రామాయంపేట జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-91.wav?_=1

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను స్వాగతించేందుకు సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంగా మారింది.
కార్యక్రమానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నృత్యాలు, పాటలు, నాటికలు, వినోదాత్మక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Freshers Party at Ramayampet Junior College.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ –
“కళాశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు సామాజిక సేవా భావనను పెంపొందించుకోవాలని” సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థుల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు, ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్లు ఫ్రెషర్స్ విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T154921.524.wav?_=2

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది పేద విద్యార్థులకు ఎంతో వరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుంచి బస్సులు చేస్తూ కళాశాల కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు డిగ్రీ పూర్తి తర్వాత పై చదువులకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికెట్స్ ఎంత అవసరం ఉంటాయి అలాంటి వాటిని కళాశాలలు ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బందుల గురి చేస్తున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యార్థులు గుర్తుకొస్తారు కానీ గద్దెనింకినంక విద్యార్థులకు ఎందుకు గుర్తురారని డిమాండ్ చేశారు ప్రభుత్వము ఇకనైనా విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రంలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతున్న పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి రోజులు గడుపుతున్నాడు హాస్టళ్లకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్రంలో పాఠశాలల నుంచి కళాశాలల వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్,సాయి,విఘ్నేష్,ప్రదీప్,చారి,వైష్ణవి,మానస, తదితరులు పాల్గొన్నారు.

భుత్వ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం.

భుత్వ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం.

చిట్యాల, నేటిధాత్రి :

 

జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈవో కోడెపాక రఘుపతి మరియు శ్రీరామ్ రఘుపతి ఆధ్వర్యంలో ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈవో రఘుపతి మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు విధిగా పాఠశాలలో, గృహాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తద్వారా ముందు తరాలను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, నీలిమా రెడ్డి , కల్పన,విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, సాంబారు రామనారాయణ, సుజాత, శ్రీనివాస్, శంకర్, ఫిజికల్ డైరెక్టర్ సూధం సాంబమూర్తి, మౌనిక, బుజ్జమ్మ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై,బెల్ట్స్,గుర్తింపు కార్డులను ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ సౌజన్యంతో అందిజేశారు
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం గంగాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1000 పిల్లర్స్ లైన్ క్లబ్ అధ్యక్షులు పరికిపండ్ల వేణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకున్న వారికే ఉన్నత విద్యాభ్యాసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబద్ధత గల ఉపాధ్యాయులు చక్కని విద్యా బోధన చేస్తున్నారని అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యంత నిరుపేద విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోవడానికి వస్తారని వారికి సహాయ సహకారాలు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని రాజ్ కుమార్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రాజగోపాల్, జోనల్ చైర్మన్ చొప్పరి సోమయ్య, మాజీ సర్పంచ్ పెండ్యాల మమతా రాజు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఓరుగంటి కవిత తిరుపతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయురాలు వీణ జ్యోతి, పెండ్యాల రాము మడతలపాటి కుమార్, రుదీర్, జటబోయిన రాజు, గుండెబోయిన కాజీ యాదవ్, పుట్టపాక భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం…

బాలాజీ టెక్నోస్కూల్ లో జాతీయ అంతరిక్ష దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో 2.వ జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చంద్రయాన్- 3 పూర్తయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దేశం తన రెండవ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు.
ఆర్యభట్ట నుండి గగన్ యాన్ వరకు ప్రాచీన జ్ఞానం నుండి అనంత అవకాశాల వరకు అనే ఇతివృత్తంతో జరుపుకునే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని విజయాలతో అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాలకు సాధ్యంకాని విధంగా అనేక విజయాలను నమోదు చేసిందన్నారు.చంద్రయాన్ 1,2,3 ప్రయోగాలే కాకుండా చంద్రయాన్ – 4 ప్రయోగానికి సన్నద్ధం అవుతుందని, 2035 నాటికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉందని గుర్తుకుచేశారు. భారత్ చంద్రునిపై 2023 ఆగస్టు 23 న చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించిందని తెలిపారు.విద్యార్థులు, యువత సైన్సును కేవలం ఒక కెరీర్ గా చూడకుండా ఉండాలని, అంతరిక్ష పరిశోధన,సాంకేతికలు,దేశ నాయకత్వం పట్ల జాతీయ గౌరవాన్ని ప్రేరేపించి హద్దులు లేని ప్రయాణాన్ని చూడాలని విద్యార్థులను సూచించారు.ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో కూడా జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించగా విద్యార్థులు అంతరిక్షం సంబంధించిన చార్టులు ప్రదర్శించి క్విజ్ పోటీలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. రమేష్, విజయ్, గౌతమ్, పూర్ణిమ, రాజ్ కుమార్, రమ్య, కృష్ణవేణి, హేమలత, నరసింహారెడ్డి, అనిత, విశాల,తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T141729.361.wav?_=3

