రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణమని టిడిపి బీసీ నాయకులు జగన్నాథం అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు యొక్క 125వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలోని రుయా హాస్పిటల్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు గ్రహానికి పూమాలవేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చేసినటువంటి త్యాగ ఫలాలను స్మరించుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకోవాలని మన అందరి అదృష్టమని ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు జగన్నాథం కొనియాడారు..
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నవీన్,నిర్వహణ కార్యదర్శి డాక్టర్ రాంబాబు
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) లో మంగళవారం జాతీయ స్థాయిలో సెమినార్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు. సెమినార్ కు సంబంధించిన బ్రోచర్లను సెమినార్ కార్యదర్శి డాక్టర్ రాంబాబుతో అధ్యాపక బృందంతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రీసెంట్ అడ్వాన్స్ ఇన్ ప్లాంట్ సైన్స్- ఇష్యూస్ అండ్ ఛాలెంజ్స్ ఇన్ క్రాప్ ఇంప్రుమెంట్ అనే అంశంపై జాతీయ సెమినార్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు.
ఈ సెమినార్ నిర్వహణకు రూసా స్పాన్సర్షిప్ అందించడం విశేషమని చెప్పారు.కళాశాలలో సభా వేదిక, అతిథుల స్వాగతం, పాల్గొనే అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల కోసం అవసరమైన సౌకర్యాలు సమకూర్చబడ్డాయని పేర్కొన్నారు.సదస్సు కు కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ చీఫ్ పేట్రన్ దేవసేన,ఆర్జేడీ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్, ఆర్జేడీ జోన్ II బాల భాస్కర్, రుసా డైరెక్టర్ సౌందర్య జోసెఫ్ రానున్నారని అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి ను ఆహ్వానించమని తెలిపారు.మహారాష్ట్ర,ఆంధ్రా ప్రదేశ్,తెలంగాణ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఉపన్యాసకులు, ప్రముఖ వక్తలు సదస్సుకు పాల్గొంటున్నారని వివరించారు.వందకు పైగా పరిశోధన పత్రాలు సమర్పనకు ఉన్నాయని నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.సెమినార్ నిర్వహణ కార్యదర్శి డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ జాతీయ సెమినార్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని కమిటీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.పాల్గొనే వారు కార్యక్రమ మార్గదర్శకాలను పాటిస్తూ సమయానికి హాజరుకావాలన్నారు.సెమినార్ శాస్త్రీయ చర్చలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కళాశాల అధ్యాపకులు, నిర్వాహక బృందం, సిబ్బంది సహకారంతో విజయవంతం కానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీకి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్లో ట్వీట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్ అని పోస్టు చేశారు సీఎం.
అమరావతి, ఫిబ్రవరి 16: గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో, ఐటీ మంత్రి నారా లోకేశ్, పలువురు మంత్రులు.. ఆయన్ను ఘనంగా స్వాగతించారు. తర్వాత రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), ఇతర మంత్రులు బిల్ గేట్స్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)ను బిల్ గేట్స్, ఆయన ప్రతినిధి బృందం సందర్శించింది.
న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?
మున్సిపల్ ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించల
ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగం: మంత్రి అచ్చెన
లోకేశ్ సర్… మా పాఠశాలను కాపాడండి
ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే..
