రాయలాపూర్ గ్రామ రైతుల వినతి పత్రం సమర్పణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download.wav?_=1

 

రైతుల ధాన్యం ఎండబెట్టేందుకు స్థలం కేటాయించాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
రాయలాపూర్ గ్రామ రైతుల వినతి పత్రం సమర్పణ..

రామాయంపేట అక్టోబర్ 9 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలంలోని రాయలాపూర్ గ్రామ రైతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను వెల్లడించారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులు తాము కోత కోసిన వడ్లను ఎండబెట్టేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి సీజన్‌లో రాయలాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని రైతులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఉన్న సంఘ స్థలం చాలక రోడ్డుపై, పొలాల్లో ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రోడ్డుపై ధాన్యం పోస్తే రవాణాకు ఆటంకం కలుగుతోందని, పోలీసు అధికారులు కూడా అడ్డుకుంటున్నారని రైతులు వివరించారు. ఈ నేపథ్యంలో రాయలాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి, హనుమాన్ గుడి ముందు ఉన్న సర్వే నెం. 881లోని ప్రభుత్వ భూమిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహసీల్దార్ రజనీకుమారిని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
రోడ్డుపై వడ్లు ఆరబెట్టడం వాహనదారులకు ఇబ్బందికరమని, ప్రమాదం కూడా ఉందని రైతులు పేర్కొన్నారు. కనుక ప్రభుత్వమే తక్షణం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి తమ సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వినతి పత్రం సమర్పణ కార్యక్రమంలో సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు.

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట అక్టోబర్ 8 నేటిధాత్రి (మెదక్)

Vaibhavalaxmi Shopping Mall

అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ.
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.

రామాయంపేట పట్టణంలో బతుకమ్మ సంబరాల సన్నాహాలు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-18T160504.326-1.wav?_=2

 

రామాయంపేట పట్టణంలో బతుకమ్మ సంబరాల సన్నాహాలు..

రామాయంపేట, సెప్టెంబర్ 18 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వెంకన్నగారి చెరువు వద్ద బతుకమ్మ పండుగ వేడుకలకు సంబంధించి సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి. చెరువు కట్టపైకి వచ్చే మహిళలు సౌకర్యంగా పూల బతుకమ్మలు నిమజ్జనం చేయగలిగేలా ప్రత్యేకంగా మెట్లు తయారు చేయడంపై మున్సిపల్ సిబ్బంది పట్టు పట్టారు.
ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో మహిళలు చెరువుకు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే భద్రతా చర్యలతో పాటు సౌకర్యాల కల్పనకు ముందస్తుగానే పనులు ప్రారంభించారు.
విద్యుత్ దీపాలు, త్రాగునీటి సదుపాయం, చెరువు పరిసరాల్లో శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించామని మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణ ప్రజలందరూ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకునేలా మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని పేర్కొన్నారు.
పట్టణంలో బతుకమ్మ వేడుకలు మరింత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరగాలని మున్సిపల్ సిబ్బంది ఆకాంక్షిస్తున్నారు.”

రామాయంపేట అభివృద్ధి జనహృదయనేత సుప్రభాత్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T143429.082.wav?_=3

 

రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..

రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.

 

Development

రామాయంపేటకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం.
రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.

 

Development

 

రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

రామాయంపేట పట్టణ సుందరీకరణ వేగవంతం…

రామాయంపేట పట్టణం సుందరీకరణ.. పనులు వేగవంతం..

టై బజార్ వేలం రద్దు..

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వ్యాపారులు..

రామాయంపేట సెప్టెంబర్ 13 నేటి ధాత్రి (మెదక్)

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు.
రామాయంపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ టై బజార్ వసూల్ వేలం ను రద్దు చేసిన నిర్ణయంపై రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.


ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా — సంగారెడ్డి నుంచి వెలుకతుర్తి వెళ్లే 765 డీజి ప్రధాన రహదారిపై, అలాగే సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యన బటర్‌ఫ్లై లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది.
దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు అధ్యక్షత వహించారు.

పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రామాయంపేటలో జరుగుతున్న సుందరీకరణ పనులు పూర్తయితే పట్టణం మరింత అందంగా మారనుందని రామాయంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరాపు యాదగిరి.రమేష్ రెడ్డి. విప్లవ కుమార్. పిట్ల ప్రకాష్.మాజీ కౌన్సిలర్లు సుందర్ సింగ్. దానికి స్వామి. చింతల స్వామి. తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఝాన్సీ లింగాపూర్‌లో టార్ప్లిన్ పంపిణీ..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T124555.486.wav?_=4

 

ఝాన్సీ లింగాపూర్‌లో టార్ప్లిన్ పంపిణీ..

