పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం…

పాఠశాలలో నీటి సమస్య పరిష్కారం కోసం వినతిపత్రం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

మొగుడంపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నీటి సమస్యలను పరిష్కరించాలని గ్రామ యువకులు మంగళవారం గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 250 మంది విద్యార్థులు మరుగుదొడ్లకు వెళ్లడానికి నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జుబేర్, ఇర్ఫాన్, షకీల్, సిరాజ్, యూసుఫ్, అజారుద్దీన్, రిహాన్, మల్లేశం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఖర్చులకు పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం…

వైద్య ఖర్చులకు పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం

ఫోటో రైట్ అప్ ఆర్థిక సహకారం అందజేస్తున్న సభ్యులు

వీణవంక( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

ఇటీవల ప్రమాదానికి గురైన శంకరపట్నం మండలం కల్వల గ్రామానికి చెందిన సంగి సందీప్ కుమార్తె శ్రద్ధ వైద్య ఖర్చుల నిమిత్తం యప్ టీవీ అధినేత పాడి ఉదయ నందన్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారు.ఇటీవల కాలంలో ప్రమాదానికి గురైన శ్రద్ధకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తలలో చిన్న ఎముక విరిగడం తో డాక్టర్లు శ్రద్ధకి ఆపరేషన్ చేపట్టారు.మరల పర్యవేక్షణ చేసిన డాక్టర్లు శ్రద్ధ తలలో ఎముక ఇన్ఫెక్షన్ అయ్యిందని ,మరలా డాక్టర్లు వైద్యం చేయాలని, ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు కుటుంబీకులకు సూచించడం జరిగింది. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన శ్రద్ధ తల్లిదండ్రులు ,పాడి ఉదయ నందన్ రెడ్డిని కలిసి తన ఆర్థిక పరిస్థితిని విన్నవించుకోగా ,సానుకూలంగా స్పందించిన పాడి ఉదయ్ నందన్ రెడ్డి తన అనుచరులచే రూ 20 ,000/- లను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శ్రద్ధ కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దాసారపు ప్రభాకర్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టి, దాసారపు రాజు, మంతెన శ్రీధర్, తాళ్లపెళ్లి కుమారస్వామి, సిరిగిరి రాజశేఖర్, దాసారపు అశోక్, వంశీకృష్ణ, లోకేష్, పస్తం కుమార్ స్వామి, నీల ప్రభాకర్, సంగి మహేందర్, గట్టయ్య, చల్లూరి హరీష్, దాసారపు మహేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల కలల లోకం లోకి అడుగులు..

చిన్నారుల కలల లోకం లోకి అడుగులు

– ప్రగతిలో 3D ప్లానిటోరియం అనుభవం!

రాయికల్, అక్టోబర్ 13: నేటి ధాత్రి:

 

 

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రగతి పాఠశాలలో సోమవారం నిర్వహించిన 3D ప్లానిటోరియం విజ్ఞాన కార్యక్రమం అన్ని వయసుల విద్యార్థులను ఆకట్టుకుంది. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల అద్భుత ప్రపంచాన్ని ప్రత్యక్షంగా వీక్షించి మంత్రముగ్ధులయ్యారు.చిన్న తరగతుల విద్యార్థులకు సౌరమండల పరిచయం, భూమి–చంద్రుని కదలికలు, పగలు–రాత్రి మార్పు, ఋతువుల మార్పు వంటి అంశాలను సరళంగా చూపించగా,పెద్ద తరగతుల విద్యార్థులకు నక్షత్ర సమూహాలు,గెలాక్సీలు,బ్లాక్ హోల్‌లు,అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల ప్రయాణం వంటి అధునాతన విషయాలను 3D రూపంలో ప్రదర్శించారు.విద్యార్థులు తాము తరగతుల్లో చదివిన విషయాలను ప్రత్యక్షంగా వీక్షించడంతో ఆసక్తి మరింత పెరిగింది.శాస్త్ర విజ్ఞానం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి కలిగించే ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో ఆనందోత్సాహాల నడుమ సాగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలె శేఖర్ మాట్లాడుతూ —
“విజ్ఞానం వినోదంతో మిళితమైతేనే విద్యార్థుల్లో ఆసక్తి పుడుతుంది. ఇలాంటి ప్రదర్శనలు పిల్లల్లో ఊహాశక్తి, ప్రశ్నించే స్వభావం, పరిశోధనా దృక్పథం పెంపొందిస్తాయి” అన్నారు.కార్యక్రమం నిర్వహణలో ఉపాధ్యాయులు సక్రియంగా పాల్గొనగా, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై 3D ప్రదర్శనను ఆస్వాదించారు.ఈ కార్యక్రమంలో
కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు…

