శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అమ్మవారి సేవలో మాజీ కౌన్సిలర్ దంపతులు
వనపర్తి నేటిదాత్రి .
Tag: Abhishekam
కనకదుర్గాదేవి మండపాలలో అన్న ప్రసాద కార్యక్రమాలు…
కనకదుర్గాదేవి మండపాలలో అన్న ప్రసాద కార్యక్రమాలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్, గద్దెరాగడి ఏరియాలలో ఘనంగా కనకదుర్గ దేవి మండపాలలో నిర్వాహకులు కుంకుమ పూజ అభిషేకము అన్న ప్రసాద కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
శ్రీనివాస్ నగర్, తిలక్ నగర్, భగత్ సింగ్ నగర్ హట్స్ ఏరియాలలో అమ్మ వారి సన్నిధిలో మహా అన్న ప్రసాద కార్యక్రమాలు జరిగాయి. భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు…
దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు.
శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
దుర్గామాతను దర్శించుకున్నారు
ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉగ్యోగి వెలంగదుల శంకరయ్య సుజాత దుర్గామాత కి చేయించిన మకర తోరణంను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుల వారికి అందచేయడం జరిగింది.
భూపాలపల్లి మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, అర్చన చండీ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఓదెల లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం…
ఓదెల లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
ఓదెల(పెద్దపెల్లి జిల్లా) నేటి ధాత్రి:
ఓదెల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి సూచన మేరకు ఓదెల మండల కేంద్రం లో జిల్లా ఉపాధ్యక్షులు శనిగరపు రమేష్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గిపు నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు తో పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలుజరుగుతుందని అన్నారు.జీఎస్టీ తగ్గిపుతో దసరా పండగ ఘనంగా చేసుకునే అవకాశం ప్రతి పేదకుటుంబానికి దక్కిందని అలాగే అనేక ఔషధాల ధరలు తగ్గింపుతో జబ్బుతో బాధపడుతున్న ప్రజలకు మేలుజరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి రేణుకాదేవి పుల్లూరి పృద్విరాజ్ కుమారస్వామి చారి సత్యనారాయణ పద్మ రాచర్ల అశోక్ రామినేని రాజేంద్రప్రసాద్ సారంగం తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి…
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వేదమంత్రోచ్చరణల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఫణీంద్ర శర్మ వారి అర్చక బృందం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం వేద ఆశీర్వచనం వేదికపై ఫణీంద్ర శర్మ అయ్యవారు శేష వస్త్రాలతో ఎమ్మెల్యే దంపతులకు సన్మానం చేసి ఆశీర్వదించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
22 నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలు…
22 నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలు
జహీరాబాద్ నేటిధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు
ఆలయ ఈ.ఓ శివరుద్రప్ప ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో 22 నుండి అక్టోబర్ 2 వలకు పార్వతిదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించుటకు నిర్ణయించామన్నారు.ఈ నేపథ్యంలో ప్రతి రోజు అమ్మవారికి అభిషేక అలంకారాలు అలాగే భక్తులతో విఘ్నేశ్వర పూజ చతుష్టి సహిత ఆవరణార్చనలు లలిత హోమం ఉంటుందని పేర్కొన్నారు.పూజల్లో పాల్గొనేందుకు ఒక్కరోజు శ్రీ చక్ర సవరణ పూర్వక అభిషేకసహిత అలంకారణాది అర్చన మూడు రోజులకు రూ. 516,పాడ్యమి నుండి దశమి న్10 రోజులకు గాను ఒకేసారి రూ.1516 చెల్లించాలని,ప్రతి రోజు లలిత సహస్రనామ పారాయణము రూ. 5016 ఉంటుందని పేర్కొన్నారు.
నవరాత్రులలో అమ్మవారికి చేయబడు నిత్యాలంకారముల కోసం పట్టుచీరలు (సిల్కు) మాత్రమే అలంకరింపబడునని ఆలయ ఈ ఓ తెలిపారు.
22 నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలు…
.22 నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలు
జహీరాబాద్ నేటిధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు
ఆలయ ఈ.ఓ శివరుద్రప్ప ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో 22 నుండి అక్టోబర్ 2 వలకు పార్వతిదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించుటకు నిర్ణయించామన్నారు.ఈ నేపథ్యంలో ప్రతి రోజు అమ్మవారికి అభిషేక అలంకారాలు అలాగే భక్తులతో విఘ్నేశ్వర పూజ చతుష్టి సహిత ఆవరణార్చనలు లలిత హోమం ఉంటుందని పేర్కొన్నారు.పూజల్లో పాల్గొనేందుకు ఒక్కరోజు శ్రీ చక్ర సవరణ పూర్వక అభిషేకసహిత అలంకారణాది అర్చన మూడు రోజులకు రూ. 516,పాడ్యమి నుండి దశమి న్10 రోజులకు గాను ఒకేసారి రూ.1516 చెల్లించాలని,ప్రతి రోజు లలిత సహస్రనామ పారాయణము రూ. 5016 ఉంటుందని పేర్కొన్నారు.
