మహిళా విరోధి కాంగ్రెస్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.

మహిళా విరోధి కాంగ్రెస్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి.

బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు

భూపాలపల్లి నేటిధాత్రి

 

చట్టసభల్లో నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుని కుటిల బుద్ధి చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా ఆ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నేతలు, ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ
చట్టసభల్లో సీట్ల పెంపు పెంచిన సీట్లలో మహిళా రిజర్వేషన్ అమలుకి సంబంధించిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ మహిళా విరోధి బుద్ది మరోసారి చూపెట్టుకుంది, ఈ బిల్లు పాస్ అయి అమలు జరిగితే లోకసభలో దాదాపు 300 మంది మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది అందులో సుమారు 70 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో చట్ట సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కేది, ఇలాంటి బిల్లును అడ్డుకుని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్లు చెప్పే మహిళా సాధికారత మహిళలను మోసం చేయడం అని నిరూపించుకుంది.

గతంలో కూడా ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది, దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, సిఎఏ జిఎస్టి అమలు బిల్లులను అడ్డుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ ది, రామ మందిర్ నిర్మాణాన్ని, పాకిస్థాన్ పై చర్యలను వ్యతిరేకించిన దౌర్భాగ్య చరిత్ర కాంగ్రెస్ ది. కాంగ్రెస్ మద్దతుతో అవసరం లేకుండానే ఎన్నో ముఖ్యమైన బిల్లులను ఆమోదించి అమలు చేస్తున్న ప్రభుత్వం మాది, మోదీ నాయకత్వంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కూడా త్వరలో అమలు చేసి తీరుతాం. బిల్లును అడ్డుకుని మహిళా విరోధి బుద్ధి చూపెట్టిన కాంగ్రెస్ ని మహిళా లోకం ముందు దోషిగా నిలబెడతామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ని మహిళలు రాజకీయంగా సమాధి చేయడం ఖాయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ మాజీ మండల అధ్యక్షుడు దేశెట్టి గోపాల్ జిల్లా నాయకుడు కూర సురేందర్ రెడ్డి మాజీ బీజేవై మండల అధ్యక్షుడు పంజాల కుమార్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి బండారి సమ్మయ్య బూతు అధ్యక్షులు సుబ్బక్క పల్లె సర్పంచ్ బొడ్డు రాజేందర్ కనిగంటి వెంకటేష్ శ్రీను రమేష్ దేశెట్టి రవీందర్ తదితరు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

అంబేద్కర్ ఆశయా సాధనకై నరేంద్ర మోదీ పాలన.

అంబేద్కర్ ఆశయా సాధనకై నరేంద్ర మోదీ పాలన.

#భాజపా మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.భారతరత్న డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్135వ జయంతిని పురస్కరించుకొని బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి పండ్ల పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వినయ్ గౌడ్ మాట్లాడుతూ. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా ఈ దేశాన్ని ప్రధాని మోదీ మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.సమాజంలో అసమానతలను తొలగించి,సకల జనులకు సమన్యాయం చేకూర్చాలన్న బాబాసాహెబ్ ఆశయాలను నిజం చేస్తూ.. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని,సామాజిక సాధికారత దిశగా మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రక అడుగులే ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళులు అన్నారు.బీజేపీ ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ కు అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని ప్రధానం చేసిందని,భారతదేశపు సామాజిక నిర్మాణాన్ని అద్వితీయ పాత్రను పోషించిన అత్యున్నత పురస్కారమిచ్చి గౌరవించుకుంది బిజెపి పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి, గుర్రపు నరేష్, మండల కార్యదర్శులు ఓదెల అశోక్,పున్నం కృష్ణమూర్తి,పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల కోటి, వల్లే పర్వతాలు,ఎస్సీ మోర్చా మండల నాయకుడు జన్ను మధు, యువ మోర్చా మండల అధ్యక్షుడు తిమ్మాపురం శివ, నాయకులు ములుక రాజేష్, ధర్మారం క్రాంతి కుమార్,కొనకటి సుధాకర్,బల్ల రాజు,ఈర్ల రవి, మార్తా రవీందర్,దొమ్మటి బచ్చలు తదితరులు పాల్గొన్నారు.

