రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్యకు నిర్వాహకులు సత్కారం నిర్వహించారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ నవనీతతో పాటు పలువురు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనా నైపుణ్యం నేటి తరానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. సమాజంలో స్వాభిమానం, స్వాతంత్ర్య భావాలు పెంపొందించడంలో శివాజీ పాత్ర చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గజవాడ లావణ్య మాట్లాడుతూ, శివాజీ చూపిన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పట్టణాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మున్సిపాలిటీ కృషి చేస్తోందని తెలిపారు. యువత శివాజీ ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని సూచించారు. కార్యక్రమం ముగింపులో శివాజీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సి లర్లు గజవాడ నాగరాజు. దేవుని రంజిత్. రవి.డాకి స్వామి. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి. చింతల యాదగిరి. ఎనీశెట్టి అశోక్. రాధా కిషన్ బొందుగుల రాజు. తదితరులు పాల్గొన్నారు.
,,,, రెబల్గా పార్టీకి అన్యాయం కన్నా గెలుపు కోసం త్యాగం,,,,
,,,, ఐక్యమత్యానికి వారీ సహకారం,,,,,,
ఒక్కొక్క గడ్డిపరక ఏనుగుని బంధించినట్టు,,,,,,
విజయానికి వీ రు కూడా భాగస్తులే,,,,
,, అధినాయకుని గౌరవించి మాటకు విలువ ఇచ్చారు,,,,,,
రామాయంపేట ఫిబ్రవరి 18 నేటి ధాత్రి (మెదక్)
జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకున్నట్టు కాకుండా విజయం చాలాచోట్ల దోబూచులాడింది. అధికారం ఉన్న నాయకులు ఉన్న ప్రజల్లో సంశయమైన దోబూచులాట కాంగ్రెస్ ఓటమికి చాలాచోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయి మెదక్ జిల్లాలో కూడా బి ఆర్ఎస్ బిజెపి పార్టీలు మెదక్ జిల్లాలోని కాక రాష్ట్రంలో తీవ్రమైన పోటీని బలమైన అభ్యర్థులను మాజీ అధికార పార్టీ అయితే డబ్బులను పెద్ద ఎత్తు న పెట్టి కాంగ్రెస్కు పెద్ద సవాలే విసిరింది రామాయంపేట మున్సిపల్ కు వస్తే అధికారం ఉన్న ఎమ్మెల్యే పదవి ఉన్నా స్థానిక ఎన్నికల్లో గతం నుండి పది సంవత్సరాలుగా అన్ని స్థానిక సంస్థల పదవులను ఏకపక్షంగా సాధించి కాంగ్రెస్ ను పంజరంలో వేసిన ఘనత విఆర్ఎస్ పార్టీ దే గతంలో అనైక్యత పార్టీలో నుండి కోవట్లు టిఆర్ఎస్కు పెద్ద మొత్తంలో ఉండడమే కాకుండా అధినాయకత్వం కూడా లేకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే ఇక్కడ ఉన్న నాయకులు పోతే పోనీ నాకేంటి మాకు మాత్రం నాయకత్వానికి లోటు లేదు అనే ధోరణిలో గడిచింది కాబట్టి టిఆర్ఎస్ కు పోటీ లేకుండా సాధించాలన్నది పరిశీలిస్తున్న భావన కానీ మైనంపల్లి మంత్రాంగం అందర్నీ ఏకతాటిపై తీసుకువచ్చి నయాన భయాన ఓకే అభ్యర్థికి విజయానికి సహకరించాలని ఆదేశాలు చాలా బాగా పనిచేశాయి. యువజన కార్యకర్తలు సాకేత్ రెడ్డి పుట్టి నికుల్ తమ కు టికెట్టు ఇచ్చే అవకాశం ఉన్న కేటాయించకపోవడం పట్ల ఏమాత్రం కూడా స్వార్థంతో ఆలోచించకుండా నిస్వార్ధంగా అభ్యర్థుల గెలవడానికి కారణమయ్యారు..