*జిల్లాకలెక్టర్ గరీమా అగర్వాల్ కి సీనియర్ సిటిజన్ డైరీ సమర్పణ*
*సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన కోడం నారాయణ కార్య నిర్వహణలో దొంత దేవదాసు ఆధ్వర్యంలో డాక్టర్ జనపాల శంకరయ్య సూచనలతో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ని కలిసి సీనియర్ సిటిజన్ 2026 డైరీ ,ని సీనియర్ సిటిజన్ పిలుపుపత్రికను సమర్పించడం జరిగినది. వారు మీ అనుభవాన్ని భవిష్యత్తు తరానికి అందించే విధంగా ప్రయత్నాలు సాగించాలని సలహా ఇచ్చారు. అలాగే వారే గుర్తుచేసి మీ డే కేర్ సెంటర్ త్వరలో అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. అందుకు కలెక్టర్ జిల్లా కార్యవర్గం అభినందనలు తెలపడంతెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీ గాద మైసయ్య, గౌరిశెట్టి ఆనందం, గుడ్ల శ్రీధర్ గజవాడ కైలాసం, శ్రీహరి రెడ్డి ,కే రాజిరెడ్డి దేవనపల్లి శ్రీహరి మొదలైన వారు పాల్గొన్నారు. .
* పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళ మణులు * సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం లక్ష్మిరెడ్డి పల్లె గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలను అందిస్తుందన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మంజూరైన చీరలను లబ్ధిదారులకు వారు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విజయ అశోక్ రెడ్డి,గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు._
రాజన్నసిరిసిల్ల జిల్లా ( టాస్కా ) శాఖ డైరీ పిలుపు పత్రిక ఆవిష్కరణ
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని (టాస్కా) సిరిసిల్ల శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య అధ్యక్షతన కోడం నారాయణ కార్యనిర్వహణలో ,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య సూచనలతో కోశాధికారి దొంత దేవదాసు వ్యాఖ్యానంతో ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో సిరిసిల్ల ఆర్డిఓ వేంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డిఓ శ్రీమతి రాదా బాయి మేడం , జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజమ్ ,2026 డైరీ, పిలుపు పత్రికను ఆవిష్కరించి సిరిసిల్ల జిల్లాలో సీనియర్ సిటి జనులు ఐక్యంగా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగు తున్నా రని అభినందించారు. ఉపాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ గొంతుక పిలుపు పత్రిక అన్నారు. వివిధ జిల్లాల్లో జరుగుతున్న చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ పత్రిక ఎలుగెత్తి చాటు తుందన్నారు. వయసులో పెద్ద వారైనా మానసికంగా ఆనందంతో నవ యువకులు గా కార్యక్రమానికి సన్నద్ధు లై ముందుకు సాగుతుందన్నారు. డైరీ కూడా అందంగా చక్కని అంశాలతో కూడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, శ్రీ గాద మైసయ్య, కార్యదర్శులు అoకారపు జ్ఞానోబా, గౌరిశెట్టి ఆనందం, ప్రచార కార్యదర్శి గజ వాడ కైలాసం, గుడ్ల శ్రీధర్, గజ్జల్లి రామచంద్రం, శ్రీహరి రెడ్డి, కే తిరుపతి రెడ్డి, ఎండి పాషా, ఇరుకుల్ల భాస్కర్, మొదలైన వారు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కు చెందిన కాంగ్రెస్ పార్టీ టి.పిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్. వినోద్ కుమార్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ గా రెండవసారి బుధవారం నియామకమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిగా చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఓ నిజమైన నాయకుడిగా ఆయన ఎన్నో పదవులు పొందినారు .ఖైరతాబాద్ నుంచి మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అబ్జర్వ్ గా ఆయనను నియమించడం జరిగింది.ఈ మేరకు టి.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంకితభావంతో పని చేసినందుకు తనకు కాంగ్రెస్ పార్టీ రెండవసారి ఖైరతాబాద్ అబ్జర్వర్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు.
