సిఎం,ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు…

సిఎం,ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు

పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తూనే కాంగ్రెస్ ఏమ్మెల్యే సొంత పార్టీ నాయకులతో రోడ్డు మీద ధర్నా నిర్వహించి, అధికారులను బాధ్యులను చేస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా గ్రామం, మా మండలం, మా వనరులు అంటూ ఎనలేని సవతి ప్రేమ వలకపోస్తూ చేసిన ధర్నా కార్యక్రమం తరువాత మొదటి నుండి ఇసుక అక్రమ రవాణా పై ఇసుక దోపిడీ అరికట్టాలని నిరసన కార్యక్రమాలు చేపట్టిన బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి – జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ని రాబందు అంటూ,ఇసుక మాఫియా డాన్ అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తూ, దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నిన్న టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన వాక్యలను ఖండిస్తూ మా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీస్ అధికారులు ముందస్తు అరెస్ట్ చేయగా నేడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నేతలు భూపాలపల్లి 5 ఇంక్లైన్ చౌరస్తా సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహం ముందు ఎమ్మెల్యే సీఎం దిష్టి బొమ్మలకు శవ యాత్ర నిర్వహించి, దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

8న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి..

8న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి.

చిట్యాల, నేటిధాత్రి ;

 

వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ 4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు దొడ్డే శంకర్ మాదిగ అన్నారు. శుక్రవారం ఆయన చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు పెంచి ఇస్తున్నాడు కానీ తెలంగాణలో రూ 6 వేలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాకు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులు మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
పెంచిన పింఛన్లు అమలు చేసేంతవరకు ఎంతటి పోరాటానికైనా ఎమ్మార్పీఎస్ వెనుకాడదని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version