ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయం వద్ద పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో భక్త మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మాణంలో ఉన్న భక్త మార్కండేయ ఆలయం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శివలింగానికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం గణపురం మండలం చెల్పూరు గ్రామంలో పద్మశాలి కుల బాంధవులు నిర్వహించిన భక్త మార్కండేయ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, పద్మశాలి కుల వంశోద్ధారకుడు, ధర్మ పరిరక్షకుడు అయిన భక్త మార్కండేయుని జయంతిని ఘనంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. చిన్న వయస్సులోనే శివభక్తితో సత్య–ధర్మ మార్గంలో నడిచి మృత్యువును జయించిన మహానుభావుడిగా ఆయన ఆదర్శాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. పద్మశాలి కులం ఐక్యంగా నిలిచి విద్య, ఉపాధి, సామాజిక సేవల రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగవతం బిక్షపతి, గోనె భాస్కర్, శేరు కుమారస్వామి, గుండ వీరస్వామి, పేరాల వెంకటేశం, పాసికంటి శ్రీనివాస్, కుసుమ కృష్ణమోహన్, భీమనాధిని సత్యనారాయణ, తౌటం ప్రభాకర్, అంకం నర్సయ్య, మామిడాల రవీందర్ లతొ పాటు తదితరులు పాల్గొన్నారు.

పేదరికాన్ని నిర్మూలించిన మహిళా ప్రధాని ఇందిరమ్మ…

పేదరికాన్ని నిర్మూలించిన మహిళా ప్రధాని ఇందిరమ్మ

నర్సంపేట,నేటిధాత్రి:

 

గరీబీ హఠావో నినాదంతో పేదరికారాన్ని నిర్మూలించిన ఉక్కుమహిళా మొదటి భారత మహిళా ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ అని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ అన్నారు.ఇందిరా గాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని బుదవారం నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజేందర్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం, ఇందిరమ్మ చేసిన త్యాగాలు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కష్టకాలాల్లో వారు చూపిన ధైర్యం సంకల్పం రాబోయే తరాలకు కూడా నిలుస్తాయని తెలిపారు.ఇందిరమ్మ ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేవండ్ల రాంబాబు, నర్సంపేట పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్ భాయ్, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఇస్లావత్ పద్మా బాయ్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి నూనె పద్మ, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శిలు చిప్ప నాగ, గిరగాని రమేష్, పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హసిన, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ సహాయ కార్యదర్శి దేశి లక్ష్మీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, నాడెం నాగేశ్వర్లు, పేరం బాబు రావు, గండి గిరి, రామగోని సుధాకర్, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగోని శ్రీనివాస్, గోపు మహేందర్ రెడ్డి, కిసరి వెంకటేశ్వర్లు, నాగేల్లి సారంగం, వేల్పుల కృష్ణ, మేరుగు కిరణ్, కొర్ర రాహుల్, దేశి సాయిపటేల్, భూక్యా గణేష్, వాజిత్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలు…

ఘనంగా కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

కార్తీక పౌర్ణమి రోజున జన్మించిన గౌడ కులగోత్రం,గౌడవంశం మూల పురుషుడు కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాలను గౌడ కుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోపా వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రామగోని సుధాకర్ గౌడ్ నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యుగంలో ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన వినాశకరమైన విపత్తులు వచ్చినప్పుడు మానవ వినాశనం, దైవ వినాశనం, వృక్ష వినాశనం నుంచి ప్రజల్ని కాపాడడం కోసం అవతరించిన పరమేశ్వర ప్రసాది కౌండిన్య మహాముని అని పేర్కొన్నారు. దైవ గౌడ జాతి ఆవిర్భావానికి మూలపురుషుడు గౌడ గోత్రదారి నేటికీ ఏకకుల గోత్రనామ దయంతో దేశవ్యాప్తంగా గౌడ జాతి పిలవబడుతుందని తెలిపారు.కార్తీకమాసంలో గౌడ కుల గోత్ర పూజ, గౌడ కులదైవాలను ప్రసన్నం చేసుకొని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సకల సంపదలతో దేశవ్యాప్తంగా వర్ధిల్లేల ఆశీర్వదించే పవిత్రదినం కార్తీక పౌర్ణమి రోజు అని తెలియజేశారు.అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మాజీ ఉపరాష్ట్రపతి, భారత దేశ సైన్స్ పితామహుడు స్వర్గీయ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామకృష్ణాపూర్ పట్టణ తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో చేసిన నిస్వార్ధ సేవలకు గాను అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ తెలిపారు. అబ్దుల్ అజీజ్ కు కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో పట్టణంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు…