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి మన జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తేవాలని శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శనివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ సార్ విగ్రహం నుండి అంబేడ్కర్ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన క్రీడా దినోత్సవ రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించి జెండా ఊపి క్రీడా రన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ క్రీడా యూనివర్సిటీతో పాటు జిల్లా కేంద్రాలలో క్రీడామైదానాలను ఏర్పాటు చేస్తూ క్రీడలకు ప్రాధాన్యత నిస్తుందని అన్నారు.
ఎంప్రభుత్వం విద్యాతో పాటు సమాంతరంగా క్రీడలకు అత్యున్త ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశ్యంతో అన్ని జిల్లా కేంద్రాలలో క్రీడా మైదానాల ఏర్పాటు మొదలు పెట్టడం జరిగిందని యువత మత్తు పదార్థాలకు ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పి కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయ లక్ష్మీ, జిల్లా క్రీడల శాఖ అధికారి రఘు, అధికారులు, అనధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

పాఠశాల దారికి పరిష్కారం చూపిన DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T133258.874.wav?_=4

పాఠశాల దారికి పరిష్కారం చూపిన DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్

మరిపెడ నేటిధాత్రి

 

మరిపెడ మండలం ఎల్లంపేట శివారు మంచ్య తండా ప్రాథమిక పాఠశాలలో దాదాపు 22 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న తరుణంలో వారికి పాఠశాలకు రావడానికి మార్గం లేక అనేక అవస్థలు పడుతున్నారని డిఎస్ఎఫ్ఐ నేతలకు సమాచారం రాగా వెంటనే ఆ తండా పాఠశాలకు వెళ్లడం జరిగింది, పొలం గట్టే విద్యార్థులకు దారిగా మారిందని వర్షం వస్తే పిల్లలు కింద పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు,అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి 4 ఫీట్ల రోడ్డును ఇవ్వాలని కోరగా రైతులు అంగీకరించారు,అదే సమయంలో జిల్లా విద్యాశాఖ అధికారి డిఈవొ రవీందర్ రెడ్డి తో మాట్లాడి తక్షణమే ఆ పాఠశాలకు రోడ్డు శాంక్షన్ చేయాలని కోరగా, డీఈవో సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో మాట్లాడి కచ్చితంగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు,డాక్టర్ వివేక్ తో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్ర వీరభద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెలోత్ సాయికుమార్, రాష్ట్ర కోశాధికారి గుగులోతు సూర్యప్రకాష్, కోర్ కమిటీ సభ్యులు ఎర్ర దిలీప్, డాక్టర్ వివేక్ వ్యక్తిగత సహాయకుడు శివ వర్మ, డిఎస్ఎఫ్ఐ నేతలు రమేష్,ఎర్ర నితీష్, లేవి జియాన్ చరణ్,మురళి,విష్ణు,సాయి,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల అస్వస్థపై అనుమానం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T123331.092-1.wav?_=5

అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల అస్వస్థపై అనుమానం

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి సుభాష్ కాలనీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు మంచినీరు తాగి అస్వస్థకు గురయ్యారు దీనిపైన జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అధికారులను డిమాండ్ చేశారు
భూపాలపల్లి సుభాష్ కాలనీ గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 13 మంది విద్యార్థులు ఆహారం తిని వాటర్ తాగి అస్వస్థకు గురైన విద్యార్థులను స్థానిక ప్రిన్సిపాల్ వెంటనే 100 పడకల హాస్పిటల్ తరలించి వైద్యం అందించారు కానీ ఘటన జరిగిన దాని యొక్క కారణాలు ఏమున్నాయి ఎవరు చేశారు అనేదానిపై విచారణ జరిపించి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం బాధ్యులు ఎంతటి వారైనా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా సెక్రెటరీ శీలపాక నరేష్ పార్టీ నాయకులు రాజు పాల్గొన్నారు

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T112717.663.wav?_=6

 