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు

పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం,పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ భాషల్లో 6వ తరగతి నుండి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చునని అన్నారు. డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర,విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు అనే అంశం మీద వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబర్ 28 వ తేదీ లోగా సమర్పించాలని,ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని,అంతే కాకుండా రామగుండం పోలీస్ కమీషనరేట్ స్థాయిలో 1వ, 2వ,3వ స్థానాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడుతాయి అన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి బహుమతులు పొందాలని సీపీ సూచించారు.పోటీలో పాల్గొనే విధానం కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేసి పాల్గొనండి
https://forms.gle/jaWLdt2yhNrMpe3eA
మీ పేరు,విద్యార్హత ఇతర వివరాలు నమోదు చేయండి.వ్యాసాన్ని పేపర్‌ పై రాసి,దానిని చిత్రం (ఇమేజ్) లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌ లో 500 పదాలు మించకుండా అప్‌ లోడ్ చేసి సబ్మిట్ చేయాలని తెలిపారు.

ఆధార్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోండి : మండల విద్యాధికారి వినయ కుమార్…

ఆధార్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోండి : మండల విద్యాధికారి వినయ కుమార్

చందుర్తి’ నేటిధాత్రి:

 

చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆధార్ క్యాంపును మండలంలోని అన్ని గ్రామాల విద్యార్థిని విద్యార్థులు మరియు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తేది 14.10.2025 మంగళ వారం నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయడం, నూతన ఆధార్ కార్డు నమోదు, ఆధార్ కార్డులో పేరు మార్చుట, వేలిముద్రలు మార్చటం, మొబైల్ నెంబర్ మార్చుట, అడ్రస్ మార్చుట, పుట్టిన తేదీ మార్చుట, ఆధార్ నెంబర్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయడం, ఆధార్ కార్డుకు పాన్ కార్డు మరియు ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానం చేయుట వంటి అన్ని అవకాశాలు ఉన్నాయి.
ఈ ఆధార్ క్యాంపు సనుగుల ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే ఒకటి కొనసాగుతుందని, మంగళ వారం నుండి చందుర్తి ప్రాథమిక పాఠశాలలో మరో క్యాంపు మొదలవుతుందని తెలిపారు.
మండలం లోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేందుకు, ఆధార్ కార్డు లేని విద్యార్థులకు కొత్త ఆధార్ కార్డు తీసుకునేందుకు ఇదొక మంచి అవకాశం అని, ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134240.033.wav?_=1

 

— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు
• చదువుతోపాటు క్రీడలు అవసరమే..
సీఐ వెంకట రాజ గౌడ్

నిజాంపేట: నేటి ధాత్రి

 

విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ…

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టై బ్యాడ్జి బెల్టుల పంపిణీ@
స్థానిక జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల కోసం దాతల సహాయంతో టై, బ్యాడ్జి బెల్టులను ఎంఈఓ రఘుపతి పంపిణీ చేశారు.
ఇందుకోసం పొగళ్ల మహేందర్ రెడ్డి, దేవ శ్రీధర్,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో విద్యార్థులకు ఎం ఈ వో రఘుపతి వీటినిపంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సదయ్య, కూచనపల్లి.శ్రీనివాస్, పిడి సూధం సాంబమూర్తి, రామనారాయణ, ఉస్మాన్ అలీ, నీలిమ రెడ్డి సరళ దేవి,కల్పన, విజయలక్ష్మి, సుజాత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు మండల స్థాయి కబడ్డీ కోఖో క్రీడల ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ పెద్ది ఆంజనేయులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.అనంతరం ఆంజనేయులు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు టీషర్టులు ఉచితంగా అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య,నోడల్ అధికారి నామాని సాంబయ్య,గెజిటెడ్ ప్రదానోపాద్యాయులు సురేందర్,మదు బాస్కర్,పీడీలు శ్యాం,రజిత ,వినయ్ ,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు,పీఈటీలు పాల్గొన్నారు.