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ లింగాయత్ సమాజ్ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉల్లిగడ్ల పద్మజ ప్రమాణ స్వీకారం చేశారు. లింగయత్ సమాజ అభివృద్ధి కోసం మహిళలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేస్తానని, మహిళల సమస్యలు, హక్కుల సాధనకు ప్రాధాన్యత ఇస్తానని, సమాజ సంక్షేమ కార్యక్రమాల్లో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం లింగాయత్ సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రామడుగు మండలం నూతన కమిటీ ఎన్నిక
రామడుగు, నేటిధాత్రి:
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జల కాంతం ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్లానింగ్ కమిటి చైర్మన్ గజ్జల ఆనందరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెళ్ల మహేందర్, రాష్ట్ర కార్యదర్శి, మీసాల సాయిలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండ స్వరూపల సమక్షంలో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రామడుగు మండల అధ్యక్షులుగా రేణికుంట అశోక్, ఉపాధ్యక్షులుగా జెట్టిపల్లి మురళి, జిల్లాల సురేష్, లింగంపల్లి రవి, మండల ప్రధాన కార్యదర్శిగా ఆరేపెల్లి ప్రశాంత్, కార్యదర్శులుగా గజ్జల సురేష్, మచ్చ మహేష్, పర్లపల్లి తిరుపతి, చిలుముల రమేష్, కోశాధికారి తడగొండ శేఖర్, ప్రచార కార్యదర్శులుగా రేణిగుంట శ్రావణ్, కత్తెరపాక రమేష్, బండపల్లి గోపి, తదితరులను నియమించారు.
* మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణి చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల, నేటిధాత్రి :
చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య శనివారం నవాబ్ పేట్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి పేరిట డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వెలుగు ప్రార్థనను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి, సంక్షేమ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని,గ్రామీణ ప్రాంతాల్లో మహిళల జీవిత స్థాయిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రధానంగా అమలు అవుతున్న పథకాలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, ఆదర్శ పాఠశాలలో మహిళా అధ్యక్షురాలు నియామకం, ఆర్టీసీ బస్సుల కొనుగోలులో మహిళా సమాఖ్యల భాగస్వామ్యం, వడ్డీ రహిత రుణాలు, విద్యార్థుల వసతి మెస్ చార్జీల తగ్గింపు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు . మహిళలను ఆర్థికంగా స్వావలంబి, సామాజికంగా బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళ సంఘం ప్రతినిధులు, సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*పేద ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం..
*డాక్టర్ వి.ఎం. థామస్…
గంగాధర నెల్లూరు(నేటిధాత్రి)
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అర్హులైన లబ్ధిదారులు గంగాధర్ నెల్లూరు మండలం చిన్న 48,500 రూపాయలు, కొత్త వెంకటాపురం ప్రేమ్ నాథ్ నాయుడు 1,27,969 రూపాయలు, ముక్కుల్తూరు వినోద్ కుమార్ 62,021 రూపాయలు, వేల్కూర్ మునెమ్మ 20,000 రూపాయలు, కడపగుంట ఆదిలక్ష్మి 76,495 రూపాయలు, కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లి గోవింద్ స్వామి 38,541 రూపాయలు, సిడి, కండ్రిగ దాసరి గణేశం 1,09,660 రూపాయలు, అమ్మపల్లి భారతి 9,000 రూపాయలు, ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి చంద్రశేఖర్ 1,60,826 రూపాయలు, పెనుమూరు మండలం సాతంబాకం విజయ 87,384 రూపాయలు, మొత్తం 7,40,316 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు(ఎమ్మెల్యే) డాక్టర్ వి.