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ
శాఖ నుంచి గౌరవ ప్రశంసా పత్రం అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మేడికాల అంజయ్య
దేశభక్తిని చాటేలా జోగాపూర్
విద్యార్థుల “హర్ ఘర్ తిరంగా”

విద్యార్థులలో దేశ భక్తిని పెంపొందించేందుకు సిసిఆర్టి శిక్షకులు, హర్ ఘర్ తిరంగా వాలీంటియర్ మేడికాల అంజయ్య కృషి …

చందుర్తి, నేటిధాత్రి:

 

 

స్వాతంత్ర్యయం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా “ఆజాదీ కా మహోత్సవ్ – 2022″లో భాగంగా కేంద్రం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మరోసారి పాల్గొనే అవకాశం కల్పించినందున జోగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ,సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వాలింటిర్ గా వ్యవహరిస్తు జాతీయ పతాక ఆవిష్కరణ విధానం, నియమాలను విధ్యార్థులకు
అవగాహాన కల్పిస్తు దాదాపు 60 మంది విద్యార్థుల జాతీయ పతాక సెల్ఫిలను అప్ లోడ్ చేయించగా,60 మంది విద్యార్థులు ప్రశంస పత్రాలు అందుకున్నారు. వాలింటిర్ గా వ్యవహరించిన ఉపాధ్యాయుడు అంజయ్య కు
మినిస్ట్రి ఆఫ్ కల్చర్ మరొక గౌరవ ప్రశంసా పత్రం అందించి గౌరవించింది.
విద్యార్థి దశలోనే దేశభక్తిని పెంపోందించేలా కృషి చేస్తే , భావితరాల వారు దేశం కోసం పనిచేస్తారని, విద్యార్థులు చక్కటి క్రమశిక్షణను పాటిస్తారని అంజయ్య అన్నారు.

సత్యసాయి సేవా సమితి వ్యాస పోటీ…

“సత్య సాయి సేవా సమితి” ఆధ్వర్యంలో “డిగ్రీ” విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
మెట్ పల్లి ఆగస్టు 22 నేటి ధాత్రి

 

 

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వచ్చే నెల 10 వ తేదీన “సత్యసాయి సేవా సమితి” ఆధ్వర్యంలో “వ్యాసరచన” పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.కే.వేంకయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు.మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో శుక్రవారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ,సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలలో “భవిష్యత్తు కోసం ప్రస్తుతం మనం ఏమి చేయాలి”( ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ వాట్ వి డు ఇన్ ద ప్రెజెంట్) అన్న శీర్షికపై విద్యార్థులకు వ్యాస రచన పోటీలను నిర్వహించడం జరుగుతుందని,ఈ పోటీలు ఉదయం 11 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ – కళాశాల విద్య కమీషనర్ (సీ సీ ఈ) శ్రీమతి ఏ.దేవసేన మరియు సీసీఈ జాయింట్ డైరెక్టర్ ఆచార్య డీ ఎస్ ఆర్ రాజేందర్ సింగ్ లు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.కళాశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రథమ ,ద్వితీయ, తృతీయ స్థానం పొందిన విద్యార్థులకు ఈ బహుమతులను ప్రదానం చేస్తున్నారని ఆయన వివరించారు. మానవ విలువలను పెంచడం కోసమే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొంటూ “సత్య సాయి సేవా సమితి” స్పష్టంగా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ పోటీలలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య పిలుపునిచ్చారు. ఇతర సమాచారం కోసం 98493 94561 నెంబర్ కు కాల్ చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో కళాశాల కామర్స్ హెచ్.ఓ.డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు అంజయ్య, శ్రీకాంత్, దశరథం, బోధనేతర సిబ్బంది లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్, లింగం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల టాపర్లకు ఎన్ఆర్ఎ నగదు పారితోషికం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T112844.936.wav?_=7

 

పాఠశాల టాపర్లకు ఎన్ఆర్ఎ నగదు పారితోషికం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహీర్ మండలంలోని బిలాల్ పూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఎ చర్ల వెంకట్ రెడ్డి నగదు పురస్కారాలు అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది విద్యార్థులకు రూ.