పార్టీ ఐక్యమత్యంతో పాటు కోవట్లను కూడా జాగ్రత్తగా గమనిస్తూ వారికి ఎన్నికలు దూరంగా ఉంచడం మరొక ఆలోచన ఇకపోతే అధినాయకత్వానికి గెలిచే సస్తావున్న అభ్యర్థులు కూడా పార్టీ ధ్రువీకరించిన అభ్యర్థులకు పూర్తి సహకారం అందించడమే కాక ముందుండి ఓట్లను సంపాదించడం మరొకటి విజయానికి సాధ్యమైంది రెబ్బలు ఒకటి రెండు చోట్ల ఇతర పార్టీల అనుమతితో నిలబడ్డ వారిని పూర్తిగా ఓడించే ప్రయత్నం పూర్తిగా సఫలమైంది 12వ వార్డులో గతంలో షరాబు శ్యామ్ కుమార్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బలంగా ఆర్థికంగా గెలిచి సత్తా ఉన్న గతంలో తనతో ఓడిపోయిన పోచమ్మల గణేష్ కు ఛాయిస్ ఇవ్వడం ప్రచారంలో ఉండి కాంగ్రెస్కు బలంగా ఓట్లు తేవడం నిజంగా అతను త్యాగానికి పార్టీ ప్రతిఫలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటో వార్డులో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని సీట్లలో టిఆర్ఎస్ గాలిని అడ్డుకొని గెలిచి నిలిచిన బుర్ర అనిల్ కుమార్ చైర్మన్ కాండిడేట్ నాగరాజు లావణ్య కు పెద్ద విజయాన్ని సాధించి పెట్టాడు పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నుకోబడ్డ చింతల స్వామి 11 లో అతనికి అవకాశం ఉన్న కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థికి పూర్తి న్యాయం చేయడం ఏడో వార్డులో గొలుపర్తి 700 ఓట్లు గ్రామంలోని ఉండడం గత కొన్ని సంవత్సరాలుగా పచ్చంటి రాము పోటీ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేదైన చైర్మన్ భర్త నాగరాజుకు త్యాగం చేసి పార్టీకి లాభం చేకూర్చాడు .అందుకే రామాయంపేట మెదక్ జిల్లాలో వేస్తున్న పోటాపోటీ బిఆర్ఎస్ గారికి ఐకమత్యములు మరియు త్యాగాలతో విజయం చేకూర్చడంలో భాగస్వాములు అయ్యారని చెప్పవచ్చు.
గ్రామంలో సర్పంచ్ ల పాత్ర కీలకమని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా సర్పంచ్ లు పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రామాయంపేట, నిజాంపేట మండలలో ఎస్సీ, ఎస్టీ సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. గ్రామానికి సర్పంచ్ వెన్నుముక లాంటి వాడని, గ్రామ అభివృద్ధి సర్పంచ్ చేతిలోనే ఉంటుందన్నారు. భారతదేశంలో మానవులంతా సమానమేనని ప్రతి ఒక్కరు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా అందరు సమానమేనన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే బాటలో నడవాలన్నారు. స్థానిక ఎస్సై రాజేష్, డీఎస్డీఓ సింధు, డీబీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ తదితరులు ఉన్నారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ , రామాయంపేట ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకము క్వింటాలుకు 2389 గాను, గ్రేడ్ బి రకానికి క్వింటాలుకు 2369 gaa అలాగే సన్న రకానికి బోనస్ గా 500 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుందని సెంటర్ నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్ ,వడ్ల కనుగోలు కేంద్రం నిర్వాహకులు కేతావత్ సురేష్ , పాత్లోత్ శంకర్, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగ్లోత్ దేవేందర్, గ్రామస్థులు ఉప్పలయ్య, మోహన్, నాజాం , అనిల్ కుమార్, మరియు రైతులు పాల్గొన్నారు.