ఎం. థామస్ పంపిణీ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో, నైపుణ్యం కలిగిన అర్హులైన దళితులకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్ కులముల సేవ, సహకార అభివృద్ధి సంఘం. ( ఎస్. స్సి. కార్పొరేషన్ ). ద్వారా, బ్యాంకు అధికారుల సహకారంతో, సబ్సిడీ ద్వారా, మహీంద్రా ఆల్ఫా డీలక్స్, బీ, యస్, 6, డీజిల్ ప్యాసింజర్, సెన్సార్లు కలిగిన, ఆటోలను, లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సబ్సిడీ ద్వారా ఆటోలను తీసుకున్న కొన్ని నెలలకే, ఈ ఆటోలు చెడిపోవడంతో. ఇట్టి విషయమై ఎన్నో సార్లు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీని, ప్రభూత్వ అధికారులు స్పందించలేదన్నారు. ఈ వాహనంలో ఏ చిన్న లోపం తలెత్తిన, వీటిని బాగు చేయుటకు, ఇతర వాహనం సహకారంతో, హైదరాబాద్ వెళ్లవలసిందే నని, ఈ విధంగా గత మూడు సంవత్సరాల నుండి, ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్లి, తమ ఆటోను బాగు చేసుకొని వచ్చినప్పటికీని, మళ్లీ మళ్లీ చెడిపోవడంతో, లబ్ధిదారులు అప్పులపాలై, బ్యాంకులో ఆటో కొరకు తీసుకున్న అప్పును తీర్చలేక, బ్యాంకు అధికారుల, మరియు, మధ్యవర్థుల మాటలకు, మానసికంగా, బాధపడుతున్నామన్నారు. ఈ ఆటోలను, ప్రభూత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు మాత్రమే విక్రయించి, ఇతరులకు విక్రయించకుండా, గత మూడు సంవత్సరాలుగా, ఈ ఆటో విక్రయాలు నిలిపివేయడానికి గల కారణం ఏమిటో, సంబంధిత అధికారులు, పత్రిక ముఖంగా తెలియజేయాలని, ఈ ఆటోలను మాత్రమే, ప్రభుత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడానికిగల కారణం ఏమిటో, ఇతర కంపెనీల ఆటోలను ఇవ్వలేమని, సంబంధిత అధికారులు తమకు చెప్పడంతో, గథ్యాంతరం లేక,ఈ ఆటో ను తీసుకున్నామన్నారు. ఈ ఆటోలు తీసుకొని నష్టపోయిన లబ్ధిదారులను, ప్రభూత్వమే ఆదుకోవాలని, లబ్ధిదారులు కోరుచున్నారు,
ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా రత్నం శైలేందర్
పరకాల,నేటిధాత్రి
పట్టణానికి చెందిన రత్నం శైలేందర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినట్లు అఖిల భారత దళిత యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిన్న రాము తెలియజేశారు. రత్నం శైలేందర్ గత 30 సంవత్సరాల నుండి వివిధ దళిత సంఘాలలో పనిచేస్తూ దళితులను సామాజికంగా చైతన్యం కొరకు వారిని మేల్కొల్పడం జరుగుతుంది రత్నం శైలేందర్ గత కొంతకాలంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీకి జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారని ఈయన చేస్తున్న పలు కార్యక్రమాలను దళితులకు చేస్తున్న సేవలను దృష్టిలో ఉంచుకొని ఇతనిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తున్నట్లు జాతీయా అ ధ్యక్షులు తెలిపారు.ఈ సందర్భంగా రత్నం శైలేందర్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఏడు దశాబ్దాల దాటుచున్న అప్పటికి పేదవాడు మరింత పేదవాడు గానే ఉంటున్నారని ధనికులు మాత్రం పైపైకి ఎదుగుతున్నారు దీనికి అనేకమైనప్పటికీ ఈ అంతరాలను సేదించడానికి స్వతంత్ర భారత్లో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కుల,మత వర్గా లింగ వేదం లేకుండా ప్రతి భారత పౌరుడు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ ఓసి ఆయా కేటగిరీల వారిగా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి అందరికీ సమన్యాయం చేయాలని అన్నారు.
