మహదేవపూర్ బాధిత కుటుంబాలను బీజేపీ నేతలు పరామర్శ…

బాధిత కుటుంబాలను పరామర్శించినబీజేపీ రాష్ట్ర నాయకులుచల్లనారాయణ రెడ్డి**

* మహదేవపూర్ సెప్టెంబర్ 13 (నేటి ధాత్రి *

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి రాంశెట్టి సమ్మయ్యని పరామర్శించి ప్రమాదంకు సంబదించిన పరిస్థితులను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అలాగే
గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో హాస్టల్స్ లో డైలీ వెజ్, కాoటినింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కరానికై చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం వెంటనే వర్కర్ల సమస్యల పరిష్కరానికి కృషి చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది,
మహాదేవపూర్ మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో గురువారం గోదావరి తీరా ప్రాంతంలో పిడుగు పాటుకు మృతి చెందిన 94 గోర్లు, వాటి కాపరులను పరామర్శించి, అనంతరం మాట్లాడుతూ పశు సంబంధిత అధికారులు, కలెక్టర్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది,అలాగే 94 మృతి చెందిన గోర్లతో పాటు ఇంకో 30 గోర్లు కూడా చనిపోయే పరిస్థితి లో వున్నవి కాబట్టి వాటిని కూడా కలుపుకొని ఆర్థిక సహాయం చేయాలనీ, గొర్ల యొక్క విలువ మొత్తం 14 లక్షల నుంచి 15లక్షలు వరకు ఉంటుందని,కానీ ప్రభుత్వ సహాయం కింద గొర్రెకు 5000 వేలు నష్ట పరిహారం ఇస్తూ బాధిత కుటుంబలు 9 లక్షల వరకు నష్ట పోతుందని, ఆలా కాకుండా 14 లక్షలు అన్నిటి విలువ కట్టి ప్రభుత్వo ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు, అలాగె బీజేపీ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల శంకర్ శంకర్,లింగంపల్లి వంశీదర్ రావు,శ్రావణ్, బీజేపీ మండల నాయకులు ఆడప లక్ష్మి నారాయణ, కొక్కు శ్రీనివా స్, సాగర్ల రవీందర్, దాడిగేలా వెంకటేష్, రాకేష్, అయ్యప్పతో పాటు పలువురు పాల్గొన్నారు

మాజీ జెడ్పిటీసి అంతిమయాత్రలో పాల్గొన్న గజ్జి విష్ణు…

మాజీ జెడ్పిటీసి అంతిమయాత్రలో పాల్గొన్న గజ్జి విష్ణు

 

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన సిలివేరు మొగిలి మాజీ జడ్పీటీసీ మరణించగా అంతిమయాత్రలో సూర్య హాస్పిటల్ ఎండి డాక్టర్.సురేష్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సూర్య ట్రస్ట్ చైర్మన్ గజ్జి విష్ణు మొగిలి పార్థివదేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి దైర్యం చెప్పి వారి కుటుంబానికి రూపాయలు 5000 ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో కొగిల్వయి చందు,పెంచల రాజెందర్,సిలివేరు చిరంజీవి,సిలివేరు వెంకటేష్,రాఘవ,వినయ్,రంజిత్,సాయి,దయ,ఈ అంతిమయాత్ర లో పాల్గొన్నారు.

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటా…

పీరియ నాయక్ కుటుంబానికి ఆర్థిక చేయూత

నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్

కేసముద్రం/ నేటి ధాత్రి

సబ్ స్టేషన్ తండ వాస్తవ్యులు బానోత్ పీరియా నాయక్ గ్రామ పంపు ఆపరేటర్ గా గత కొన్ని సంవత్సరాలు పని చేశారు కావున మాజీ సర్పంచ్ కి”శే”గుగులోతు వెంకన్న కుటుంబ సమక్షంలో మంగళవారం పెద్దకర్మ సందర్భముగా మానుకోట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాదావత్ పవన్ కళ్యాణ్ నాయక్ పీరియ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మానవత్వంతో ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి నగదుగా 6000 /- రూపాయలు అందజేయడం జరిగింది బానోత్ పిరియా నాయక్ భార్య బానోత్ బిచ్చాలి మరియు తన కుమారుడు బానోతు సురేందర్ కూతురు సంగీత కు ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటానని ప్రభుత్వం ద్వారా లబ్ది చేకూర్చే పథకాలు ఏమైనా ఉంటే నా వంతు సహాయంగా తప్పకుండా మీ కుటుంబానికి అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
గుగులోత్ శివుడు
గూగులోత్ సుక్యనాయక్
గుగులోతు నరేష్ (బోయ)
గుగులోతు విజయ్ నాయక్
గ్రామ పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్…