వర్షంలో ఇల్లు కూలి ఇబ్బందులు..

రామాయంపేట సెప్టెంబర్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

https://youtu.be/P-tFvsSUVDg?si=1meRL81t9whuSFKi

 

 

రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామానికి చెందిన తుడుం జీవన్ కుమార్ కుటుంబం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిన్న రాత్రి మరోసారి వర్షం కురవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇది తెలుసుకున్న
సానీక్ష ఫౌండేషన్ ముందడుగు
పేద కుటుంబం పరిస్థితిని గమనించిన సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివ తక్షణమే స్పందించారు. కుటుంబ అవసరాలపై స్థానికులు సమాచారం అందించగా, శివ స్వయంగా ముందుకు వచ్చి సహాయం కల్పించే ప్రయత్నం ప్రారంభించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన దాతలు రాజశేఖర్ రెడ్డి, మేఘన నండూరి (ఇక్షణ ఫౌండేషన్) సానుభూతితో స్పందించారు. వారి సహకారంతో శుక్రవారం టార్ప్లిన్ పంపిణీ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో సానీక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు శివతో పాటు కాంగ్రెస్ యువ నాయకుడు నవీన్ రెడ్డి, సభ్యులు శ్రీకాంత్, బాధితుడు తుడుం జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ సహాయం పేదలకు నిజమైన అండగా నిలుస్తుంది. ఇలాంటి సమయంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం అని తెలిపారు.

యూరియా కోసం రైతుల తిప్పలు…

యూరియా కోసం రైతుల తిప్పలు
వర్షాన్ని లెక్కచేయని క్యూలైన్‌లు..

రామయంపేట సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రామాయంపేట మండలం కాట్రియాల, ధర్మారం గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీ ఎదుట బారులు తీరారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా, తడుస్తూనే ఒక బస్తా యూరియా కోసం ఎనిమిది గంటలపాటు క్యూలైన్‌లలో నిలబడ్డారు.
“తడిసినా పర్వాలేదు… మా పంటలకు యూరియా లేకపోతే ఎండిపోతాయి” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా లైన్లలో నిలబడటం గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో
రైతులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు.ఇక మాకు హామీలు వద్దు వెంటనే యూరియా సరఫరా చేయాలి. పంటల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్..

రామాయంపేట, సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ₹8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రామాయంపేట శాఖ డిమాండ్ చేసింది.
స్థానిక బస్టాండ్‌ వద్ద గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న 8300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ –
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు, ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ నిధుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలపై స్పందించకపోగా కేవలం డైవర్షన్ రాజకీయాలతోనే రోజులు గడుపుతున్నారని విమర్శించారు.
అతను హెచ్చరిస్తూ, విద్యార్థుల సమస్యలు, స్కాలర్‌షిప్‌లు తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ విస్తృత స్థాయి ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలిపారు.
ఈ నిరసనలో నగర కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి అర్జున్, హరిహర, ఆదర్శ్, చందు, మల్లికార్జున్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ…

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ

రామాయంపేట సెప్టెంబర్ 10 నేటి ధాత్రి (మెదక్)

 

 

మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్‌డీఓ గారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో యూరియా పంపిణీ పరిస్థితులు, 22-ఎ సమాచారం, భూభారతి పనులు, రెవెన్యూ సభల్లో ఫైళ్ల పరిష్కారం, మీ సేవ డాష్‌బోర్డ్‌ వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. అదేవిధంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.
తదుపరి సిబ్బందితో మాట్లాడిన ఆర్‌డీఓ గారు సమయపాలన కచ్చితంగా పాటించాలని, దరఖాస్తులు, అభ్యంతరాలపై ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమై రెవెన్యూ సంబంధిత పనులపై మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు మహమ్మద్ గౌస్. గోపి. సిబ్బంది సుష్మ. సౌమ్య. రోజా. సునీత. తదితరులు పాల్గొన్నారు

తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T151154.040-1.wav?_=5

 

తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు

మెదక్ జిల్లా, రామాయంపేట, సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ప్రముఖ కవి,స్వాతంత్ర్య సమరయోధుడు,ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దారు రజిని కుమారి మాట్లాడుతూ, “కాళోజి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష పాత్ర పోషించారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకాలు. ఆయన స్ఫూర్తితో మనమంతా తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి” అని పేర్కొన్నారు.
అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కోసం వేడినీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నవీన్. మండల ఆర్ఐ గౌస్ మయినుద్దీన్, రూరల్ ఆర్ఐ గోపి, సుష్మ. రోజా. చంద్రకళ సౌమ్య. మండల రెవెన్యూ సిబ్బంది పద్మ.తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలకు అప్రమత్తతే రక్షణ కవచం : ఎస్సై బాలరాజు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T115053.225.wav?_=6

 

 

సైబర్ నేరాలకు అప్రమత్తతే రక్షణ కవచం : ఎస్సై బాలరాజు..

రామాయంపేట, సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

నేటి డిజిటల్ యుగంలో సాంకేతికతను ఆయుధంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను ఉచ్చు వేస్తున్నారని రామాయంపేట ఎస్సై బాలరాజు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రజలకు అప్రమత్తతే ప్రధాన రక్షణ కవచమని సూచించారు.
ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, స్టాక్ మార్కెట్ మోసాలు, యూపీఐ మోసాలు, లోన్ ఫ్రాడ్లు, నకిలీ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ షాపింగ్ ఆఫర్లు వంటి మోసపూరిత పద్ధతులు ప్రస్తుతం విస్తరించి ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ ఉచ్చులో పడుతున్నారని, ఆకర్షణీయమైన లాభాలు, సులభంగా డబ్బు సంపాదన వాగ్దానాలను నమ్మకూడదని సూచించారు.

“వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా పంపే APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ ఫోన్ మొత్తం నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్లకు స్పందించరాదు. మొదట ఎక్కువ లాభాలు వస్తాయని చూపించి డబ్బు పెట్టించాక, తిరిగి రాబట్టడం అసాధ్యం అవుతుంది” అని ఎస్సై ఉదాహరణలు ఇచ్చారు.
ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’ లోనే చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని బాలరాజు హితవు పలికారు. దానికి గాను జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయవచ్చని, లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సైబర్ మోసాల నివారణకు పోలీసులు నిరంతర అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని, అయితే ప్రజలు స్వయంగా అప్రమత్తతతో వ్యవహరించడమే నిజమైన రక్షణ కవచమని ఎస్సై బాలరాజు స్పష్టం చేశారు.

సమీకృత హాస్టల్ ఆవరణలో ఆవరిగోడ నిర్మాణం చేపట్టాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T111516.377.wav?_=7

 

సమీకృత హాస్టల్ ఆవరణలో ఆవరిగోడ నిర్మాణం చేపట్టాలి

ఎస్సి గర్ల్స్ హాస్టల్ కొత్త భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కృషి చేయాలి

హాస్టళ్లను పర్యవేక్షణ చేసిన యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటి సభ్యుడు రవి..

రామాయంపేట సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట పట్టణ కేంద్రంలో ఉన్న పలు హాస్టళ్లను జిల్లా అధ్యక్షుడు జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గుడికందుల రవి పర్యవేక్షణ చేసి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని రవి మాట్లాడుతూ…. సమీకృత హాస్టల్ ఆవరణలో అవరి గోడ లేకపోవడం వల్ల బయట వ్యక్తులు హాస్టల్లోకి వెళ్లి బాత్రూం లు నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు.

 

 

 

సిగరెట్ల డబ్బాలు, అంబర్ వంటి పొట్లాలు మైదానంలో పడేసి వెళుతున్నారని అన్నారు కావునా అధికారులు అవరిగోడ నిర్మించాలని ఆయన కోరారు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ సమస్యలు పరిష్కరించే నాథుడే కరువయ్యాడనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శిధిల వ్యవస్థకు చేరిన హాస్టల్ కొత్త భవనం నిర్మించే దిశగా స్థానిక ఎమ్మెల్యే కృషి చేయాలని ఆయన అన్నారు పట్టణ కేంద్రంలో ఇంటర్మీడియట్ డిగ్రీ అబ్బాయిలు హాస్టల్లో ఉందామంటే వారికి హాస్టల్ సదుపాయం లేక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేద వ్యక్తం చేశారు గురుకుల హాస్టల్ సదుపాయాలకు పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని ఆయన తెలియజేశారు కేజీబీవీ హాస్టల్లో నీటి కొరత తీర్చాలని. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ హాస్టల్లో అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని వారి సమస్యలు పరిష్కరించాలనీ అన్నారు జిల్లా కలెక్టర్ లాగా ప్రతి విద్యాధికారులు పర్యవేక్షణలో ఉండాలని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యు ఎస్ ఎఫ్ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శేఖర్ నాయకులు మహేష్ పాల్గొన్నారు

రామాయంపేట: యూరియా కోసం రైతుల ఆందోళన..

రామాయంపేట: యూరియా కోసం రైతుల ఆందోళన..

రామాయంపేట సెప్టెంబర్ 8 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి క్యూలైన్లలో నిలబడి యూరియా బస్తాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

 

నెల రోజులుగా తగినంత యూరియా లభించక పంటల సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సరిపడా యూరియా సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

యూరియా కొరతపై రైతుల ఆందోళన..

యూరియా కొరతపై రైతుల ఆందోళన..

రామాయంపేట సెప్టెంబర్ 8 నేటి ధాత్రి (మెదక్)

 

చేగుంట మండలంలో యూరియా కొరత రైతులను రోడ్డెక్కేలా చేసింది. మూడు రోజులుగా ఎరువులు అందకపోవడంతో సోమవారం చేగుంట గాంధీ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఇటీవల 440 బస్తాల యూరియా మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు పంపిణీ జరిగి, మిగతా వారికి అందలేదు. ఈరోజు యూరియా వస్తుందని తెలిసి తెల్లవారుజామున మూడు గంటలకే రైతులు రైతు వేదిక వద్దకు చేరుకున్నారు.

అయితే యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన వారు ప్రధాన కూడలి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అరగంట పాటు సాగిన రాస్తారోకోతో మెదక్–హైదరాబాద్, నిజామాబాద్ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి అక్కడకు చేరుకుని రైతులతో చర్చించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి మంగళవారం యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

అక్కన్నపేటలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం..

రామయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్ర వారం సాయంత్రం గ్రామమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
నిమజ్జన శోభాయాత్రలో గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ వేషధారణలో కోలాటాలతో నృత్యాలు చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, యువకులు కూడా డప్పు వాయిద్యాలు, నృత్యాలతో ఊరంతా ఉత్సవ శోభను పెంచారు.
ఫ్రెండ్స్ యూత్ సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు జైజై గణేశ్, గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ ఊరంతా సందడి చేశారు.

అప్పాజీపల్లి గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో గణేశ్ ప్రతిష్ట..

అప్పాజీపల్లి గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో గణేశ్ ప్రతిష్ట..

రామాయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)

 

సగర సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో గణేశుని ప్రతిష్టించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మండపానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శనమిచ్చారు. గణేశ్ వద్దకు వచ్చిన భక్తులకు సగర సంఘం గుర్తింపుగా ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ చైర్మన్ సంధిల సత్తయ్య సగర, జిల్లా అధ్యక్షులు సంధిల సాయిలు సగర, గ్రామ అధ్యక్షులు శంకురి సాయిలు సగర, ఉపాధ్యక్షులు రుక్కముల సంగయ్య సగర, మాజీ అధ్యక్షులు చెట్టుకింది సాయిలు సగర, మాజీ సర్పంచ్ మర్క రాములు సగర, సగర బంధువులు ఎల్లంపల్లి జగన్ సగర, చెట్టుకింది లక్ష్మయ్య సగర తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో…

రాష్ట్ర స్థాయి పత్రికా కథన రూపంలో

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్..

రామాయంపేట, సెప్టెంబర్ 5 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వయికుంట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం సందర్శించి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, సాఫీగా జరిగేలా మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాల ర్యాలీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, రాకపోకలు అంతరాయం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్‌కు తగు సూచనలు ఇస్తూ, సర్వయికుంట చెరువులో జరిగే నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని భద్రతా చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశించారు.
కలెక్టర్ పర్యటనలో మండల తహసీల్దార్ రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం.దేవేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సైదయ్య, మున్సిపల్ వార్డు అధికారులు, ప్రజాప్రతినిధులు సుప్రభాత రావు. తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T124355.369.wav?_=8

 

మున్సిపల్ కార్మికులకు సిబ్బందికి ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన లైన్స్ క్లబ్..

రామాయంపేట, సెప్టెంబర్ 4 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు విశేష సన్మానం లభించింది. గురువారం ఉదయం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్‌ను అందజేశారు.
లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి, జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్, సభ్యులు వంగరి కైలాస్, దోమకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ దేవేందర్ మాట్లాడుతూ – “పట్టణం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి పారిశుధ్య కార్మికుల కృషి అత్యంత కీలకం. ఇలాంటి సేవా కార్యక్రమాలు వారికి ప్రోత్సాహం కలిగిస్తాయని తెలిపారు.
కార్మికులు తమ భావాలను వ్యక్తం చేస్తూ, శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – “మేము ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమిస్తాం.
ఇలాంటి గుర్తింపు మా కష్టానికి నిజమైన గౌరవం” అన్నారు.