గురువారం, ఇటీవల మరణించిన నలుగురు పిఆర్టియు ఉపాధ్యాయుల కుటుంబాలకు సంక్షేమ సంస్థ తరపున జిల్లా అధ్యక్షుడు మణయ్య లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దిగ్వాల్- విజయలక్ష్మి, చింతల్ చెరు- నీరజ, చాప్ట(కే ) – శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్- సుజాత కుటుంబ సభ్యులకు ఈ సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
జహీరాబాద్ పట్టణంలో యాచకుల కోసం మెప్మా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సర్వే ద్వారా పట్టణంలో యాచకులు ఎక్కడెక్కడ ఉన్నారో పూర్తి వివరాలను మెప్మా సిబ్బంది సేకరించారు. ఈ సర్వే కార్యక్రమం మరో మూడు రోజులపాటు కొనసాగుతుందని మెప్మా పట్టణ ప్రాజెక్టు అధికారి బసంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం యాచకుల పునరావాసం మరియు సంక్షేమానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
సీపీఐ నేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత గుండా మల్లేష్ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం గుండా మల్లేష్ ఐదవ వర్ధంతిని రామకృష్ణాపూర్ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సీపీఐ నాయకుల తో కలిసి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. గుండా మల్లేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిం చాలంటే ప్రతీ కార్యకర్త క్రమశిక్షణతో పని చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పరితపించేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
దళిత మంత్రి అడ్లూరు లక్ష్మన్ కుమార్ ని దూషించిన పొన్నం ప్రభాకర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి -బెజ్జంకి అనిల్ మాదిగ
కరీంనగర్, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ ని అసభ్యపదజాలంతో దుషించిన పొన్నం ప్రభాకర్ ఇరవైనాలుగు గంటల్లోనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసమావేశంలో ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని వివేక్ తో పొన్నం ప్రభాకర్ దున్నపోతుగానికి టైం తెలియదు ఏమి తెలియదు అని అహంకారంగ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ వైఖరి నిరసిస్తూ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షేమాపణ చెప్పాలి లేదా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతాం పొన్నం తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈనెల 8న జిల్లావ్యాప్తంగా పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తాం, ఈనెల 9నాడు పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడి చేస్తాం అన్నారు.
ఈఇరవై నాలుగు గంటలు పోన్నం ప్రభాకర్ కి ఇస్తున్నాం. ఒక దళిత మంత్రిని అవమాన పరుస్తూ వివేక్ తో మాట్లాడినప్పుడు ఒక దళిత మంత్రిగా ఉండి కనీసం స్పందించలేదంటే దళిత పదం నీబతుకు తెరువు కోసమే తప్ప దళిత జాతి భవిష్యత్తు కోసం మీరు ఏమి ఉపయోగపడరు అన్నది స్పష్టంగా మాకు అర్థమవుతుంది తక్షణమే పొన్నం ప్రభాకర్ మాటలను ఒక మంత్రిగా మీరు స్పందించాల్సిన బాధ్యత మీమీద కూడా ఉంది అని మేము వివేక్ కూడా గుర్తు చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ ఇరవై నాలుగు గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బోయిని కొమురయ్య మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, దండు అంజయ్య మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, రేపాక బాబు మాదిగ, అలువాల సంపత్ మాదిగ, కనకం నరేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