ఆపదలో భరోసా సీఎంఆర్ఎఫ్

గంగాధర నేటిధాత్రి :

 

అనారోగ్యంతో బాధపడుతూ, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసా కల్పిస్తోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ. 22,56,500/- విలువైన ఆర్థిక సహాయం మంజూరు అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు శనివారం గంగాధర మండలం మధురానగర్ లోని ఎమ్మెల్యే ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపదలో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ తోట కరుణాకర్, బుర్గు గంగన్న,సాగి అజయ్ రావు,సత్తు కనుకయ్య, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రెండ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గరికంటి కరుణాకర్,ముచ్చ శంకరయ్య,దొమ కొండ మహేష్, మల్లయ్య, శంకర్,మ్యాక వినోద్,ఎమిరెడ్డి నాగేంద్రర్ , శ్రీనివాస్, మంత్రి మహేందర్, పవుల్, నారాయణ ,తదితరులు పాల్గొన్నారు.

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-26T133713.630-1.wav?_=1

హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఆసక్తిగా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గ్రామానికి మంజూరైన 58 ఇండ్లలో ఇప్పటివరకు 46 మంది లబ్దిదారులు బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. ఈ దశలో పనులు పూర్తి చేసిన ప్రతి లబ్దిదారుడికి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున వారి ఖాతాలలో జమ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ వివరించారుసోమవారం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, రమేష్, శుకూర్ మియా తదితరులు పాల్గొన్నారు.

పేదలకందిన సీఎంఆర్ఎఫ్ చెక్కు….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-58-3.wav?_=2

పేదల వైద్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

*-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి *

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ టౌన్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి నివాసంలో గురువారం కోహీర్ మండలం మనియార్ పల్లీ గ్రామానికి చెందిన బి.బుజ్జమ్మ 60,000 /- (ఆరవై వేలరూపాయల) ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారు భర్తకు సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షద్ పటేల్,శ్రీకాంత్ రెడ్డి,అక్బర్,జుబెర్,అశ్విన్ పాటిల్,అరుణ్,నరేష్ బబ్లూ,బి.మల్లికార్జున్,ఇమామ్ పటేల్,మహ్మద్.గౌసోద్దీన్,నర్సింహా యాదవ్,మానియార్ పల్లీ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్,మోహీన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/congress.wav?_=3

సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత..

రామాయంపేట,  నేటి ధాత్రి 

రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డుకు చెందిన బీర సత్యనారాయణకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు. గౌరవనీయులైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఈ ఆర్థిక సహాయం లభించిందని స్థానిక నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి మాట్లాడుతూ
ప్రభుత్వం అందిస్తున్న సాయం లబ్ధిదారులకు ఉపయుక్తమవుతుందని, అవసరమైన వారు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డేమే యాదగిరి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకట్. బిర రామచంద్రం. మంగలి సత్యం. దోనేటి గోపాల్. మంగళ్ పవన్. వివేక్ తదితరులు పాల్గొన్నారు.

తొర్రూరులో పరామర్శ కార్యక్రమం…

అధైర్య పడొద్దు అండగా ఉంటాం

తొర్రూరు పట్టణంలో శ్రద్ధాంజలి, పరామర్శ కార్యక్రమాలు నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు.

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు పట్టణంలోని 16వ వార్డుకు చెందిన గుర్రాల మధుకర్ రెడ్డి కుమారుడు సాయి నవనీత్ రెడ్డి ఇటీవల మృతిచెందగా, ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

తదనంతరం, పట్టణంలోని 2వ వార్డులో సీతమ్మగారు ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.

Condolence Meet in Torrur

ఈ కార్యక్రమాల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమరాజ శేఖర్, సీనియర్ నాయకులు పెద్దగాని సోమన్న, తునం శ్రావణ్, బసనా బోయిన రాజేష్ యాదవ్, చెవిటి సుధాకర్, అలాగే పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు

అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డ్ ను…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T161527.757-1.wav?_=4

 

అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డ్ ను
ఆదుకున్న పోలీస్ శాఖ అధికారులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

 

 