గర్ల్ఫ్రెండ్తో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్
పార్టీ నిర్ణయమే ఫైనల్.. నేతలకు మంత్రి నారా లోకేశ్ దిశానిర్దే
సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు
టీ20 ప్రపంచ కప్ 2026: చెలరేగిన ఐర్లాండ్ బ్యాటర్లు.. ఒమన్ టార
ఏపీ బడ్జెట్లో గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై ప్రస్తావన
ఏపీకి బిల్ గేట్స్ రాక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. బిల్ గేట్స్ను స్వాగిస్తూ సీఎం ట్వీట్ చేశారు. ‘వెల్కమ్ బ్యాక్ మిస్టర్ బిల్ గేట్స్’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే #APWelcomesYou హ్యాష్ట్యాగ్తో ట్యాగ్ చేశారు సీఎం చంద్రబాబు. ఇక ఏపీకి బిల్ గేట్స్ రావడం ఇది మూడోసారి. మరోవైపు, సచివాలయానికి చేరుకున్న బిల్స్ గేట్స్, ఆయన ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
చంద్రగిరి మండల పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో స్మగ్లర్ల అరెస్టు పై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఏ ఎస్ పి రవి మనోహరాచారి పర్యవేక్షణలో డి.ఎస్.పి బి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. డీఎస్పీ బి ప్రసాద్ కు గంజాయి అక్రమ రవాణా పై వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం తొండవాడ జాతీయ రహదారి వంతెన వద్ద సీఐ సురేష్ కుమార్ నేతృత్వంలో ఎస్సైలు అరుణాచలం, రవి ప్రకాష్ రెడ్డి, సిబ్బంది తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదమైన రెండు బ్యాగులు కలిగిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను తనిఖీ చేయగా ఆరు ప్యాకెట్లు లో 22 కేజీల గంజాయి పట్టుకున్నారు. స్థానిక తహశీల్దార్ శివరాం సుబ్బయ్య సమక్షంలో పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారించగా చంద్రగిరి మండలం పిచ్చినాయుడు పల్లి గ్రామానికి చెందిన శశి కుమార్, చంద్రగిరి టౌన్ అక్క గార్ల కాలనీకి చెందిన షేక్ లాల్ గా గుర్తించారు. పోలీసులు నిందితులను విచారించగా వైజాగ్ నుండి తెలిసిన వ్యక్తి ద్వారా తిప్పించుకుని చంద్రగిరి పరిసర ప్రాంతాలలో అమ్మాలనుకున్నట్లు తెలింది. నిందితులు గంజాయి వినియోగించే వారి పేర్లను, గంజాయి విక్రయిస్తున్న వారి పేర్లను కూడా తెలిపినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాలో ఈ ఇద్దరితోపాటు మరికొందరి పాత్ర ఉందని పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. త్వరలో ఆ పాత్రధారులను కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. కేసు నమోదు చేసి ముద్దాలను తిరుపతి కోర్టుకు హాజరు హాజరు పరిచినట్టు సురేష్ కుమార్ తెలిపారు. న్యాయస్థానం ముద్దాయిలకు 14 రోజులు రిమాండ్ విధించింది అన్నారు. గంజాయి అక్రమ రవాణా కేసులో ప్రతిభ కనబరిచిన చంద్రగిరి స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎమ్. సురేష్ కుమార్, యస్.ఐలు రవిప్రకాష్ రెడ్డి, అరుణాచలం సిబ్బంది ఎమ్ నాగరాజు, శ్రీనివాసులు, చలపతి, రాజశేఖర్, మణి, ముణిప్రసాద్ మహేష్ లకు క్యాష్ రివార్డ్ లను ప్రకటించినట్లు సిఐ సురేష్ కుమార్ తెలిపారు…
అవ్వ, తాతల ముఖాల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం… ఇంటి ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన టిడిపి నేత జేబీ శ్రీనివాస్
తిరుపతి(నేటి ధాత్రి:
అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వు చూడటమే టిడిపి కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేబీ శ్రీనివాస్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నగరంలోని 5, 6, 7, 8, 9 డివిజన్లలో ఉదయం 6 గంటల నుండి రెండవ క్లస్టర్ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ పర్యటించి అర్హులైన వృద్దులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇళ్ళకు వెళ్లి జేబీ శ్రీనివాస్ పెన్షన్లను అందజేశారు. ఆయా డివిజన్ ల లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ సమస్యలను జేబీ శ్రీనివాస్ దృష్టికి తేవడంతో వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీ ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఒక రోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పటికే 90% హామీలను నెరవేర్చడం జరిగిందని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు మూడు సిలిండర్ల గ్యాసు అందించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధి చెందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రఘురాం, ఆయా డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.
తిరుపతి: తిరుపతి, సాయినగర్ షిర్డీ.. ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య అనుసంధానం పెరిగేలా, భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలును ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మంగళవారం కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్గా ప్రారంభించగా, తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. అదే సమయంలో తిరుపతిలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీటీడీ సభ్యుడు జి.భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ
*ఖేలో ఇండియా పథకం ముఖ్య ఉద్దేశం, దాని వివరాలను కోరిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు..
*సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ.