సత్ఫలితాలనిస్తున్న ప్రతిభా కళాశాలలు నీట్-2025లో సత్తాచాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్గోల్, బూచినెల్లి క్యాంపస్ల నుంచి 16 మందికి ఎంబీబీఎస్ సీట్లు పదేండ్లలో డాక్టర్లుగా 1200 మందికి పైగా గురుకుల విద్యార్థులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
జహీరాబాద్, మాజీ ముఖ్యముతై కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి.. దీంటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు విరునామాగా నిలుస్తు న్నాయి. అందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక లోని అల్గోర్ బూచి బూచిపెట్టె గ్రామ గ్రామ శివారులో (టెర్రెస్) మైనార్డ్ గురుకుల క్యాంపస్ విదర్శనం. ఈ రెండు బ్యాండ ల నుండి ఈ ఏడాద్ 18 మందికి పైగా విద్యార్థులు ఎంటి బీఎస్ సీట్లను సాధించడం తెలంగాణ గురుకుల విద్యావ్య వన్దకే గర్వకారణం. ఇఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యా భ్యాసమనేది మీద, మధ్యతరగతి విద్యార్థులకు అందన్ డ్రాక్ష ఆర్థికంగా ఉన్న కుటుంబాలవారైతే
పేరొందిన విద్యాసంస్థల్లో లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోగలుగుతారు. కానీ, విరుపేద, మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి అందుకు విరుద్ధం. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాలి. లేదంటే ఆశయాన్ని వదులుకోవాల్సిందే. అలాంటి పేదింటి బిడ్డల ఆశయాలకు ఊపిరి పోసి, ప్రతిభకు మెరుగులు దిద్ది, వారి కల లను సాకారం చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేలాది గురుకులాలను ఏర్పాటుచేసి ఇంటర్, డిగ్రీతో పాటు నాణ్యమైన విద్యను అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల ఆధ్వ ర్యంలో 66. మైనార్టీ సొసైటీ పరిధిలో 12 గురుకుల కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (ప్రతిభా కళాశాలలు) గా తీర్చిదిద్దింది.
ఆయా ప్రతిభా కాలేజీల్లోకి మెరిట్ ఆధారంగా విద్యా ర్థులను ఎంపిక చేసి ఐఐటీ, తేవారు, వీటి పాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేవి ధంగా ఏర్పాట్లు చేసింది. పోటీపరీక్షలకు సంబంధించిన ఇంటెన్సివ్ కోచింగ్స్ను ఉచి తంగా అందించింది. ఫలితంగా గత పదేం లో గురుకులాల విద్యార్థులు రికార్డుస్థా యిలో ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశం వారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థ ల్లోనూ అడ్మిషన్లు పొందుతున్నారు. రాష్ట్రం లోని గురుకుల విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సీవోఈలు గిలిచాయంటే అతి శయోక్తి కాదు ఇప్పటివరకు అన్ని సీవోధుల నుంచి మొత్తంగా 1,500 మందికిపైగా విద్యా ర్థులు వైద్యరంగంలోకి ప్రవేశించడం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నది..
మైనార్టి గురుకులాల నుంచే 10 మందికి ఎంబీబీఎస్ సీట్లు
కేసీఆర్ దార్శనికతడు సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ నియోజకవర్గంలోని అల్గో అల్గోల్, బూరె వెళ్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల క్యాంపస్లు అద్దంపడుతున్నాయి. ఆయాకళా శాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య తోపాటు జేఈఈ, నీటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.
దీంతో ఇక్కడి విద్యా ర్థులు వార్షిక పరీక్ష ఫలితాల్లో మంచి మార్కు లతోపాటు జిల్లా, రాష్ట్రాస్థాయిలో ర్యాంకులు సాదిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందు తున్నారు. 2020 సంవత్సరానికిగాను నిర్వ హించిన నీట్ ప్రవేశ పరీక్షకు అల్గోల్, బూచి వెల్లి గురుకుల బాలుర, బాలికల కళాశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు హాజర య్యారు. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలి తాల్లో ఆయా కళాశాలలకు చెందిన 15 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలే జిల్లా సీట్లు సాదించి సత్తా చాటారు.