నవరాత్రులలో అమ్మవారికి చేయబడు నిత్యాలంకారముల కోసం పట్టుచీరలు (సిల్కు) మాత్రమే అలంకరింపబడునని ఆలయ ఈ ఓ తెలిపారు.
రెడ్డి గుడి దేవాలయంలో పూజలు…
రెడ్డి గుడి దేవాలయంలో పూజలు
చంద్రగ్రహణం తర్వాత ప్రారంభమైన పూజలు
దూలం కుమార్ కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో పురాతన దేవాలయంలో శ్రీ నాగ లింగేశ్వర స్వామి రెడ్డి గుడి దేవాలయం వద్ద నిన్న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసి వేయడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలకు తెరిచి ఆలయ అర్చకులు భద్రమయ్య సంప్రోక్షణ పూజ జరిపించి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి దాత దూలం కుమార్ గౌడ్ శ్రీదేవి దంపతులు స్వామివారికి నిత్య దీపారాధన చేసే దీపాంతలను 2500 ఆలయ అర్చకునికి అందించడం జరిగింది ఆ దంపతులకు స్వామివారి కృప క్రెటాక్షణ ఉండాలని ఆశిస్తూ ఆలయ కమిటీ
బొజ్జ గణపయ్యకి 108 ప్రసాదాలతో పూజలు.
బొజ్జ గణపయ్యకి 108 ప్రసాదాలతో పూజలు.
బెల్లంపల్లి నేటిధాత్రి
గత 21 సంవత్సరాలుగా సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ చిన్న పెద్ద కలిసి భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు.
బెల్లంపల్లి బాబు క్యాంప్ బస్తీలో గల సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయకుడికి అత్యంత ఇష్టమైన మోదకం, లడ్డు ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, పూరి, కోవా, పానకము,అరిసి పొంగల్,కుజి,బూందీ,
చారు, నైవేద్యము 108 ప్రసాదాలతో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు చూపరులను అలరించేలా ఒకే రకమైన చీరలతో గణనాథుని పూజలో పాల్గొన్నారు.
తదనంతరం మహా గణనాథునికి హారతి పాటలతో హారతిపట్టి పూలతో అభిషేకం చేసి ఆ మూషిక వాహనానికి భక్తితో అలరించిన మహిళలు.
శేఖపూర్ లో శ్రావణమాసం ముగింపు: భజనలు, అన్నదానం…
శేఖపూర్ లో శ్రావణమాసం ముగింపు: భజనలు, అన్నదానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో శ్రావణమాసం పురస్కరించుకొని ప్రతిరోజు భజనలు, కీర్తనలు, హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా జరిగాయి. శ్రావణమాసం ముగింపు అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో కేతకిలో శని అమావాస్య పూజలు…
భక్తిశ్రద్ధలతో కేతకిలో శని అమావాస్య పూజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీ కేతకే సంగమేశ్వర స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి,స్వామివారిని దర్శించుకున్నారు. శని అమావాస్య కావడం, మంజీర నది తీరంలో ఉన్న ఈ దేవస్థానం ప్రాముఖ్యత కారణంగా తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం. శని అమావాస్య సందర్భంగా,ముఖ్యంగా శనివారము అమావాస్య ఉండడం వల్ల భక్తులు ఇక్కడ తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.
ఈ ఆలయం మంజీర నది తీరంలో వెలిసి, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ స్వామివారిని బ్రహ్మదేవుడు ప్రతిష్టించాడని నమ్ముతారు.కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి అమావాస్య రోజున, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర వంటి ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ శేఖర్ పటేల్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప ఆలయ సిబ్బంది అర్చకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఝరాసంగం ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన వితరణ చేశారు.
శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
నేటి ధాత్రి కథలాపూర్
శ్రీ సీతారామ చంద్రుల వార్షిక ఉత్సవమును పురస్కరించుకొని మూడు రోజుల కార్యక్రమము జరిగినది మొదటి రోజున మూలవరులకు అభిషేక కార్యక్రమాలు అలంకరణ అర్చన రెండవ రోజు శ్రావణ మంగళవారం పురస్కరించుకొని మహిళలచే శ్రావణ మంగళ గౌరీ వ్రతము కుంకుమార్చన కార్యక్రమము నేడు స్వామివారి జన్మ నక్షత్రము పునర్వసు పురస్కరించుకొని స్వామివారికి పంచామృత అభిషేకం సహస్ర నామార్చన తులసీదల పుష్పాలచే జరిపించి హవన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో చైర్మన్ ఇట్టెడి సంజీవ్ రెడ్డి వైస్ చైర్మన్ తిక్క గంగారెడ్డి మరియు డైరెక్టర్ లు ప్రజలు హనుమాన్ భక్తమండలి వారు పాల్గొనడం జరిగింది
కైలాసగిరి శివాలయానికి భక్తుల రద్దీ….