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ

 

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివరాల్లోకి వెళితే..

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రాష్ట్రంలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొన్న మోదీ, ప్రస్తుత అధికార పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం భయాందోళనలకు గురవుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు భద్రత కల్పిస్తామని, రాజకీయ హింసలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణ

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టి

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డ

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన 

అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నా

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్య

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్

అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర్

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణ

మహిళలు, బాలికలపై దాడులు చేస్తే చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు.. సోదాలు చేపట్టి

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డ

మనీ ప్లాంట్‌ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం

సమ్మర్‌లో రోజూ షూ వేసుకుంటున్నారా? ఈ తప్పులు చేయకండి

ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన 

అమరావతిపై పనులపై వైసీపీవి అన్నీ తప్పుడు ప్రచారాలే: మంత్రి నా

అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్య

ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్.. హైకోర్టు స్టే ఆర్డర్

అసలు వాస్తవాలు కనుమరుగు చేసే మ్యాజిక్ ‘మావిగన్’

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర

పూర్బ బర్ధమాన్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ‘పశ్చిమ బెంగాల్ నుంచి చొరబాటుదారులందరినీ తరిమేస్తాం. అలాంటి వారికి మద్దతునిచ్చి, వారు ఇక్కడ స్థిరపడటానికి సహాయపడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. అమాయక ప్రజలపై, రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెడతాం. అవినీతి, శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం. ప్రతి టీఎంసీ గూండా, సిండికేట్, అవినీతిపరుడైన ఎమ్మెల్యే లేదా మంత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు అమలు అవుతున్న పథకాలను బీజేపీ అడ్డుకోదు. మేం అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే పశ్చిమ బెంగాల్‌లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తాం’ అని అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు కొండబోయిన నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో నాగారం డివిజన్‌లో పెద్ద ఎత్తున బీజేపీ జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతుందని తెలిపారు.
47 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పార్టీ నాయకులు, కార్యకర్తల త్యాగాల వల్లే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే భావంతో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే పార్టీ లక్ష్యమని చెప్పారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలు చేరాలనే లక్ష్యంతో బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగారం డివిజన్‌ ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నాగారం డివిజన్‌లో సుమారు 20 బూత్‌లలో జెండాలు ఎగరవేయడం పార్టీ ఎదుగుదలకు మంచి పరిణామమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మునిగంటి సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్యామ్ సుందర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి బుధవరం లక్ష్మి, మాజీ ఎంపిటిసి తరిగొప్పుల బలరాం, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్ ,మాజీ పీఎస్ఎస్ డైరెక్టర్ కొండేటి ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు బొమ్మిడి బుచ్చిరెడ్డి, రామారం మహేందర్ గౌడ్, నక్క కిషోర్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షులు వల్లల శ్రీనివాస్ గౌడ్, ఎలసాని నాగరాజ్ యాదవ్, కార్యదర్శి బోల్లపు సురేందర్ రెడ్డి, సతీష్ రెడ్డి, నాయకులు శంకర్ రెడ్డి , జమ్మల శంకర్ తాటకొండ రవీందర్,బుధవరం వేణుగోపాల్, రవీందర్ రెడ్డి, సూర్య శేఖర్ రెడ్డి, నెల్లుట్ల నవీన్, మంచాల మహేందర్, జూపల్లి నరేష్, అక్కల సురేష్, భువనేశ్వరి, విజయలక్ష్మి, ముద్రగణం శ్రీనివాస్ యాదవ్, సూర్వి రాజు, రమాదేవి, షాజీ, కృష్ణ చారి, విజయ్, సతీష్ , శ్రీకాంత్ యాదవ్, బూత్ అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, కత్తురోజు అశోక్ చారి, వెంకట చారి, గుమ్మడి చంద్ర రెడ్డి, యాదగిరి, మహేష్, సంజయ్, కుమార్ యాదవ్, పొట్ట సుధాకర్, మల్యాల మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.