 

 

2వేలు వంతున రూ.20వేలు, ప్రశంసా పత్రాలను తన సోదరుడు చర్ల పాండురంగారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు ఆనందం చేతుల పంపిణీ చేశారు. విద్యార్థులను చదువులో ప్రోత్సాహంచేందుకు గాను గత 12 సంవత్సరాలుగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ, తెలుగు మీడియం విద్యార్థులకు తరగతిలో టాపర్లుగా నిలిచిన వారికి అందజేస్తూ వస్తున్నారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఫాతిమా బేగం, ఉపాధ్యాయులు ప్రకాష్ రావు, ఆబేద్లీ, బషీర్అహ్మద్, ఎ.నర్సింహులు, అనీస్ ఫాతిమా పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ ఆవిష్కరణ

డిగ్రీ కళాశాలలో ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ ఆవిష్కరణ

విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్

ఫీజు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలని

యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ లేదా తస్తమాన విద్యను పూర్తిచేసి పాసైన విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి బీఏ,బీకం,బీఎస్సీ కోర్సులలో చేరేందుకుగాను 30న చివరితేది అని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉన్నత విద్యను అభ్యసించాలని ప్రిన్సిపాల్ అన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్.రమేష్ మాట్లాడుతూ ఇంటి దగ్గర లేదా ఉపాధి చేసుకుంటూ విద్యను అభ్యసించాలనుకుంటే విద్యార్థులకు బిఆర్ఏఓయూ దూరవిద్య మంచి అవకాశాన్ని కల్పిస్తుందని టిప్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ పొందిన వారు కూడా ఓపెన్ డిగ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే ఫీజు చెల్లింపులు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎలిశాల అశోక్, డాక్టర్.దుప్పటి సంజయ్,సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మై భారత్ మేరా భారత్ ఏక్ పెడ్ కార్యక్రమం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-71-1.wav?_=8

మై భారత్ మేరా భారత్ ఏక్ పెడ్ కార్యక్రమం..

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)

 

లో భాగంగా రామాయంపేట యువ జ్యోతి స్పోర్ట్స్ క్లబ్ నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట సహా కారంతో ఏక్ పెడ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని హై స్కూల్ ఆవరణంలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయురాలు

 

నిర్మల విజయ మొక్కలు నాటారు ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో వృక్షాల అవసరం ఎంతైనా ఉందని ప్రాణవాయువు విడుదలకు మొక్కలు ఆమె కోరారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ వ్యాధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మహాదేవపూర్‌లో బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T132408.472.wav?_=9

ఘనంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు

మహాదేవపూర్ఆగస్టు21నేటి ధాత్రి *

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా మహాదేవపూర్ బస్టాండ్ లో వివేకానంద విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణాసంచా కాల్చి, స్వీట్స్ పంపిణి చేశారు, అనంతరం మహాదేవపూర్ మండల తాసిల్దార్ ఎరాబటి రామారావు మరియు హాస్పిటల్ సూపరెండెంట్ డా, విద్యావతి ముఖ్య అతిధిగా పాల్గొని,ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేసి ఆసుపత్రి ప్రాంగణం లో చెట్లు నాటడం జరిగింది అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న సహకారంతో ప్రధానోపాధ్యాయురాలు సరిత ఉపాధ్యాయుడు మడుక మధు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని 10వ 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు భగవద్గిత పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది,
బీజేపీ మహాదేవపూర్ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ఒక సామాన్య కార్యకర్త నుండి జాతీయ స్థాయి నాయకునిగా మరియు కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు, అనేక రకాల ప్రజా ఉద్యమాలు చేసి కింది స్థాయి నుండి వచ్చిన నాయకుడు అని అన్నారు, అలాగే కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రివర్యులుగా ఎదిగిన అయన జీవితం, నేటి కార్యకర్తలకు, యువకులకు ఆదర్శమన్నారు, కష్టపడి పనిచేసే నిజాయితీ కలిగిన కార్యకర్తలకు కేవలం భారతీయ జనతా పార్టీలోనే గుర్తింపు ఉంటుందన్నారు, రాబోవు రోజుల్లో బండి సంజయ్ఆ అమ్మవారి ఆసిస్సులతో మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశభావం వ్యక్తం చేసారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్ మండల ప్రధాన కార్యదర్శులు బొల్లం కిషన్, సూరం మహేష్, సీనియర్ నాయకులు కన్నీబోయిన అయిలన్న, సాగర్ల రవి, లింగంపల్లి వంశీ, బాలిరెడ్డి,శ్రీనివాస్,శ్యామ్,రాంరెడ్డి, వెంకటేష్, శ్రవణ్,సాయి, సంపత్, రాకేష్, మనోజ్, రాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గురువుకు శిష్యుల కన్నీటి వీడ్కోలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T125253.086.wav?_=10

 

గురువుకు శిష్యుల కన్నీటి వీడ్కోలు.