కైలాసగిరి శివాలయానికి భక్తుల రద్దీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ కైలాసగిరి శివాలయంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జహీరాబాద్లో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉదయం 5 గంటల నుంచి బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు గణేష్ స్వామి, నందు స్వాముల ఆధ్వర్యంలో శివుడికి అభిషేకం, బిల్వార్చన, గంగాభిషేకం వంటి పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.
భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం…
భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం
భక్తిశ్రద్ధలతో శ్రావణమాస పూజలు.. సర్వ దర్శనానికి 3 గంటల సమయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సోమవారం శ్రావణ మాస సందర్భంగా భక్తులతో కిక్కిరిసి పోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మందుగా భక్తులు ఆలయం స్వామి వారి అమృత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు “ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ” గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
స్వామి వారికి ప్రత్యేక పూజలు..
సోమవారం శ్రావణమాస సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవా, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి క్రతువును నిర్వహించారు. అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు,
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ శేఖర్ పటేల్ , ధర్మ కర్త కంతనం మల్లయ్య స్వామి కార్యనిర్వాహణ అధికారి రుద్రాయ స్వామి, తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సింగరేణి ఏరియా ఆసుపత్రి గణపతి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు..
సింగరేణి ఏరియా ఆసుపత్రి గణపతి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గణపతి దేవాలయ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు ఆసుపత్రి సిబ్బంది అధ్యర్యంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, నవగ్రహ హోమం, రుద్ర హోమం, త్రయంబక హోమం, పూర్ణాహుతి హోమంలతో పాటు, లక్ష్మీగణపతి, ఆంజనేయ, సుబ్రమణ్యం స్వామి అభిషేకాలు, చేయడం జరిగిందని పూజారులు అంబా ప్రసాద్, చక్రవర్తి, సూరజ్, శ్రీకాంత్ లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మేకల రాజయ్య, బాబురావ్, ఆర్.శ్రీనివాస్, జమదగ్ని, రఘు, రమేష్, మహేష్, వైద్య సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు
గురు పౌర్ణమి సందర్భంగా సత్యసాయి మందిరంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్య సాయి మందిరంలో షిరిడి సాయి సత్య సాయి బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు భజనలు ఘనంగా నిర్వహించామని శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశామని ఆయన తెలిపారు
ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు
ఘనంగా అయ్యప్పస్వామి అభిషేకాలు
ఉత్తర నక్షత్రం సందర్భంగా మహాదివ్య పడిపూజ
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామికి ఘనంగా అష్టాభిషేకాలు నిర్వహించారు.అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర జాతకంతో జన్మించిన నేపథ్యంలో ప్రతీ నెల వచ్చే ఉత్తర నక్షత్ర గడియలు వస్తున్న తరుణంలో నర్సంపేట శ్రీ ధర్మ శాస్త దేవాలయ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఐదు నెలలుగా ప్రత్యేక పడిపూజలు నిర్వహిస్తున్నారు.కాగా బుదవారం దేవాలయ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా, అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయంలో అయ్యప్పస్వామి పడిపూజ నిర్వహించారు.ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై హోమం కార్యక్రమం,ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం అయ్యప్పస్వామి ఉత్తర నక్షత్ర పడిపూజ, అభిషేకం,అన్నదాన దాతగా వంగేటి పద్మావతి గోవర్ధన్ కుటుంబం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా బృందం వేధ మంత్రోచ్చారణతో మహాదివ్య పడిపూజ చేపట్టారు.ముందుగా 18 కలశాల పూజలు,మెట్ల పూజలు చేశారు.ఈ సందర్భంగా అయ్యప్పస్వామికి నెయ్యి, తేనే,చక్కర,పంచాంతృతం,గంధం,
విభూదితో అష్టాభిషేకాలు,కలశాభిషేకాలు చేపట్టారు. అనంతరం పుష్పాభిషేకం చేశారు.ఈ నేపథ్యంలో పడునెట్టాంబడిపై కర్పూర జ్యోతులతో వెలిగించడంతో భక్తులు మురిసిపోయారు.కళ్యాణరాముడు సురేష్,రంగనాథ్ బృందం ఆలపించిన భజన పాటలతో,భక్తుల శరణఘోషతో దేవాలయ ప్రాంగణం ఎంతగానో మారుమ్రోగింది.అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం దాత వంగేటీ పద్మావతి గోవర్ధన్ కుటుంబం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్టు కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా,శ్రీరాం ఈశ్వరయ్య ఇరుకుల్ల వీరలింగం,భూపతి లక్ష్మీనారాయణ,బండారుపల్లి చెంచారావు,దొడ్డ వేణు,మల్యాల రాజు,మల్యాల ప్రవీణ్,భీరం నాగిరెడ్డి,రాంచందర్,కర్ణాకర్,మండల వీరస్వామి గౌడ్,బాదం అనిల్,శ్రీనివాస్,గురుస్వాములు సంజీవ రావు, యాదగిరి,అనిల్,ఆలయ గుమస్తా దేశి రాము అర్చకులు ఫ్రాన్స్,శివాంకిత్,ఆనంద్,తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీశైల మల్లన్న అభిషేకం స్పర్శ దర్శనం చేసుకున్న శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ సభ్యులు.