చిత్తూరు(నేటి ధాత్రి)
క్రీడల అభివృద్ధి కోసం ఖేలొ ఇండియా పథకం భారతదేశంలో విజయవంతంగా అమలవుతోందనీ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు వెల్లడించారు. ఇది క్రీడలను ప్రోత్సహించడానికి, క్రీడాకారులకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడిందని ఆయన తెలిపారు. న్యూఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు. హాజరయ్యా రు,ఆంధ్రప్రదేశ్ ప్రగతితో పాటు,తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు అభివృద్ధికి సంబంధించి, అంశాలను లోక్ సభ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా కోరారు. దీనికి భారత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి, లిఖిత పూర్వక సమాధానం ఇచ్చినట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు సోమవారం మీడియాకు తెలిపారు. తాజాగా ఖేలో ఇండియా పథకం ముఖ్య ఉద్దేశాన్ని, దేశ వ్యాప్తంగా ఒక రాష్ట్రం ఒక ఆట చొరవ కింద రాష్ట్రాలకు భారత ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందించిందా..అలాగే కోచింగ్, క్రీడా పరికరాలు,సహాయక సిబ్బంది వంటి సాఫ్ట్ కాంపోనెంట్స్ల మంజూరు కోసం విడుదల చేసిన నిధులకు సంబంధించిన వివరాలను లిఖిత పూర్వకంగా కోరగా ఇందుకు తక్షణమే స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ,సంబంధిత డేటాను సవివరంగా తెలియపరుస్తూ తనకు అందించినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.., అంతేకాకుండా ఆ పథకం అమలు వల్ల ఆంధ్రప్రదేశ్ కు, చిత్తూరు పార్లమెంటుకు వనగూడిన ప్రయోజనాలను తెలియాలని కేంద్ర యువజనుల వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖను కోరానని, దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ,ఖేలో ఇండియా పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేయడమే కాకుండా తాను కోరిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు. నైపుణ్యమున్న క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఖేలో ఇండియా బాటలు వేస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కృతజ్ఞతలు తెలియజేశారు
ఫొటో క్యాప్షన్,భారీ వర్షాల కారణంగా కొలంబోలోని కడువెల ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతం
గమనిక : ఈ కథనంలో కలచి వేసే అంశాలున్నాయి
శ్రీలంకలో దిత్వా తుపాను వల్ల ఇప్పటి వరకు 193 మంది చనిపోయారని, 228 మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది.
వరదల వల్ల 26,114 కుటుంబాలకు చెందిన 9.68 లక్షల మంది ప్రభావితమయ్యారు. భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.
దిత్వా తుపాను ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నైకి దక్షిణంగా 250 కి.మీ. దూరం ప్రయాణిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అది తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా కదులుతోంది. ఆదివారం (నవంబర్ 30) సాయంత్రానికి తీరాన్ని సమీపిస్తుందని అంచనా
ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను కారణంగా తమిళనాడుతోపాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుపాను తూర్పు వైపుకు కదిలి ఇండోనేషియాలో భారీ నష్టాన్ని కలిగించింది.
ఈ వారం బంగాళాఖాతంలో మలక్కా జలసంధి సమీపంలోని సెన్యార్, శ్రీలంకకు దక్షిణంగా దిత్వా అనే రెండు తుపానులు దాదాపు ఒకేసారి వచ్చాయి.
“బంగాళాఖాతంలో ఇది చాలా అరుదైన సంఘటన” అని స్వతంత్ర వాతావరణ శాస్త్రవేత్త శ్రీకాంత్ అన్నారు.
దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మైలదుత్తురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు, పుదుచ్చేరి, కారైకల్లలో కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర తమిళనాడు , పుదుచ్చేరి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 నుండి 70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను ప్రభావం తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయి.ఫొటో క్యాప్షన్,శ్రీలంకలో దిత్వా తుపాను ప్రభావం
ఆంధ్రప్రదేశ్లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
డిసెంబర్ 1న తుపాను వేగం గంటకు 45-55 కి.మీ.లకు (అప్పుడప్పుడు గంటకు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి) తగ్గుతుంది.
తుపానును దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.
ఫొటో క్యాప్షన్,శ్రీలంకలోని కాండీ సమీపంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
శ్రీలంకలోని కాండీలోని సరసవిగమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నలుగురు పిల్లలు సహా 23 మంది తమిళులు మరణించారని స్థానికులు బీబీసీతో చెప్పారు. కొండచరియలు విరిగిపడిన సంఘటన గురువారం రాత్రి జరిగింది.
కొండ చరియలు విరిగి పడినప్పుడు సహాయక చర్యలు ప్రారంభించిన కాసేపటికే మరోసారి భారీ కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెప్పారు.
ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి మృతదేహాలను వెదికేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు.