పోచమ్మ శంకర్ మాట్లాడుతూ “ఇంతవరకు ఎవరు మాపై ఇంత శ్రద్ధ చూపలేదు. లైన్స్ క్లబ్ చేసిన సత్కారం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది”.

లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి మాట్లాడుతూ – “సమాజానికి మూలస్తంభాలుగా నిలుస్తున్న పారిశుధ్య కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పోదేండ్ల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ – “ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తాం” అని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు దేమే యాదగిరి. లక్ష్మణ్ యాదవ్. వంగరి కైలాస్. దోమకొండ శ్రీనివాస్. శ్రీధర్ రెడ్డి. చల్ మెడ ప్రసాద్ పోచమ్మ శంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అకాల వర్షాల్లో రామాయంపేట పోలీసులు ప్రజలను రక్షించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T163411.207.wav?_=9

సలాం పోలీస్‌..

అకాల వర్షాల్లో ప్రజలకు అండగా రామాయంపేట పోలీసులు..

పోలీసులపై నేటి ధాత్రి ప్రత్యేక కథనం..

రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు నగర జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కాలువలు పొంగిపొర్లడంతో తక్కువ ఎత్తున్న కాలనీలు మునిగిపోయి వందలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడిన వారు పోలీసులు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్, ఎస్‌.ఐ బాలరాజు తమ సిబ్బందిని ముందుండి నడిపిస్తూ పగలు–రాత్రి తేడా లేకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

రిస్క్ తీసుకుని ప్రాణరక్షణ

నీటి మునిగిన వీధుల్లోకి ప్రవేశించి వృద్ధులను, మహిళలను, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాలలో చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రుల ఆందోళన తొలగించారు. వర్షాల మధ్య ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా పోలీసులు సేవలందించడం ప్రజల హృదయాలను తాకింది.

ప్రజల కృతజ్ఞత..

“పోలీసులు లేకపోతే మా కుటుంబం బతికేది కాదు. మమ్మల్ని ప్రాణాలకు భయపడకుండా రక్షించారు. ఈ ఋణం మాకు ఎప్పటికీ మరవలేనిది” అని బస్తీ వాసులు కన్నీటి కళ్ళతో చెప్పారు.

“మా పిల్లలు స్కూల్లో చిక్కుకుపోయారు.

వెంటనే పోలీసులు వచ్చి వారిని రక్షించారు. మా కోసం వారు ప్రాణరక్షకులుగా నిలిచారు” అని స్థానిక పిల్లల తల్లులు భావోద్వేగంతో అన్నారు.

అధికారుల ప్రశంసలు

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – “ప్రజల ప్రాణాలను కాపాడడంలో రామాయంపేట పోలీసులు చూపిన ధైర్యం నిజంగా ప్రశంసనీయమైంది. ఇతరులకు ఆదర్శం.” అని అభినందించారు.

హనుమంతరావు మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ దంతపల్లి.

“ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు చూపిన స్పందన సమాజానికి స్ఫూర్తిదాయకం. వారు కేవలం చట్టం అమలులోనే కాకుండా, ప్రాణరక్షకులుగా నిలుస్తున్నారు.” అని అన్నారు.

 

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. మల్లన్న గారి నాగులు ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ. తోని గండ్ల.

అకాల వర్షాల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలిచిన రామాయంపేట పోలీసులు చూపిన త్యాగం, సేవలు ఎన్నటికీ మరువలేనివి. వారి కృషి రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పాత్రకు ఒక నిదర్శనంగా నిలిచింది.

కోనాపూర్‌లో దివంగత కుటుంబానికి లీలా గ్రూప్ చైర్మన్ సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T144903.648-1.wav?_=10

కోనాపూర్ గ్రామంలో దివంగత కుటుంబానికి లీలా గ్రూప్ చైర్మన్ మోహన్ నాయక్ పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారు దివంగత కరికి బాబు కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. ఇటీవల మరణించిన కరికి బాబు కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం అందజేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు చింతాల స్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విద్యాసాగర్, మండల నాయకులు మామిడి సిద్ధిరాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుల అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం సురేష్, యూత్ అధ్యక్షులు మామిడి సతీష్, ప్రధాన కార్యదర్శి కరికి రాజు, చాకలి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version