అంటే ఇక్కడ చదివిన ప్రతి బదుగురిలో ఒక్కరు డాక్టర్ కాబోతున్నారు. అల్గోల్ బాలుధ గురు కుల కళాశాలకు చెందిన మహ్మద్ ఫిరోస్, ధర్మ తేజ, సిద్ధి రమేశ్, ఎస్వీ ఆయాన్, ఎండీ ఓబెడ్, గౌతమిఖన్నా, సృజన్కుమార్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. బూచి వెల్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన అస్మా పాతిమా షేక్ సమీనా మర్దార్ గాలి అనూష, తస్కీన్ ఖామర్, షాగుప్తా షాహీన్, ప్రియా అంజీర్, తస్లీం, సరేఖ మర్డాన్, ఫిరోస్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు.
గురుకుల కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగా లను సాధిస్తుండటం గర్వంగా ఉన్నదుని ఆయా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యా పకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ దూరదృష్టికి
◆:- తార్కాణం గురుకులాలు గురుకుల
◆:- విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడం సంతోషం
◆:- ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదగడం గర్వకారణం
మాజీ మంత్రి హరీశ్ రావు
కేసీఆర్ గొప్ప ఆలోచన, దూరదృష్టితో నిర్మించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందులో చదువుకొన్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నతో ద్యోగులుగా సేవలందించడం గర్వకార ణమని తెలిపారు. 2021లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచిపల్లి మైచార్జీ గురుకులం ప్రారంభం సంద ర్భంగా ఓ విద్యార్థితో ముచ్చటించిన సన్నివేశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్యూచర్లో ఏం అవు తావమ్మా? అని అడిగిన ప్రశ్నకు డాక్ష ర్ను అవుతాను సార్ అని చెప్పిన ఫిస్టోన్ అనే విద్యార్థిని మాట నిలబెట్టు కున్నది.
కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది’ అని హరీశ్రావు వెల్లడించారు. ఫిరోసోపాటు అదే మైనార్టీ గురుకులం నుంచి మరో ఎని మిది మంది, అల్గోల్ మైనార్టీ గురుకుల నుంచి ఏడుగురు విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంచి విద్యార్థులు విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడటం అభినందనీయమన్నారు. లీఆర్ఎస్ సర్కారు దూరదృష్టి, గురుకు చాల ప్రిన్సిపాళ్లు, ఉపాద్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసంవల్లే సాధ్యమైం దని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న కేసీఆర్ కలలను నీరు పేద విద్యార్థులు సాకారం చేయడం గొప్ప విషయమని అభినందించారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన TMRIES (బుచినెల్లి) విద్యార్థిని సన్మానించిన మాజి మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో(బుచినెల్లి) చదివిన విద్యార్థి ఝరసంఘం మండలం బొప్పన్పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ గారి కుమార్తె ఫిర్దోస్ నీట్లో క్వాలిఫై అయ్యి సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్లో ఉచిత సీటు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ,స్థానిక జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్రావు విద్యార్థిని శాలువా పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు నాగన్న తదితరులు..ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2021లో సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం భూచనల్లి తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ గురుకులం (TMREIS) ప్రారంభం సందర్భంగా.. “ఫ్యూచర్ లో ఏం అవుతావు అమ్మా?” అని అడిగిన ప్రశ్నకు “డాక్టర్ అవుతాను” అని చెప్పింది విద్యార్థిని ఫిర్దోస్.చెప్పడమే కాదు, కష్టపడి చదివి అన్న మాట నిలబెట్టుకుంది. నేడు ఎంబీబీఎస్ సీటు సాధించింది.ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, జహీరాబాద్ నియోజకవర్గం లోని అదే మైనారిటీ గురుకులం నుండి మరో 8 మంది విద్యార్థినులు, అలాగే అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలను సాకారం చేస్తున్నాయి గురుకులాల్లో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారు. ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం వల్ల సాధ్యమైంది తెలంగాణ రాకముందు మొత్తం 290 గురుకులాలు మాత్రమే ఉండగా, కేసీఆర్ ప్రభుత్వం వాటిని 1020కి పెంచింది నాడు కేవలం 2 మైనారిటీ గురుకులలు ఉంటే ఆ సంఖ్యను 204కు పెంచింది . మొత్తంగా గురుకులలో విద్యార్థుల సంఖ్యను లక్షన్నర నుండి ఆరున్నర లక్షలకు పెంచింది. గతంలో ఇంటర్ చదువు గురుకులాల్లో అందుబాటులో ఉండేది కాదు. పది తరగతి పూర్తి చేసిన తర్వాత పేద విద్యార్థులు పనులకు వెళ్లేవారు.దీన్ని మార్చడానికి కేసీఆర్ గారు అన్ని గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసి, ఉన్నత విద్యను చేరువ చేశారు. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం ఒకప్పుడు ఎంతో కష్టం, ముఖ్యంగా మహిళలకు. దీనికి పరిష్కారంగా కేసీఆర్ గారు 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు.దేశంలో తొలిసారిగా రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.పేద పిల్లల విద్యపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగమని కేసీఆర్ గారు నమ్మారు.రేపటి తరంపై పెట్టే పెట్టుబడిని అద్భుత సంపదగా భావించారు.విద్యార్థుల కోసం చేసే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (Capital Expenditure) గా నిర్వచించారు.ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్ లేదా ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం గొప్ప విషయం.వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరం మొత్తంలో మార్పు వస్తుంది. కేసీఆర్ గారు దీన్ని నమ్మారు కాబట్టి, విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించి చదువుకునే అద్భుత అవకాశాలు అందించారు. మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి.మీ ఊరికి, మీ స్నేహితులకు, పేదలకు, గురుకుల సొసైటీకి ఏదో విధంగా తోడ్పాటు అందించాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నా. ఒక్క ఫిర్దోస్ మాత్రమే కాదు, అల్గోల్ మైనారిటీ గురుకులం నుండి 7 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు . కేసీఆర్ గారు గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు, పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయి అని అన్నారు
మండలంలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు * నివాళులర్పించిన బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్
మహాదేవపూర్ సెప్టెంబర్ 25 (నేటి ధాత్రి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యర్యంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ అధ్యక్షతన గురువారం రోజున శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా బస్ స్టాండ్ ఆవరణలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులూ అర్పించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రo సిద్ధాంతకర్త అని, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25 న ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర ‘నగ్ల’ చంద్రబాన్ అనే గ్రామంలో జన్మించారని, మొదట కొద్దీ మంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశీక సహా ప్రచారక్ స్థాయికి ఏదిగారని, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకత్మాత మానవతా వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు రచించారాని, ఏకాత్మ మానవవాదం ప్రవచించి సమాజంలో అట్టడుగునా వున్నా వ్యక్తికి ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని రూపొందించిన శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకులు దాడిగేలా వెంకటేష్, శంకర్, శ్రవణ్, మహేష్, రాకేష్, హరీష్, పాల్గొన్నారు,
వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంపు కోసం గ్రామ కార్యాలయాలు ముట్టడి
◆:- వినతి పత్రం ఇచ్చిన వికలాంగులు వృద్ధులు వితంతువులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ ఎల్గోయి గ్రామాలలో ఈరోజు వృద్ధులు వితంతువులు వికలాంగులు గ్రామపంచాయతీ కార్యాలయాలు ముట్టడిచ్చి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి డివిజన్ నాయకురాలు శోభ రాణి మండల నాయకురాలు బిస్మిల్లా వికలాంగులు వృద్ధులు వితంతువులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి దేశంలోనే గుర్తింపు పొందుతూ రామరాజ్యం తలపించేలా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సభ్యులు పెండెం రామానంద్ తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పెండెం రామానంద్ గారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు,అవసరాలను తెలుసుకున్న నేత అని పేర్కొన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని తెలిపారు. పేద ప్రజలు,విద్యార్థుల కోసం ఆరోగ్య శ్రీ పథకం,ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి చిరస్మరణీయుడయ్యారని కొనియాడారు.