ములుగు, నేటిధాత్రి.

 

 

ములుగు జిల్లా మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో తరాలను విద్యా ప్రస్థానంలో ఆవిష్కరించిన గురువు సుదర్శన్ చారి మరణవార్త వారి శిష్య సమాజం, సహచర ఉపాధ్యాయ వర్గానికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. వృత్తిని ధర్మంగా భావించి, తప్పుదారి పట్టిన జీవితాలను క్రమశిక్షణతో సరిచేసిన క్రమశిక్షణ ప్రియుడు, రేపటి పౌరులను తీర్చిదిద్దిన శిల్పిగా ఆయన గుర్తింపు పొందారు. విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలను ఎదురించి, వాటి వైపు నడిపించిన ప్రేరణాత్మక వ్యక్తిత్వం గల వారు అని ఆయన శిష్యులు స్మరించారు. “అజ్ఞానమనే నిశీధిని జ్ఞానంతో రూపుమాపి, జీవంలేని రాతిశిలలను శిల్పాలుగా మలచి, విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఆచార్యుడు ఇక లేరన్న వార్త శిష్యులను మ్రోయజేసింది. 2005 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ గురువును స్మరించుకుంటూ ప్రగడా సానుభూతి తెలిపారు.

తిరుపతి ఆకాష్ లో ఆంథే 2025 పోస్టర్ ఆవిష్కరణ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-66-2.wav?_=11

*తిరుపతి ఆకాష్ లో ఆంథే 2025 పోస్టర్ ఆవిష్కరణ..

*250 కోట్ల స్కాలర్షిప్పులు ప్రకటించిన ఆకాష్..

తిరుపతి(నేటి ధాత్రి)

 

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆంథే 2025 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 250 కోట్ల రూపాయలు విలువైన స్కాలర్షిప్లను ప్రకటించినట్టు ఇక్కడ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఎయిర్ బైపాస్ రోడ్ లో గల సంస్థ కార్యాలయంలో స్టేట్ అకాడమిక్ ఆపరేషన్ హెడ్ ఆర్ వి ఎస్ ఎన్ మూర్తి, రీజనల్ సేల్స్ హెడ్ నిశాంత్ మిశ్రా, సీనియర్
అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, రీజినల్ మార్కెటింగ్ హెడ్ మోడేo నరసింహులు, బ్రాంచ్ మేనేజర్ సుబ్రమణ్యం పోస్టర్ విడుదల అనంతరం విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగుతుంది. అంతే 2025 ను విజయవంతంగా 16వ ఏట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి నూరు శాతం ఉచితంగా శిక్షణ పొందడంతో పాటు పలు క్యాష్ ప్రైస్ ప్రకటించినట్టు తెలిపారు. ఆంథే 2025 పరీక్ష ఆఫ్‌లైన్ విధానo లో అక్టబర్ 5, 12 తేదీల్లో వివిద కేంద్రాల్లో
నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు క్లాస్‌రూమ్, ఆకాష్ డిజిటల్ మరియు ఇన్‌విక్టస్ కోర్సుల కోసం స్కాలర్‌షిప్‌లు ఇవ్వబడతాయి. గత ఏడాది, ఈ పరీక్షలో 10 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం ద్వారా కొత్త రికార్డ్ స్థాపించబడింది. నీట్ యుజి, జేఈఈ మెయిన్ మరియు అడ్వాన్స్డ్ లో
టాప్
ర్యాంకులలో ఉన్న విద్యార్థుల్లో చాలామంది ఆంథే ద్వారా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు
ఈ అవకాశాన్ని 9 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులు
సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీట్, జేఈఈలలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఆకాష్ సంస్థ ద్వారా శిక్షణ పొందే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తర్ఫీదు నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్లో వెబ్సైట్ https://anthe.aakash.ac.in/home
ఆఫ్ లైన్ పరీక్ష రాయాలనుకునే వారు సమీప ఆకాష్ కేంద్ర లో సంప్రదించవచ్చునని వెల్లడించారు. కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు సాయి రాజ్, చిరంజీవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

“తిథి భోజన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం”

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T150035.198.wav?_=12

 

తిథి భోజన్ ద్వార ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుంది

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

మండలంలోని కోమటి కొండాపూర్ మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల లో చదువుచున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నభోజనంలో పౌష్టికాహారం అందివ్వడం జరిగింది. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు జ్యోష్ణ తన జన్మదినం సందర్బంగా, తిథి భోజన్ కార్యక్రమం లో భాగంగా 60 మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందివ్వడం పట్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి వారిని అభినందించారు.ఈ సందర్బంగా రాజన్న మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు వారి పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర శుభ దినముల సందర్బంగా వారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన భోజనం అందివ్వడం, మరియు సీజనల్ పండ్లు అందివ్వడం ద్వార విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగరాజు, చిన్నయ్య, రత్నం, ప్రేమ్ కుమార్, సుధారాణి, రాణి, నర్మద, జ్యోష్ణ లు పాల్గొన్నారు. 