ఫిలాటెలి డే: షైన్ స్కూల్ విద్యార్థుల తపాలా కార్యాలయ సందర్శన

ఫిలాటెలి డే సందర్భంగా తపాలా కార్యాలయం సందర్శించిన షైన్ స్కూల్ విద్యార్థులు

నేటిధాత్రి, వరంగల్:

Vaibhavalaxmi Shopping Mall

ఫిలాటెలి డే సందర్భంగా హనుమకొండ రాంనగర్‌లోని షైన్ ఉన్నత పాఠశాల ఎలైట్ క్యాంపస్ విద్యార్థులు స్థానిక తపాలా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు పోస్టల్ స్టాంపులను తిలకించి, తపాలా కార్యాలయంలో అందిస్తున్న సేవల గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ మూల రమాదేవి, పోస్ట్ మాస్టర్ పవన్ కుమార్, పోస్టల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. షైన్ విద్యాసంస్థల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, డైరెక్టర్లు కవిత, రమ, ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

*దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక..

*దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక..

*వైసీపీ ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప్ర‌శంస‌..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్
https://youtu.be/foreloAmve0?si=EykeHX2ZzSIIlHhM

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక పోషిస్తుందని తిరుపతి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి ప్ర‌శంసించారు. తిరుప‌తి ఐఐటీ శాశ్వ‌త క్యాంప‌స్ అభివృద్ధి ప‌నుల్లో భాగంగా రూ.2313 కోట్ల అంచనాలతో ఫేజ్‌-బీ ప‌నుల‌కు శ‌నివారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ విధానంలో భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఈ ప్రాంతానికి గర్వకారణమ‌న్నారు. అలాగే చారిత్రక రోజన్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు యువ‌త ఉజ్వ‌ల భ‌విష్య‌త్ నిర్మాణ‌మ‌న్నారు. ఇందుకోసం సుస్థిరమైన మౌలిక సదుపాయాలను క‌ల్పిస్తూ, విద్యార్థుల ఆవిష్కరణలకు, పరిశోధనలకు కొత్త దారులు తీసుకువస్తున్న ప్రాజెక్టుగా ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఐఐటీ ప‌రిశోధ‌న ఫ‌లితాలు అందుతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన డీఆర్‌డీఏ, టాటా, జేఎస్‌డ‌బ్ల్యూ లాంటి సంస్థ‌ల‌తో తిరుప‌తి ఐఐటీ స‌మ‌న్వ‌యంతో ముందుకెళుతూ పరిశ్రమలకు బలం చేకూర్చి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు.
అదే సమయంలో ఈ ప్రాంతంలోని మామిడి, టమాటా రైతులకు ఉపయోగ‌ప‌డేలా ఆహార ప్రాసెసింగ్ రంగంపై కూడా ఐఐటీ తిరుపతి దృష్టి సారించిందన్నారు. వ్య‌వ‌సాయ రంగానికి కూడా త‌న ప‌రిశోధన ఫ‌లాల్ని అందిస్తోంద‌ని ఆయ‌న కొనియాడారు. దీని ద్వారా రైతులకు సాంకేతికత, ఆవిష్కరణలు, వృద్ధి అందుబాటులోకి వస్తాయన్నారురెండో దశలో సుమారు 2,500 మంది విద్యార్థులకు సేవలందించనున్న ఈ సంస్థ యువతకు, ప్రాంత అభివృద్ధికి గొప్ప తోడ్పాటు అందిస్తోంద‌న్నారు.
ఈ ప్రాజెక్టును ఆమోదించి తిరుపతికి కేటాయించినందుకు గాను ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి నిజమైన దూరదృష్టి గల నాయకుడైన ఆయన ఎప్పుడైనా తిరుపతి అభివృద్ధి కోసం కోరినప్పుడు అపారమైన సహకారం అందిస్తున్నారని ఆయ‌న కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామ‌ని ఎంపీ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు.
ప్ర‌ధాని చొర‌వ‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డంతో విద్యార్థులు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. దేశాన్ని ముందుకు న‌డ‌పడంలో ఐఐటీ నుంచి వ‌చ్చే యువ‌త కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆయ‌న కొనియాడారు. మ‌రీ ముఖ్యంగా త‌న సొంత మండలంలో ఉన్న ఐఐటీకి అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పించిన ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాల‌న్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ఐఐటీ మొదటి ఫెజ్ నిర్మాణానికి ఎంతో తోడ్పాటు అందించార‌న్నారు. దేశం ప్ర‌గ‌తి ప‌థంలో ముందుకెళ్ల‌డానికి ప్ర‌త్యేక భూమిక తిరుప‌తి ఐఐటీ పోషిస్తోంద‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మంలో తాను పాల్గొన‌డం సంతోషంగా, గ‌ర్వంగా వుంద‌న్నారు.

