుడు ఐన సుప్రీంకోర్టులో సిజేఐ గవాయ్పై బూటు విసిరె స్థాయికి చేరింది.ఈ చర్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లు అందరు తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ & ఎస్టీ జెఎసి నాయకులు తదితరులు పాల్గొన్నారు
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న బిజెపి సహకరిస్తున్న ఎలక్షన్ కమిషన్…
దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది…
ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత…
ఓటును చోరీ చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమానికి నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు , ఎంపీ కావ్య .
వర్దన్నపేట( నేటిధాత్రి):
Vaibhavalaxmi Shopping Mall
ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం,బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఓటు చోరీ పై సంతకాల సేకరణ కార్యక్రమం వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ చౌరస్తాలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు.అనంతరం ఓటు చోరీకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి తమ సంతకాల ద్వారా నిరసన వ్యక్తం చేశారు.ఓటు చోరీ పై బూత్ స్థాయి, మండల,డివిజన్, గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు,ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు.
Congress
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ఓటు హక్కును నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దేశ ఎన్నికల సంఘం, బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ, దొంగ ఓట్లు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ “ప్రజలు క్షేత్రస్థాయి నుంచి దేశస్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలి” అని పిలుపునిచ్చారు అన్నారు.భారత రాజ్యాంగంలో కీలకమైన ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ, అధికారం కోసం బీజేపీ చేస్తున్న తంతును బహిర్గతం చేయడం మా బాధ్యత. ఈ విషయాన్ని గ్రామం నుంచి దేశ స్థాయికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగించాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు తెలియజేశారు..ఈసందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తోందని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి పవిత్ర హక్కు అని, ఆ హక్కును చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. బీజేపీ ఓటు దొంగలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తాం అని ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ గ్రామ స్థాయి స్థానిక కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్, మహిళా కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు….
మహాదేవపూర్ మండల కేంద్రంలోని భారతదేశం ప్రపంచంలో అగ్రగామి కావడానికి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టిందనీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక్ సత్యనారాయణ అన్నారు. ఆర్ఎస్ఎస్ కు దేశమే ముఖ్యమని కార్యకర్తలు కూడా దేశం తర్వాతనే ఇతర విషయాలకు ప్రాధాన్యమిచ్చే వారే ఈ సంస్థకోసం నిలబడతారని అన్నారు. పంచ పరివర్తనలో భాగంగా చెట్లు నాటడం, ఒకసారి వాడే ప్లాస్టిక్ను నిషేధించడం, భూగర్భ జలాలను పెంపొందించడానికి కట్టుబడి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. స్వ ఆధారిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వభాష, స్వవేషం, స్వ సంస్కృతి తోపాటు స్వదేశీ వస్తువులను వాడాలని సూచించారు. హిందూ కుటుంబాలు సమిష్టిగా ఉండేలా మానక మానసిక స్థితిని పెంపొందించే విధంగా చూడాలన్నారు. పండుగ పర్వదినాలలో సమిష్టి కుటుంబంలోని వారందరూ కలుసుకునే సంప్రదాయాన్ని పాటించారన్నారు. పూర్వకాలం నుండి హిందుత్వంలో జ్ఞానానికే ప్రథమ ప్రాధాన్యం ఉన్నదే తప్ప కుల మతాలకు వర్గ విభేదాలకు తావు లేదని అలాంటి సమాజాన్ని పునర్ నిర్మించాలన్నారు అన్నారు. కుల మతాలను పాటించకుండా అందరిలో దైవమున్నాడని భావించే సమరసత కోసం కృషి చేయాలని అన్నారు. పౌర విధులను సక్రమంగా నిర్వహించారని రాజ్యాంగం, చట్టాలను పాటించడం ద్వారా సమాజంలో పౌర భావనను పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని మరోపదేళ్లలో ప్రపంచంలోని అన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రజలకు ఆర్ఎస్ఎస్ లో పరిచయం చేయడానికి ప్రతి మండలంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ గడ్డం శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు దేవరావు, తదితరులు పాల్గొన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్
కొత్తగూడ, నేటిధాత్రి :