ఘనంగా బిజెపి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు కల్వకుర్తి బిజెపి పార్టీ కార్యాలయం పైన బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్దారి పర్వతాలు పార్టీ జెండా ను ఆవిష్కరిoచారు.
పట్టణంలోని పలు వార్డులలో బిజెపి బూత్ అధ్యక్షులు జెండాను ఆవిష్కరించారు.పార్టీకార్యాలయం, బూత్ ల వారిగా జరిగిన జెండా ఆవిష్కరణలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్,జిల్లా ఉపాధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి గుర్రాల రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు రామకృష్ణ, శ్రీరాములు,సీనియర్
నాయకులు నీరుకంటి రాఘవేందర్ గౌడ్, నారెడ్ల శేఖర్ రెడ్డి, కృష్ణ గౌడ్, పాలకూర్ల రవి గౌడ్, గంగాధర్, వంశీ నాయక్, పెద్దారి విజయ్, ధన్నోజు నరేష్ చారి, కుడుముల రాంరెడ్డి,,శివాజీ, లక్ష్మీనరసింహ, అరవింద్ రెడ్డి, కూన ప్రవీణ్, వెంకటేష్, కిరణ్ యాదవ్,శివకుమార్, రాఘవేందర్ సాగర్, హనుమంతు గౌడు,మణికంఠ గౌడ్,శేఖర్, శ్రీకాంత్,రమేష్, పట్టణ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.పార్టీ స్థాపకులకు, మహానేతలకు ఘన నివాళులు అర్పించారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిస్తూ, దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు.భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన ఈ పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుంది.అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందన్నారు.

దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ…

దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన పార్టీ బీజేపీ

#మండలంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు.

#తడుక అశోక్ గౌడ్ సీనియర్ నాయకుడు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అశోక్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం 2 ఎంపీ స్థానాలతో ప్రారంభమైన పార్టీ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ క్రమంగా తన బలాన్ని పెంచుకుందని,అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సత్తాను చాటుకున్న బీజేపీ, అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపిందన్నారు.“సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసంల భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు , మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షులు గుర్రపు నరేష్,బత్తిని కుమారస్వామి, మండల కార్యదర్శి ఓదెల అశోక్ ,కోశాధికారి మురికి మనోహర్, సీనియర్ నాయకులు వల్లే పర్వతాలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బెల్టు జోరు… కుటుంబాలు బేజారు…

బెల్టు జోరు… కుటుంబాలు బేజారు

అడ్డగోలుగా మద్యం విక్ర యాలు

పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రాత్రింబవ ళ్ళు పొద్దున్న కొడుకుయక ముందే యథెచ్చగా మద్యం వ్యాపారం కొనసాగుతుంది. బెల్టు దుకాణాల్లో జరుగుతు న్న ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించిన అధికారులు అండదండలతో అడ్డుఅదుపు లేకుండా ఈ మద్యం వ్యాపా రం దందా మండలంలో మూ డు పూలు ఆరు కాయలుగా విరజిల్లుతుంది. దీన్ని ఆసరా గా చేసుకున్న మద్యం వ్యాపా రులు ఈ దందాను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని కొనసాగిస్తున్నారు. మండ లంలో వివిధ గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నది. ప్రతి గ్రామం పల్లెలలో కిరాణా దుకాణాల కంటే ఎక్కువ మద్యం దుకాణాలే దర్శనమి స్తున్నాయి. మద్యానికి బాని సలై ఎంతో మంది పేద బతు కులు చింద్ర మౌతున్నాయి. అయినా ఎక్సైజ్ పోలీసులు యంత్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు వాళ్లకు నెలకు మాములు ఇస్తే చాలు. నాలు గు నెలలకు ఒకసారి తూతూ మంత్రంగా చుట్టపు చూపుగా తనిఖీలు నిర్వహిస్తూ చూసి చూడనట్టు వ్యవహరిస్తు న్నారు. బెల్టు షాపుల యజ మానులు ఒక బీరు, ఒక క్వాటర్ నుండి రూ. 20 నుండి రూ. 40 రూపాయల వరకు మద్యంపై అధికంగా వసూలు చేస్తున్నారు. మండ లంలో బెల్టు షాపులు ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎనీ టైం మద్యంను అరిక ట్టలేరా!