రక్తదానం చేయండి ఒ…

రక్తదానం చేయండి ఒ

రక్తదానం చేయండి ఒక మనిషి ప్రాణం కాపాడండి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విశేషంగా స్పందన లభించింది ప్రజలు సేవాభావంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 103 యూనిట్ల రక్తం సేకరించి ఎంజిఎమ్ ఆసుపత్రి, వరంగల్ వారికి అందజేయడం జరిగింది.
2011 నుండి ఇప్పటి వరకు 5500 యూనిట్లకు పైగా రక్తం సేకరించామని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ & ఐటి మాస్టర్ డైరెక్టర్ వెముల శంకర్ తెలిపారు.
ప్రతి శిబిరానికి భూపాలపల్లి ప్రజలు విశేషంగా స్పందించడం ఎంతో గర్వకారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే భూపాలపల్లిలోనే అత్యధిక రక్తసేకరణ జరుగుతోందని ఎంజిఎమ్ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భూపాలపల్లి ప్రజల సేవా మనసుకు నిదర్శనమని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐటి మాస్టర్ డైరెక్టర్ వేముల కుమార్, సంగి సురేందర్, సిబ్బంది శ్వేత, శివాజీ, కిరణ్,
విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

క మనిషి ప్రాణం కాపాడండి

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విశేషంగా స్పందన లభించింది ప్రజలు సేవాభావంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 103 యూనిట్ల రక్తం సేకరించి ఎంజిఎమ్ ఆసుపత్రి, వరంగల్ వారికి అందజేయడం జరిగింది.
2011 నుండి ఇప్పటి వరకు 5500 యూనిట్లకు పైగా రక్తం సేకరించామని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ & ఐటి మాస్టర్ డైరెక్టర్ వెముల శంకర్ తెలిపారు.
ప్రతి శిబిరానికి భూపాలపల్లి ప్రజలు విశేషంగా స్పందించడం ఎంతో గర్వకారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇతర ప్రాంతాలతో పోలిస్తే భూపాలపల్లిలోనే అత్యధిక రక్తసేకరణ జరుగుతోందని ఎంజిఎమ్ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భూపాలపల్లి ప్రజల సేవా మనసుకు నిదర్శనమని వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐటి మాస్టర్ డైరెక్టర్ వేముల కుమార్, సంగి సురేందర్, సిబ్బంది శ్వేత, శివాజీ, కిరణ్,
విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి…