కొత్తగూడ మండల కేంద్రo జీఎల్ నగర్ ( గోగ్గల లక్ష్మయ్య నగర్ ) ఆదివాసీ మహిళా పై గిరిజనేతరుడు అయిన ఎండీ పాషా మొబైల్ షాప్ నిర్వాహకుడు దాడి చేయడాన్ని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా కండించడం జరిగింది. దాడిలో గాయపడిన ధనసరి అనసూర్య నీ ఆదివాసీ సంఘాల నాయకులు ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం జరిగింది…అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం గుర్తించిన 5 వ షెడ్యూల్ ప్రాంతం అయిన ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక ఏజెన్సీ చట్టాలు ఉన్నపటికీ చట్టలకు విరుద్ధం గా బ్రతుకు దెరువు కోసం ఏజెన్సీ లోకి వలసలు వచ్చిన గిరిజనేతరులు తిరిగి ఆదివాసీల పైనే దాడులు చేస్తున్నారు. 1/59,1/70, LTR( భూ బదలాయింపు నిషేధ చట్టం) పేసా-1996, ROFR-2006, ఏజెన్సీ లో వడ్డీ వ్యాపార నిషేధ చట్టం-1960 చట్టాలు అమలు చేయక పోవడం వల్లనే గిరిజనేతరులు దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలనీ లేని యెడల ఆదివాసి లు “నాన్ ట్రైబ్ గో బ్యాక్ నినాదం”తో దశాల వారి ఉద్యమనికి తిరుగు బాటు చేయక తప్పదాని హెచ్చరించారు. ఏజెన్సీ గూడ లలో ఉన్న ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంత చట్టలు హక్కుల పై అవగాహనా తో ఉండాలని ఆదివాసీ యువత గిరిజనేతరుల అక్రమాలను తిప్పి కొట్టాలని భారత రాజ్యాంగం ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ ల కోసం గుర్తించిన చట్టాలు హక్కులు అమలు కావాలంటే తిరుగు బాటు తప్పదాని యువత అప్రమత్తం గా ఉండాలి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం లో ఆదివాసీ సంఘాల నాయకులు పూనేం సందీప్ దొర,ధనసరి రాజేష్,కుంజ నర్సింహా రావు, కల్తీ నరేష్, పెండకట్ల లక్ష్మీ నర్సు, ఈసం రామస్వామి,బీజ్జ సందీప్, ఈసం వెంకన్న, పెనక విజయ్ తదితరులు పాల్గొన్నారు.
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క
ములుగు జిల్లా, నేటిధాత్రి:
మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, విద్యార్థిని, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక 79వ భారత స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో ఆగస్టు,15కు విశిష్ట స్థానం ఉంది. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచిన మనం.. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి, భారతదేశ పునాది పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పౌరులకు, అణగారిన వర్గాలకు సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం నిబంధనలు ఉండేలా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులు ఊదారు. మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. స్థానిక సంస్థలలో… విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ములుగు జిల్లా 2019లో ఏర్పడినప్పటి నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లుటకు నూతన ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా జిల్లాలో నూతన ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం, జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు జిల్లా ప్రజలకు అందించుటకు నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, శాశ్వత భవనాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకశాలను పెంచుటకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. తద్వారా 51 మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. ములుగు, బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలతో ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయటకు కృషి చేయడం జరిగింది. మల్లంపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, జిల్లాలో మరో 15 సబ్ సెంటర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2026 లో జరగనున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు దాదాపు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు దర్శించుకొనున్ననేపధ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లకై ప్రతి శాఖను సమాయత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను.
మహాలక్ష్మి పథకం : ఆడబిడ్డలకు పైసా ఖర్చు లేకుండా ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించుటకు ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకం ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి 35 లక్షల మంది మహిళలకు 81 కోట్ల 23 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగినది. జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో 4 కోట్ల 80 లక్షలతో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో 6 కోట్ల 28 లక్షలతో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. మంగపేటలో 52 లక్షల నిధులతో బస్టాండ్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నవి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది.