ప్రభుత్వ అనుమతి కలిగిన మద్యం దుకాణాల నిర్వహణ కు సమయపాలనలో నిబంధ న ఉంది. కానీ ఎనీ టైంమద్యం దొరికేది ఒక బెల్టు షాప్ దుకా ణాలోనే ఎనీ టైం మందును అరికట్టే వారే అధికారులు లేరా!

ఇబ్బంది పడుతున్న మహిళలు

గ్రామాల్లో అక్రమంగా వెలసిన బెల్టుషాపుల దుకాణాల వల్ల మహిళలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. మద్యం సేవిం చిన మత్తులో బెల్టు దుకాణా ల వైపు వెళ్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేసిన ఘ టనలు అనేకం చోటుచేసు కున్నాయి. ఈ బెల్టు దుకా ణాల వల్ల చెడు మార్గాలు పడుతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని సంసారాల్లో బెల్టు దుకాణాలు చిచ్చు పెడుతు న్నాయని మహిళలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. బెల్టు దుకాణాలపై అధికారులు కొరడా జరిపించాలని పలు వురు మహిళలు కోరుకుం టున్నారు.

యువతపై త్రీవప్రభావం

BJP Celebrates Foundation Day in Narsampet

 

 

 

మండలంలోని అనేక గ్రామాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా మొదలయ్యా యి. అందుబాటులో మద్యం దొరుకుతుంది. దీనివల్ల యు వత మద్యానికి బానిసై భవి ష్యత్తును నాశనం చేసుకుం టున్నారు. అధికారులు చర్య లు తీసుకోకపోతే భవిష్యత్తు లో ఇంకా ఎన్నో అనార్థాలు జరిగే ప్రమాదం ఉందని పలు వురు మేధావులు అంటున్నారు.

పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

బస్టాండ్, ఆటో స్టాండ్ ఆవ రణంలో రోడ్డు పక్కనే , కిరాణం దుకాణాల్లోచాలా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.మండల కేంద్రం నుండి గ్రామాల్లో గల్లీకోక్క మద్యం దుకాణం. దీనికి తోడు ఇక్కడ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో అనుక్షణం ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మద్యం షాపు పూర్తిగా రోడ్డుకు ఆనుకునే ఏర్పాటు చేశారు.ఈ దుకా ణంలో విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేసిన వారు దుకా ణం ముందురోడ్డుపైనే మద్యం తాగి అక్కడే పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బం దులు ఏర్పడుతున్నాయి. అదే విధంగా ఈ దుకాణం పక్కనే ఇళ్ళు ఉండడంతో మందుబాబుల ఆగడాలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుకాణం ముందు పలుసార్లు ఇక్కడ ఎదురెదురుగా వస్తున్న వాహ నాలు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్న సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదని తీవ్ర ఆరోప ణలు వస్తున్నాయి. మామ్ము ళ్లకు అలవాటు పడిన సంబం ధిత ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో లేదు.దీంతో ప్రజల సమస్యలు నిత్య కృత్యం అయ్యాయి. అంతేగాక పలు గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విచ్చ లవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న అధికారులు కిమ్మనక పోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణం నుండి ఆటోలు ఇతర వాహనాల్లో అక్రమంగా మద్యంను గ్రామాల్లో కొనసా గుతున్న బెల్ట్ షాపులకు తరలించి అధిక ధరలకు అమ్మకాలు చేపడుతున్నా రు.దీంతో తాగుబోతుల జేబులకు చిల్లులు పడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ….

