సింగరేణి కార్మికుల సొంత ఇంటి కోసం ఓటింగ్..

సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో ఓటింగ్ ద్వారా అభిప్రాయ సేకరణ

కంపేటి రాజయ్య, బంద్ సాయిలు

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి కార్మికులకు సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో గత రెండు రోజులపాటు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా కార్మికుల అభిప్రాయాల సేకరణ చేపట్టారు.
ఈ మేరకు శనివారం స్థానిక శ్రామిక భవనంలో విలేకర్ల సమక్షంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పెట్టారు. ఈనెల 11, 12 తేదీలలో నిర్వహించిన ఓటింగ్ లో సొంతింటి కల నెరవేర్చాలని 3000 మంది కార్మికులు పాల్గొని వారీ అభిప్రాయాన్ని బ్యాలెట్ పత్రంపై తెలియజేశారు. 21 మంది సొంతిల్లు, క్వార్టర్ కావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమిటీ రాజయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ… 40 వేల మంది సింగరేణి కార్మికుల యొక్క శ్రమ ఫలితంగా వేలకోట్ల రూపాయల లాభాల్లో సింగరేణి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్లు డివిడెంట్ రూపంలో సింగరేణి చెల్లిస్తూ ఉన్నదనీ, ఇంత శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికులకు మాత్రం సొంత ఇల్లు లేకపోవడం బాధాకరమన్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 వేల సింగరేణి క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయని, 3200 క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకున్నయని తెలిపారు. వేలాదికరాల భూమి సింగరేణి ఆధీనంలో ఉందని కార్మికులకు సొంతింటి నిర్మాణానికి ఇంటి స్థలం కేటాయించి, రూ.25 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చే వరకు కార్మిక సంఘాలు సంఘాల కతీతంగా పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు బాధ్యత తీసుకోవాలని, మిగతా కార్మిక సంఘాలను ఏకం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం దేవేందర్, దీకొండ ప్రసాద్, ఎం రాజేందర్, తోట రమేష్, బిక్షపతి, రవి కుమార్, రాజాకు, శంకరు తదితరులు పాల్గొన్నారు.

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా…

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండల కేంద్రంలో
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈరోజు గురువారం గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో
రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చర్ల పల్లి చింతల నుండి లద్దబండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు.

సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి…

సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సొంత ఇంటి కోసం 200 గజాల స్థలం ఇవ్వాలి
కార్మికుడి సంవత్సర జీవితంలో మూడు నెలలు ఇన్కమ్ టాక్స్ కట్టడానికే సరిపోతున్నది అందువలన కనీసం అధికారులలాగా పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ను మాఫీ చేయాలని కోరుతున్నాం.
సింగరేణిలో రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక భూగర్భగనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు గత 18 నెలల నుండి జరగకపోవడం వలన రక్షణ విషయంలో వెనుకబడినట్లుగా భావిస్తున్నాం. నూతన బదిలీ విధానం కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
మెరుగైన క్యాడర్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతప్రమోషన్ పాలసీని తీసుకురావాలని కోరుతున్నాము
ఏరియా ఆసుపత్రులలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రిఫరల్ సిస్టంను మార్చలని మైన్ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్కు గురైన కార్మికుడిని ముందుగా డిస్పెన్సరీకి తీసుకువెళ్లడం తర్వాత ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం తర్వాత రిఫరల్ చేయడంతో చాలా సమయం వృధా అయి విలువైన ప్రాణాలను కోల్పోతున్నందున ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రి నుండే డైరెక్టుగా రిఫరల్ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
40/ లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం
ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేరుల సమస్యను వెంటనే తీర్చాలని కోరుతున్నాం
పై సమస్యల పరిష్కారానికి తగు చర్యను వెంటనే తీసుకొని సింగరేణి కార్మిక లోకానికి న్యాయం చేయాలని కోరుతున్నాం వివిధ కారణాల వలన ఉద్యోగాలను కోల్పోయిన డిస్మిస్డ్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అన్ని డివిజన్లో ఉన్న వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ లో ఇవ్వాలి సింగరేణి కార్మికుల ఎన్నికలలో వాగ్దానం చేసి ఇప్పటివరకు వాటిని అమలు చేయలేకపోతున్నారు వెంటనే అమలు చేయాలి చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు

సెప్టెంబర్ 15లోగా చీరల ఉత్పత్తి ఆర్డర్ పూర్తి చేయాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-77-2.wav?_=1

 

సెప్టెంబర్ 15లోగా చీరల ఉత్పత్తి ఆర్డర్ పూర్తి చేయాలి

ఉత్పత్తిలో వెనుకబడిన వారు వేగం పెంచాలి

రెండు షిఫ్ట్ లలో ఉత్పత్తి చేయాలి

త్వరలో ఆర్డర్ల బిల్లులు చెల్లిస్తాం

చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా
రామయ్యార్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తో సమీక్ష

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఉత్పత్తి ఆర్డర్ ను వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీలోగా పూర్తి చేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ సూచించారు. ఎస్ హెచ్ జీ సభ్యులకు అందజేసే ఏకరూప చీరల ఉత్పత్తిపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చెందిన బాధ్యులతో హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరై, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముందుగా సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బాధ్యులకు మొత్తం కేటాయించిన ఆర్డర్, వారు ఉత్పత్తి చేసిన అంశాలపై సమీక్ష చేశారు. ఉత్పత్తిలో చాలా వెనుక బడిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు ఏకరూప చీర చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు.ఈ చీరల ఉత్పత్తి ఆర్డర్ లో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ కేటాయించడం జరిగిందని వివరించారు. మొత్తం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటిదాకా దాదాపు 50 శాతం పూర్తి అయిందని వెల్లడించారు. మిగతా ఆర్డర్ ను వచ్చే నెల 15వ తేదీ లోగా ఇవ్వాలని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా పరిశ్రమ బాధ్యులు పవర్ లూమ్స్, కార్మికులు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని, ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఉత్పత్తిలో వెనుకబడిన వారు తమ ఆర్డర్ పూర్తి చేయని పరిస్థితుల్లో మిగతావారికి దానిని అందిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమ బాధ్యుల వద్ద ఉన్న వస్త్రాన్ని వెంటనే గోదాముకు తరలించాలని సూచించారు. దీంతో మిగతా ప్రక్రియ వేగంగా పూర్తి అవుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు నిరంతరం ప్రభుత్వ ఆర్డర్లు అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమలోని యంత్రాలను ఆధునీకరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. దీంతో మార్కెట్ తో పోటీ పడే అవకాశం ఉంటుందని, మరిన్ని ఆర్డర్లు వస్తాయని తెలిపారు వస్త్ర పరిశ్రమ బాధ్యులు ఆలోచన చేయాలని సూచించారు.వస్త్ర పరిశ్రమ ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు త్వరలోనే అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, జీఎస్టీ తదితర సమస్యలను పరిశ్రమ బాధ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. ఆట సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ తీసుకువెళ్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.సమీక్ష సమావేశంలో చేనేత జౌళి శాఖ జేడీ, టెస్కొ సీజీఎం ఎన్ వీ రావు, ఏడీ రాఘవరావు, అధికారులు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T164829.319.wav?_=2

 