వైద్య ఆరోగ్య శాఖ : ఆరోగ్య శ్రీ బ్రాండ్ స్కీం : మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో 2800 మందికి వైద్య సేవలకుగాను 10 కోట్ల 99 లక్షలకు పైగా రూపాయాల లబ్ది చేకూర్చడం జరిగింది. ఈ సంవత్సరం 1056 గర్భిణి స్త్రీలకుగాను 748 స్త్రీలకి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు (71 శాతం) చేయడం జరిగినది. సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా 24 వేల 38 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 34 మలేరియా 10 డెంగ్యూ కేసులను నిర్ధారించి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం జరిగినది. అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించుటకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నూతన ఆలోచనతో 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 4182 మంది పేద గిరిజన ప్రజలకు పరీక్షలు నిర్వహించి, 19 లక్షల 56 వేల రూపాయలను లబ్ది చేకూర్చడం జరిగింది.
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్: ఓ.పి, ఐ.పి. సేవలు గత సంవత్సరం కన్నా 10 శాతం పెరిగినవి. రోజువారి ఓపి 715, ఐ.పి. 165 గా ఉన్నది. మాతా శిశు సంబంధిత సేవలు మరింతగా పెరిగాయి. జనరల్ సర్జరీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నవి. ఈ నెల ఇద్దరికీ రొమ్ము కణితి, ఒకరికి దవడ కణితి విజయవంతంగా తొలగించి మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని అభినందిస్తున్నాను.
ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల : ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం కొరకు 50 సీట్లకు ఎన్.ఎం.సి. నుండి అనుమతి పొందడం జరిగింది. కళాశాలలో కావాల్సిన మైక్రోబయాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మా కాలేజీ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబిబిఎస్ కోర్స్ తో పాటు పారామెడికల్ కోర్స్ డి.ఎం.ఎల్.టి., డి.ఎం.ఎస్.టి. 60 సీట్లతో ల్యాబ్, తరగతి గదుల సౌకర్యాలను కల్పిస్తూ తరగతులను ప్రారంభించడం జరిగింది.
వ్యవసాయ శాఖ : రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతు భరోసా పథకం కింద వ్యవసాయ భూములకు వానా కాలానికి ఎకరానికి 12 వేల చొప్పున 79 వేల 481 మంది రైతుల ఖాతాలో 99 కోట్ల 10 లక్షల జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం కింద 2024-25 సంవత్సరంలో 218 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 10 కోట్ల 90 లక్షలను రైతుల నామినిల కుటుంబ ఖాతాలో జమ చేయడం జరిగింది. సబ్ మిషన్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళా సన్న చిన్న కారు రైతులకు 50% రాయితీపై 79 లక్షల 60 వేల రూపాయలను వ్యవసాయ పరికరాలు అందించుటకు కేటాయించడం జరిగింది. జిల్లాలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన 671 మంది రైతులకు 3 కోట్ల 80 లక్షల 97 వేల రూపాయలను నష్టపరిహారం ఇప్పించడం జరిగింది.
విద్యుత్ శాఖ : గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200యూనిట్ల వరకు 39వేల 79 విధ్యుత్ వినియోగదారులకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది. తద్వారా ఇప్పటి వరకు 39 కోట్ల 44 లక్షల రూపాయలను లబ్దిదారులకు సబ్సిడీ కల్పించాము. 21 కోట్ల 29 లక్షల నిధులతో బుచ్చంపేట, అడవీరంగాపూర్, గట్టమ్మ, జగ్గన్నపేట, నార్లపూర్, లింగాల, రోయ్యూరు గ్రామాల్లో నూతన 33 / 11 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడం జరిగినది. కోడిశాల కుంటలో 2 కోట్ల 70 లక్షలతో నిర్మించుకున్న 33 / 11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించడం జరిగింది.