ఫొటో క్యాప్షన్,కొలంబో శివారు ప్రాంతం వెల్లంపిటియలో వరద నీటిలో సురక్షిత ప్రాంతానికి వెళుతున్న స్థానికులు.
దిత్వా తుపాను శుక్రవారం శ్రీలంకను తాకింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరద పోటెత్తింది.
బదుల్లా జిల్లాలో (తేయాకు తోటలు ఉన్న ప్రాంతం) కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారని విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది.
కాండీ, అంపారా, బదుల్లా జిల్లాల్లోనే తుపాను కారణంగా ఎక్కువ మరణాలు సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారులను మూసివేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొన్ని ముఖ్యమైనవి మినహా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
మరోవైపు, రావల్పిండిలో పాకిస్తాన్తో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ ట్రై సిరీస్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో తుపాను బాధితుల కోసం శ్రీలంక క్రికెటర్లు ఒక నిముషం మౌనం పాటించారు.
తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి నిరంతర కృషి ఫలితంగా గుడిమల్లం శ్రీ పరసురామేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అనుమతి మంజూరు చేసింది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన శివలింగాలలో ఒకటైన గుడిమల్లం శివ లింగాన్ని దర్శించేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అవసరమైన సౌకర్యాల విస్తరణ అత్యవసరమని ఎంపీ గురుమూర్తి పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి, పురావస్తు శాఖకు లేఖల ద్వారా వివరించారు.
భక్తుల సేవలకు ప్రధానమైన కల్యాణకట్ట, పాకశాల, అన్నదాన శాల, యాగశాల, రాధాశాల వంటి నిర్మాణాలకు 2022 నుంచి అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్కు వరుసగా లేఖలు రాసి అనుమతులు కోరారు.ఈ నిర్మాణాల్లో కొంత భాగం ఆలయ రక్షిత ప్రాంతంలోకి రావడంతో అనుమతులు ఆలస్యమవుతున్న విషయం కూడా ఎంపీ గురుమూర్తి పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల్లో, భక్తులకు అత్యవసరమైన తాత్కాలిక అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ నో అబ్జెక్షన్’ జారీ చేసింది.సర్వే నెం.17లో 5 మీటర్ల ఎత్తు, 1913.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ తాత్కాలిక నిర్మాణానికి కొన్ని నిబంధనలతో అనుమతి మంజూరు చేశారు. అనుమతిలో భాగంగా: నిర్మాణ పనులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, అమరావతి సర్కిల్ పర్యవేక్షణలో జరగాలి. సంబంధిత శాఖల నుండి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలి. స్థానిక బై–లాస్ కు అనుగుణంగా నిర్మాణం జరగాలి. గుడిమల్లం ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ ఇప్పటికే రూ.95 లక్షల సి జి ఎఫ్, నిధులు కేటాయించిన విషయాన్ని ఎంపీ గురుమూర్తి కేంద్రానికి తెలియజేశారుఈ అనుమతి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని, గుడిమల్లం ఆలయ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
*చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ)..
చిత్తూరు నేటి ధాత్రి:
చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్, సుమిత్ కుమార్, ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, జిల్లా అధికారులు జెడ్ పి సీఈఓ రవికుమార్ నాయుడు,పి ఆర్,ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ లు చంద్రశేఖర్ రెడ్డి,విజయ్ కుమార్,డ్వామా,హౌసింగ్ పిడి లు,డిఇఓ, వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసి వెంకట రమణ,డి ఆర్ డిఏ,పిడి, శ్రీదేవి,జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీ కృష్ణ, మధుసూదన్ రెడ్డి,సీపీఓ శ్రీనివాసులు ఎల్డిఎం హరీష్,జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వరి, డిపిఓ ప్రభాకర్ రావు,డి ఎం హెచ్ ఓ, సుధారాణి, డి ఎస్ ఓ శంకరన్,చిత్తూరు మున్సిపల్ కమిషనర్ సంబంధిత జిల్లా అధికారులు హాజరు అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి, శాఖల వారీగా అధికారులతో సమీక్షించి, దిశా నిర్దేశం ఆయన చేశారు, అర్హులైన నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని ఎంపి, దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు..
*మీడియా సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..