యు వకులు ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం ఆనందకర విషయం,,,,,
రామాయంపేట అక్టోబర్ 27 నేటి ధాత్రి (మెదక్)
రక్తదానం మహాదానమని దానివల్ల ఎందరో ప్రాణాపాయ స్థితి నుండి చిరంజీవులు అవుతారని రక్తదానం చేయడానికి అందరు సిద్ధం కావాలని తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ అన్నారు, సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా స్నేహ బందు మరియు పోలీసులు రామాయంపేట పోలీసులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 1,50,000 మంది రక్తం అందగా మరణిస్తున్నారన్నారు అవసరమైన సమయానికి రక్తం ఇస్తే ఎందరో చిరంజీవులుగా మారతారన్నారు అందుకే రక్త దానం అనేది ఎన్నికైన గొప్ప విషయం అన్నారు ప్రమాదాల్లో
క్షతగాత్రులైన వారికిరక్తం బాగా సహకరిస్తుందన్నారు సమయానికి రక్తం అందిస్తే వారికి నూతన జీవితం అందించడం జరుగుతుందన్నారు యువత చాలామంది ఈరోజు రక్తదానికి సహకరించడం నూతన జీవితాలను వెలిగించడం జరుగుతుందన్నారు రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ రామాయంపేట ఎస్సై ఆర్ బాలరాజ్ నిజాంపేట్ ఎస్సై రాజేష్ నార్సింగ్ ఎస్ఐ సృజన పోలీసులుతదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు స్నేహబంధు లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన రైతు పేగుడ దుర్గయ్య (68) మృతి చెందడంతో గ్రామం మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమారు 25 రోజుల క్రితం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లుచిరుగి పొలం వద్దనే కుప్పకూలిన దుర్గయ్యను చుట్టుపక్కల రైతులు గమనించారు. వెంటనే స్పందించిన వారు 108 అంబులెన్స్కి సమాచారం ఇవ్వగా, అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయనకు రక్తపోటు అత్యధికంగా పెరగడంతో కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుండి హైదరాబాద్కు తరలించిన కుటుంబ సభ్యులు, మేడ్చల్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయితే 26 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దుర్గయ్య చివరకు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. రైతు దుర్గయ్య భార్య లక్ష్మి కూడా సుమారు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను విడిచి వెళ్లిపోయిన దుర్గయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల విలాపాలతో తోనిగండ్ల గ్రామం మునిగిపోయింది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు దుర్గయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. “ఆయన ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. కుటుంబం కోసం జీవితాంతం శ్రమించారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేం” అని గ్రామస్థులు కన్నీటి కణాలతో గుర్తుచేశారు.
శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి వైద్యుల సేవలతో కోలుకున్నా బాలుడు..
రామాయంపేట, అక్టోబర్ 15 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి,కంటి ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు.జ్వరంతో బాధపడుతూ,ప్రమాదకరంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిన గజ్వేల్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రిత్విక్ నందన్ 7 సంవత్సరాల బాలుడిని విజయవంతంగా చికిత్స చేసి ఆరోగ్యవంతుడిగా మార్చారు. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలుడి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండగా, పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రావు పర్యవేక్షణలో వైద్య బృందం ప్రత్యేక చికిత్సా విధానాలతో సేవలు అందించారు.వైద్యుల కృషి ఫలితంగా బాలుడి ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణ స్థాయికి చేరుకుంది.ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో శుక్రవారం బాలుడిని డిశ్చార్జి చేశారు.ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడికి ఉత్తమ వైద్యం అందించి ప్రాణం కాపాడిన డాక్టర్ ప్రదీప్ రావు మరియు ఆసుపత్రి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పట్టణ ప్రజలు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో శ్రీరాజరాజేశ్వర ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు ఇటువంటి నిబద్ధత కలిగిన వైద్యులు రామాయంపేటకు గర్వకారణమని ప్రశంసించారు.
తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే 18వ తేదీ శనివారం రామాయంపేట బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా బీసీ సంక్షేమం, రాజకీయ, కుల, మహిళా, యువజన, ఉద్యోగుల, దివ్యాంగుల, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకత్వంలో రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీకర ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. సమావేశంలో నేతలు మాట్లాడుతూ — రాష్ట్ర జనాభాలో 65 శాతం బీసీలు ఉన్నా, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కేవలం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత న్యాయం చేయాలంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లును చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ జేఏసీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణం మరియు మండలంలోని ప్రజలు, వ్యాపార వాణిజ్యవేత్తలు, కుల సంఘాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు ఉద్యోగులు, యువజన సంఘాలు, అలాగే ఎస్సీ–ఎస్టీ, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నాయకులు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు వచ్చి బంద్ను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం. మామిడి సిద్ధరాములు. పోచమ్మల అశ్విని శ్రీనివాస్. రేవెల్లి వినయ్ సాగర్. బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులో చోటుచేస్తుంది. రామయంపేట నుంచి వస్తున్న బైక్ ను ఆటో ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఫారెస్ట్ అధికారి మహేష్, ఎంపీడీవో కార్యాలయ ఆపరేటర్ శ్రీనివాస్ గౌడ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రైతుల ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం కేటాయించాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన రాయలాపూర్ గ్రామ రైతుల వినతి పత్రం సమర్పణ..
రామాయంపేట అక్టోబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలంలోని రాయలాపూర్ గ్రామ రైతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను వెల్లడించారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు తాము కోత కోసిన వడ్లను ఎండబెట్టేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సీజన్లో రాయలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని రైతులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉన్న సంఘ స్థలం చాలక రోడ్డుపై, పొలాల్లో ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రోడ్డుపై ధాన్యం పోస్తే రవాణాకు ఆటంకం కలుగుతోందని, పోలీసు అధికారులు కూడా అడ్డుకుంటున్నారని రైతులు వివరించారు. ఈ నేపథ్యంలో రాయలాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి, హనుమాన్ గుడి ముందు ఉన్న సర్వే నెం. 881లోని ప్రభుత్వ భూమిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్ రజనీకుమారిని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. రోడ్డుపై వడ్లు ఆరబెట్టడం వాహనదారులకు ఇబ్బందికరమని, ప్రమాదం కూడా ఉందని రైతులు పేర్కొన్నారు. కనుక ప్రభుత్వమే తక్షణం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి తమ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.
అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ. రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకన్నగారి చెరువు వద్ద బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించి సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. చెరువు కట్టపైకి వచ్చే మహిళలు సౌకర్యంగా పూల బతుకమ్మలు నిమజ్జనం చేయగలిగేలా ప్రత్యేకంగా మెట్లు తయారు చేయడంపై మున్సిపల్ సిబ్బంది పట్టు పట్టారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో మహిళలు చెరువుకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే భద్రతా చర్యలతో పాటు సౌకర్యాల కల్పనకు ముందస్తుగానే పనులు ప్రారంభించారు. విద్యుత్ దీపాలు, త్రాగునీటి సదుపాయం, చెరువు పరిసరాల్లో శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలందరూ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకునేలా మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని పేర్కొన్నారు. పట్టణంలో బతుకమ్మ వేడుకలు మరింత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరగాలని మున్సిపల్ సిబ్బంది ఆకాంక్షిస్తున్నారు.”
రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..
రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.
Development
రామాయంపేటకు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం. రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.
Development
రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వ్యాపారులు..
రామాయంపేట సెప్టెంబర్ 13 నేటి ధాత్రి (మెదక్)
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు. రామాయంపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ టై బజార్ వసూల్ వేలం ను రద్దు చేసిన నిర్ణయంపై రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా — సంగారెడ్డి నుంచి వెలుకతుర్తి వెళ్లే 765 డీజి ప్రధాన రహదారిపై, అలాగే సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యన బటర్ఫ్లై లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు అధ్యక్షత వహించారు.
పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రామాయంపేటలో జరుగుతున్న సుందరీకరణ పనులు పూర్తయితే పట్టణం మరింత అందంగా మారనుందని రామాయంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరాపు యాదగిరి.రమేష్ రెడ్డి. విప్లవ కుమార్. పిట్ల ప్రకాష్.మాజీ కౌన్సిలర్లు సుందర్ సింగ్. దానికి స్వామి. చింతల స్వామి. తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తుడుం జీవన్ కుమార్ కుటుంబం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిన్న రాత్రి మరోసారి వర్షం కురవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇది తెలుసుకున్న సానీక్ష ఫౌండేషన్ ముందడుగు పేద కుటుంబం పరిస్థితిని గమనించిన సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివ తక్షణమే స్పందించారు. కుటుంబ అవసరాలపై స్థానికులు సమాచారం అందించగా, శివ స్వయంగా ముందుకు వచ్చి సహాయం కల్పించే ప్రయత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన దాతలు రాజశేఖర్ రెడ్డి, మేఘన నండూరి (ఇక్షణ ఫౌండేషన్) సానుభూతితో స్పందించారు. వారి సహకారంతో శుక్రవారం టార్ప్లిన్ పంపిణీ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివతో పాటు కాంగ్రెస్ యువ నాయకుడు నవీన్ రెడ్డి, సభ్యులు శ్రీకాంత్, బాధితుడు తుడుం జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ సహాయం పేదలకు నిజమైన అండగా నిలుస్తుంది. ఇలాంటి సమయంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం అని తెలిపారు.
యూరియా కోసం రైతుల తిప్పలు వర్షాన్ని లెక్కచేయని క్యూలైన్లు..