పౌర సరఫరాల శాఖ :70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. సన్నధాన్యానికి ఇప్పటివరకు 52 కోట్ల 70 లక్షల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు యాసంగి సీజన్ పంటలకు కనీస మద్దతు ధర పై 78 వేల 701 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో 485 కోట్ల 49 లక్షల రూపాయలను చెల్లింపు చేయడం జరిగింది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ భారంగా మారకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో 50 వేల 64 మందిని అర్హులుగా గుర్తించి, ఇప్పటి వరకు 500 రూపాయల చొప్పున ఒక లక్ష 64 వేల 169 సిలెండర్లను డెలివర్ చేసి, 4 కోట్ల 39 లక్షల సబ్సిడీని లబ్దిదారుల ఖాతాలో జమ చేశాం. రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు జిల్లాలో 6 వేల 207 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పేదల ఆకలి తీర్చటంతో పాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు జిల్లాలో ప్రతినెల 97 వేల 634 రేషన్ కార్డుదారులకు, ప్రతి నెల 7 కోట్ల 88 లక్షల రూపాయలను వెచ్చించి 1,751 టన్నుల పోషకాలతో కూడిన సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతున్నది.
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ : గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా మహిళ శక్తి పథకం లో భాగంగా ఎస్.హెచ్.జి. లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 28 వేల 797 మంది విద్యార్థులకు ఏకారూప దుస్తులను వీరి ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాల ద్వారా జిల్లాలో పౌల్ట్రీ మదర్ యూనిట్లు 5, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు యూనిట్లు 2 ఏర్పాటు చేయడం జరిగినది. సదరం క్యాంపు ద్వారా 6,776 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. బ్యాంకు లీకేజీ కింద 1060 మహిళా సంఘాలకు 80 కోట్ల 54 లక్షల రుణాలు మంజూరు చేశాం. స్త్రీ నిధి కింద 33 వి.ఓ. లకు, 136 సంఘాల సభ్యులకు 4 కోట్ల 50 లక్షలు మంజూరు చేశాం. చేయూత పెన్షన్ పథకం ద్వారా 38 వేల 60 మంది లబ్దిదారులకు 9 కోట్ల 87 లక్షల రూపాయలను ప్రతి నెల పెన్షన్స్ అందిచడం జరుగుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం 7లక్షల 57 వేల పనిదినాలు కల్పించి, 47 వేల 50 మంది కూలీలకు 20 కోట్ల 80 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించడమే కాకుండా, 12 కోట్ల 32 లక్షల రూపాయలను మెటీరియల్ కొరకు ఖర్చు చేయడం జరిగింది.
జిల్లా పంచాయతీ శాఖ : జిల్లాలోని 171 గ్రామ పంచాయితీలలో ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి, డంపింగ్ యార్డులకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. జిల్లా లోని 171 పంచాయితిలలోని నర్సరిలలో 11 లక్షల 39 వేలకు పైగా మొక్కలను సంరక్షించడం జరుగుతుంది.
నీటిపారుదల శాఖ : యాసంగి పంట సాగుకు 53 వేల 278 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడం జరిగింది. అంతేగాకుండా ప్రస్తుత సంవత్సరం వానకాల పంటల కొరకు సుమారు 88 వేల 18 ఎకరాలకు పైగా సాగునీరు అందించుటకు చర్యలు తీసుకొన బడుచున్నవి.
మిషన్ భగీరథ: జిల్లాలో 601 ఓ. హెచ్.ఎస్.ఆర్. లతో 88 వేల 30గృహాలకు అన్ని అవసరాలకు సరిపడు సురక్షిత మంచినీరు సరఫరా చేయడం జరుగుతున్నది.
ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం: నిరుపేదలకు ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. మొదటిదశలో నిరుపేదలై ఉండి.. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారిని ప్రామాణికంగా తీసుకుని 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో బాగంగా జిల్లాలోని 10 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మొదటి దశలో 4601 ఇండ్లు మంజూరు కాగా 3 వేల 678 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. 1561 ఇండ్లు నిర్మాణ పనులు వివిద దశల్లో పురోగతిలో ఉండగా ఇప్పటి వరకు 9 కోట్ల 81 లక్షలు చెల్లించాం. ఈ పథకంతో పేదవాళ్లకు సొంతింటి కల సాకారమైంది.
కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకం: 2025-26 సంవత్సరంలో కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకాల క్రింద వివాహాలు జరిగిన పేద కుటుంబాలకు రూ.1 లక్ష 116/- ల చొప్పున 2 కోట్ల 71 లక్షల రూపాయలను 271 మంది లబ్దిదారులకు అందించడం జరిగినది.
అటవీశాఖ : వనమహోత్సవములో భాగంగా 171 గ్రామపంచాయితీలలో 14 లక్షల 26 వేల మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా వివిధ శాఖలలోని నర్సరీలలో 25 లక్షల 40 వేల మొక్కలను పెంచడం జరిగినది. తూనికాకు సేకరణలో 10వేల 359 “ఎస్. బి. “లకు 341 లక్షల 86 వేల కలెక్షన్ చేసి, 10 వేల 631 కూలీలకు రుసుముగా ఇవ్వడం జరిగింది. కాంపా అభివృద్ధి పనుల కింద ఒక లక్ష 33 వేల పని దినాలు కల్పించడం జరిగింది.
పశు వైద్య, పశుసంవర్ధక శాఖ : పాడి పశువులకు ఒక లక్ష 75 వేల గాలి కుంటు, జబ్బ వాపు, గురక వ్యాది టీకాలను, 65 వేల లంపి చర్మవ్యాధి టీకాలను వేయడం జరిగింది. గొర్రెలలో మేకలలో చిటుకు రోగం నీలి నాలుక వ్యాధి నివారణకు 42 వేల 194 టీకాలు వేయడం జరిగింది.
పరిశ్రమల శాఖ : టీజీ ఐపాస్ క్రింద 24 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు 40 వివిధ రకముల అనుమతుల మంజూరు చేయడం జరిగింది. ఇట్టి పరిశ్రమల ద్వారా 38 కోట్ల 20 లక్షల పెట్టుబడితో 221 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. టీ ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పి.హెచ్.సి. పారిశ్రామిక వేత్తలకు 10 యూనిట్లకు 33 కోట్ల 32 లక్షల రూపాయలు రాయితి మంజూరు చేయడం జరిగింది.
పర్యాటక శాఖ : రామప్ప ఐలాండ్ వద్ద 13 కోట్ల నిధులతో అభివృద్ది పనులను, ప్రసాద్ స్కీమ్ లో భాగంగా 61 కోట్లతో యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పర్యాటక ప్రాంతం పాలంపేట గ్రామంలో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్టులు, సావనీర్ షాప్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టడం జరుగుతుంది.
రెవెన్యూ శాఖ : రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను అత్యంత పారదర్శకంగా, సరళతరంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుటకు గాను నూతన ఆర్.ఓ.ఆర్. భూ భారతి చట్టంను రూపొందించినది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి 36 వేల 673 అర్జీలను స్వీకరించి, రికార్డులు పరిశీలన అనంతరం 6 వేల 284 దరఖాస్తులను ఆమోదించడం జరిగినది. భూములను రీసర్వే నిమిత్తం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను ఎంపిక చేసిన దానిలో వెంకటాపురం మండలంలోని నూగూరు రెవెన్యూ గ్రామం ఒకటి. దీనిలో భాగంగా ప్రతి భూ భాగాన్ని సర్వే చేసి రైతుల యొక్క విభాగానికి ల్యాండ్ పార్సెల్ మ్యాప్ తయారు చేసి రైతుల యొక్క ఆమోదం ద్వారా రెవెన్యూ రికార్డులలో అప్ డేట్ చేయుటకు ప్రక్రియ మొదలైనదని తెలుపుతున్నాను.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖలు : జిల్లాలోని 48 వసతి గృహాల్లోని విద్యార్థులకు కామన్ డైట్ అమలు చేస్తున్నాం. ఆహార నాణ్యత పరిశీలనకు ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేశాం. సంక్షేమ, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార తనిఖీలు నిర్వహించడం, నాణ్యత పరిశీలనకు ప్రతి వారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రత్యేక అధికారులు వారంలో 3 రోజులు విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి నాణ్యత, సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాం. డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాం. ఈ శాఖల ద్వారా విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, బెస్ట్ అవైలబుల్ స్కీం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తదితర పథకాలు అమలు చేస్తున్నాం.