గిరిజన బాలికల హాస్టల్‌కు కొత్త భవనం డిమాండ్.

చర్ల ట్రైబల్ వెల్ఫర్ గర్ల్స్ ఎస్టీ హాస్టల్ కు నూతన భవనం మంజూరు చేయాలి

పివైఎల్ భద్రాద్రి జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్

నేటిదాత్రి చర్ల

చర్ల మండల కేంద్రంలో ఉన్న బాలికల గిరిజన హాస్టల్ శిథిలవస్థలో ఉన్నదని ఈ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలి ప్రస్తుతం అద్దేభవనం ఏర్పాటుచేసి కొత్త భవనం నిర్మించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు పి వై ఎల్ ప్రగతిల యువజన సంఘం ఆద్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించడం జరిగింది
అనంతరం పిడిఎస్ యు మండల నాయకురాలు శిరీష అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ 130 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉంటున్నారని ఈ భవనం నుంచే స్కూలు కు వెళ్లి చదువుకుంటున్నారని అలాంటి భవనం శిథిలవస్తులో ఉన్నదని వర్షాలు తీవ్రతరం కావడంతోటి గోడలు మొత్తం నాని కురుస్తున్నాయని పెచ్చలు ఊడిపోయి మీద పడుతున్నాయని ఆయన అన్నారు బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉందని విద్యార్థినిలు భయాందోళనలో ఉన్నారని ఈ బిల్డింగు శిథిలావస్థకు వచ్చిందని అధికారులకు తెలిపీనా పట్టించుకోని పరిస్థితుల్లో వాళ్ళు లేరని బాత్రూములు కూడా సరిపోను లేవని తక్షణమే నూతన బిల్డింగును ఏర్పాటు చేయాలని కోరారు ఈ బిల్డింగ్లో విద్యార్థినిలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే ఆ ప్రమాదాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు అప్పటివరకు తాత్కాలిక హాస్టల్ నీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్…

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్.

హైదారాబాద్,నేటిధాత్రి:

 

 

విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్ ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టిన శివ వుల్క్ందకార్ సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి సమక్షంలో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి చేతుల మీదగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శివ వుల్క్ందకార్ కు నియామక పత్రాన్ని అందజేశారు.తదనంతరం ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం,కార్మిక,కర్షక,ఉద్యోగ,విద్యార్థి,యువత,మహిళా నిరుద్యోగుల సమస్యలపై శాంతియుత ఉద్యమాలు,పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజ సేవకుల ఎన్నిక ఏప్పుడు,ఏక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని కోరారు.నూతంగా ఎన్నికైన రాష్ట్ర అద్యక్షుడు శివ వుల్క్ందకార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని క్షేత్రాస్తాయి నుండి పటిష్టమైన నాయకత్వం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు పార్టీని హక్కున చేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతానని అన్నారు. రాష్ట్ర ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేస్తానన్నారు.ప్రజ సేవా చేయడానికి పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశమని, పార్టీ వ్యవస్థాపకురాలు,జాతీయ అధ్యక్షురాలు యస్. రమాదేవి, జాతీయ,రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఏడాకులపల్లిలో విద్యార్థులకు ఉచిత బ్యాగులు..

ఏడాకులపల్లి గ్రామంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రెస్టీజ్ వెంచర్ యజమాని సత్యనారాయణ ఝరాసంగం మండల గ్రామం ఏడాకులపల్లి ఎంపియుపిఎస్ పాఠశాల విద్యార్థులకు ఉచిత స్కూల్ బాగ్స్ పంపిణి చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొప్పోజు శ్రీనివాస్,గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, సంగారెడ్డి మరియు వీరన్న పాల్గొనడం జరిగింది.మరియు పాఠశాల ఉపాధ్యాయులు రజిత రేణుక పాఠశాల చైర్మన్ కల్పన ఈ కార్యక్రమంలో పాల్గొని కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version