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ

భాజపా జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

నర్సంపేటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నర్సంపేట, నేటిధాత్రి:

సిద్ధాంతిక నిబద్ధతతో ప్రజల మన్ననలు పొందిన పార్టీ బీజేపీ అని వరంగల్ జిల్లా కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.నర్సంపేట పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సిద్ధాంతిక నిబద్ధతతో క్రియాశీల రాజకీయాలు నెరుపుతూ ప్రజల మన్ననలు పొందిన పార్టీగా బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. 1980 ఏప్రిల్ 6న దేశ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణ మరియు అంత్యోదయ సిద్ధాంత ప్రాతిపదికన ఆవిర్భవించిన బీజేపీ అవినీతి రహిత పారదర్శక పాలనతో దేశ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

దివంగత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి సుపరిపాలనకు బాటలు వేస్తే, నేడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు వికసిత్ భారత్ లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో యువత, మహిళలు, రైతులు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, నర్సంపేట నియోజకవర్గంలో కూడా బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, పార్లమెంట్ కో-కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ జూలూరు రోజా రాణి, సీనియర్ నాయకులు గడ్డం ఆంజనేయులు, కుంభం కోమల్ రెడ్డి, బాల్నే జగన్, దుగ్యాల సమ్మయ్య, మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు, రూరల్ అధ్యక్షులు తనుగులు అంబేద్కర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, ఉపాధ్యక్షులు కొంకీసా విగ్నేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత, ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్, కందగట్ల నాగరాజు, కాసుల నాగేంద్రబాబు, ముత్యాల శ్రీనివాస్, పోనుగొటి రవీంద్ర చారి, పులిపాక అశోక్, శోభన్, చిల్వేర్ అన్వేష్, సామల ప్రవీణ్ కుమార్, ఆముదాల రమేష్, సామల సాయి, నూనె రంజిత్, కట్ల మహేందర్, నరసయ్య, అల్లం నిఖిల్, వేల్పుల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జిల్లా బీజేపీ అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ…
1980 ఏప్రిల్ 6న మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, ఈ 47 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. పార్టీ కార్యకర్తల కృషి, శ్రమ, త్యాగాలు, పోరాటాల ఫలితంగా బీజేపీ ఈ స్థాయికి ఎదిగి, కేంద్రంలో అలాగే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని పేర్కొన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌తో రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యవర్గ లు జన్నే మొగిలి పార్లమెంట్ కొ కన్వీనర్ లింగంపల్లిప్రసాద్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్ పెండ్యాల రాజు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి కార్యాలయం కార్యదర్శి వట్టం తిరుపతి మీడియా ఇంచార్జ్ మునెందర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలీఫ్, జిల్లా నాయకులు పొన్నాల కొమురన్న,తుమ్మటి రాంరెడ్డి,తాటికంటి రవి కుమార్ తాటికంటి రవికుమార్,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తీగల జగ్గయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

మండల బిజెపి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బిజెపి పార్టీ ఆఫీసులో బిజెపి మండల అధ్యక్షులు బిజెపి నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా. పార్టీ స్థాపకులకు మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ స్తూ భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్. 6. స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించిందని ప్రారంభ దశలో కేవలం రెండు ఎంపీ స్థానాలతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన పార్టీ క్రమక్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలిచుకుంటూ తన బలం పెంచుకుందని మొదటి సారి అటల్ బిహారీ వాజపేయి గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బిజెపి తన సత్తాను చాటుకుందని అనంతరం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలు సాధిస్తూ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని తెలియజేస్తూ. సబ్కా సాత్ -సబ్కా వికాస్-సబ్కా విశ్వాస్”. అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతని లక్ష్యంగా చేసుకొని దేశంలో ప్రజల ఆశీర్వాదం పొందుతూ ప్రపంచంలోనే అత్యధిక శక్తివంత దేశంగా తీర్చిదిద్దుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి యావత్ భారతదేశం ప్రజలు దీవిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తన బలం పెంచుకుందని తెలియజేస్తూ మండల బిజెపి నాయకులు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47 వ స్థాపన దివస్ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి. మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బిజెపి మరింత బలపడడానికి ఆకాంక్షించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు. ప్రధాన కార్యదర్శి ఇటికలరాజు. కోసినివిజయ్. ఇటుకల మహేందర్. యాదవ్. బోల్గంభాస్కర్ గౌడ్. బక్క శెట్టి రాజేందర్. రెడ్డి మల్ల నరసింహ. గణేష్. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.

దేశం కోసం ధర్మం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ బిజెపి.

బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల, నేటిదాత్రి :

భారతదేశంలో ఆదర్శాలకు సంస్కృతికి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ బిజెపి అని చిట్యాల మండలాధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్* అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ జన సంఘ్* , జనతా పార్టీ* నుండి 1980 ఏప్రిల్ 6వ తేదీన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి*, లాల్ కృష్ణ అద్వాని నేతృత్వంలో ఆవిర్భంచి నేటికీ 46 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను చిట్యాల మండల కేంద్రంలో గల బీజేపీ కార్యాలయంలో బిజెపి జెండా ఎగరవేయడం జరిగిందిఅని సిద్ధాంతాలకు* కట్టుబడి పనిచేస్తూ ప్రపంచంలోనే* ఎక్కువ సభ్యత్వాలు గలఅతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించిందని 2 పార్లమెంటు సీట్లతోనే ప్రారంభమై వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలో ఉండి అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దని 500 సంవత్సరాల క్రితం నెరవేరని అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు దేశభక్తిని ప్రతి పౌరునికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశం కోసం ధర్మం* కోసం దేశ ప్రజల శ్రేయస్ కోసం బిజెపి పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీనీ ఆదరించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ బిజెపి సీనియర్ నాయకులు గజానాల రవీందర్ ఓదెల శ్రీహరి సాదా సదానందం గుర్రపు రవి రాయిని శ్రీనివాస్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ పల్లాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు:

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

 

కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..

 కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో (Central Budget) తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్ష ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రేపటి పౌర్ణమి తెలంగాణకు వెలుగులు తెస్తుందా..? , చీకటి ఇస్తుందా..? చూడాలని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారీ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

తెలంగాణకు న్యాయం చేయాలి..

కనీసం ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు, ఉద్యమం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకత ఉందన్నారు. రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి తెలంగాణ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు. ఈ విషయంపై కేంద్రానికి, బీజేపీకి చివరిసారిగా గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర విద్యాసంస్థల స్థాపనకు మోదీ ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తెలంగాణకి వస్తే తాము గౌరవంగా కలుస్తున్నామని ప్రస్తావించారు. పక్క రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తే తాము తప్పు పట్టడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో…..

*కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో..

+ఘనంగా 77.వ గణ తంత్ర దినోత్సవ వేడుకలు..

తిరుపతి(నేటి ధాత్రి:

 

తిరుపతిలోని గాంధీ రోడ్డులో కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు నేతృత్వంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చమంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డా. పి.సి. రాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డా. పి.సి. రాయులు మాట్లాడుతూ, కస్తూర్భా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జనవరి 26ను దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలతో మనంగా జరుపుకుంటారని చెప్పారు. దాదాపు 200 సంవత్సరాల బొటిష్ పాలన అనంతరం 1947లో భారతదేశం స్వాతంత్ర్యం సాధించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడంతో సంపూర్ణ స్వయంప్రభుత్వం లభించిందని గుర్తు చేశారు.
ఆనాటి నుండి నేటి వరకు భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతర దేశాలతో పోటీపడుతూ ముందుకు సాగుతోందన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా కస్తూర్భా గాంధీ ట్రస్ట్ పేదలు, వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని,
భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
గాంధీ స్మృతి & దర్శన్ సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్ పేదలు, అవసరమైన వారికి సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ సమితి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుండగా, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చైర్మన్ గా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షులు
చమంతి శ్రీనివాస్, గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. సమానత్వం, న్యాయం. స్వేచ్ఛ. ఆర్థిక స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరి అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అనేక రంగాల్లో ముందుకు సాగుతోందని, గత నేతలు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా ముందుకెళోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప మేయర్ ఆర్.సి. ముని కృష్ణ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యాలయ సిబ్బంది. బండి మధుసూదన్ రెడ్డి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు..

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-16.wav?_=1

 

నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

 

బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి నటి కంగనా రనౌత్ సంతోషం వ్యక్తం చేసారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలకు అభినందనలు తెలిపారు.

ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(BMC)లో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి గండిగొట్టి బీజేపీ, శివసేన మహాయుతి కూటమి ఘనవిజయం సాధించడంపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut) సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ అందరికీ గొప్ప విజయమని అన్నారు. బీఎంసీ ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారామె. ఇదే సమయంలో గతంలో ముంబైలోని తన ఆఫీసు కూల్చివేత ఘటనను గుర్తు చేసుకుంటూ ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై విమర్శలు గుప్పించారు.
‘గతంలో నన్ను వేధించిన వారిని, నా ఇంటిని కూల్చేసిన వారిని, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోవాలని బెదిరించిన వారిని ఇప్పుడు రాష్ట్రమే వదిలేసింది. మహిళా విద్వేషులు, బంధుప్రీతి మాఫియాకు ప్రజలు సరైన చోటు చూపించారు’ అని కంగనా రనౌత్ విమర్శించారు. బాంద్రాలోని కంగనా రనౌత్ కార్యాలయంపై కొంత భాగాన్ని 2020లో బీఎంసీ అధికారులు నిబంధనల పేరుతో కూల్చేశారు. దీనిపై ముంబై కోర్టును కంగన ఆశ్రయించడంతో బీఎంసీ చర్యను కోర్టు తప్పుపట్టింది. కూల్చివేతలను ఆపాలని, ఆమెకు జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఆదేశించింది.

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్‌కు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థిని విప్లవ..

జాతీయస్థాయి వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీలకు ఎంపికైన ఎంఎల్ఆర్ఐటీ విధ్యార్థిని విప్లవ కు మర్రి రాజశేఖరరెడ్డి ప్రశంసలు

మల్కాజిగిరి నేటిధాత్రి

 

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో భాగంగా నిర్వహించిన పోటీల్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులో మూడవ సంవత్సరం చదువుతూ జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) లో చురుకుగా పాల్గొంటున్న కోడూరి విప్లవ జాతీయ స్థాయిలో జరగబోయే ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఎంపికవడం తమ కళాశాలకు గర్వకారణమని కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ సెక్రెటరీ మరియు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో నాలుగు దశల్లో క్విజ్, ఎస్సే రైటింగ్, ప్రజెంటేషన్, ఇంటర్వూ లాంటి పోటీల్లో పాల్గొన్న ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 లో తమ కళాశాలకు చెందిన కోడూరి విప్లవ జాతీయస్థాయికి ఎంపికవటం పట్ల మర్రి రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాలలో వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా తీర్చిదిద్దుతున్నామని, హ సస్టైనబిలిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో విప్లవ తన ఆలోచనలు పంచుకోనుండడం ఒక గొప్ప అవకాశమని తెలియజేస్తూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీరు విప్లవ మరియు ప్రోత్సహించిన తమ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ లను అభినందించారు.

ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఢిల్లీలోని భారత మండపంలో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీల్లో సస్టైనబులిటీ మరియు గ్రీన్ వికసిత్ భారత్ అనే అంశం మీద మాట్లాడబోతున్న విప్లవ రాణించాలని ఆకాంక్షించారు రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీనివాసరావు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాయిని ఉదయ్ రంజన్ గౌడ్ విప్లవను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి…

ప్రతి గ్రామపంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి.

#గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే.

#బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

పల్లెల్లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చిన నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి గ్రామపంచాయతీలో గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని తప్పనిసరిగా పెట్టాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూపర్డెంట్ ఆలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే 14వ, 15వ ఆర్థిక సంఘం ద్వారానే గ్రామపంచాయతీలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని అందుకనే నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో ప్రతి గ్రామ పంచాయతీ లో మీమే ఫోటోను పెడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, జిల్లా నాయకుడు బచ్చు వెంకటేశ్వరరావు, నాయకులు మురికి మనోహర్, ఓదెల అశోక్, ఊటుకూరి చిరంజీవి, శివ, కొండ్లె రమేష్ నవీన్, మధు, రవి తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తన్న బిజెపి నేతలు…