పలమనేరు(నేటి ధాత్రి)
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మిక వేదికగా విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచిందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో రెండు రోజులు పాటు జరిగిన సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడడం మాత్రమే కాదని మన రాష్ట్రంపై గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందన్నారు. పెట్టుబడులు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా రావడం ప్రభుత్వ వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం అన్నారు.ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుంటే ఏపీ అందుకు భిన్నంగా స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13,25, 716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి వారిరువురు ప్రధాన పరిశ్రమను తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని తెలిపారు. ఈ సమ్మిట్ లో పవర్ సెక్టర్ లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకే రావడం ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు డ్రోన్ హబ్ గా, అనంతపురం, కడప,కర్నూలు జిల్లాలు రెన్యూవల్ ఎనర్జీ హబ్ గా, తిరుపతి మ్యానుఫ్యాక్చరింగ్,చిత్తూరు టెక్స్ టై ల్ హబ్ లుగా నిలువనున్నయన్నారు.ఇక రాయలసీమ కేంద్రంగా ఏరో స్పేస్ రంగాల్లో 1200 కోట్లతో రేమాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో రాయలసీమ ఏరోస్పెస్ సిటీగా ఎదిగేందుకు దోహదం కానందున్నారుగతంలో రాయలసీమలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేసిన కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ స్థిరత్వం, పారదర్శకత చూసి ముందుకు వస్తుండడంతో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందనుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
బెల్ట్ షాపు యజమాన్యంపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి..
*గౌడ సంక్షేమ సంఘం సభ్యుల డిమాండ్.
తిరుపతి(నేటిధాత్రి) నవంబ
ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన వైన్ షాప్ ని బెల్టు షాప్ యజమానులు కొడుతున్నారని గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘ సభ్యులు వాపోయారు. ఈ ప్రభుత్వంలో మద్యం షాపు టెండర్ ద్వారా 28 మంది దరఖాస్తు చేసుకోగా అత్తరాల నారాయణ అనే వ్యక్తి పేరు మీద పుత్తూరు నందు షాపు మంజూరైనది. గౌడ సంఘం సభ్యులు అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నాముఅధికారుల సూచన మేరకు షాపును మార్చాలని కోరగా మొదట తొర్రూరు బైపాస్ రోడ్డు నందు, అక్కడి నుండి విష్ణు మహల్, ఇస్లాపురం తరువాత కళ్యాణపురం దగ్గరికి మార్చాము. బెల్ట్ షాపు నిర్వాహకులు పగలు రేయి మద్యం అమ్మడంతో మా షాపు తెరిస్తే వాళ్లకు వ్యాపారాలు దెబ్బతింటాయని బయట ఊరి నుంచి జనాలను తెచ్చి ధర్నాలు చేపించడం జరుగుతున్నదిమా షాపు వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు మా పైకి బయట ఊర్ల నుంచి మనుషులను తెప్పించి దాడులకు పంపుతున్నారు.ఈ షాపు ద్వారా 28 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి,మేము షాపు తెరకపోతే చావేగతి, వేరే దారి లేదని వాపోయారు.షాపు తెరవకపోతే ప్రభుత్వానికి లైసెన్స్ కు మేము డబ్బులు ఎలా కట్టాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న మాకు న్యాయం జరగలేదని పత్రిక ముఖం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని మీ ముందుకు వచ్చామని పత్రికల వారిని కోరుకుంటున్నామని, మా బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా షాపును తెలుసుకునే దానికి అనుమతులు ఇచ్చి, మాకు రక్షణ కల్పించాలని, బెల్టు షాపుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో నాగరాజు గౌడ్, అత్తిరాల శ్రీరాములు గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాంబాబు గౌడ్, పురుషోత్తం గౌడ్, రామయ్య గౌడ్, ఉదయగిరి మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పలమనేరు బార్ అసోసియేషన్ లో మంగళవారం జరిగిన అంతర్గత విషయాలను, తీర్మానాలను కొందరు వాస్తవాలను వక్రీకరించి మీడియా మిత్రులకు అందజేశారని, అందులో వాస్తవం సుదూరంగా ఉందని పలమనేరు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఖండిస్తూ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వాస్తవంగా మంగళవారం బార్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యుడు ఏ. రాజశేఖర్ పై పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన హత్యాయత్నంపై చర్చించి తీవ్రంగా ఖండించడం జరిగింది. సదరు సంఘటనపై ఖండిస్తూ తీర్మానించిన అనంతరం ఒక బార్ సభ్యుడు ఒక కోర్టు కానిస్టేబుల్ వ్యవహారంపై చర్చించాలని కోరారు. సదరు విషయంపై చర్చించి కోర్టు కానిస్టేబుల్ విషయంపై స్థానిక డిఎస్పి కి ఒక తీర్మానం ద్వారా అందజేయాలని నిర్ణయించాము. ఆ ప్రకారం సభ్యుల ఏకాభిప్రాయంతో ఒక తీర్మానాన్ని ఆమోదించాము.