సిరిసిల్ల జిల్లాలో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ,అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్ కి జిల్లా పోలీస్ యంత్రాంగం బాసటగా నిలిచి స్వచ్ఛందంగా (55,000/- రూపాయలు) జమచేసి వారి కుటుంబా సభ్యులకు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐ.పి.ఎస్ చేతుల మీదుగా శివకుమార్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగినది.పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని,తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఎస్పీ అన్నారు.ఈ సందర్భంగా ఆర్.ఐ లు యాదగిరి,రమేష్, పోలీస్ శాఖ అధికారులు మరియు శివకుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో ఎంఐఎం నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-33-4.wav?_=5

సీఎం రిలీఫ్ ఫండ్ చక్కులను అందజేసిన ఎంఐఎం పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఏఐఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఒవైసీ, కౌసర్ మొహియుద్దీన్, ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఇమ్రాన్ మొహియుద్దీన్ ఈ సందర్భంగా దిగ్వాల్ అధ్యక్షులు మహ్మద్ వాజీద్, కృష్ణాపూర్ అధ్యక్షులు మహ్మద్ యూనస్ రజా, సంపత్ సుధాకర్, సాజిద్ మునవర్ జమీల్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు..

అపదలో అండగా నిలిచే అనుమండ్ల తిరుపతి రెడ్డి…

అపదలో అండగా నిలిచే అనుమండ్ల తిరుపతి రెడ్డి…

అనుమాండ్ల మాధవ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా

సేవల పతాకం ఎగురవేస్తున్న చెర్లపాలెం గర్వకారణం

– తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

చెర్లపాలెం గ్రామానికి చెందిన అనుమండ్ల తిరుపతి రెడ్డి సమాజంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే జీవిత ధ్యేయంగా భావించి, నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ఇటు ప్రజలకు సేవ చేయడంలో తనకంటూ ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్న మన తిరుపతిరెడ్డి, నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ కార్యకర్తలను ఎల్లవేళలా వెన్ను తడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి గుర్తిస్తూ, నమ్మిన నాయకులను వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తూ తిరుపతిరెడ్డి అంటే నమ్మకానికి మరో పేరుగా నిలుస్తూ పాలకుర్తి నియోజకవర్గం లో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు..

రైతుల సంక్షేమానికి కట్టుబాటు..

వ్యవసాయ రంగంలో పారదర్శకత, పంటలకు న్యాయమైన ధరలు, మార్కెట్ సౌకర్యాల విస్తరణ వంటి పలు సంస్కరణలను అమలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విని, తక్షణ చర్యలు తీసుకోవడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. చర్లపాలెం గ్రామంలో యాదవుల భూముల దగ్గరికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న రైతులను సమస్యను దగ్గర నుండి చూసి తక్షణ సహాయంగా రైతుల కోసం రహదారి ఏర్పాటు చేసి మరియు 40 వేల రూపాయల తోటి మోరీలను ఏర్పాటు చేసి రైతుల ప్రయాణానికి సుగమం చేశారు..

హనుమాన్ల మాధవ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ – సేవకు ప్రతీక….
సమాజంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు, అనాథలు, పేద విద్యార్థుల కోసం “హనుమాన్ల మాధవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్” ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు వందలాది మందికి వైద్య సహాయం, విద్యా సహాయం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సాయం అందించారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు..

చెర్లపాలెం గ్రామంలో ప్రజల కోరిక మేరకు ఎల్లమ్మ గుడి నిర్మాణానికి తన సొంత గా రెండు లక్షల రూపాయలు ఇచ్చి ప్రజల కోరిక మేరకు గుడి నిర్మాణం పూర్తి చేసి గత నెలలో ప్రారంభించడం జరిగింది. అలాగే గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కోసం రెండు లక్షల 16 వేల రూపాయలు అందించడం జరిగింది. చర్లపాలెం మరియు గోపలగిరి గ్రామాలకు ముత్యాలమ్మ గుడిలను నిర్మించడానికి గ్రామస్తుల కోరిక మేరకు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.వైద్య ఖర్చులు భరించడం, రోగులకు సహాయం పాఠశాలల అభివృద్ధి కోసం నిధుల సమకూర్చడం,పేద విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫార్ములు, స్కాలర్‌షిప్‌లు తాగునీటి సదుపాయాల ఏర్పాటు ఆపదలో అండగా
వరదలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తిరుపతి రెడ్డి ముందుండి సహాయం అందించారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన క్షణం ఆయన వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించి సాయం అందించడం ఆయన సహజ స్వభావం.