శ్రీశైల మల్లన్న అభిషేకం స్పర్శ దర్శనం చేసుకున్న శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ సభ్యులు
కొల్చారం (మెదక్) నేటిధాత్రి:
తూప్రాన్ పట్టణ శ్రీ దుర్గా మాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్రీశైలం లోని దివ్య భవ్య మహిమాన్విత పుణ్య క్షేత్రం అయిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున ఆలయం లో స్పర్శ దర్శనం చేసుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాస్ రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దగ్గర ఉండి ప్రత్యేక పూజలు చేయించి అత్యంత ప్రామాణికమైన శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనం చేయించి ఆలయ సంప్రదాయ పద్ధతిలో అభిషేకం హారతి అర్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో తూప్రాన్ మున్సిపల్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ లయన్ కుమ్మరి రమేష్, లయన్ గరిగే నర్సింగ్ రావు,తాటి విశ్వం,వడియారం నరసింహులు. ఈఓ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం రోజు బృహస్పతివాసరే ఆర్ద్ర నక్షత్రం
అమృతకాలం –
రాహుకాలంలో స్పర్శ దర్శనం చేసుకోవడం వలన వ్యాపార వృద్ధి చెంది దినదిన అభివృద్ధి చెందుతామని తెలిపారు.
సూర్యోదయం కంటే ముందు మల్లన్న దర్శనం ఎంతో మేలు చేసే గొప్ప శుభ ఫలితాలను ఇస్తుంది అని అన్నారు.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు…అని వేదపండితులు ఆశీర్వచన ఇచ్చారని తెలిపారు.
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి!! అదే మన కర్తవ్యం అని తెలిపారు.
కామరెడ్డి లో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.
కామరెడ్డి పల్లి గ్రామంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
సొమ్ము కేంద్రానిది సోకేమో రాష్ట్ర ప్రభుత్వానిదా
బిజెపి మండల అధ్యక్షులు కాసాగాని రాజ్ కుమార్ గౌడ్
పరకాల నేటిధాత్రి
మండలంలోని కామారెడ్డి పల్లి గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తున్న సందర్భంగా నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం ద్వారా
అందరికీ ఆహారం పౌష్టిక సమాజం భాగంగా ప్రతి పేదవాడికి కడుపు నింపే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారాలతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పతకంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పథకంలో 5 కిలోల బియ్యం కేంద్రప్రభుత్వం 1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు.
కరోనా సమయం నుండి 2028 వరకు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఉచితంగా ఇస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక వ్యక్తికి ఒక కిలో ఇస్తూ మొత్తం మేమే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది అందుకోసమే లబ్ధిదారులకు తెలియజేసే విధంగా రేషన్ షాప్ వద్ద నరేంద్రమోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.అలాగే ప్రతి రేషన్ షాప్ డీలర్లు రేషన్ షాప్ ల వద్ద నరేంద్ర మోడీ ఫోటో పెట్టేలా చొరవ తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ గౌడ్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిడి మహేందర్ రెడ్డి,62 వ బూత్ అధ్యక్షులు తండ కుమారస్వామి,శెక్తి కేంద్ర ఇంచార్జి ఎదునూరి లింగయ్య, మాజీ సర్పంచ్ చిర్ర చక్ర పాణి, బీజేవైఎం నాయకులు కాసగాని సాయి కుమార్, ప్రమోద్ కుమార్,తడుక సురేష్,వి ఎన్ రెడ్డి,కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.
వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలం రేజింతల్ లోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామి వారికి పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు.