వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు..

వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు

హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్‌2 ట్రైల‌ర్ విడుద‌లైంది.

బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) న‌టించి భారీ బ‌డ్జెట్ చిత్రం వార్‌2 (War 2). మ‌రో నెల రోజుల్లో ప్రేక్ష‌కుల‌కు ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. బ్ర‌హ్మాస్త్ర త‌ర్వాత అయాన్ ముఖర్జీ (Ayan mukharji) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు షురూ చేసేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అంతేగాక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj films) సంస్థ ఇప్ప‌టికే వెల్లడించింది. ఈ క్ర‌మంలో వీరు చెప్పిన‌ట్లుగానే స‌రిగ్గా శుక్ర‌వారం ఉద‌యం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ముందుగా వ‌చ్చిన టీజ‌ర్‌ను మించి విజువ‌ల్ గ్రాండియ‌ర్గా ఉంది. యాక్ష‌న్ సీన్స్ హాలీవుడ్ లెవ‌ల్‌లో, మొద‌టి భాగాన్ని మించి స‌న్నివేశాలు తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా దుమ్ము లేపుతోంది. కియారా గ్లామ‌ర్‌తోనే కాకుండా యాక్ష‌న్ సీన్ల‌లోనూ అద‌ర‌గొట్టింది.

ఇదిలాఉంటే.. ఈ మూవీలో య‌శ్‌రాజ్ యూనివ‌ర్స్‌ చిత్రాల నుంచి ప‌లు స‌ర్‌ప్రైజ్‌లు ఈ సినిమాలో స‌ర్‌ఫ్రైజ్ క్యామియోలు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.ఇక వార్ మ‌రో 20 రోజుల్లో రిలీజ్ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఇప్ప‌టికే హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న్ థియేట‌ర్ వ‌ద్ద ప్యాన్స్ చెల‌రేగి పోయారు. భారీ క‌టౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, హ‌ర‌తులు ఇస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారిని ఆప‌డం ఇప్ప‌ట్లో కుద‌ర‌ద‌నేలా వారు హంగామా సృష్టిస్తున్నారు. ఇది ఇలానే సినిమా రిలీజ్ వ‌ర‌కు కొన‌సాగేలా తెలుస్తోంది.

నెలరోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసం.

 

 

నెలరోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసం

యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘స్పై యూనివర్స్’ నుండి రాబోతున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘వార్ -2’ (War -2). ఇవాళ్టి నుండి సరిగ్గా 30 రోజుల్లో ‘వార్ 2’ ఆగస్ట్ 14న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటు హృతిక్ రోషన్ (Hrithik Roshan), అటు ఎన్టీఆర్ (NTR) నడుమ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తుపాకీ గురిపెడుతూ ఉండటం విశేషం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అని ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు.

 

శేషం ఏమంటే… ‘వార్ 2’ కథానాయిక కియారా అద్వానీ జూలై 16 ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి ఆమె డెలివరీ ఆగస్ట్ లో జరగాల్సి ఉంది. కానీ నెల రోజుల ముందే బిడ్డను కనేసింది కియారా. 2023లో ఆమె తన సహ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాను ప్రేమ వివాహం చేసుకుంది. ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఆస్పత్రిలో కియారా ప్రసవం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే… ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృతిక్, ఎన్టీఆర్ అభిమానులు ‘వార్ 2’ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పై డ్రామా మరో ముప్పై రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రాబోతోందని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో రాబోతున్న ‘వార్ -2’ ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా రికార్డులు క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు

చిన్నతనం నుండే ఫిమేల్ వాయిస్ తో రాణింపు

దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బొటికే సుదర్శన్..

నర్సంపేట నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన బొటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ అవార్డు వరించింది.ఈనెల 28న నిర్వహించిన ఖమ్మం వారి సర్వమాలిక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా దుగ్గొండి మండలానికి చెందిన బోటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అచీవ్మెంట్ 2025 అవార్డు దక్కింది. ఈ అవార్డును తుమ్మలపల్లి నాగేశ్వరరావు తనయుడు తుమ్మలపల్లి యుగేందర్ చేతుల మీదుగా తీసుకున్నాడు.తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుండి ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది అని సుదర్శన్ తెలియజేశ

అలాగే గత ఏప్రిల్ 13 న ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకోవడం జరిగిందని సుదర్శన్ పేర్కొన్నారు.కాగా విశాఖపట్నంలోని డాలి ఫంక్షన్ హాల్ లో సినీ హీరో నరేన్ తేజ్,పబ్లిక్ ఫైటర్ మహేష్ యాదవ్ చేతుల మీదగా ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకున్నాడు.గత ఫిబ్రవరి 27 న కరీంనగర్ లో జరిగిన వెంకట్ మ్యూజికల్ తరపున ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫిమేల్ అవార్డు ఏసిపి విజయ్ కుమార్ చేతుల మీదగా తీసుకున్నాడు.   చిన్నతనం నుండి సుదర్శన్ ఫిమేల్ వాయిస్ లో పాట పాడడం అలవాటు చేసుకున్నాడు. 2025 సంవత్సరంలో ఇన్ని అవార్డులు రావడం చాలా గౌరవంగా ఉందని సుదర్శన్ తెలియజేశారు.ఈ సందర్భంగా సుదర్శన్ కు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు పలువిధాల సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే ముందు ముందు మంచి అవార్డులు తీసుకొని దుగ్గొండి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version