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మం డల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు తదనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మరిం చుకుంటూ మండల అధ్యక్షు డు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవిత సారాన్ని గుర్తు చేశారు.పండి ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ స్థాపకులలో ఒకరు. ఆయన జీవితం ఏకత్వం, మానవతా భావన, అంత్యో దయ సిద్ధాంతాల స్పష్టమైన ప్రతీక. విద్యార్థులు, యువత మరియు ప్రజల జీవితాలను మార్గదర్శకంగా మార్చిన ఆయ న సిద్ధాంతాలు, సూత్రాలు ప్ర స్తుత సమాజానికి స్ఫూర్తి ఇస్తాయని పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ విద్యారంగం లో చేసిన సేవలు, సామాజిక సదుపాయాల పట్ల ఆయన ఇచ్చిన దృష్టి, మానవతా సూత్రాలపట్ల ఆయన ప్రతిబద్ధ తపై ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పారు. పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజంలోని అసమానతల నివారణకు మార్గం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వంటి విలువలను ప్రతిబింబి స్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, యువర్ మోర్చా జిల్లా నాయ కులు కొత్తపల్లి శ్రీకాంత్ మండ ల ఉపాధ్యక్షుడు కోమటి రాజ శేఖర్, భూత్ అధ్యక్షులు బాసా ని నవీన్,గొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

“గురుకుల పాఠశాల తనిఖీ…

“గురుకుల పాఠశాల తనిఖీ”

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో కలెక్టర్ విజయేందిర బోయి జనరల్ బాలికల పాఠశాల & కళాశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల వంటగదిరిని పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనమును అందించాలన్నారు. బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజన రుచిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ నాయక్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సౌమ్య, కృష్ణవేణి, శోభారాణి, సాయి లక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎస్ జి ఎఫ్ మొగలపల్లి జోనల్ క్రీడలు విజయవంతం…

ఎస్ జి ఎఫ్ మొగలపల్లి జోనల్ క్రీడలు విజయవంతం
జోన్ చైర్మన్ మండల విద్యాధికారి లింగాల కుమారస్వామి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

మొగుళ్ళపల్లి జోనల్ స్థాయి క్రీడోత్సవాలువిజయవంతంగా జరిగాయని ఎస్జీఎఫ్ మొగుళ్లపల్లి జోన్ చైర్మన్ మండల విద్యాధికారి లింగాల కుమారస్వామి తెలిపారు
ఈ సందర్భంగా మొగులపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ చదువు మరియు క్రీడలు విద్యార్థికి రెండు కండ్ల లాంటివని విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను అందుకుంటారని మాట్లాడడం జరిగింది ఎస్ జి ఎఫ్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండెల్లి రాజయ్య మాట్లాడుతూ మొగుళ్లపల్లి చిట్యాల టేకుమట్ల మూడు మండలాల నుండి 450 మంది విద్యార్థులు అండర్ 14 అండర్ 17 విభాగాలలో బాల బాలికలు క్రీడోత్సవాలకు హాజరయ్యారని వెల్లడించారు జోనల్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో , ఫిజికల్ డైరెక్టర్లు సూదం సాంబమూర్తి బొమ్మ సందీప్ రెడ్డి సంగినేని పృథ్వీరాజ్ బండి ప్రసాద్ నూకల లింగయ్య గాజర్ల శ్రీనివాస్ మహేష్ అజయ్ స్వరూపారాణి చాగంటి ఆనంద్ సుమత ఉమా వెన్నెల శారద అశోక్ శ్రీనివాస్ సుదర్శన్ నరేష్ సంఘ రఘుపతి తదితరులు పాల్గొన్నారు

గిరిజన సంక్షేమ అధ్యాయాన కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని…

గిరిజన సంక్షేమ అధ్యాయాన కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే నాయిని…

#విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు,విద్యా బోధన గురించి ఆరా…

#గ్రూప్స్ ప్రిపరేషన్ లో ఉన్న విద్యార్థులందరికీ సొంత ఖర్చులతో మెటీరియల్ ఇస్తానని హామీ…

#ప్రభుత్వ విద్యా వైద్యం వ్యవసాయం కోసం ప్రత్యేక దృష్టి సారించింది.

#మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉంటానని భరోసా అందించిన ఎమ్మెల్యే నాయిని…

హన్మకొండ, నేటిధాత్రి:

హనుమకొండలోని బాలసముద్రం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంపీటీసీ (మల్టీ పర్పస్ ట్రైనింగ్ సెంటర్) ను శుక్రవారం ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, బోధనా ప్రమాణాలపై సమీక్ష జరిపారు. గ్రూప్స్ ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూగ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరికీ నేను స్వయంగా ఖర్చు భరించి అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేస్తానని అని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.కేంద్రంలో మరిన్ని ఆధునిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయిని భరోసా ఇచ్చారు. అవసరమైతే ప్రభుత్వ స్థాయిలో పీటిషన్లు పెట్టి సౌకర్యాలు పొందేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఉమ్మడి జిల్లా నుంచి ప్రత్యేకంగా విద్యానభ్యసించడానికి వచ్చిన విద్యార్థులకు భరోసా ఇచ్చారు.ఇంటర్ విద్యార్థులను కలిసి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని ప్రేమకల,ప్రిన్సిపాల్ శ్రీరాములు,అధ్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు మొక్కల పంపిణీ…

విద్యార్థులకు మొక్కల పంపిణీ
• నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలి.
• ఎంపీడీవో రాజీరెడ్డి.

నిజాంపేట: నేటి ధాత్రి

 

తల్లి పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నగరం తాండ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రాజీరెడ్డి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఒక్కొకరికి ఒక్కో మొక్కను ప్రధానం చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, స్రవంతి విద్యార్థులు, గ్రామస్తులు ఉన్నారు.

ఘనంగా జరుపుకున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం…

ఘనంగా జరుపుకున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

“తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” సందర్భంగా బుధవారం రోజు ఝరాసంగం మండల ఎంపిడిఓ కార్యాలయంలో ఉదయం 10:00 గంటలకు ఝరాసంగం మండల ఎంపిడిఓ మంజుల జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతాలపన చేశారు.ఈ సందర్భంగా ఎంపిడిఓ మంజుల మాట్లాడుతూ.పోలీసు, సిబ్బందికి మరియు మండల ప్రజలందరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో ఉండేది.ఆనాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై, అప్పటి నిజాంరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకు రేడియోలో ఉపన్యాసిస్తూ హైదరాబాద్ సంస్థానం..! భారత యూనియన్ లో అంతర్భాగం అని ప్రకటించడం జరిగింది. కావున ఈ రోజును మనం “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం” గా జరుపుకుంటున్నాం అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అనగా ప్రజలచేత, ప్రజలకొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం అని, ప్రజల సంక్షేమం కొరకు అనేక పథకాలు అమలు చేస్తూ.., ప్రతి పల్లె, ప్రతి వాడ, ప్రతి ఇంటి వరకు ప్రభుత్వ సేవలను చేరవేయడం ప్రజాపాలన ప్రధాన ధ్యేయం అని, ఇది “ప్రజల పాలన” అనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు.

 

 

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఏ విధంగానైతే సమాజ సేవ చేయాలని ఉత్సాహంగా విధులలో చేరామో, అదే ఉత్సాహం చివరి వరకు కొనసాగిస్తూ.., తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడానికి, మన వంతు కృషి చేయాలని అన్నారు. చివరగా, ఈ ప్రజాపాలన దినోత్సవం ప్రజల కోసం సేవాభావం, సమానత్వం, న్యాయం అనే విలువలను గుర్తు చేస్తుంది అన్నారు. ఇటీ కార్యక్రమంలో ఎంఆర్ఓ తిరుమల రావు నాయబ్ తహశీల్దార్ కరుణాకర్ రావు జూనియర్ అసిస్టెంట్ విజ్ఞాన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమంత రావు ఆయా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పోలీసు సిబ్బందులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కొల్లూరులో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన ధినోత్సవ వేడుకలు:

