3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు.

3 మండలాలకు నిలిచిపోనున్న మిషన్ భగీరథ నీరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

హుగ్గేలి చౌరస్తా వద్దా NIMZ రోడ్డు విస్తరణ లో మిషన్ భగీరథ పైపు లైన్ రోడ్డు కిందకి పోతున్నందున కొత్త పైప్‌లైన్ వేయడం జరుగుతుంది.ఇందుచేత 2 రోజుల పాటు జహీరాబాద్ మున్సిపాలిటీ, జహీరాబాద్, మొగుడంపల్లి,కోహీర్ మండలంలో మరియు ఝరాసంగం లో 10 గ్రామాలు మిషన్ భగీరథ నీరు నిపివేయడం జరుగుతుంది.

జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం.

జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం

 

మెట్ పల్లి జూన్ 4 నేటి ధాత్రి

 

ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్
మెట్ పల్లి జర్నలిస్టుల భద్రతే టీయూడబ్ల్యూజే(ఐజేయు) ధ్యేయం అని జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తున్నామని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ అన్నారు.
ప్రతినెలా నాలుగవ తారీఖున జరిగే సాధారణ సమావేశం బుధవారం రోజున ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించారు.ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్ మహ్మద్ అజీమ్ లు మాట్లాడుతూప్రెస్ క్లబ్ సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా సభ్యులందరికీ 15 లక్షల రూపాయల పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. ఇట్టి ఇన్సూరెన్స్ లోని ప్రయోజనాలు యాక్సిడెంటల్ డెత్ కి15 లక్షలు, శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యం చెందిన వారికి 15 లక్షలు, అత్యవసర వైద్యానికి లక్ష రూపాయలు, విద్యా ప్రయోజనానికి లక్ష రూపాయలు, వివాహ ప్రయోజనానికి లక్ష రూపాయలు, అంత్యక్రియల ఖర్చుకు 5000 రూపాయలు, ఏదైనా ఎముకలు విరిగినప్పుడు 25 వేల రూపాయలు, కాలిన గాయాలకి 10000 రూపాయలు, పాలసీదారుడు కి హాస్పిటల్ లో రూమ్ కోసం రోజుకి 1000 రూపాయలు చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్ కోసం రూమ్ కి 2000 రూపాయల చొప్పున 15 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న స్కీమ్ సభ్యులందరికీ చేయించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పానుగంటి మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఏసవిని గణేష్ ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మిషన్ భగీరథ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జహీరాబాద్ డివిజన్ నూతన డి. ఈ గా నియమితులైన జి. సృజన్ చక్రవర్తి గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మాజీ మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల వివరాలను ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ మంత్రి చంద్రశేఖర్ లకు డి ఈ సృజన్ చక్రవర్తి వివరించారు.

మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్.!

మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కమిటీ మెంబర్స్ పద్మశాలీల ఉద్యోగ శిక్షణ కార్యక్రమం ప్రకటన ప్రెస్ క్లబ్ లో వెల్లడించడం జరిగినది. అనంతరం కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్ మాట్లాడుతూ 10వ తరగతి పాస్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు,24 నెలలు మరియు ఇంటర్మీడియట్ పాస్, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు18 నెలలు ఉచిత భోజన,వసతి మరియు శిక్షణ పని కాలంలో స్టాయిపాయండ్ కూడా , ఇస్తుంది అని మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ సిరిసిల్ల మెంబర్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్, గోనే ఎల్లప్ప, కోడం ఆంజనేయులు, చిమ్మని ప్రకాష్, గంట్యాల సురేష్, కొండ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version