విద్య శాఖ : ఈ విద్య సంవత్సరము ఇంటర్మీడియట్ ఫలితాలలో 81.12 శాతం సాదించి ములుగు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన, విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు. ఈ విద్య సంవత్సరం కన్నాయిగూడెం మండలంలోని కే.జి.బి.వి. పాఠశాలను జూనియర్ కాలేజీగా ఉన్నతీకరించడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన, నాణ్యమైన విద్యా బోధనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 6 కోట్ల 91 లక్షలతో 239 పాఠశాలల్లో మరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 413 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 20 వేల 112 మంది విద్యార్థులకు లక్షా 27 వేల 880 ఉచిత పాఠ్య పుస్తకాలు, లక్షా 9 వేల 215 వ్రాత పుస్తకాలను పంపిణీ చేశాం.
State Minister Danasari Anasuya Seethakka
ఉద్యానశాఖ : జిల్లాలో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం, తెలంగాణ సూక్ష్మనీటి పారుదల పథకం, సమీకృత జాతీయ నూనె గింజల ఆయిల్ పామ్ పథకాలు అమలు చేస్తున్నాం. సమీకృత జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ పథకం లో భాగంగా 265 మంది రైతులకు 343.78 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు పరిపాలన అనుమతులు, 72 మంది రైతులకు 88.74 హెక్టార్లలో 33.35 లక్షల రూపాయలను సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు, రైతులు ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం12 ఎకరాల్లో ఆయిల్ ఫ్యాక్టరీకోసం కేఎన్ బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి అనుమతి ఇచ్చి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది.
సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ: బీఏ ఎకనామిక్స్ హానర్స్, ఇంగ్లీష్ హానర్స్ కోర్సులతో ప్రారంభమైన యూనివర్సిటీ లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయానికి ఎదురుగా 287 ఎకరాల రెవెన్యూ భూమిని, 50 ఎకరాల అటవీ భూమిని కేటాయించి, త్వరలో యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
మహిళా, శిశు సంక్షేమ శాఖ : ఈ సంవత్సరంలో సఖి కేంద్రం ద్వారా 196 మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. 1372 మంది గర్భిణి స్త్రీలకు, 1037 మంది పాలిచ్చే తల్లులకు ప్రతి రోజు అన్నము, పప్పు, కూరగాయలు పాలు, గుడ్డుతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాము. 5,938 మందికి 7 నెలల నుండి 3 సం.ల లోపు చిన్నారులకు నెలకు 2.5 కేజీల బాలామృతముతో పాటు 16 గుడ్లను అందిస్తున్నాము. 6 వేల 424 మందికి 3 నుండి 6 సం.ల లోపు పిల్లలకు ఒక గ్రుడ్డు, అన్నము, పప్పు, కూరగాయలు, స్నాక్స్ ప్రతి రోజు పంపిణి చేయడం జరుగుతున్నది. వికలాంగుల కోసం సదరం సర్టిఫికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేసాము. గతంలో కేవలం 7 రకాల వైకల్యాలను మాత్రమే సదరం క్యాంపులలో గుర్తించే వారు. ఇప్పుడు 21 రకాల వైకల్యాలను గుర్తించి సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాం. జిల్లాలో 600 మంది దివ్యాంగులను గుర్తించి వారికి బ్యాటరీ వీల్ చైర్స్- 150, వీల్ చైర్స్- 250, హియరింగ్ ఎయిడ్స్- 40, ట్రై సైకిల్స్ 150, మోటరైజ్డ్ వెహికల్స్ 10, అందించడం జరిగింది. జిల్లాలో ఐదుగురు దివ్యాంగులు సకలాంగులను వివాహం చేసుకున్న 3 జంటలకు లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించడం జరిగింది.
గిరిజన అభివృద్ధి శాఖ : జనవరి 28 నుండి 31 వరకు మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ మహా జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఎస్టి, ఎన్డీ.ఎఫ్ పథకంలో భాగంగా గత రెండు సంవత్సరాలలో 52 రోడ్లు, 68 కోట్ల 51 లక్షలతో మంజూరు కాగా 12 రోడ్లు పూర్తి అయినవి. మిగతావి ప్రగతిలో ఉన్నవి. 25 గ్రామ పంచాయతీ బిల్డింగ్ పనులు 5 కోట్లతో మంజూరు కాగా 2 పూర్తి అయి మిగతావి పురోగతిలో ఉన్నవి. అసిస్టెంట్ టు ఐటీడీఏ లో భాగంగా గత రెండు సంవత్సరములలో 110 పనులు 723 లక్షల 30 వేలతో మంజూరు కాగా 70 పనులు పూర్తి అయినవి. అంగన్వాడి కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలు, సబ్ సెంటర్ల రిపేర్ల నిమిత్తము 227 పనులు, 11 కోట్ల 65 లక్షలతో మంజూరు కాక 126 పనులు పూర్తయినవి. 101 పనులు పూర్తి దశలో ఉన్నవి.
రహదారులు, భవనముల శాఖ :జిల్లాలో ఎస్టి.యస్.డి.ఎఫ్., ఆర్.డి.ఎఫ్., తదితర పథకాల ద్వారా 93 పనులకు గాను 228 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. 12 పనులు పూర్తికాగా 81 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవనం (కలెక్టరేట్), నివాస గృహముల నిమిత్తం 63 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. శరవేగంగా నిర్మాణం పనులు జరుగుచున్నవి. కోర్టు సముదాయ భవన నిర్మాణం కొరకు 81 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగినది. త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది.
పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ :జిల్లాలో మహత్మా గాంధీ జాతీయ ఉపాది హామీ పథకం క్రింద 9 కోట్ల 52 లక్షల అంచనా వ్యయంతో 22 గ్రామ పంచాయతీ భవనాలు 30 అంగన్వాడి కేంద్రాలు 76 స్కూల్ టాయిలెట్స్ పనులు చేపట్టడం జరిగింది. సి.ఆర్.ఆర్. పథకం ద్వారా 73 కోట్ల 98 లక్షలతో 37 రోడ్లు, ఎం.ఆర్.ఆర్. పథకం ద్వారా 109 కోట్ల 76 లక్షలతో 62 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎఫ్ డి ఆర్, ఎస్టి ఆర్ పథకాల ద్వారా 28 కోట్ల 49 లక్షల నిధులతో 24 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. ఎస్.డి.ఎఫ్. గ్రాంటు క్రింద ఎస్.టి కాంపోనెంట్ లో 33 కోట్ల 25 లక్షల తో 10 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎస్.ఎస్.ఎం. జె. గ్రాంట్ క్రింద 7 కోట్ల 14 లక్షలతో 11 కూడలి అభివృద్ధి వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. 6 కోట్ల అంచనా వ్యయంతో 3 ఎం.పి.డి.ఓ. కార్యాలయ భవనాలు, ఒక కోటి 80 లక్షలతో 2 పి. ఆర్. సబ్ డివిజన్ ఆఫీస్ భవనాలు, 2 కోట్లతో ఒక పి.ఆర్.ఎస్. ఈ. ఆఫీస్ భవనం మంజూరు చేయడం జరిగినది.
యాస్పిరేషన్ అవార్డు : మన జిల్లాకు యాస్పిరేషన్ అంశాలలో రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లాకు అవార్డు ఇవ్వడం ఎంతో గౌరవంగా ఉంది. ఈ సందర్భంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ ని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను. మన జిల్లా యాస్పిరేషన్ నుండి ఇన్పిరేషన్ జిల్లాగా అభివృద్ధి చెంది రోల్ మాడల్ గా నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను.