కొల్లూరులో ప్రజాపాలన దీనోత్సవం లో బాగంగా గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు,నాయకులు,వివిధ సంఘనాయకులు,అధికారులు,గ్రామ విద్యార్థుల అధ్వర్యం లో ఘనంగా జాతీయ పథకాన్నీ ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలాపించారు…ఇట్టి కార్యక్రమములో మాజీ ఎంపిటిసి సి హెచ్ రాజ్ కుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్,మాజీ వార్డ్ సభ్యులు ఎం విష్ణు, ఫీల్డ్ అసిస్టెంట్ చింతలగట్టు సుబాకర్,సోషల్ మీడియా ఇంచార్జి దిగంబర్,షెరి సంగమేష్,మలగరి మాణయ్య,వడ్ల కాశీనాథ్, చింతలగట్టు నర్సింలు,చింతలగట్టు ప్రకాష్,మలగరి బాలయ్య, బి శ్రీనివాస్,సి హెచ్ సంగమేష్, కాశీనాథ్, రామ్ లక్ష్మణ్,అబ్రహం,కిస్టయ్య, దేవదాస్, టి నర్సిమ్లు,సంగయ్యా,మానయ్యా,వీరన్న, పాఠశాల ఉపాధ్యాయులు అక్షర, వనిత, సిఏ మరియమ్మ,మరియు వివో లీడర్స్ మరియు మహిళా గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

ముందస్తుగా గ్రీన్ వుడ్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T141934.802.wav?_=2

 

ముందస్తుగా గ్రీన్ వుడ్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు

మహాదేవపూర్ సెప్టెంబర్ 15 (నేటి ధాత్రి)

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి రంగురంగుల తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి ముత్యాల ముగ్గులు రంగవల్లులతో ప్రాంగణాన్ని తీర్చిదిద్ది దానిలో బతుకమ్మను నెలకొల్పి కోలాటాలతో, బతుకమ్మ పాటలతో, నృత్యాలు చేస్తూ ఘనంగా గ్రీన్ వుడ్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో జరుపుకున్నారు తదనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మలోని రంగురంగుల పూలు మన జీవితం రంగుల మయంగా ఉండాలని, అందరితో కలిసి ఆడడం అంటే జీవితాంతం అందరితో కలిసి మెలిసి సుఖసంతోషాలతో ఎలా జీవించాలో నేర్పే పండుగనే బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాపు, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ డైరెక్టర్ ఆకుతోట రాజకుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్ కుమార్, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కటకం అశోక్, మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు కడార నాగరాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాపకేతర బృందం పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు వినతి పత్రం ఇచ్చిన..!

ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రములో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వర్డన్ వెంటనే సస్పెండ్ చేయాలి మహిళా వార్డెన్ సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామేర కిరణ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పెండింగ్ లో ఉన్న మేస్ కాస్మోటిక్స్. స్కాలర్ షిప్స్ & ఫిజురియంబర్స్ వెంటనే విడుదల చేయాలీ
జిల్లా కేంద్రములో విద్యార్థులు సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్వరం ప్రధాన కార్యదర్శి కుమార్ రాజ్ కుమార్ పాల్గొనడం జరిగింది

జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం….

జిల్లాస్థాయి లో అవార్డు స్వీకరించిన భూమేశ్వర్ కు ఘన సన్మానం.
మల్లాపూర్ సెప్టెంబర్ 12 నేటి దాత్రి

 

 

 

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన చేస్తున్న భూమేశ్వర్ ఉపాధ్యాయుడు ఇటీవలే జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు ఘన సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారాన్ని విలువలను వినయాన్ని నేర్పుతూ ప్రజల మనసును చూరగొన్న భూమేశ్వర్ నిజంగా అభినందనీయుడని అవార్డుకు తగిన వ్యక్తిగా సరిపోతాడని ఈ అవార్డు మరింత బాధ్యత పెంచుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు కైవసం చేసుకొని మా పాఠశాలకు పేరు తీసుకురావాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయి, విష్ణువర్ధన్ రాజు శ్రీధర్ గౌడ్ కొండ గణేష్ దువ్వ నవీన్ నాగభూషణం మహేష్ రమణ ముజాబీర్ మెలికూర్ రెడ్డి వందన తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version