వనపర్తి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తన్న బిజెపి నేతలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు శ్రీవెంకటేశ్వర దేవాలయం నుండి మార్నింగ్ వాకింగ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు అమలు అబివృద్ది గురించి పట్టణ బిజెపి అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ బచ్చు రాం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ ప్రజలకు తెలుపుతున్నామని తెలిపేరు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని వారుపేర్కొన్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితరేషన్ ప్రధాన మంత్రి ఆవాస్ యువజన ద్వారా నాలుగు కోట్లపైగా ఇళ్ల నిర్మాణం గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జెల్ యోజన ద్వారా నల్ల కనెక్షన్లు సురక్ష బీమా ద్వారా బీమా ముద్ర రుణ సదుపాయం అదేవిధంగా ప్రధానమంత్రి స్వనిది ద్వారా వీధి వ్యాపారులకు పూచికత్తు లేని రుణాలు రైతులకు ఫసల్ బీమా యోజన బీమా క్లైముల పరిష్కారం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు మద్దతు ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి దానికి వార్షిక ఐదు లక్షల ఉచిత వైద్యం పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా 300 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌభాగ్య యోజా న ద్వారా విద్యుద్దీకరణ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ చేశారని వారు ప్రజలకు వివరించారు వార్డు ల పర్యటనలో బిజెపి రాష్ట్ర నేత అయ్యగారి ప్రభాకర్ రెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు డి నారాయణ బచ్చురాం కూన శ్రీకాంత్ పట్టణ బిజెపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని బచ్చు రాం తెలిపారు

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత్‌ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రముఖ నగరాల్లో పర్యటిస్తారు. గోట్ ఇండియా టూర్‌ 2025లో భాగంగా ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు. మెస్సీతో పాటు లూయిస్ సూరెజ్, అర్జెంటినా మిడ్ ఫీల్డర్ రోడ్రిగో డే పాల్‌లు కూడా భారత్‌లో పర్యటించనున్నారు. మెస్సీ మూడు రోజుల భారత్ టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి.

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి

భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో వై సునీల్ రావు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎలక్షన్లు బిజెపి బలపరిచిన అభ్యర్థులు గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి గ్రామం పంచాయతీలలో ఒక చీపురు కట్ట కొనాలన్న కేంద్ర నిధులను తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ తన పార్లమెంటు అభివృద్ధి కొరకై వేల కోట్ల నిధులు ఇస్తున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సొంతంగా ఫండింగ్ పెడతానని ప్రజలకు తెలియజేయుతున్నారు మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పైసలు ఇచ్చే ప్రభుత్వం లో పనిచేస్తున్న కార్యకర్తలను మీ సర్పంచి అభ్యర్థుల గెలిపించుకోండి ఇలాంటి ఒక రూపాయి ఇవ్వని అభ్యర్థులకు ఓటు వేసి గ్రామాలు అభివృద్ధికి కుంటుపడుతుందని మేము కోరడం జరుగుతుంది కావున మా అభ్యర్థులు గెలిపించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్థానిక పార్లమెంటు సభ్యుడు ప్రత్యేకమైన నిధులతో చెరువతో మీ గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు,జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహారాజు, గొడుగు వినోద్, మాడుగురి సమ్మిరెడ్డి, లింగారెడ్డి ,ముత్యాల రవీందర్, కొండల్ రెడ్డి, ఎల్లా గౌడ్, దాట్ల వీరస్వామి, పార్లపల్లి స్వామి, దసారపు అశోక్, మోటం శ్రీనివాస్, కంకల సంతోష్, మడికొండ వెంకటేష్,చేతి వెంకటేశ్వర్లు, పత్తి శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, తోడేటి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T121732.421.wav?_=2

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రైతుల కోసం చేసిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు. అన్నదాతలు వైసీపీ హయాంలో చాలా నష్టపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రెండు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
రైతులకు ఇప్పటికే రూ.14,000 ఇచ్చామని చెప్పుకొచ్చారు. త్వరలో మూడో విడతగా రూ.6,000 విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సంవత్సరానికి రూ.20,000 అన్నదాతలకు సహాయం చేశామని తెలిపారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫీల్డ్‌లోకి వచ్చి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రైతాంగం ఎన్డీఏ నాయకత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడాన్ని కూడా పూర్తిగా రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శలు చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. ఇదంతా చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమవుతోందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్‌లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లో మమేకమై వారి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version