 

భవిష్యత్ లక్ష్యం…
జిల్లా వ్యాప్తంగా ట్రస్ట్ సేవలను విస్తరించి, మరింత మంది పేదలకు, రైతులకు అండగా నిలవాలని తిరుపతి రెడ్డి సంకల్పం. గ్రామీణాభివృద్ధి, విద్యా అవకాశాల పెంపు, రైతుల సంక్షేమం ఆయన ప్రధాన లక్ష్యాలు. నియోజకవర్గంలో మరియు మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయడమే కాకుండా నమ్మిన కార్యకర్తలను వెన్న0టూ ఉంటూ ఆపదలో ఆదుకొని కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా చూడాలన్న సంకల్పం నెరవేరుతుందని ఆశిద్దాం.తన గ్రామం నుంచి మొదలైన సేవా యాత్రను జిల్లాలో వ్యాప్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అనుమండ్ల తిరుపతి రెడ్డి, “మన సమాజంలో ఎవ్వరూ ఆపదలో ఒంటరిగా ఉండకూడదు” అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.

నిరుపేద వధువుకు బిఆర్ఎస్ నాయకుడి సహాయం..

నిరుపేద వధువు వివాహానికి..
10 వేల ఆర్థికసాయం.

నిజాంపేట: నేటి ధాత్రి

నిరుపేద వధువు వివాహానికి బిఆర్ఎస్ నాయకులు కంట తిరుపతిరెడ్డి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిజాంపేట కు చెందిన మామిడాల సరిత కూతురు తేజశ్రీ, వివాహం రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగింది. వధువు వివాహానికి కంట తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ నాయకులతో కుటుంబానికి 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మావురం రాజు, సంఘ స్వామి, రాములు, తిరుమల గౌడ్, నగేష్ మవురం ఉన్నారు.

బెజ్జంకి ప్రభాకర్‌కు సీఎం సహాయ నిధి సాయం..

బెజ్జంకి ప్రభాకర్ కు రూ.21 వేల చెక్కు అందజేత.*

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు బెజ్జంకి ప్రభాకర్ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోగా ఎక్కువ మొత్తంలో ఖర్చులు అయ్యాయి.కాగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 21 వేలు మంజూరు అయ్యాయి.ఎమ్మెల్యే సూచనల మేరకు పట్టణ 21వ వార్డ్ ఇంచార్జి, మాజీ వార్డ్ మెంబర్స్ కొయ్యడి సంపత్, గాజుల రమేష్ లు ఆ చెక్కును బెజ్జంకి ప్రభాకర్ కు అందజేశారు.నిరుపేద కుటుంబాలకు చేయూతగా ముఖ్య మంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని బెజ్జంకి ప్రభాకర్ తెలియజేశారు.కార్యక్రమంలో గిరగాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T144552.380.wav?_=6

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన

◆:- శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 8 మంది లబ్ధిదారులకు చెక్కులను గాను ₹2,25,000 విలువ గల చెక్కులను క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అందజేయడం జరిగింది.

లబ్ధిదారుల వివరాలు:-

చిన్న హైదరాబాద్ కి చెందిన శారు బాయి మేఘవత్ ₹.21,000 గడి వీదికి చెందిన రైనగారి రాజ రత్నం ₹.12,000 పాండు రంగా స్ట్రీట్ కి చెందిన అమీనా సుల్తానా ₹.12,000 రంజోల్ కి చెందిన మోషప్ప ₹.60,000 & బ్యాగారి స్వప్న ₹.30,000 రచ్చన్నపేట్ కి చెందిన తర్లపల్లి ధనలక్మి ₹.39,000 & కమలాకర్ ₹.18,000 రాం నగర్ కి చెందిన దశరథ్ ₹.33,000
ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ చైర్మన్ తంజీమ్ ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,సత్యం, బరూర్ దత్తాత్రి,గణేష్,చంద్రయ్య ,దీపక్ ,అశోక్ రెడ్డి ,
తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు

2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగుడంపల్లి గ్రామానికి చెందిన చాకలి అంజమ్మ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-( 2 లక్ష రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి , ధన్యవాదాలు తెలిపారు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన వారికి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ షోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల.ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన గాలి పెళ్లి బాలకృష్ణ కి..(40000). వేల రూపాయల సీఎంఆర్ఎఫ్. చెక్కుని లబ్ధిదారులకు స్థానిక. కాంగ్రెస్ పార్టీ నాయకుల. ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు సహకరించిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. శ్రీ ఏ నుముల. రేవంత్ రెడ్డికి. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి. ప్రభుత్వ . వీప్ . వేములవాడ శాసనసభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు. శ్రీ ఆది శ్రీనివాస్ కి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. కంది గట్ల సదానందం. బై రీ. వేణు. జంగంపల్లి భాగ్యలక్ష్మి. ముందటి శారద. కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

తంగళ్ళపల్లి. నేటి దాత్రి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. అని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల. రాజు. మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో. వంగరి సుమలత. భర్త శ్రీనివాస్. వారికి 32,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును.

గ్రామ శాఖ అధ్యక్షుడు. గుగ్గిల రాములు గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ చెక్కులు రావడానికి కృషిచేసిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మానవ హక్కుల విభాగం జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. కోలా గంగారాం. కూనవేణి. వినోద్. గుగ్గిల అభిషేక్. సాయిరాం. మహేష్. సంజయ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం
గాంధీనగర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన స్వర్గస్తులైన కీర్తిశేషులు కీర్తి శ్రీకాంత్ దిన కర్మ కు హాజరైన భూపాలపల్లి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంపటి భువన సుందర్ మాజీ తాజా సర్పంచ్ మాధం మమత – సుధాకర్,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోతరాజు సురేష్, కాంగ్రెస్ నాయకులు గుడ్డేటి సురేష్, కడారి సుమన్, వేంపటి సురేందర్, పల్లెవెని రాజయ్య,బోల్ల భిక్షపతి, తుముల కుమార్, బొళ్ళశంకర్,కీర్తి శంకర్,కీర్తి భద్రయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు బొచ్చు ప్రమోద్,అందరు కలిసి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీ ల బియ్యాన్ని మరియు ఆర్థిక సాయం 2500 రూపాయలు అందించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ఆదుకొని అండగా ఉంటానని ధైర్యం చెప్పారు

ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం.

ఆనారోగ్య మహిళకు ఆర్థిక సహాయం–ఉదయం ఫౌండేషన్

రాయికల్ , జూలై 23, నేటి ధాత్రి:

మండలం అయోధ్య గ్రామానికి చెందిన తునికి జల (42) గత కొన్ని నెలలుగా షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ టాబ్లెట్స్ తీసుకుంటుంది.భర్త రాజేశం 6 సంవత్సరాల క్రితం మరణించాడు. వీరిది నిరుపేద కుటుంబం. రేకుల షెడ్ లో ఉంటూ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలల నుండి బీడీలు మానేసి మంచం పట్టి , హాస్పిటల్ కి వెళ్ళదామంటే డబ్బులు లేక ఉదయం ఫౌండేషన్ సంప్రదించాగా ఈ రోజు 5000 వేల రూపాయల ఆర్థిక సహాయన్నీ అందించారు.ఈ కార్యక్రమంలో పంచతి నరేష్, బాలరాజు, రాజేందర్, రాజశేఖర్, మహమ్మద్ అస్లాం, తోట రాజేష్ లు పాల్గొన్నారు.

బాధిత మెకానిక్ కుటుంబాలకు రూ.30 వేలు ఆర్థిక సాయం.

బాధిత మెకానిక్ కుటుంబాలకు రూ.30 వేలు ఆర్థిక సాయం

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 21:

ముగ్గురు బాధిత టు వీలర్స్ మెకానిక్స్ కు తిరుపతి టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి తెలియజేశారుతిరుపతికి చెందిన గోపాల్ (హార్ట్), చంద్రగిరి కి చెందిన చిన్న తంబి ( కిడ్నీ), తలకోనకు చెందిన సుబ్రహ్మణ్యం ( కాలు విరిగి) సమస్యలతో బాధపడుతున్న ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఆవుల ముని రెడ్డి తన తోటి అసోసియేషన్ నేతలు సభ్యులతో కలిసి అందజేశారు. అలాగే 70 మంది మెకానిక్ లకు స్పెషల్ టూల్ కిట్స్ అందజేశారు. అంతేకాకుండా బోస్ డి ఎస్ 7 కంపెనీ ఏరియా మేనేజర్ సతీష్ చంద్ర తో త్వరలో ఆ కంపెనీ బైక్ ను గురించి టూవీలర్స్ మెకానిక్లకు అవగాహన కల్పించినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణరావు సెక్రెటరీ గురు ఆచారి జాయింట్ సెక్రెటరీ తేజారెడ్డి ట్రెజరర్ బాబు కమిటీ మెంబర్లు నాగరాజు పాపయ్య మురుగ, బాధిత మెకానిక్స్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version