వైఎస్ఆర్ పాలన సంక్షేమమే ప్రధాన ఎజెండా గా కార్యకర్తలే సైనికులుగా కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా పని చేసిన గొప్ప నాయకుడు అని రామానంద్ గుర్తుకు చేశారు. దివంగత డాక్టర్ వైయస్సార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే నేటికీ కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ,మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ర్మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మాజీ సొసైటీ వైస్ చైర్మన్ పాలాయి రవి,నర్సంపేట మండలం అధ్యక్షులు కత్తి కిరణ్, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, పంబి వంశీకృష్ణ, మార్కెట్ డైరెక్టర్ డక్క శ్రీను,నర్సంపేట పట్టణ కార్యదర్శి చిప్ప నాగ,నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, గజ్జి రాజు, లక్కాసు రమేష్, నాగేల్లి సారంగం, పొన్నం నరసింహారెడ్డి, కొప్పు అశోక్, బాణాల శ్రీను, మెరుగు కిరణ్, మహిళ నాయకురాలు హసీనా, గాజుల రమేష్, గండు గిరి, బిట్ల మనోహర్, పాతార బోయిన చంద్ర మొగిలి, మేడం కుమార్, ఎండి సర్వర్, దేశీ సాయి పటేల్, కాంగ్రెస్,మహిళా,యూత్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వైద్య నిధి-ముఖ్యమంత్రి సహాయనిధి: -ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య.
వర్దన్నపేట( నేటిదాత్రి )
వర్ధన్నపేట మండలం, కట్రియాల గ్రామానికి చెందిన చిక్కొండ ధూడేలు, గజ్జెల సరోజన, ఇటికాల గౌతం,కామిండ్ల రాజకుమార్ మరియు కాసు యాకమ్మ గార్లకు గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీ కె.ఆర్.నాగరాజు సహకారంతో మంజూరైన 400000 /-(నాలుగు లక్షలు) రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కే.ఆర్.నాగరాజు ఆదేశానుసారం వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామాశాఖ అధ్యక్షులు బండారి సతీష్ గౌడ్,దేవస్థాన చైర్మన్ కట్ట వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,మండల మహిళా నాయకురాలు& ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీగల సునీత గౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు తాటికాయాల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు ఎలికట్టే చిన్న రాజు,మానుక మల్లయ్య యాదవ్ గారులు కట్రీయాల గ్రామములో లబ్దిదారుల నివాసాల వద్దకే వెళ్లి సదరు సిఎంఆర్ఎఫ్ చెక్కులను వారికీ అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సహకారముతో మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అపర సంజీవనిలా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ అభివర్ణించారు. తీవ్ర అనారోగ్యంతో పడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసిలు కూడా అందించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నారని తెలిపారు. అనారోగ్యంతో ఆర్థిక స్తోమత లేక అప్పో ,సప్పో చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు ఎవ్వరూ కూడా అప్పులపాలు కాకూడదని అని భావించి వేడి నీళ్లకు సన్నీళ్ళు తోడు అన్నట్టుగా ముఖ్యమంత్రి సహాయనిధి(CRMF) నుండి ఒకే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఏకకాలంలో 5 మందికి రూ.400000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగిందని తెలిపారు.కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుని అట్టి వైద్య ఖర్చుల సహాయం నిమిత్తం ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా ఈ విధంగా “ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF)” నుండి సహాయం అందిస్తున్నారని తెలిపారు.CMRF తో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎక్కువ బడ్జెట్ తో వైద్యం చేయించుకోవడానికి మరియు ఖరీదైన శస్త్ర చికిత్సలు చేయించుకోవడానికి ముందస్తుగా ఇచ్చే LOC లు కూడా సీఎంఆర్ఎఫ్ నుండి లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు అందిస్తున్నారని తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.