రామయంపేట సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండలం కాట్రియాల, ధర్మారం గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీ ఎదుట బారులు తీరారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా, తడుస్తూనే ఒక బస్తా యూరియా కోసం ఎనిమిది గంటలపాటు క్యూలైన్లలో నిలబడ్డారు. “తడిసినా పర్వాలేదు… మా పంటలకు యూరియా లేకపోతే ఎండిపోతాయి” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా లైన్లలో నిలబడటం గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రైతులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు.ఇక మాకు హామీలు వద్దు వెంటనే యూరియా సరఫరా చేయాలి. పంటల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..
ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్..
రామాయంపేట, సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)
రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ₹8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రామాయంపేట శాఖ డిమాండ్ చేసింది. స్థానిక బస్టాండ్ వద్ద గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ – ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ నిధుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించకపోగా కేవలం డైవర్షన్ రాజకీయాలతోనే రోజులు గడుపుతున్నారని విమర్శించారు. అతను హెచ్చరిస్తూ, విద్యార్థుల సమస్యలు, స్కాలర్షిప్లు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ విస్తృత స్థాయి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలిపారు. ఈ నిరసనలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అర్జున్, హరిహర, ఆదర్శ్, చందు, మల్లికార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్డీఓ గారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో యూరియా పంపిణీ పరిస్థితులు, 22-ఎ సమాచారం, భూభారతి పనులు, రెవెన్యూ సభల్లో ఫైళ్ల పరిష్కారం, మీ సేవ డాష్బోర్డ్ వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. అదేవిధంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. తదుపరి సిబ్బందితో మాట్లాడిన ఆర్డీఓ గారు సమయపాలన కచ్చితంగా పాటించాలని, దరఖాస్తులు, అభ్యంతరాలపై ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమై రెవెన్యూ సంబంధిత పనులపై మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు మహమ్మద్ గౌస్. గోపి. సిబ్బంది సుష్మ. సౌమ్య. రోజా. సునీత. తదితరులు పాల్గొన్నారు
తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు
మెదక్ జిల్లా, రామాయంపేట, సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ప్రముఖ కవి,స్వాతంత్ర్య సమరయోధుడు,ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దారు రజిని కుమారి మాట్లాడుతూ, “కాళోజి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష పాత్ర పోషించారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకాలు. ఆయన స్ఫూర్తితో మనమంతా తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి” అని పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కోసం వేడినీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నవీన్. మండల ఆర్ఐ గౌస్ మయినుద్దీన్, రూరల్ ఆర్ఐ గోపి, సుష్మ. రోజా. చంద్రకళ సౌమ్య. మండల రెవెన్యూ సిబ్బంది పద్మ.తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలకు అప్రమత్తతే రక్షణ కవచం : ఎస్సై బాలరాజు..
రామాయంపేట, సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
నేటి డిజిటల్ యుగంలో సాంకేతికతను ఆయుధంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను ఉచ్చు వేస్తున్నారని రామాయంపేట ఎస్సై బాలరాజు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రజలకు అప్రమత్తతే ప్రధాన రక్షణ కవచమని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, స్టాక్ మార్కెట్ మోసాలు, యూపీఐ మోసాలు, లోన్ ఫ్రాడ్లు, నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లు వంటి మోసపూరిత పద్ధతులు ప్రస్తుతం విస్తరించి ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ ఉచ్చులో పడుతున్నారని, ఆకర్షణీయమైన లాభాలు, సులభంగా డబ్బు సంపాదన వాగ్దానాలను నమ్మకూడదని సూచించారు.
“వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా పంపే APK ఫైళ్లు డౌన్లోడ్ చేస్తే మొబైల్ ఫోన్ మొత్తం నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న పార్ట్టైమ్ జాబ్ ఆఫర్లకు స్పందించరాదు. మొదట ఎక్కువ లాభాలు వస్తాయని చూపించి డబ్బు పెట్టించాక, తిరిగి రాబట్టడం అసాధ్యం అవుతుంది” అని ఎస్సై ఉదాహరణలు ఇచ్చారు. ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’ లోనే చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని బాలరాజు హితవు పలికారు. దానికి గాను జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు కాల్ చేయవచ్చని, లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ మోసాల నివారణకు పోలీసులు నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని, అయితే ప్రజలు స్వయంగా అప్రమత్తతతో వ్యవహరించడమే నిజమైన రక్షణ కవచమని ఎస్సై బాలరాజు స్పష్టం చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.