సదరు బార్ అసోసియేషన్ తీర్మానం ను బుధవారం అనగా ఈరోజు స్థానిక డిఎస్పి కి అందించి సమస్య పై ఆయనతో చర్చించాలని తీర్మానించాం. అయితే కొందరు పై విషయాలను వక్రీకరించి ప్రింట్ మరియు సోషల్ మీడియా మిత్రులకు అందజేయడం ఆ వార్తలు వైరల్ అవ్వడంతో బార్ అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా మనస్థాపం చెంది సదరు వక్రీకరణ విషయంను ఖండిస్తున్నాం. ఒకరిద్దరూ న్యాయవాదులు ఒకరిద్దరూ కోర్టు కానిస్టేబుల్స్ మధ్య జరిగిన వ్యవహారాలను మొత్తం బార్ అసోసియేషన్ సభ్యులకు మరియు పోలీసు వ్యవస్థకు మధ్య దూరాన్ని పెంచడానికి కొందరు ప్రయత్నించారని స్పష్టం అవుతోoది. ఇందులో కార్యవర్గ సభ్యుల ప్రమేయం కానీ అందరు న్యాయవాదులు ప్రమేయం కానీ లేదని స్పష్టం చేస్తున్నాము. ఈ మేరకు బుధవారం స్థానిక డిఎస్పీ డేగల ప్రభాకర్ ను కలిసి బార్ అసోసియేషన్ లో తీర్మానం చేసిన కాపీలను అందజేసి వాస్తవాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్.భాస్కర్, వి.చంద్రశేఖర్, సహ కార్యదర్శి జి.ఆ జి.ఆర్. రవి, న్యాయవాదులు కె.జగదీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో గత ఆదివారం జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీల్లో తిరుపతికి చెందిన ఎ.వెంకటేష్(67), సి.జయశంకర్(58) ప్రతిభ కనబరిచారు. వేర్వేరుగా బ్యాక్, బ్రేస్ట్ స్టోక్, ఫ్రీస్టయిల్ విభాగాలలో వెంకటేష్ కు నాలుగు బంగారు, జయశంకర్కు రెండు చొప్పున సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.
తిరుపతి: విజయవాడలో గత ఆదివారం జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీల్లో తిరుపతి(Tirupati)కి చెందిన ఎ.వెంకటేష్(67), సి.జయశంకర్(58) ప్రతిభ కనబరిచారు. వేర్వేరుగా బ్యాక్, బ్రేస్ట్ స్టోక్, ఫ్రీస్టయిల్ విభాగాలలో వెంకటేష్ కు నాలుగు బంగారు, జయశంకర్(Jayashankar)కు రెండు చొప్పున సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. దీంతో నిర్వాహకులు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. వీరిరువురు స్థానిక శ్రీనివాస క్రీడా సముదాయంలో స్విమ్మింగ్ శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎ్సడీవో శశిధర్, కోచ్ చక్రవర్తి, పలువురు క్రీడాకారులు, ప్రముఖులు వారిని అభినందించారు.
మొంథా తుఫాను కారణంగా రాయలచెరువుకు గండి పడి ఊరిని మొత్తం ముంచెత్తింది. భారీగా నీరు రావడంతో పెద్దఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొంథా తుఫాను (Cyclone Montha) ఏపీలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం తప్పింది. అయితే పంట పొలాల్లోకి నీరు చేరడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం అందజేస్తామని.. ప్రతీఒక్కరినీ ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. అలాగే తుఫాను బాధితులకు ఇంటికి వెళ్లే ముందు రూ. మూడు వేల నగదు ఇవ్వడంతో పాటు బియ్యం, నిత్యావరసరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక మొంథా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో రాయల చెరువుకు గండి పడి అక్కడి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక పశువులు చనిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొంథా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో రాయల చెరువుకు గండిపడి నష్టపోయిన కుటుంబాలకు, పశువులకు ప్రత్యేక స్కేలు ఆర్థిక సాయం చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈరోజు (సోమవారం) విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి జయలక్ష్మి జీవో ఆర్టీనెంబర్ 125ను జారీ చేశారు. ఈనెల 6న వల్లూరు గ్రామం కేవీబీపురం మండలంలోని రాయలచెరువు ట్యాంకుకు గండి పడింది. దీంతో ఆ నీరంతా కాల్తూరు హరిజనవాడ, ఎస్ఎల్ పురం, పాతపాలెం గ్రామాల్లోకి రావడంతో భారీగా పశువులు చనిపోయాయి.
వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపిన భర్త
◆:- మృతురాలు డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్
◆:- తరచూ గొడవల వల్లే ఈ ఘోరం జరిగినట్లు వెల్లడి
◆:- భర్త బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
◆:- మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లాకు చెందిన చెవుల బ్రహ్మయ్య, కృష్ణవేణి (37) దంపతులు కొంతకాలంగా అమీన్పూర్లో నివసిస్తున్నారు. కృష్ణవేణి కోహిర్లోని డీసీసీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తుండగా, బ్రహ్మయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
వీరికి ఇంటర్ చదువుతున్న కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు.కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఇదే క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
తీవ్ర ఆగ్రహానికి లోనైన బ్రహ్మయ్య.. ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్తో కృష్ణవేణి తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు,
కార్తీక మాసం మూడో సోమవారం.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు శివాలయాలకు చేరుకుని మహాదేవుడిని దర్శించుకుంటున్నారు.
భోళా శంకరుడుకి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం (Kartika Masam). ఈ మాసంలో ఆ మహాదేవుడుని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది, విశిష్టమైనది అని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతుంటారు. శైవక్షేత్రాల్లో శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తుంటారు. హర హర మహాదేవ శంభోశంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతుంటాయి. ఇక కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా ఏపీలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామ క్షేత్రం, ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పాదగయా క్షేత్రం, శ్రీశైలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి ఈశ్వరుడిని దర్శించుకుంటున్నారు.
ఏపీ పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మధుసూదన్ రెడ్డి
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని ఏపీ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఆయన కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.ఈ క్రమంలోనే మడ్డిని మాచవరం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.డ్రగ్స్ (Drugs)ని అరికట్టడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి డ్రగ్స్ ముఠాని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగానే డ్రగ్స్ ముఠాల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఆయనని మాచవరం పోలీసులు బెంగళూరులో ఇవాళ(సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. మడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఏపీకి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఆయనని ఏపీకి తీసుకువచ్చిన తర్వాత విచారించే అవకాశాలు ఉన్నాయి. మడ్డిని విచారిస్తే పలు కీలక విషయాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అని పోలీసులు తెలిపారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తూ బెంగళూరులో మడ్డిగా చలామణి అవుతున్నారు మధుసూదన్ రెడ్డి. బెంగళూరులో డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మడ్డి. సెప్టెంబరులో బెంగళూరు నుంచి డ్రగ్స్తో విశాఖపట్నం వెళ్తూ విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రీవాత్సవ్, హవి పట్టుబడ్డారు . శ్రీవాత్సవ్, హవిల అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లారు మడ్డి. ఆయన కదలికలపై నిఘా ఉంచి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.
అమరావతి, నవంబర్ 6: రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్ట్టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్కు మంత్రి అచ్చెన్నాయుడు (Union Minister Atchannaidu) లేఖ రాశారు. మొంథా తుఫాను ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు, 8 లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం ఏపీపీ (CM APP), ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App)ను రాష్ట్ర CM APPతో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో వివరించారు.
అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్
జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని బుద్దా వెంకన్న అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
విజయవాడ, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్పై (Former CM YS Jagan) టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP Leader Budda Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పరామర్శ పేరుతో వారిపైనే జగన్ దండయాత్రలాగా వెళ్లారంటూ మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతోనే ప్రధాన మార్గంలో వెళ్లారని ఆరోపించారు. రైతుల కోసం వెళ్లిన జగన్కు మందీ మార్బలం ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే అర్హత, స్థాయి జగన్కు ఉందా అని మండిపడ్డారు.
రైతులపై కక్ష…
‘అసలు వ్యవసాయం గురించి నీకేం తెలుసు. నీ తాతది గ్రానైట్, నీ తండ్రి ఫ్యాక్షన్, వ్యాపారం, నీది దగా వ్యాపారం. అసలు జగన్కు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో. చదివి చెప్పడం కూడా జగన్కు చేత కావడంలేదు. ఫసల్ బీమా కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయి. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏమీ తెలియకుండా ఐదేళ్లు ఉన్నావా. నీకు ఓట్లు వేయకపోతే రైతుల మీద కక్ష కడతావా’ అంటూ ఫైర్ అయ్యారు.
