సామాజిక బాధ్యతలో.. ఊరికి స్వచ్ఛ సేవలో కట్టా!

`పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య ప్రణాళిక కరదీపిక.

`ప్రతి ఇల్లు నిండుగా.. పల్లెకు పండుగ.

`ఊరికోసం మన మందరం కదులుదాం.. ఊరుపేరు నిలబెడదాం.

`కట్టా రాకతో కదలిన కమలాపూర్!

`ఉత్సాహంగా సాగిన పారిశుధ్య పరిరక్షణ.

`మన ఊరు.. మన బాధ్యత ఒక వినూత్న యజ్ఞం.

`మన ఊరు.. మన బాధ్యత లో భాగంగా కట్టా శ్రమ దానం.

`సర్పంచ్ చేస్తున్న స్వచ్ఛ కమలాపూర్ కు కట్టా చేయూత.

`కన్నతల్లి, పుట్టిన ఊరు అన్నిటికన్నా గొప్పది.

`ఇల్లు ఎంత శుభ్రంగా వుంటుందో ఊరు కూడా అంతే సుందరంగా వుండాలి.

`ఊరు కోసం ఒక్క రోజు శ్రమ దానం ఎంతో ఆదర్శం.

`ప్రతి ఊరు కమలాపూర్ లా కదిలితే దేశమంతా సౌభాగ్యం.

`ప్రతి కుటుంబం ఆరోగ్యం.. ప్రతి ఊరు నందన వనం.

`ఆరోగ్యమే మహాభాగ్యము.. ఊరు స్వచ్ఛతే సుందర వనము.

`కట్టాతో కలిసి సాగిన శ్రమ దానం..స్వచ్ఛతకు శ్రీకారం.

`కమలాపూర్ లో కదిలిన యువత.. ఊరు భావితకు సరికొత్త బాట.

`ఈ యజ్ఞం ఆగకూడదు.. వారానికి ఒక్క సారి సాగినా ఊరికి జ్వరం కూడా రాదు.

` ఊరు చల్లగా వుంటే.. ఊరంతా పండగ చేసుకుంటుంది.

`ఊరు పచ్చగా వుంటే.. అందరికీ ఆరోగ్యం పంచుతుంది.

`ఊరు కళకళ లాడితే జీవితాలు కిలకిల రావాలవుతాయి.

హైదరాబాద్, నేటిధాత్రి:

ఆ ఊరు కట్టా ఓసారి రావా అనిపిలించి. నీ ఊరికి ఏదైనా సేవ చేయవా? అని పిలిచింది. తాతల నాడు ఆ ఊరికి చేసిన సేవలు ఇంకా గుర్తున్నాయని గుర్తు చేసింది. కన్న తల్లి మీద ప్రేమ, పుట్టిన ఊరి మీద మమకారం బతికున్నంత కాలం ఎవరికీ పోదు. అందుకే కమలాపూర్‌కు కట్టా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబందం వుంది. ఆ కుటుంబం తాతల నాడు ఆ ఊరి చెరువును నిర్మాణం చేశారు. చెరువుకు ప్రాణం పోశారు. ఊరికి నీటి కష్టం రాకుండా పెద్ద ఎత్తున కట్ట నిర్మాణం చేశారు. తరతరాలకు ఊరికి కల్పతరువుగా మార్చారు. ఆ చెరువు ఆ ఊరికి ఆదెవరుగా మారింది. కొన్ని కుటుంబాలకు ఆ చెరువు ఆదారమైంది. ఆదాయం ఇస్తుంది. ఊరి సాగుకు నీటిని అందిస్తుంది. ఆ ఊరు కట్టా కుటుంబాన్ని ఇంకా గుర్తు పెట్టుకుంది. ఆనాటి ఆనవాలుతో కట్టా కుటుంబానికి ప్రత్యేక స్దానం ఏర్పడింది. అప్పటి నుంచి కట్టా కుటుంబం అంటే ఊరుతో మరింత మమకారం పెరిగింది. తరాలు గడిచినా, ఊరు వదలి ఆ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వెళ్లినా, ఊరును వాళ్లు మర్చిపోలేదు. ఊరిలో వారికి ఆనవాలును వదులుకోలేదు. అందుకే సమయం చిక్కినప్ప్పుడల్లా ఊరును చూసి వస్తుంటారు. ఊరి బాగోగులు తెలుసుకుంటారు. ఊరి కోసం తమ శక్తికి మేరకు మేలు చేసి పెడుతుంటారు. ఆ పరంపర కొనసాగింపులో భాగంగా కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, ఫోన్ చేసి కట్టా రాఘవేంద్రరావును ఓసారి ఊరికి రమన్నారు. మన ఊరు..మన భాద్యత పేరుతో నెలలో రెండు శనివారాలు స్వచ్ఛ కమలాపూర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దాంతో వెంటనే స్పందించిన నేటి ధాత్రి దినపత్రికి ఎడిటర్, ధాత్రి గ్రూప్స్ చైర్మ్‌న్ కట్టా రాఘవేంద్రరావు, ఆయన కుమారుడు నేటిదాత్రి డిజిటల్ డైరక్టర్‌తో కలిసి కమలా పూర్‌కు వస్తామని మాటిచ్చారు. అన్నట్లుగానే శనివారం కమలా పూర్ చేరుకున్నారు. ఊరంతా కట్టా రాఘవేంద్రరావును ఘనంగా స్వాగతం పలికింది. స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా కట్టా రాఘవేంద్ర రావు ఊరి ప్రజలనేద్ధేశించి మాట్లాడారు. ఊరితో తమకు వున్న అనుబందాన్ని గుర్తు చేశారు. ఊరి కోసం తమ తాతలు చేసి సేవలను కొనియాడారు. సామాజిక బాద్యత అనేది తమ తాతల కాలం నుంచి వస్తుందని చెప్పారు. ఊరికోసం ఆ కాలంలోనే ఎంతో చేసిన తమ కుటుంబం, ఇప్పటికీ ఏదైనా చేయాలన్న తపన ఎప్ప్పుడూ వుంటుందన్నారు. అందుకే సర్పంచ్ పబ్బు సతీష్ కోరికను అంగీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ కుటుంuం ఆ కాలంలోనే ఊరి కోసం ఎంతో చేసిందన్నారు. కమలాపూర్ అందమైన ప్రపంచం. అది ఎప్ప్పుడూ కళకళలాడాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఊరికోసం ఇక నుంచి మనందరం కదులుదాం..ఊరి పేరు నిలబెడదాం అని యువతకు సూచించారు. ఊరంతా పచ్చగా వుండాలి. పరిశుభ్రంగా వుండాలి. పచ్చదనం వెల్లివిరియాలి. పాడి పంటలతో ఊరు సౌభాగ్యంగా వెలుగొందాలని కట్టా రాఘవేంద్రరావు సూచించారు. ముఖ్యంగా యువత తమకు వున్న సమయంలో ఒక రోజు రెండు మÖడు గంటలు కేటాయిస్తే చాలు. ఊరంతా నందనవనంగా మారిపోతుందని అన్నారు. కమలాపూర్ తెలంగాణకే కాదు, దేశానికే ఆదర్శం కావాలని కోరారు. అందుకు ఊరి పెద్దలు, యువకులు తోడ్పాటునందించాలన్నారు. కేవలం కొంత సమయం ఊరి కోసం వెచ్చిస్తే చాలు అన్నారు. ఊరంతా తల్చుకుంటే కమలాపూర్ సుందరవనంగా వెలుగొండం పెద్ద సమస్య కాదు. అందరం శ్రమ దానం చేస్తే ఊరు సుందరమయం చేయడం పెద్ద సమస్య కాదు. అయితే అందరిలోనూ అంకితభావం వుండాలి. ప్రభుత్వమే అన్ని చేయాలని అనుకోకూడదు. దేశం మనకేమిచ్చిందని అనుకోవడం కన్నా, మనం దేశానికి ఏమిస్తున్నాన్నదే ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు. మన ఇల్లు ఎంతో శుభ్రంగా వుండాలని కోరుకుంటాం. రోజుకు రెండు సార్లైనా సరే శుభ్రం చేసుకుంటాం. అలాగే మన ఊరు కూడా శుభ్రంగా వుంటే మనం ఆరోగ్యంగా వుంటాం. ఈ రోజు నేను ఊరి ప్రజల్లో చూసిన ఉత్సాహం ఎప్ప్పుడూ మర్చిపోను. తనకు సాదర స్వాగతం పలకడంతోపాటు, మీతోపాటు కలసి ఊరికోసం శ్రమ దానం చేసే అవకాశం రావడం కూడా ఎంతో ఆనందాన్ని అందించింది. ఊరి కోసం చేసే చిన్న శ్రమ దానంలో ఇంత ఆత్మ సంతృప్తి వుందా? అని కూడా మనసు పులకరించింది. మన కోసం గ్రామం పారిశుద్య పనులు నిర్వహించే వాళ్లు ఎంత కష్టపడుతున్నారో ఒక్క పూటలో మనందరికీ అర్దమౌతోంది. నిత్యం వాళ్లు ఊరి కోసం పడుతున్న శ్రమలో ఒక్క పూట సహకరిస్తే వారిని మనం ఎంతో గౌరవించినట్లౌవుతుంది. వారి సేవలు ఎంతో గొప్పవి. అవి అందరం చేయలేం. నిజం చెప్పాలంటే పారిశుద్య పనులు అనేవి ఉపాది కాదు. ఊరికి వాళ్లు చేసే సేవకు నిదర్శనమని చెప్ప్పుకోవాలి. గ్రామ సర్పంచ్ సతీష్ తీసుకున్న ఇలాంటి వినూత్నమైన యజ్ఞం నిరంతరం కొనసాగాలి. అందుకు మాతోపాటు, ఊరంతా సహకరించాలి. ఊరంతా కదలాలి. అప్ప్పుడు ఊరు పాలవెళ్లిలా మెరిపోతుంది. ఆర్యోగానికి ఆర్యోగ్యం..ఆనందానికి ఆనందం మిగులుతుంది. మన ఊరు దేశానికి ఆదర్శమౌతుంది. కట్టా రాఘవేంద్రరావు కమలాపూర్ చేరుకోగానే గ్రామ ప్రజలు ఎంతో ఆదరంగా పలకరించారు. ఆయన స్వయంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తుంటే ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించారు. ఊరి మీద ఎంత ప్రేమ వుంటే ఇలా పాలు పంచుకోగలరు అని ప్రజలు అనుకున్నారు. కట్టా రాఘవేంద్రరావుతోపాటు, ఆయన కుమారుడు మలి తరం నుంచి కట్టా శివసుబ్రహ్మణ్యం కూడా అలుపు లేకుండా వీధులు శుభ్రం చేస్తుంటే ప్రజలు ఆసక్తిగా గమనించారు. సామాజిక సేవ అనేది వారి రక్తంలోనే వుందని అనుకున్నారు. మొత్తానికి ఊరు మెచ్చేలా, పిలిచినందుకు సంతోషించేలా సేవలను అందించి శబాష్ అనిపించుకున్నారు. ఇలాగే సమయం దొరికనప్ప్పుడు ఊరికి వచ్చి వెళ్లాలని కోరారు.

బాక్స్ ఐటమ్
ఇంటర్ ర్యాంకర్ కోరం వైష్ణవికి, కట్టా శివసుబ్రహ్మణ్యం రూ.5వేల ఆర్ధిక సాయం.
కమలాపూర్ గ్రామానికి చెందిన పేద విద్యార్ధిని కోరం వైష్ణవి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి రాష్ట్రంలోనే నెంబర్ టూ ర్యాంక్‌ను సంపాదించుకున్నది. పేద కుటుంబంలో వికసించిన చదువల సరస్వతి వైష్ణవి. ఆమె చదువకు పేదరికం అడ్డు కాకూడదన్న ఆలోచనతో నేటిధాత్రి డిజిటల్ డైరెక్టర్ కట్టా శివసుబ్రహ్మణ్యం వైష్ణవికి రూ.5 నగదు ప్రోత్సాహం అందించారు. వైష్ణవి మరిన్ని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించారు. పేదరికం వల్ల చదువు ఆగిపోకూడదన్నారు. చదువులో ఎంతో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులెందరికో కట్టా రాఘవేంద్రరావు ఆర్ధిక చేయÖతనందిస్తూ వుంటారు. అలా కమాలాపూర్‌లో పేదవిద్యార్ధి గురించి తెలిసి వెంటనే వైష్ణవికి ఆర్ధిక చేయÖతనందించారు. కట్టా కుటుంబం సామాజిక సేవకు గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు. పేదవిద్యార్ధికి సాయం చేయడాన్ని గ్రామస్ధులు అభినందించారు.

ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి

బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునెందర్

భూపాలపల్లి నేటిధాత్రి

భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి గెలిచిన తరువాత తెలంగాణకు మొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా రేపు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు భూపాలపల్లి జిల్లా ప్రజలు,పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ సభకు వస్తున్నారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామల నుంచి బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు,బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.

కొనుగోలు కేంద్రలలో రైతులకు మౌలిక వసతులు కల్పించాలి

రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం.సేకరణ లక్ష్యం

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

కోదాడ, నేటి ధాత్రి:

జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కోదాడ మండలం తమ్మర బండపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్న అంచనా మేరకు జిల్లా వ్యాప్తంగా 340కి పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 25వేల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, సోమవారం ఒక్కరోజే 8900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు వివరించారు. గతంలో రోజుకు 5వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండగా వరి కోతలు ఎక్కువ కావడంతో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని రోజుకు 10వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసె లా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని మౌళిక వసతులతో పాటు తేమ కొలిచే యంత్రలు, టార్ఫలిన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. లోడింగ్ చేసిన ధాన్యాన్ని మిల్లులలో వేగంగా అన్ లోడింగ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలను వచ్చేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. కొనుగోలుకు అనుగుణంగా లారీలను ఏర్పాటు చేయాలని, అవసరం అయితే లారీల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయం సమయంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చామని, అదే విదంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో నీడ, తాగునీటి సౌకర్యం, ఓఆర్ఎస్ లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అకాల వర్షాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ అలీ, కోదాడ సొసైటీ సీఈవో మండ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌ఎస్ఎస్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం…

ఎన్‌ఎస్ఎస్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం

విద్యార్థులు సమాజ సేవలో ముందుండాలి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజు

కేసముద్రం/ నేటి ధాత్రి

https://youtu.be/iVSPrhfij-c?si=ODFRGLB-VB9BnObZ

కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఇటీవలే కేసముద్రం మండలం కొత్తూరు గ్రామంలో నిర్వహించిన ఎన్‌ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రాజు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజంలోని రుగ్మతలను అర్థం చేసుకుని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంతో సమాజానికి సేవలు అందించాలని సూచించారు. ఎన్‌ఎస్ఎస్ ద్వారా పొందిన సర్టిఫికెట్లు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమేష్ నాయక్, అధ్యాపకులు మైసయ్య, ప్రవీణ్ కుమార్, రాజు, యాదగిరి, రవి, రమాదేవి, మున్నీ, మంజుల, సలీం తదితరులు, అలాగే బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు….

గ్రామ పంచాయతీ కార్యాలయం లో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు.

కోదాడ, నేటి ధాత్రి:

https://youtu.be/iVSPrhfij-c?si=_xQ8CgKmb590KGDW

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను మంగళవారం కోదాడ మండలం తొగర్రాయి గ్రామ గ్రామపంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ లిక్కీ గురవమ్మ వెంకటయ్య, ఉపసర్పంచ్ ఉమామహేశ్వరి శీను లు బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం అన్నారు. ప్రపంచంలోని మహనీయుల జాబితాలో అగ్రగణన్యుడుగా అంబేద్కర్ ఉన్నారన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా సమ సమాజ స్థాపనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కులాలకు అతీతంగా మహనీయులను స్మరించుకోవాలని అది మనందరి బాధ్యతనీ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అవినాష్, వార్డ్ నెంబర్ పులి సంధ్య, నాగమ్మ వీరయ్య , నరేష్, దేవాలయం కమిటీ చైర్ పర్సన్ సరస్వతి మదన్ మోహన్, ఎస్సి సెల్ అధ్యక్షులు పులి సులోచన రావు, వెంకయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, ఆదం నాగరాజు, ఏడుకొండలు, సునీత, గ్రామపంచాయతీ సిబ్బంది యువకులు మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మిలర్ల మధ్య..కుల కుంపటి?

`ఎన్నికలలో గెలిచేందుకు ఇదొక్కటే దారి!

`రగులుతున్న ఆధిపత్య పంచాయతీ!

`మూడు కులాల మధ్య మూడు ముక్కలాట!

`తెలంగాణా వచ్చిన తర్వాత 12 ఏళ్లు కుర్చీ మీద ఒక కులం!

`పదేళ్లు సాగిన మరో కులం పెత్తనం!

`ఆ రెండు కులాల సంఖ్యతతో ఇంత కాలం సాగిన ఆధిపత్యం.

`ఇప్పుడు కుర్చీ కోసం మరో కులం ఆరాటం.

`కుర్చీ మాదే, పెత్తనం మాకే కావాలంటున్న ఆ కులం!

`గతంలో కుర్చీ ఒకరికి, పెత్తనం ఒకరికి పంచుకున్నారు.

`పదేళ్లు కలహం లేకుండా కాలం గడుపుకున్నారు.

`అప్పటి నుంచి మూడో కులం గుర్రుగా వుంది.

`అదును కోసం ఎదురుచూస్తూ వుంది.

`ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది.

`దానిని వినియోగించు కోవాలని మూడో కులం చూస్తోంది.

`కుర్చీ గుంజుకునే రాజకీయం మొదలైంది.

`రెండు కులాల మధ్య చీలిక తేవాలని మూడో కులం ప్రయత్నం మొదలు పెట్టింది.

`రెండు కులాలలో వున్న అసంతృప్తులను దగ్గర చేసుకోవాలని చూస్తోంది.

`విభజించి పాలించే రాజకీయం మూడో కులం జోక్యంతో మొదలైంది.

హైదరాబాద్, నేటిధాత్రి:

కులం గట్టిగా వుంటే ఎన్ని కోటలైనా కట్టొచ్చు. ఎన్ని కోటలైనా కూల్చోచ్చు. అని చరిత్రలో అనేక సాక్ష్యాలున్నాయి. అందులోనూ ఆధిపత్య కులాల మధ్య వున్న ఐక్యత, ఇతర కులాల మధ్య లేకపోవడం కూడా వారి పెత్తనానికి పెద్దరికానికి దారి వేశాయన్న నిదర్శనాలు అనేకం కనిపిస్తాయి. ఏ రంగంలో చూసినా ఏదో ఒక కులం ఆదిపత్యం కనిపిస్తుంది. అందులోనూ సామాజికంగా ఎంతో కొంత ముందున్న కులాలే పెత్తనం చేస్తుంటాయి. అందుకు ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేదు. అందుకే వారి పెత్తనం నిరంతర ప్రవాహంలా సాగుతోంది. అయితే ఆ కులాల మధ్య కూడ అప్ప్పుడప్ప్పుడు అంతరాలు, ఆక్రోషాలు, విభేదాలు పొడ చూపుతుంటాయి. అలా ఆ కులాల మద్య కుంపట్లతో చూరంటుకున్న సందర్భాలు వున్నాయి. ఇప్ప్పుడు తెలంగాణలోని మిల్లర్ల యూనియన్‌లో కూడా అదే కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, తెలంగాణ వచ్చినా ఈ పదేళ్ల కాలం పాటు ఓ కులానిది మిల్లర్ల సంఘంలో పెత్తనం, పెదరికం వుండేవి. ఆ వర్గానికే కుర్చీ కూడా ఎప్ప్పుడూ సొంతమౌతూ వుండేది. కాని తెలంగాణ వచ్చిన తర్వాత కుర్చీతోపాటు, పెత్తనం సాగిన ఓ కుýం పెత్తనం వదులుకోవాల్సి వచ్చింది. కుర్చీ తమకే వుంది కదా! అని సర్ధుకుపోవాల్సి వచ్చింది. దాంతో ఆ రెండు కులాలా మధ్య పదేళ్లపాటు డీల్ సాఫీగా సాగిపోయింది. కుర్చీలో కూర్చున్న కులం సంతోషంగానే వుంది. కుర్చీతో సంబందం లేకుండా పెత్తనం చేసిన కుýం ఆనందంగానే వుంది. కాని అప్పటి నుంచి ఓ కులం రగిలిపోతూ వుంది. తమ పెత్తనానికి దారి దొరకడం లేదని అదునుకోసం ఎదురుచూసింది. ఆ పదేళ్ల కాలం పాటు వారికి చీమ కాలంత సందుకు కూడా దొకరలేదు. అలా అని ఆ కులం కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. అనువు గాని చోల అదికులమనరాదు! కొంచెముండుటెల్ల కొదువు కాదు..కొండ అద్దమందు కొంచెమై వుండదా!! అని ఆ కులం సర్ధు కుపోయింది. కాలం కలిసి రానప్ప్పుడు ఎన్ని కేకలేసినా ఎవరికీ వినపడదు. పైగా గొంతు నొప్పి మొదలౌతుంది. అందుకే ఆ కులం సైలెంట్‌గా వుంటూ వచ్చింది. అంత మాత్రానా ఆ కులానికి పెద్దగా ప్రాదాన్యత లేదని కాదు. కాని కుర్చీ లేదు. కుర్చీ ఎక్కే అవకాశం ఆ కులానికి రాలేదు. కాని ఎంతో కొంత పెద్దరికం, పెత్తనం నడిచింది. పూర్తిగా ఆ పెత్తనం వశం చేసుకునే అవకాశం రాలేదు. ఇప్ప్పుడు వచ్చింది. అవకాశం అందిపుచ్చుకోవాలన్న ఆలోచన ఆ కులంలో మొదలైంది. గత కొంత కాలంగా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. సంఘం ఎన్నికల సమయం దగ్గరకొచ్చింది. ఎలాగైనా ఈసారి మిల్లర్ల ఎన్నికల్లో తమదే పై చేయి కావాలని ఆ కులం చూస్తోంది. అందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ఎంత అయితే పూర్తిగా వర్ వన్‌సైడ్ కావాలంటే ఆ కులం బలం ఒక్కటే చాలదు. ఆ కులానికి మిగతా రెండు కులాల మద్దతు కావాలి. అందుకు ఆ రెండు కులాలలో వున్న కొద్ది మంది అసంతప్తుల సహయసహాకారాలు అందాలి. ఎందుకంటే ఎంత పెద్ద సామాజ్య్రమైనా సరే ఎక్కడో అక్కడ ఎంతో కొంత అసంతప్తి వుంటుంది. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా పేదరికం వుంటుందన్నట్లు, ఏ కులంలోనైనా సరే ముందుకు వెళ్లలేని వాళ్లు వుంటారు. వాళ్లకు ప్రాద్యాతన పెరుగుతుందంటే, మరో కులానికి సపోర్టు చేయడానికి వెనుకాడరు. పైగా విభజించి పాలిస్తే ఏదైనా సాద్యమౌతుంది. మన దేశానికి వ్వాపారానికి వచ్చిన వారు కూడ వారి ఆధిప్యతం కోసం రాజులను విభజించారు. తర్వాత ఆంగ్లేయులే పాలించారు. ఇది అన్ని రాజకీయాలకు మూల సూత్రమైపోయింది. ఇప్ప్పుడు మిల్లర్ల ఎన్నికల సంఘానికి కూడా ఉపయోగపడుతోంది. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం అందాలంటే ఆ రెండు కులాýలో ఇబ్బందులెదుర్కొంటున్న మిల్లర్లను తమ వైపు తిప్ప్పుకుంటే చాలు అనుకుంటున్నారు. రాజకీయం రసవత్తరంగా సాగాలని చూస్తున్నారు. ఎంత సేపు ఆ కులాలలో వున్న కొంత మంది పెద్దలకు కుర్చీల మీద వున్న యావ మిల్లర్ల సమస్యల మీద లేదు. పెత్తనం మీద వున్న ఆశ మిల్లర్లకు మేలు జరిగే పరిస్దితి కనిపించడం లేదు. తెలంగాణలో ఇప్పటికీ బాయిల్డ్ రైస్ మిల్లర్లదే ఆదిపత్యం. పెత్తనం. పెద్దరికం. కాని పైకి మేడి పండులా కనిపించినా, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నా,చితకా మిల్లర్లు చాలా మంది వున్నారు. వారి సమస్యలు పెద్ద మిల్లర్లకు పట్టవు. మిల్లర్ల అసోసియేషన్ పెద్దలకు పట్టవు. కుర్చీలు ఎక్కింది ఎవరికో సాయం చేసేందుకో కాదు.. తమ స్వార్ధం కోసమే అన్నట్లు పెద్దలు వ్యవహరిస్తుంటారు. చిన్న మిల్లర్లను ఇరికించేంది వారే. చిన్న మిల్లర్లను ఇబ్బందులు పెట్టేది వాళ్లే..వాళ్లకు న్యాయం చేసినట్లు నటించి పెత్తనం చేసేది పెద్ద మిల్లర్లే..యూనియన్ పెద్దలే. ఈ విషయం చిన్న మిల్లర్లకు ఎప్పటికీ అర్దం కాదు. అర్ధమైనా సరే ఎదించే దైర్యం ఎవరూ చేయలేరు. నిజానికి యూనియన్ పెద్దలు చిన్న మిల్లర్ల పరిష్కారం కోసం పనిచేయాలి. వారి సమస్యలను తీర్చేందుకు కషి చేయాలి. కాని కులాý మధ్య కుంపట్లు చిన్న మిల్లర్లను మింగేసే కుట్ర జరుగుతుందన్న సంగతి ఇప్పటికీ తెలుసుకోలేకేపోతున్నారు. చిన్న మిల్లర్ల అమాయకత్వాన్ని నేరుగా సొమ్ము చేసుకునేందుకు కూడా కొంత మంది తిమింగల మిల్లర్లు చూస్తున్నారు. ఆ సమయం కోసం కాచుకొని కూర్చున్నారు. ఈ మద్య చిన్న మిల్లర్ల చేత, ప్రభుత్వానికి బకాయిలు పడ్డ మిల్లర్లను రెచ్చగొట్టి రబీ వడ్లు తీసుకోమని చెప్పేలా రెచ్చగొట్టారు. ఆ సంగతిలో వున్న రాజకీయం అర్దం కాక చిన్న మిల్లర్లు ఓ కులం ట్రాప్‌లో పడిపోయారు. తెలంగాణలో డిఫాల్టర్లుగా తేలిన వారిలో చిన్న మిల్లర్లు కూడా వున్నారు. మొత్తం 600 మంది డిఫాల్లర్లలో చిన్న మిల్లర్లే ఎక్కువగా వున్నారు. వారి మిల్లులను ప్రభుత్వం స్వాదీనం చేసుకొని, వేలం వేస్తే వాటిని ఓ కులం పెద్దలంతా ఏమైక దక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకు కుర్చీ, పద్దరికం రెండూ కావాలని చూస్తోంది. ఎవరైతే బలి కానున్నారో వాళ్లనే పావులుగా చేసుకొని ఓ కులం రాజకీయం మొదలు పెట్టింది. రబీ సీజన్ అంతా దాదాపు బాయిల్ద్ మిల్లులకే వరి వెళ్లుతుంది. ఆ అవకాశం కూడా బాగా కలిసి వస్తుంది. ఒక్క దెబ్బకు అటు వ్యపారం, ఇటు రాజకీయం రెండూ సక్సెస్ అవుతాయని ఆ కులం ఎత్తుగడ వేసింది. కొన్ని దశాబ్దాలుగా మిల్లింగ్ వ్యాపారం చేస్తూ ఆది నుంచి పెత్తనం చేస్తున్న ఆ కులం నుంచి కుర్చీ లాగేసుకోవడానికి, ఆ కులం మిల్లులను మింగేయడానికి ఓ కులం కుట్ర బ్రహ్మాండగా సాగుతోంది. అదే జరిగితే భవిష్యత్తు అంతా ఆ కులానిదే అవుతుంది. భవిష్యత రాష్ట్ర రాజకీయాలు ఎలా వున్నా తమదే పై చేయి అవుతుందని ఆ కులం పద్మవ్యూహం పన్నుతోంది. అమాయకులైన ఆ కులం చిన్న మిల్లర్లను తప్ప్పుదోవ పట్టించి, మిల్లులను చెరపట్టాలని చూస్తున్నారు. మిల్లింగ్ వ్వాపారం నుంచి ఏకంగా ఆ కులాన్నే లేకుండా చేద్దామని చూస్తున్నారు. ముందు ఆ కులాన్ని మిల్లింగ్ వ్యాపారానికి దూరం చేస్తే భవిష్యత్తులో కుర్చీకి ఆ కులం అడ్డు వుండదని కూడా దీర్ఘ కాలిక స్కెచ్ వేస్తున్నారు. చిన్న మిల్లర్లు ఆ కుట్రలను పసిగడతారా? లేదా? సొంత కులం పెద్దలతో వున్న విభేదాలతో కుట్రలు చేస్తున్న కులంతో చేతులు Å£లుపుతారా? తిమింగలాలై వస్తున్న కులంకు ఎరలుగా మారుతారా? అనేది కాలమే చెప్పాలి. అది ఎంతో దూరంలో లేదు. చూడాలి!!

మొగుళ్ళపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీస్పెషల్టి మెగా హెల్త్ క్యాంప్…

మొగుళ్ళపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీస్పెషల్టి మెగా హెల్త్ క్యాంప్
————————–మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తేదీ 28 మార్చి 2026 శనివారం రోజున మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలో అందుబాటులోకి తీసుకురావడానికి గాను శనివారం రోజున (ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు) మల్టీ స్పెషాలిటీ మెగా హెల్త్ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది .ఈ శిబిరంలో డెంటల్, ఆప్తలిమిక్, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసినన్ , పీడియాట్రిక్, గైనక్ సంబంధిత వైద్య నిపుణులు వస్తారు అని ప్రాథమిక ఆరోగ్యంగా కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ,డాక్టర్ నవత గార్లు ఆస్పత్రి సిబ్బందితో సమావేశం ఏర్పరిచి మండల ప్రజలకు తెలియజేసినారు. ఈ శిబిరాన్ని అన్ని గ్రామ ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.
ఈ యొక్క శిబిరానికి వివిధ వైద్య విభాగాలకు చెందిన ప్రముఖ వైద్య నిపుణు రానున్నారని తెలియజేస్తున్నారు.
ఈ శిబిరానికి ముఖ్యంగా ఈ క్రింది వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు.
1.స్త్రీ వైద్య నిపుణులు (గైనకాలజిస్ట్):- మహిళా ఆరోగ్య సమస్యలు మరియు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయబడును.
2.ఎముకల వ్యాధి నిపుణులు (ఆర్థోపెడిక్ ):-కీళ్ల నొప్పులు ఎముకల బలహీనత వంటి సమస్యలకు చికిత్స అందజేస్తారు.
3.MD జనరల్ మెడిసిన్:-అన్ని రకాల జబ్బులకు పరీక్ష చేయబడును .
4.నేత్ర వైద్య నిపుణులు (ENT):-కంటి చూపు సమస్యలు ఉన్నవారికి పరీక్షలు చేయబడును.
5.పిల్లల వైద్య నిపుణులు (పీడియాట్రిక్):-చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు గూర్చి చికిత్స చేయబడును.
6దంత వైద్య నిపుణులు (డెంటల్):-పంటి సమస్యలు ఉన్న వారికి పరీక్ష చేయబడును. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో నిపుణులైన డాక్టర్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేయనున్నట్లు తెలియజేసినారు. ఇంకేమైనా పెద్ద సమస్యలు ఉన్నట్లయితే పై ఆసుపత్రికి పంపించబడును.కావున మొగుళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, మరియు వృద్ధులు చిన్నపిల్లలు, కంటి సమస్యలు ఉన్నవారు, పంటి సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
వైద్యాధికారిణి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
మొగుళ్ళపల్లి

అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి…

అంగన్వాడీ కేంద్రాల సమస్యల పట్ల మంత్రి సీతక్కకు వినతి

అంగన్వాడీ కేంద్రాల్లో ఒకపూట బడి జీవో విడుదల చేయాలి

మంత్రి సీతక్కను కలిసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు

హైదరాబాద్,నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో వేసవికాలం దృశ్య ఒకపూట నిర్వహణ కోసం జీవో విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ ప్రజా భవన్‌లో మహిళా అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బియార్టీయు) రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించి సానుకూలంగా స్పందించారు.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఒక పూట నిర్వహణ కోసం జీవో జారీ చేయాలని కోరారు. అలాగే మే నెలలో టిహెచ్ఆర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని అన్నారు. 2024-25 సంవత్సరంలో రిటైర్మెంట్ అయిన టీచర్స్ మరియు హెల్పర్స్‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్స్‌కు 18 వేల వేతనం అమలు చేయాలని కోరారు.మంత్రి సీతక్కను కలిసిన అనంతరం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జేడీ అడ్మిన్ అకేశ్వర్ రావు, జేడీ మోతిని కలిసి సమస్యలపై చర్చించారు. మంత్రి మరియు అధికారులను కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. రమా తార, కోశాధికారి ఎం. వేదవతి, రాష్ట్ర నాయకులు ఎల్లమ్మ, రజిత, శిరీష పాల్గొన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ…

ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాజ్ నోటీస్ జారీ

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఎమ్మారై యంత్రం ఏర్పాటుకు అవసరమైన విద్యుత్తు సరఫరా పనుల్లో జాప్యంపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఎమ్మారై పరికరం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఎమ్మారై యంత్రం ఏర్పాటు కోసం అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనలో జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నట్లు గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులకు గైర్హాజరు కావడంపై షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆర్డిఓను పర్యవేక్షణ సంబంధిత అధికారిగా నియమించామని తెలిపారు.
విద్యుత్ సరఫరా ఏర్పాటుకు అవసరమైన పరికరాలను ఇప్పటికీ సమకూర్చకపోవడంపై కలెక్టర్ ప్రశ్నిస్తూ, ఈ విధంగా కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతాయని అసహనం వ్యక్తం చేశారు. యంత్రం ఏర్పాటు అవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఉప పర్యవేక్షకులు డా వెంకటరత్నం, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా రాజేష్, టిజిఎంఎస్ ఐడిసి ఏఈ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్ఐ బి అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ వి ఎస్ సంఘ నాయకులు…

ఎస్ఐ బి అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ వి ఎస్ సంఘ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం చెల్పూర్ శ్రీ వినాయక శ్రీనివాస వెల్ఫేర్ సొసైటీ చెల్పూర్ బస్టాండ్ వ్యవస్థాపక అధ్యక్షులు అయిత రమేష్ అధ్యక్షులు పి.కిరణ్ ఆధ్వర్యంలో నూతనంగా గణపురం కు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ బి.అశోక్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మూదురుకొల్ల రమేష్ దుంప నర్సయ్య ఎడ్ల శ్రీనివాస్ ముప్పిడోజు శ్రీనివాస్ చక్రపు వెంకటేశ్వర్లు
వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శంకర్
కోశాధికారి పాత రవీందర్
సహాయ కార్య దర్శులు హైగ్రీవ చారి పట్టెం బద్రయ్య
ప్రచార కార్యదర్శి కునారపు రఘు పాల్గొన్నారు.. అనంతరం ఇటీవల తిరుపతి లో జాతీయ అవార్డు తీసుకున్నందుకు గాను దుంప నర్సయ్య ను ఎస్సై సమక్షంలో శ్రీ వినాయక శ్రీనివాస వెల్ఫేర్ సొసైటీ చెల్పూర్ తరపున సన్మానం చేయడం జరిగింది

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి…

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్

పరకాల,నేటిధాత్రి

 

30న తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గత8సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులపై పోరాటం చేస్తున్నామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టినటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు,కమిటీ వేస్తానని చెప్పి సంవత్సరాలు కావస్తున్న కూడా కమిటీ వేయడం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీని ముట్టడికి సిద్ధమాయ్యమన్నారు.తెలంగాణలోని ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా కచ్చితంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.

విద్యుత్ ఉద్యోగుల ధర్నా…

విద్యుత్ ఉద్యోగుల ధర్నా

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి మోత్కూరి కోటి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వరంగల్ ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ యాళ్ల సురేందర్ రెడ్డి ధర్నా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఈ ధర్నాలో ఆర్టిజన్, అన్‌మాన్, స్పాట్ బిల్లర్స్, ఎస్‌పీఎంలు ఇతర పీస్‌రేట్ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కార్మికుల ప్రధాన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క కార్మికుల సమస్యను పరిష్కరించాలి అని వారు అన్నారు
ఆర్టిజన్ కార్మికులను వారి విద్యార్హతలను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలి
ఏపీఎస్ఈబి నిబంధనలు పూర్తిగా అమలు చేయాలి
ఒకే సంస్థలో సంవత్సరాలుగా పని చేస్తున్న అన్‌మాన్ కార్మికులను ఆర్థిక ఆర్టిజన్‌గా గుర్తించాలి
కార్మికులకు శాశ్వత పరిష్కారం కల్పించాలి
కార్మికులు సంస్థ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరం అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ధర్నా అనంతరం డివిజన్ ఇంజనీర్ కి కార్మికుల సమస్యలను వివరించి మెమోరండం ఇవ్వడం జరిగింది.
అనంతరం ఉమ్మడి డివిజన్ కమిటీ భూపాలపల్లి ఆధ్వర్యంలో టీవీఏఈ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో:
చైర్మన్‌గా – నాగుల తిరుపతి రెడ్డి
కన్వీనర్స్‌గా – మోత్కూరి కోటి, తిప్పారపు రాజు
కో-కన్వీనర్స్‌గా – సమ్మయ్య, జన రవీందర్
కో-చైర్మన్‌గా – బత్తుల రాజేందర్
వైస్ చైర్మన్‌లుగా – జి. సుదర్శన్, ఎల్. రాజయ్య
జాయింట్ సెక్రటరీగా – వేముల కిరణ్
కోశాధికారిగా – హరిచంద్ర
నూతన జేఏసీ కమిటీ ఏర్పాటుతో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి, కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 7న “చలో వరంగల్” కార్యక్రమం నిర్వహించి, అవసరమైతే సమ్మెలోకి వెళ్లే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ధర్నా అనంతరం టీవీఏఈ జేఏసీ జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వంటేరు మల్లయ్య, ఎండి అక్షావాలి, భాస్కర్ చారి, విజేందర్, రామయ్య తదితరులు పాల్గొన్నారు

ఈనెల 30న కొత్తగూడెంలో ధర్నాను విజయవంతం చేయాలి…

ఈనెల 30న కొత్తగూడెంలో ధర్నాను విజయవంతం చేయాలి

ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు సీతారామయ్య కొరిమి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సింగరేణిలో గతం కంటే రాజకీయ జోక్యం ఆర్థిక అరాచకత్వం మితిమీరి పోయిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి పరిరక్షణ సాధనకై ఈనెల 18న ప్రారంభమైన సింగరేణి బస్ జాత యాత్ర భూపాలపల్లి జిల్లా కు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య కొరిమి రాజ్ కుమారులు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఈ ప్రభుత్వం అనేక స్ట్రక్చర్ మీటింగులో ఒప్పుకున్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. అనేక రోజులుగా ఎదురు చూస్తున్న మెడికల్ బోర్డు విధానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైందని అన్నారు. విజిలెన్స్ కేసుల పరిష్కారం, మెడికల్ ఫిట్ అయిన 300 మందికి పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా కార్మికుల సొంతింటి కల నెరవేర్చడం కోసం మాట ఇచ్చిన యాజమాన్యం అమలు చేయడంలో విఫలమైందని వివరించారు. పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని కోరడం జరిగిందని, డిస్మిస్ కార్మికుల కు మరొకసారి అవకాశం ఇవ్వాలని గుర్తింపు సంఘంగా అడగడం జరిగిందని, అది అమలు చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అదేవిధంగా సింగరేణిలో నూతన గనులు రాకుంటే సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని నూతన గనులు ఏర్పాటు చేయాలని, అనేక కార్మిక సమస్యలపై యాజమాన్యానికి విన్నవించిన వాటిని పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణి సేవ్ యాత్రను చేపట్టడం జరిగిందని తెలిపారు. 18 నుండి నిర్వహిస్తున్న ఈ యాత్ర 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున వంటవార్పు, ముట్టడి, మహా ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈనెల 30 వరకు కార్మిక సమస్యలు పరిష్కారం కాకుంటే అన్ని జాతీయ సంఘాలు ఏకమై మరో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు నిర్వహించే నిరసన వంటవార్పు కార్యక్రమానికి భూపాలపల్లి నుండి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సీతారామయ్య, రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ డిప్యూటీ సెక్రటరీలు వీరభద్రయ్య, వైవి రావు, ముష్కే సమ్మయ్య,మడ్డి ఎల్లయ్య , ఏ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీలు గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, ఆసిఫ్ పాషా, జి శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా గుండు సాయిలు గౌడ్…

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీగా గుండు సాయిలు గౌడ్
#యాదగిరిగుట్ట ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఆటో యూనియన్ అధ్యక్షులు గుండు సాయిలు గౌడ్ నీ యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీగా నియామకం.

నేటిదాత్రి యాదగిరిగుట్ట:

ఎస్ ఎల్ ఎన్ ఎస్ ఆటో యూనియన్ రాంపల్లి రజనీకాంత్ గర్లా ఆధ్వర్యంలో మా మిత్రుడు గుండు నరసింహ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారిని ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా మా ఆటో యూనియన్ నుండి పై స్థాయికి వెళ్లడానికి కృషిచేసిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నం మా ఆటో కార్మికులపై మీరు చూపిస్తున్న ప్రేమని మేము ఎన్నడు మరువలేమన్న మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్న అని బిర్లా ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు గుండు సాయిల్ గౌడ్, రాంపల్లి రజనీకాంత్ గౌడ్, మోహన్ నాయక్, కంసాని శ్రీహరి, జమాల్, ఎల్లా గౌడ్, రజినీకాంత్, చాంద్ పాషా, సత్యం గౌడ్, మంగు నాయక్, జహంగీర్, గుండు మధు, సాయి, కందుకూరు మధు, వాటర్ మధు, నగేష్ తదితర ఆటో డ్రైవర్స్ పాల్గొనడం జరిగింది.

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు…

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

చెన్నూరు సిఐ బన్సీలాల్

మంచిర్యాల,నేటి ధాత్రి:

రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం చెన్నూరు సిఐ బన్సిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్,జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరులు సందర్శించి డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో స్పష్టమైన చూపు అత్యంత ముఖ్యమని,ప్రతి డ్రైవర్ సమయానుకూలంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.అదేవిదంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిన నిబంధనలను వారికి వివరించారు.ఈ శిబిరంలో సుమారు 150 మంది ఆటో,టాక్సీ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.వీరిలో 24 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందించగా,5 మందిని కంటి శస్త్రచికిత్స కోసం ఎంపిక చేసి పంపించారు.

గాంధీ చౌక్‌లో “చలి వేంద్రం” ప్రారంభం

వేసవిలో ప్రజలకు చల్లని తాగునీటి సదుపాయం.గాంధీ చౌక్ వద్ద డీసీపీ భాస్కర్,ఏసీపీ వెంకటేశ్వరులు సమక్షంలో చెన్నూర్ పట్టణ పోలీసులు చలి వేంద్రం ను ప్రారంభించారు.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చుట్టు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ ఎస్సై లు శ్యాంపటేల్, సుబ్బారావు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మార్మతుల కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీరు నిలిపివేత…

మార్మతుల కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీరు నిలిపివేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణం లోని మైపిల్ హోటల్ సమీపంలో మిషన్ భగీరథ పైపు లైన్ లికేజీ కారణంగా రెండు రోజులు మిషన్ భగీరథ నీళ్లు నిలిపివేయడం జరుగుతుంది అని మిసన్ భగీరథ డి ఈ నాగేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు జహీరాబాద్ పట్టణం మరియు మండలం, మొగుడంపల్లి మండలాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా మరమ్మత్తు పనులు జరుగుతున్న కారణంగా శుక్రవారం మరియు శనివారం 2 రోజుల పాటు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా నిలిపివేయబడుతుంది.కాబట్టి సంబంధిత మండలాల ప్రజలందరూ ముందుగానే తగినన్ని నీటిని నిల్వ చేసుకొని సహకరించవలసిందిగా కోరారు.

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి

ఎంపీఓ శ్రీపతి బాబురావు

జైపూర్,నేటి ధాత్రి:

 

పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిలువలు లేకుండా ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీఓ శ్రీపతి బాబురావు సూచించారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు,పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు.పెగడపల్లి శివారులో చెత్తతో నిండి ఉన్న డ్రైనేజ్ లను శుభ్రం చేపించారు.జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నులు వంద శాతం పూర్తి చేయాలని,ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంత నిర్మించుకునేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులకు ఎంపీఓ శ్రీపతి బాబురావు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జైపూర్ సర్పంచ్ కూన భాస్కర్,పెగడపల్లి సర్పంచ్ రామగిరి రాము,పంచాయతీ కార్యదర్శులు బి.ఉదయ్ కుమార్,శ్రీవాణి సిబ్బంది పాల్గొన్నారు.

పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతం….

పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతం

నర్సంపేట,నేటిధాత్రి:

పీడీఎస్యు ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు విడుదల చేయాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చంద్రబోస్, ఉషా కిరణ్, సందీప్, శ్రీకాంత్, అనిల్ షఫీనా, పూజ, అభినయ, అఖిల తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్…

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన మోకుదెబ్బ రమేష్ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట డివిజన్ ఏబీఎన్ రిపోర్టర్ బుర్ర వేణు గౌడ్ కుమార్తె బుర్ర భువనేశ్వరి గౌడ్ దశ దిన ఖర్మ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ ఆమె చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా సలహాదా
రులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సొల్తీ సారయ్య గౌడ్, మోకుదెబ్బ జిల్లా సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్,సీనియర్ జర్నలిస్ట్ లు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,ఉగ్గిడి శివుడు,రాష్ట్ర కార్యదర్శి కోండి రాము గౌడ్, తాళ్ల పెళ్లి చంద్ర మౌళి గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్,దొంతి సంతోష్ గౌడ్,కళ్లేపల్లి ప్రణయ్ దీప్,మద్దెల శ్రీనివాస్ గౌడ్,మచ్చిక నర్సయ్య గౌడ్, గౌడ్, బూర కుమార్ గౌడ్ గౌడ్,గోడిశాల గిరినాద్ గౌడ్, వేముల గోపి గౌడ్,సాంబరాతి మల్లేశం, పులి రాజేందర్,బూర సుధాకర్ గౌడ్, బూర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చేర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఆరెళ్ళ వీర మల్లయ్య గెలుపు…

చేర్యాల బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఆరెళ్ళ వీర మల్లయ్య గెలుపు

వరుసగా రెండుసార్ల విజయం సాధించిన ఆరెళ్ళ

చేర్యాల నేటిధాత్రి

చేర్యాల కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు కోర్టు ఆవరణ లో జరిగినవి హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో ఆరేళ్ల వీర మల్లయ్య విజయం సాధించారు ఉపాధ్యక్షుడిగా కాటం సురేందర్ ప్రధాన కార్యదర్శిగా మెరుగు రమేష్ ఎన్నిక అయినారు ఎన్నికల అధికారులుగా బి యాదగిరి గౌడ్ ఎన్ . సంతోష్ వ్యవహరించారు ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షుడు ఆరెల్లి వీరమల్లయ్య మాట్లాడుతూ నాపై నమ్మకంతో గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ జడ్జ్ నియామకానికి నేను కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సురేష్ కృష్ణ గుస్క వెంకటేష్ శ్రీధర్ మరియు న్యాయవాదులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version