కాంగ్రెస్ వైఫల్యాలపై, రైతుల పక్షాన బీజేపీ వినతి.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిమండలంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ఆధ్వర్యంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు బండెల రామచంద్రారెడ్డిహాజరై వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా విస్మరించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత రైతులను తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెట్టేసిందని తెలిపారు.రైతులకు ఎరువులు సమయానికి అందకపోవడం వల్ల పంట నష్టాలు తప్పవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకువచ్చి, ఎరువుల సరఫరా నిరవధికంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి మండల రెవెన్యూ అధికారి గారికి ఈ విషయాన్ని తెలియజేసాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించాలని కోరాం,” అని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.అలాగే, గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ రైతుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు బిజెపి సీనియర్ నాయకులు కృష్ణగౌడ్ జిల్లా ఉపధ్యక్షుడు బొడ నరసిహ్మ పట్టణ అధ్యక్షులు బబిదేవ్ జిల్లా కాన్సిల్ సభ్యులు కిష్టారెడ్డి మాజీ మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు రహ్మతులా, pacs వైస్ చైర్మన్ శ్యాంసుందర్, గoగధర్,మండల ప్రధాన కార్యదర్శులు బచలకుర శ్రీశైలం,శ్రీను,ముదిరాజ్ నప శివ, ఉపాదేక్షులు బాలకృష్ణ, రాజశేఖర్, పానుగంటిశివ,మంద రజురెడ్డి, లిoగారెడ్డి,నాగరాజు,సురేష్ గౌడ్, వెంకటేష్, వినయ్ రెడ్డి, అంజనేయులు,అయోధ్య, తదితరులు పాల్గొన్నారు.

*జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T162411.931-1.wav?_=3

*జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరైన..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి(నేటి ధాత్రి)ఆగస్టు 25:

 

సోమవారం చిత్తూరులోని హోటల్ భాస్కర(ఎన్
పి యస్)లో నిర్వహించిన చిత్తూరు జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర బాబు ని, లీడ్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు ని తుడా చైర్మన్ ఘనంగా సత్కరించారు. తిరుపతి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు బూత్ స్థాయి నాయకులను కలుపుకొని కార్యకర్తలకు అధిక ప్రాధాన్యతనిస్తూ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తుడా చైర్మన్ తెలియజేశారు.

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161734.060-1.wav?_=4

 

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

వరంగల్, నేటిధాత్రి

 

వరంగల్ చౌరస్తాలో మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వలన స్థానికులకు చాలా పెద్దగా భారం పడుతున్నది కావున
కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురి కార్మికులు మాట్లాడుతూ, వలస వచ్చినా కార్మికులు మేము మాట్లాడిన పనికి వాళ్ళు చానా తక్కువ ధరకు మాట్లాడి మాకు పనులు లేకుండా చేస్తున్నారు ఎందుకో మరి వాళ్లకు మా మీద కోపం మేము కలిసికట్టుగా పని చేసుకోవాలి అన్నదే మా ఉద్దేశం వాళ్లు కూడా మాతో కలిసి పని చేస్తే వాళ్లకు మంచి జీవనోపాధి ఉంటది మాకు స్థానిక యూనియన్ నిర్ణయించిన ఉపాధి ఉంటది. వాళ్లు రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిండ్రు అని, మా స్థానిక యూనియన్ నిర్ణయించిన నిర్ణయాల ప్రకారం నడవాలని కోరారు. కావున కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని, మా జీవనోపాధి పూర్తిగా ఈ రంగంపైనే ఆధారపడి ఉందనీ అన్నారు. అయితే, సరైన రీతిలో పనులు లేకపోవడం, తగిన అవకాశాలు కల్పించకపోవడం వలన మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాల నుండి వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని ఐక్యంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మా సమస్యలను గమనించి తక్షణమే పరిష్కారం చూపకపోతే, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల అసోసియేషన్ నేతలు అధ్యక్షులు సమీర్, జన్ను సునీల్, ఉపాధ్యక్షులు ఫిరోజ్, ఫయాజ్, తాజ్ ఫిరోజ్, అయూబ్, జలీల్, చెన్నూరి కిషోర్, రాజేందర్, నాసం హరీష్, సాదిక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.

బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.

హెచ్చరించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

 

చిట్యాల మండలం లోని కాల్వపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్ పై ఆగస్టు 15న జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్, ఆయన భార్యపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దాడులకు పాల్పడటం పూర్తిగా బలహీనత రాజకీయాలు అని నేతలు విమర్శించారు. ఇలాంటి దాడులు ప్రజలలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేవని, దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు.