పోలీస్ శాఖ : శాంతి భద్రతల పరిరక్షణకు పొలిసుశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటూ, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో నేరాలను చేధించడంతో పాటు నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమైన జిల్లా ఎస్పి, పోలిస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న మన జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారికి, జిల్లాలో ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు తమ పూర్తి సహకారం అందిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, వివిధ సంస్థల గౌరవ చైర్మన్లు. డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగ వేళ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ముగిస్తున్నాను.
నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడాతూ.. యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ 1975 లో అధికారం కొరకు, అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణిచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మరచిపోలేని చీకటి రోజు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారం, అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బిజెపి అగ్రనాయకులు అద్వానీ, వాజపేయి, మోడీ లు నినదిస్తే అణిచివేసేందుకు కుట్రలు పన్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ పరిరక్షణను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి -రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి -పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు (డివిజన్)నేటి ధాత్రి
భారత రాజ్యాంగ పరిరక్షణను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్, జై బాబు జై భీమ్ జై సంవిధన్ కార్యక్రమం పాలకుర్తి ఇంచార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లు అన్నారు.ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని హరిపిరాల గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా వారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పై ఉందన్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. అహింస శాంతి సిద్ధాంతాలను కాపాడుకునేందుకే ఏఐసీసీ ఉద్యమ కార్యక్రమమును రూపొందించింది అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఏకం కావాలని పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని,రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్,పార్టీ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్,కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి,డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు,చిత్తలూరి శ్రీనివాస్,అశోక్ రెడ్డి,చెవిటి సధాకర్, ప్రశాంతి,కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు తోట అశోక్, యూత్ అధ్యక్షుడు గద్దల మధు, మహిళా అధ్యక్షురాలు చెవిటి లింగమ్మ, స్థానిక నాయకులు వల్లపు మల్లయ్య,వల్లపు నారాయణ, రావుల కిషన్ రెడ్డి, రణధీర్ రెడ్డి,పరశురాములు, రాఘవులు,గద్దల సుజాత తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి -పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి
భారత రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని కర్కాల నుండి హరిపిరాల గ్రామ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం నిర్వహించి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేతిలో గాంధీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి,రామచంద్రయ్య, సురేందర్ రెడ్డి,అచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి,శ్రావణ్ కుమార్,చెవిటి సధాకర్,యాకూబ్ రెడ్డి,ధరావత్ సోమన్న, రవి నాయక్, ఫింగిలి ఉష, ప్రశాంతి, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరునికి ఉంది
కొత్తగూడ, నేటిధాత్రి:
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు… ములుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు వజ్జ సారయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వారి నేతృత్వంలో కొత్తగూడ మండలంలోని బుధవారం రోజు తాటి వారి వేంపల్లి. మాసంపల్లి తండా. గోపాలపురం కార్లయి గ్రామాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు అహింస శాంతి సిద్ధాంతాలను కాపాడుకోవాల్సిందుకే ఏఐసీసీ ఉద్యమ కార్యచరణ రూపొందించిందని బిజెపి తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల ఇన్చార్జి బానోత్ రూఫ్ సింగ్ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారు ప్రతి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండలాల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటింటికి భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య. చల్ల నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. లావణ్య వెంకన్న జిల్లా నాయకులు. బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి. ఇర్ప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కాడబోయిన జంపయ్య వైస్ఎంపీపీ. బొల్లు రమేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్. కాయితోజు ఉపేంద్ర చారి బ్లాక్ కమిటీ నాయకులు. నోముల ప్రశాంత్ జిల్లా యూత్ నాయకులు. కే దాసు ప్రసాద్ క్లస్టర్. తాటి వారి వేంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షురాలు తాటి వసంత. కార్లయి గ్రామ కమిటీ అధ్యక్షులు ఇర్ఫ వెంకన్న.మాసంపల్లి తండా గూగుల్ భీమా. గోపాలపురం అధ్యక్షులు సుధాకర్ శ్రీను. తాటి వారి వేంపల్లి సోలం వెంకన్న కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.