ఆనందంతోనే వెళ్లారు..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రైతుల వద్దకు వెళ్లి పరామర్శ చేశారని చెప్పిన బుద్దా వెంకన్న.. జగన్ రైతుల వద్దకు పరామర్శకు వెళ్లి పూలు వేయించుకుంటారా అంటూ మండిపడ్డారు. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరకు వెళ్లి కూడా ఇలాగే పూలు విసిరేయించుకుంటారంటూ విరుచుకుపడ్డారు. జగన్ పర్యటన ఆనందంతో వెళ్లినట్లుగా ఉంది కానీ.. పరామర్శకు వెళ్లినట్లు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. వంద కార్లు, బైక్లు, జెండాలు, పెయిడ్ ఆర్టిస్ట్లతో పరామర్శకు వెళ్లిక ఏకైక నాయుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు.
ఆ మాత్రం తెలీదా…
జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్ రాత్రింబవళ్లు ప్రజల కోసం పని చేశారని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఆపగలమా… నష్టం తగ్గిస్తామా అని ప్రశ్నించారు. ఆ మాత్రం జగన్ తెలియదా అని ఫైర్ అయ్యారు. వరదల సమయంలో కోటి ఇస్తా అన్నారని…. ఎవరికి ఇచ్చారంటూ జగన్ను నిలదీశారు. దేశంలో అత్యధిక సంపన్నుడినని స్వయంగా జగనే అఫిడవిట్లో చెప్పారన్నారు. జగన్కు పేదలు అన్నా, రైతులు అన్నా చులకన భావమని అన్నారు. రైతులకు మేలు చేయాలని జగన్కు నిజంగా ఉంటే తుఫాను తగ్గిన సమయంలో వెళ్లేవారన్నారు. చంద్రబాబు తుఫాను హెచ్చరికల నుంచే అందరినీ అప్రమత్తం చేశారని.. నేతలను, అధికారులను క్షేత్ర స్థాయిలో పరుగెత్తించారని తెలిపారు. జగన్ విధ్వంసకర పాలన అందించారు కాబట్టే ప్రజలు ఇంట్లోకూర్చో పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు పడి లేచిన కెరటమని.. అలాంటి ఆయనకు జగన్ వార్నింగ్ ఇస్తారా అంటూ టీడీపీ నేత మండిపడ్డారు.
కేవలం ఫోటోల కోసమే..
11 సీట్లు వచ్చినా జగన్కు సిగ్గు శరం లేదంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. అందుకే రూ.42 వేలకోట్లు దోచుకుని జగన్ జైళ్లకు వెళ్లారన్నారు. ప్రజలు ఎవ్వరూ జగన్ కోసం రోడ్డు మీదకు రాలేదని గుర్తు చేశారు. కానీ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్లపైకి వచ్చారని తెలిపారు. జగన్ తండ్రి ఎన్నో ఎంక్వయిరీలు వేసినా చంద్రబాబును దోషిగా చూపలేక పోయారని అన్నారు. చంద్రబాబు రైతు బిడ్డ.. అందుకే రైతల బాధలు ఆయనకు తెలుసన్నారు. జగన్.. ఫ్యాక్షనిస్టు బిడ్ట అని.. అందుకే విధ్వంసం చేశారని విరుచుకుపడ్డారు. సీఎంగా పొలంలో కూడా దిగని జగన్.. నిన్న మాత్రం ఫొటోల కోసం పొలంలో అడుగు పెట్టారని అన్నారు. బురద లేని చోట మట్టి అంటకుండా పొలంలో పర్యటన బాగా చేశారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబును ఊర కుక్కలతో తిట్టిస్తే… ఆయన ఛరిష్మా తగ్గదని స్పష్టం చేశారు. జగన్ దండయాత్రలు మానుకుని ప్రజల కోసం పని చేయాలని హితవుపలికారు. తుఫాను సమయంలో ప్రభుత్వం చర్యలను చూసి ప్రజలంతా హర్షించారని తెలిపారు. జగన్కు ఇలాంటి మంచి కనిపించదని… అబద్ధాలు, అసత్యాలతో మోసాలు చేయడమే వైసీపీ అధినేతకు తెలిసిన విద్య అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.