 

దాడికి వెనుక ఉన్న పులి తిరుపతి రెడ్డి – పులి అంజిరెడ్డి గ్యాంగ్.

జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ –
ఈ దాడి వెనుక తిరుపతి రెడ్డి, పులి అంజిరెడ్డి అనుచరులే ఉన్నారని స్పష్టమవుతోంది. వారే కుట్ర పన్ని, తమ అనుచరులను ప్రేరేపించి బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్, ఆయన కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించారు.

తమ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లాభాల కోసం గ్రామంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే ధైర్యం లేక భయపడి ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి అనుచరులు గ్రామ ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, బీజేపీ కార్యకర్తలను అణగదొక్కడమే తమ రాజకీయ విధానంగా మార్చుకున్నారు. కానీ ఈ పద్ధతులు ఇకపై పనిచేయవని, ప్రజలు వారిని తిప్పికొడతారని నేతలు స్పష్టం చేశారు.

నిషిధర్ రెడ్డి గారి హెచ్చరిక

“గ్రామాల్లో బీజేపీకి విపరీతమైన ప్రజా మద్దతు లభిస్తోంది. ఈ పెరుగుతున్న శక్తిని తట్టుకోలేక ప్రత్యర్థులు దాడులకు దిగుతున్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు తాత్కాలిక లాభాల కోసం పార్టీలను మార్చే వారు కాదు. వారు దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడే నిజమైన యోధులు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీలను చిన్న పిల్లలు ఆట వస్తువులు మార్చుకున్నట్లుగా మార్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సత్యనారాయణ అనుచరుడిగా మారి మా కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించడం ప్రజలు బహిరంగంగా గమనిస్తున్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా తన అనుచరులను అణగదొక్కే రాజకీయాలకు ఉపయోగించుకోవడం బాధాకరం. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వహించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడమే ఆయన రాజకీయమైపోయింది.
ఇకనైనా మా కార్యకర్తలపై దాడులు జరిగితే బీజేపీ అస్సలు ఊరుకోదు. ప్రజాపరంగా, చట్టపరంగా గట్టి సమాధానం ఇస్తాం. ఇది మా చివరి హెచ్చరిక – ఖబర్దార్!” అని నిషిధర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రవికిరణ్
మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్టేకుమట్ల మండల అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ జిల్లా కార్యదర్శి సుదగాని శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు చక్క నరసయ్య బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అశోక్ చారి బిస్కుల రవి ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్…

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్.

హైదారాబాద్,నేటిధాత్రి:

 

 

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్ ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టిన శివ వుల్క్ందకార్ సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి సమక్షంలో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి చేతుల మీదగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శివ వుల్క్ందకార్ కు నియామక పత్రాన్ని అందజేశారు.తదనంతరం ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం,కార్మిక,కర్షక,ఉద్యోగ,విద్యార్థి,యువత,మహిళా నిరుద్యోగుల సమస్యలపై శాంతియుత ఉద్యమాలు,పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజ సేవకుల ఎన్నిక ఏప్పుడు,ఏక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని కోరారు.నూతంగా ఎన్నికైన రాష్ట్ర అద్యక్షుడు శివ వుల్క్ందకార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని క్షేత్రాస్తాయి నుండి పటిష్టమైన నాయకత్వం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు పార్టీని హక్కున చేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతానని అన్నారు. రాష్ట్ర ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేస్తానన్నారు.ప్రజ సేవా చేయడానికి పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశమని, పార్టీ వ్యవస్థాపకురాలు,జాతీయ అధ్యక్షురాలు యస్. రమాదేవి, జాతీయ,రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51.wav?_=5

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో….

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో….

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CI Krantikumar

ఎమ్మార్వో కార్యాలయంలో…..

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయం లో…….

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లో……

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి గోదాములో అగ్నిప్రమాదం…

మెట్ పల్లి ఆగస్టు 14 నేటి ధాత్రి

 

 

వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి మార్కెట్ యార్డు నందు 2000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల నాన్-నాబార్డు గోదాము నందు అగ్ని ప్రమాదం జరిగినది. ఇట్టి అగ్ని ప్రమాదం నందు సివిల్ సప్లయిన్ వారి పాత గోనె సంచులు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలిసు శాఖ, రెనెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ మరియు వివిధ శాఖలకు సంబందించిన ఉద్యోగులు మరియు కార్మికులు మంటలను అదుపులోకి తేవడానికి సహాయ సహకారాలు అందించారు.
తదుపరి తెలియజేయునది ఏమనగా, వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి అధ్యక్షులు కూన గోవర్ధన్ పైన తెలిపిన డిపార్ట్ మెంట్ వారు అందించిన సహాయ సహాకారాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

సీపీఐ తెలంగాణ 4వ రాష్ట్ర మహాసభ పిలుపు….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-41.wav?_=6

సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయండి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్

పరకాల నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్ అన్నారు.ఈసందర్బంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్నందు కార్మికులతో కలిసి పోస్టర్ లను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆగస్టు 19,21,22న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని గాజుల రామారం మహారాజు గార్డెన్లో ఈ మహాసభలు జరగనున్నాయని తెలిపారు.భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆర్భవించి దేశ సంపూర్ణ స్వతంత్ర కోసం తిరుగుబాటు చేసిన మొదటి రాజకీయపార్టీగా చరిత్ర సృష్టించిందన్నారు.మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 1000 మంది ప్రతినిధులు పాల్గొని నాలుగు రోజులు ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాటం కార్యక్రమాలను నిర్ణయిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ కార్యవర్గ సభ్యులు జక్కు రాజ్ గౌడ్,నకిరేత ఓదెలు,సిపిఐ మండల కార్యదర్శి ఇల్లందుల రాములు,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్,రైతు నిరంజన్,కుమ్మరి సదనందం తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా.!

మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడిగా సదానందం ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ కార్మికులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా సదానందం ఉపాధ్యక్షుడు కల్లేపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శి రాజేందర్ బద్రిని భూపాలపల్లి మున్సిపల్ కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షుడు సదానందం మాట్లాడుతూ కార్మికులు నామీద నమ్మకంతో నన్ను మున్సిపల్ కార్మికులు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది వారికి ఎల్లవేళలా అండగా ఉంటూ కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తాం అని వారు అన్నారు గౌరవ అధ్యక్షుడు బండారి బాబు ప్రకాష్ కమిటీ సభ్యులు జంపయ్య రాజయ్య మంజుల సునీత సతీష్ రాజేందర్ వెంకన్న రాజబాబు ఎన్నికైనారు కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు

నిత్య సేవలందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్..

నిత్య సేవలందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్

టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్

ఘనంగా ప్రపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

సామాన్య ప్రజలకు నిత్య సేవలు అందించే శ్రామికులు ఆటో డ్రైవర్స్ అని టీపీసీసీ సభ్యులు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ అన్నారు.ప్రపంచం ఆటో డ్రైవర్స్ దినోత్సవం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ర్యాలీ చేపట్టగా ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ సభ్యులు,గౌరవ అధ్యక్షులు పెండెం రామానంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆటో కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామానంద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అందించే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పారు.ఆటో డ్రైవర్లకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో కాకతీయ యూనియన్ అధ్యక్షులు ఇస్రం కుమార్,పట్టణ ఇన్చార్జి కొమ్ము వినయ్ కుమార్, ఐఎన్టియుసి నాయకులు ఆకుతోట ఇంద్రసేనారెడ్డి, పాకాల రోడ్ ఆటో యూనియన్ అధ్యక్షులు దేశి విజయ్, ఉపాధ్యక్షులు ఈదుల శ్రీను, కార్యదర్శి మండల రమేష్, కోశాధికారి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు పోగుల రాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి,మాజీ కౌన్సిలర్ యెలకంటి విజయ్,మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, ప్రధాన కార్యదర్శి బైరి మురళి,కార్యదర్శులు మోటం రవి,గిరగాని రమేష్,నాంపెల్లి వెంకటేశ్వర్లు,బూస నర్సింహరాములు,బిట్ల మనోహర్,రామగోని శ్రీనివాస్,మైధం రాకేష్, రామగోని సుధాకర్,గండు గిరివరంగంటి విక్రమ్ సాయి తదితరులు పాల్గోన్నారు.

ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి.

ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి

టిఏడియు రాష్ట్ర అడ్వాయిజరి బోర్డుమెంబర్ రాజ్ కుమార్

ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్న ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని
టిఏడియు రాష్ట్ర అడ్వాయిజరి బోర్డుమెంబర్ శానబోయిన రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (టిఏడియు)ఆధ్వర్యంలో దుగ్గొండి మండలంలోని గిర్నీబావిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో కలిసి శానబోయిన రాజ్ కుమార్ కేక్ కట్ చేసి ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.12 వేలు అమలు చేయాలి.లేబర్ కార్డ్ అందించి, 5లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటించాలని తెలిపారు.మహాలక్ష్మి పథకం వలన ఆటో డ్రైవర్ కార్మికులు రోడ్డున పడ్డాయని అవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిఏడియు మండల అధ్యక్షులు బూర రామకృష్ణ గౌడ్,
మండల గౌరవ సలహాదరుడు మోడెం విద్యాసాగర్,నాయకులు నరసింహ,కార్యదర్శి దండు రాజు, అడ్డాల అధ్యక్షులు పొగాకు దేవేందర్, తెప్పే శెంకర్, గణేష్, రాజేందర్, రహీం, ప్రశాంత్, దేవేందర్, అశోక్,రాజు, నాగరాజు, రాంరాజు, సాంబయ్య, నరేష్,సాంబమూర్తి మండలములోని అన్ని అడ్డాల డ్రైవర్ కార్మికులు పాలుగోన్నారు.

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్

కరీంనగర్, నేటిధాత్రి:

గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకై ఐక్యంగా పోరాడాలని గౌడ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ తిరుపతి గౌడ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈసందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలొ పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. యాభై ఏళ్లు దాటిన గీత కార్మికులకి పింఛన్ ఇవ్వాలని, 560జీవో ప్రకారం ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఐదు లక్షలు ఉన్నదానిని పది లక్షల రూపాయలకు పెంచాలని, గీత కార్మికులకు రెండు వేల పింఛన్ను ఐదు వేలు పెంచాలన్నారు. ప్రతి జిల్లాకు గౌడ భవనం నిర్మిస్తామని నేటికి అమలు చేయలేదని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఈత చెట్టు, తాడిచెట్లు పెట్టి వనాన్ని పెంపొందిస్తామని చెప్పారని హైదరాబాద్ గీత కార్మికుల భవనానికి పూజ చేశారని వెంటనే నిర్మించాలని గీత కార్మికులు అంటే చిన్నచూపు ప్రభుత్వం చూస్తుందని పెండింగ్ లోవున్నా ఎక్స్రిగేసియే బిల్లులు వెంటనే ఇవ్వాలని తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే వైన్ షాప్ టెండర్లలో ఇరవై ఐదు శాతం గీతా కార్మికులకే కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని రాబోయే టెండర్లలో ఇవ్వాలన్నారు. గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడి శాశ్వత వికలాంగుడు అయితే ఇరవై ఐదు వేలు, గాయాల పాలైతే పదిహేనువేల రూపాయలు బీసీ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం గతంలో ఇచ్చిందని ఇప్పుడు వాటిని ఇవ్వడం లేదని పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తిరుపతి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇచ్చిన..

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, నిరసన వ్యక్తం చేసిన ఆటో యూనియన్ సభ్యులు.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రం లో ఆటో కార్మికులు గురువారం బస్టాండ్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో ఆర్థికంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని చందుర్తి మండల ఆదర్శ ఆటో యూనియన్ కార్మికులు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి గ్యారంటీ పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. దీంతో రాష్ర్టంలోని ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆటో కార్మికులకి సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం కాకుండా రూ.15వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమానికి ఆటో సంక్షేమ బోర్డుగాని, ఆటో కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల లాంటి సంక్షేమ పథకంలో ఆటో కార్మికులకు 10 శాతం ఇళ్లు కేటాయించాలని శేషు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం..

బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం

మొగుళ్ళపల్లిబిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బలుగూరి తిరుపతిరావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T151132.047.wav?_=7

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 27న జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు హాజరవుతారని ఈ సమావేశానికి మొగుళ్ళపల్లిమండల మండలంలోని ఇస్సి పేట గ్రామంలో మాజీ సర్పంచ్ కీ.శే కొడాలి కొమురయ్య గారి విగ్రహావిష్కరణ అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ నందు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు మండలపరిధిలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు కార్యకర్తలు , పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొగుళ్ళపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బలుగూరితిరుపతిరావు తెలిపారు

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను..

సి.ఐ.టి.యు బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.

బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు ముశం రమేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T130848.280.wav?_=8

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు ము శం రమేష్ మాట్లాడుతూ ఈనెల 27వ తారీకు ఆదివారం రోజున సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘంలో బీడీ అండ్, సిగార్ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఇట్టి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా బీడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ రమా రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి గార్లు హాజరవుతున్నారు
ఈ మహాసభలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఈ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం జరుగుతుంది.
ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎన్నికల సందర్భంగా 4000 పెన్షన్ అమలు చేస్తానని ఇప్పటికి కూడా అమలు చేయకుండా పోయింది
బీడీ కార్మికులను విపరీతంగా దోపిడీ చేస్తున్న కంపెనీ యజమానులపై ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో బీడీ కంపెనీలో బీడీ కంపెనీ యజమాన్యం విపరీతమైన దోపిడీకి పాల్పడతా ఉంది ప్రతి కార్మికుల నుండి కంపెనీ యజమానులు 2000 కూలీని దోచుకుంటున్నారు అనేక రకాల పేర్లతో కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.పెద్ద మొత్తంలో బీడీల నుండి ఆదాయం వస్తున్న కూడా బీడీ కార్మికులకు పనికి తగ్గ వేతనం నిర్ణయించడం లేదు రాబోయే కాలంలో బీడీ కార్మికులందరికీ పిఎఫ్ తో సంబంధం లేకుండా నాలుగు వేల పెన్షన్ అమలు చేయాలని కనీస వేతనం 1000 బీడీలకు 600 రూపాయలు చెల్లించాలని ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పీఎఫ్ అమలు చేయాలని 2000 బీడీల కోత విధించకుండా చేయాలని 26 రోజుల పని కల్పించాలని బీడీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని నాణ్యమైన ఆకు తంబాకు అందించాలని ము శం రమేష్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్, చంద్ర జిందo కమలాకర్, దాసరి రూప, బేజిగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

నిండిన మురికి కాలువను పూడిక తీస్తున్న మున్సిపల్ కార్మికులు.

నిండిన మురికి కాలువను పూడిక తీస్తున్న మున్సిపల్ కార్మికులు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-6-1.wav?_=9

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి పట్టణంలో హై స్కూల్ రోడ్డు రామాటాకీస్ దగ్గర మురికి కాలువ నిండిపోయినదని ఈ విషయం 15 వవార్డు మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టి కి తీసుకుపోవడంతో ఆయన వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి స్పందించి కార్మికులను పంపి మురికి కాలువ ను పూడిక తీయించారని మాజి కౌన్సిలర్ బండారు కృష్ణ తెలిపారు ఈ మేరకు వార్డు ప్రజల తరఫున మున్సిపల్ అధికారులకు ఒక కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version