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి

ధర్మ మార్గాన్ని చూపిన వాల్మీకి మహర్షి

జిల్లా ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

మంగళవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఎస్పీ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రామాయణం మనిషి జీవనానికి మార్గదర్శక గ్రంథమని అన్నారు ఆయన చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి.నీతి మార్గంలో నడవడమే వాల్మీకి మహర్షి కి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, డిసిఅర్భి డిఎస్పీ, ఉమామహేశ్వరావు, కార్యాలయం ఏవో, సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ,నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్ ,జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు….

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సేవలన స్మరించుకుంటూ తొలి తరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు
కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, మేనేజర్ సురేష్ రెడ్డి,రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి. శ్రావణ్ కుమార్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రదీప్, ఎ. బాబు,వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్‌లు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వీరనారి ఐలమ్మకు జిల్లా ఎస్పీ ఘనమైన నివాళులు…

వీరనారి ఐలమ్మకు జిల్లా ఎస్పీ ఘనమైన నివాళులు

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకులు

మహబూబాబాద్/ నేటి దాత్రి

చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్,

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ,
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని, బానిసత్వాన్ని బద్దలు కొట్టి సమాజానికి చైతన్యాన్ని అందించిన వీరనారి అని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐపీఎస్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీ విజయప్రతాప్, ఎస్.బి, డి.సి.ఆర్. బి సీఐ సత్యనారాయణ, ఎస్.ఐ వెంకన్న జితేందర్, ఆర్.ఎస్.ఐ శేఖర్,డిపివో అధికారులు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి

నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సేవలన స్మరించుకుంటూ తొలి తరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు
కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, మేనేజర్ సురేష్ రెడ్డి,రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి. శ్రావణ్ కుమార్, సానిటరీ ఇన్‌స్పెక్టర్లు ప్రదీప్, ఎ. బాబు,వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్‌లు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి…

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మం డల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు తదనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మరిం చుకుంటూ మండల అధ్యక్షు డు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవిత సారాన్ని గుర్తు చేశారు.పండి ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ స్థాపకులలో ఒకరు. ఆయన జీవితం ఏకత్వం, మానవతా భావన, అంత్యో దయ సిద్ధాంతాల స్పష్టమైన ప్రతీక. విద్యార్థులు, యువత మరియు ప్రజల జీవితాలను మార్గదర్శకంగా మార్చిన ఆయ న సిద్ధాంతాలు, సూత్రాలు ప్ర స్తుత సమాజానికి స్ఫూర్తి ఇస్తాయని పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ విద్యారంగం లో చేసిన సేవలు, సామాజిక సదుపాయాల పట్ల ఆయన ఇచ్చిన దృష్టి, మానవతా సూత్రాలపట్ల ఆయన ప్రతిబద్ధ తపై ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పారు. పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజంలోని అసమానతల నివారణకు మార్గం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వంటి విలువలను ప్రతిబింబి స్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, యువర్ మోర్చా జిల్లా నాయ కులు కొత్తపల్లి శ్రీకాంత్ మండ ల ఉపాధ్యక్షుడు కోమటి రాజ శేఖర్, భూత్ అధ్యక్షులు బాసా ని నవీన్,గొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు….

ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

ఏడునూతుల నిషిధర్ రెడ్డి
బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని మంజు నగర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ” జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ హాజరయ్యారు.ముందుగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ..పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సాధారణ ప్రజల కోసం, సమాజంలో చివరి అంచున ఉన్నవారి కోసం ఆలోచించిన మహానుభావుడు,ఆయన అంత్యోదయ తత్వం ‘చివరి వ్యక్తి అభ్యున్నతి’ అనే ఆలోచన నేటికీ దేశానికి మార్గదర్శనం చేస్తోంది. ప్రతి కార్యకర్త ఆయన బాటలో నడవాలి.ఆయన ఆలోచనలే మన బీజేపీకి బలమైన పునాది” అని పేర్కొన్నారు.
తరువాత జరిగిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 11 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని,ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత గౌరవాన్ని సంపాదించిందని, పేదలకు సంక్షేమ పథకాల రూపంలో మోదీ చేస్తున్న సహాయం కోట్లాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తోందని,ఉజ్వల యోజన,జనధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, హర ఘర్ విద్యుత్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. మోదీ 11 ఏళ్ల పాలనలో పారదర్శకత, అవినీతి రహితత, సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధానంగా నిలిచాయి అని వివరించారు.సింగరేణి కార్మికులు రాత్రి పగలు కష్టపడి దేశానికి “బొగ్గు సరఫరా చేస్తున్నారు.వారి శ్రమ వల్ల పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తోంది, భద్రత, వైద్యం, గృహ వసతి, బోనస్ మరియు పింఛన్ సౌకర్యాలను అందిస్తోంది. భవిష్యత్తులో కూడా వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ
“దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గారి ఆలోచనలను ప్రతి కార్యకర్త జీవన సూత్రంగా తీసుకోవాలి. బీజేపీ యొక్క ప్రతి అడుగు పేదల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే మనం కూడా ప్రజలతో మమేకమై కష్టనష్టాలను అర్థం చేసుకుంటూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య,పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి లు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, తాటికొండ రవి కిరణ్,జిల్లా కార్యదర్శి భూక్య భాగ్య,జిల్లా మీడియా కన్వీనర్ మునెందర్,కార్యాలయ కార్యదర్శి తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలసాని తిరుపతిరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్,అర్బన్ అధ్యక్షులు గీస సంపత్, రూరల్ అధ్యక్షులు పులిగుజ్జు రాజు నాయకులు సునీత,కొమరన్న, శివకృష్ణ తదితరులున్నారు.

ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T142657.332.wav?_=1

 

ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )న్యూస్

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్  హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్ డీవైఎస్ఓ రామ్ దాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, అన్సర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T141810.056-1.wav?_=2

 

సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ..

ప్రపంచదేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి వెలకట్టలేనిది..

ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరమని గుర్తించి వాటిని తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ..

రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి కలిగిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని, ప్రపంచదేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి, సేవలు మరువలేనివని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. (బుధవారం) భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… దేశానికి సమాచార, సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. యువతకు శక్తి ఇచ్చిన నాయకుడిగా రాజీవ్ గాంధీ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతారన్నారు. రాజీవ్ గాంధీ టెలీకమ్యూనికేషన్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారని అన్నారు. విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. యువత ప్రయోజనాలే లక్ష్యంగా ఐటీ, విద్య రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ రాజకీయాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 61వ రాజ్యాంగ సవరణతో ఓటేసేందుకు కనీస వయసు 21 నుండి 18 ఏళ్లకు తగ్గించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే అన్నారు. 91 పార్లమెంట్ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను యువతకు కేటాయించి తాను మాటలకారి కాదని, చేతల్లో చూపిస్తానని రాజీవ్ గాంధీ నిరూపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ జాయతి వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-53-3.wav?_=3

కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ జాయతి వేడుకలు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వనపర్తి లో ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు చీర్ల చందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తో కలిసి నిర్వహించారు
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సేవల ను కొనియాడారు కార్యకర్తలు దివంగత మాజీ ప్రధాని కి నివాళులర్పిం చి పూలమాలలు వేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సబ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఐ ఎన్ టి యు సి వర్క్స్ బోర్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మహానాయకుడు రాజీవ్ గాంధీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/congress-party-1.wav?_=4

మహానాయకుడు రాజీవ్ గాంధీ

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్

జయంతి సందర్బంగా మొక్కలు నాటిన కాంగ్రెస్ శ్రేణులు

పరకాల నేటిధాత్రి

పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో వారి పేరు మీద మొక్కలు నాటారు.ఈ సందర్బంగా కొయ్యాడా శ్రీనివాస్ మాట్లాడారు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుడు దేశం కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం విషయంలో యువకుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాజీవ్ గాంధీఅని ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవత్మకంగా మార్పులను తీసుకొచ్చారు తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారన్నారు.

టెలి కమ్యూనికేషన్స్ రక్షణ వాణిజ్య విమానా సంస్కరణాల ప్రవేశపెట్టారని విద్యా అవకాశాలు సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారని అదేవిధంగా భారత దేశ యువకులకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు వినియోగించుకోవాలని యువతీ యువకులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి దేశ రాజకీయాలలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార వాణిజ్య రంగాలలో యువకులు ముందుండాలని వారి ఆలోచన విధానంతో ఈరోజు దేశ ప్రజలందరూ సెల్ఫోన్ ల్యాప్టాప్ ఐటీ రంగాన్ని ఉపయోగించుకుంటున్నారంటే యువత మొత్తం ఐటి రంగంలో ముందున్నారంటే అది రాజీవ్ గాంధీ యొక్క ఘనత అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అన్నారు.అదేవిధంగా దేశం కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రజలే నా ప్రాణం అంటూ ప్రజాసేవలో ముందుకు సాగి ప్రాణాలర్పించిన మహా నాయకుడు రాజీవ్ గాంధని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్,బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,సమన్వ కమిటీ సభ్యులు చిన్నల గోనాథ్,ఎండి రంజాన్ అలీ, పంచగిరి జయమ్మ,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,చందుపట్ల రాఘవరెడ్డి,సదానందం గౌడ్, మడికొండ శీను,వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ ఒంటేరు శ్రవణ్ కుమార్,లక్కం వసంత,ఎండి కాయముదిన్,బొచ్చు భాస్కర్,దొమ్మటి బాబురావు,చిలువేరు రాఘవ,మహేందర్,బొచ్చు జెమిని,ఒంటేరు వరుణ్,వక్కేల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

1వ వార్డులో ఘనంగా రాజీవ్ గాంధి జయంతి

పరకాల మున్సిపాలిటిలోని ఒకటవ వార్డు సీఎస్ఐ కాలనిలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారి చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మడికొండ సంపత్ కుమార్ మాట్లాడుతూ
దేశంలో ఐటీ రంగానికి పునాదులువేసి,భారీ విదేశీ 
పెట్టుబడులను ఆకర్షించిన మార్గదర్శి,దివంగత ప్రధాని, 
భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ సమాన్వయ కమిటీ సభ్యులు నాయకులు డాక్టర్ మడికొండ శ్రీను,బొచ్చు భాస్కర్,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలువేరు రాఘవ,సదయ్య,మడికొండ రాజు,వినయ్,మహేష్
సిద్దు,కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.

దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..

దివంగత వైయస్సార్ సేవలు ఎనలేనివి..

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సేవలు తినలేనివని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైయస్అర్ ముఖ్యమంత్రిగా విద్యా, వైద్యం, ఉపాధి ఉచితంగా పేదలకు అందించారన్నారు.ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేద ప్రజలను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, మాజీ ఎంపీపీలు చుక్క రమేష్, బూర్గు రవీందర్, మండల నాయకులు కామ శోభన్, జంగిలి నగేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొలిపాక బిక్షపతి చెన్నారపు రాజు కామిశెట్టి రమేష్ మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ నాయకులు
పాల్గొన్నారు.

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు

ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు
మహాదేవపూర్ నేటి ధాత్రి :

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వారు మాట్లాడుతూ పేద ప్రజల మన్ననలు పొందిన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిఅని పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ పథకం, ఫీజు రియంబర్నమెంట్ 108 వాహనం ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు చేరవేసిన మహానేత అని కొనియాడారు వైయస్సార్ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ గారు, ఫ్యాక్స్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి గారు, మాజీ ఎంపీపీ బాన్సువాడ రాణి బాయి రామారావు గారు,మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్ గారు,మాజీ పాక్స్ చైర్మన్ వామన్ రావు గారు,అంబట్ పల్లి మాజీ సర్పంచ్ ఎరవెల్లి విలాస్ రావు గారు, దేవస్థానం డైరెక్టర్ పద్మ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తడకల జగదీశ్,దాగం సంతోష్, రాఘవేంద్ర,కడర్ల నాగరాజు, చెక్రధర్,పోత రామకృష్ణ, చెంద్రశేఖర్ రెడ్డి,అయిత తిరుపతి రెడ్డి, శంకర్, బాపు లక్ష్మయ్య తదితరులు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు పల్లె రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి పరిపాలన ప్రతి ముఖ్యమంత్రికి ఆదర్శమని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్, 108 వాహనం, పేదలకు ఆరోగ్యశ్రీ ,ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు ప్రజలకు చేరవేసిన మహానేత అని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల వేణు, బుడిగ శ్రీనివాస్, గోపతి బానేష్,గోపు రాజం,రామ కృష్ణ,బొద్దుల ప్రేమ్ సాగర్,పసరకొండ కృష్ణ,గోళ్ళ మల్లేష్,రామ్ సాయి,రవీందర్,గూడ సత్తయ్య, లచ్చులు, మహిళ నాయకురాళ్లు పందుల సునీత, కమల,జాలిగపు రాజేశ్వరి, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.

17వ పోలీస్ బెటాలియన్ లో కొణిజేటి రోశయ్య జయంతి వేడకలు.

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య జయంతి సందర్భంగా..17వ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ నందు బెటాలియన్ కమాండెంట్ M.I. సురేష్ కొనిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సదర్భంగా కమాండేంట్ మాట్లాడుతూ రోశయ్య 1933 జూలై 4వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1978 నుండి 2009 వరకు పలుసార్లు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో భాగమయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనపాటిగా పేరు పొందినారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించారు. ఆ తరువాత తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్ర గవర్నరు గా పనిచేశారు.

Assistant Commandant Jagadeeshwar Rao, officers

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జగదీశ్వరరావు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

కాశిబుగ్గ నేటిధాత్రి:

కాశిబుగ్గ 19వ డివిజన్ వివేకానంద కాలనీ రోడ్డు నెంబర్ 2 లో కోతి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు రంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ భాస్కర్ మరియు మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోరంట్ల మనోహర్, కొరవి పరమేష్, చిలువేరు శ్రీనివాస్,వేముల నాగరాజు,ములుక సురేష్,క్యాతం రంజిత్, చిలువేరు పవన్, బాల మోహన్,కత్తెరశాల భరత్, బొప్పరాతి నగేష్, బానోతు కిరణ్, గణిపాక సుధాకర్,దేవర ప్రసాద్,చిలగాని రమేష్,మార్త భాస్కర్,గుజ్జుల రాకేష్ రెడ్డి,సిలువేరు రాజు,క్యాతం రాజు, బాల రామ్మోహన్, కలివేలు శేషు, ఊరుగొండ రవీందర్,సిలువేరు రాజేష్,చిలువేరు సన్నీ, కుసుమ సారంగపాణి,వంగరి రాంప్రసాద్,వంగరి రవి, సాంబారి మల్లేశం,గోరంట్ల వరుణ్,కాశిబుగ్గ మిత్ర బృందం మరియు లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version