వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి..

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
మెట్ పల్లి సెప్టెంబర్ 22 నేటి దాత్రి

 

 

మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ సోదరుడు కూన గంగాధర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను సోమవారం రోజు వారి నివాసంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కిసాన్ సేల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా..టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి,మాజీ ఎంపిటిసి సిగారపు అశోక్,శంకర్, కోరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఏకశీల ప్రిన్సిపాల్ ఎం.డి బాబాకు “గురుబ్రహ్మ” అవార్డు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T141033.408.wav?_=1

ఏకశీల ప్రిన్సిపాల్ ఎం.డి బాబాకు “గురుబ్రహ్మ” అవార్డు

నేటిధాత్రి ఐనవోలు :-

ఎస్ఆర్ఎఫ్ (శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్) గురుబ్రహ్మ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఏకశీల ఈ టెక్నో పాఠశాల ప్రిన్సిపల్ యం.డి.బాబా ఎంపికయ్యారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో బుధవారం రాత్రి ఎస్ఆర్ఎఫ్ గురుబ్రహ్మ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డా|| జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా ప్రిన్సిపల్ యండి. బాబా గురుబ్రహ్మ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఏకశిలా విద్యా సంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి బాబాను అభినందించారు.

అభివృద్ధి పథంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T141651.918-1.wav?_=2

అభివృద్ధి పథంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్

_చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు.

నేటిధాత్రి, వరంగల్.

 

వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. శుక్రవారం వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ప్రగతిని వివరించారు. 1995లో ప్రారంభమైనప్పటి నుండి ఎదురైన సవాళ్లను అధిగమించి బ్యాంకును దినదినాభివృద్ధి చేసుకుంటూ వచ్చామని తెలిపారు. మొదట 5 కోట్లతో ప్రారంభమైన ఈ బ్యాంక్ ప్రస్తుతం 400 కోట్ల టర్నోవర్తో ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 10శాఖలను ఏర్పాటు చేశామని, వచ్చే 5 సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంక్ శాఖలను విస్తరించాలని సంకల్పించామని చెప్పారు.

“రాజకీయాలకు అతీతంగా సహకార స్ఫూర్తితో అభివృద్ధి చేస్తాము. బ్యాంక్తో రాజకీయం చేయకండి. 6 సార్లు గెలిచి సేవ చేసే అవకాశం కలిగింది. ఓడిపోయిన వారినీ కలుపుకొని ముందుకు వెళ్తాం” అని ప్రదీప్ రావు పేర్కొన్నారు.

వ్యాపార వర్గాలను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయనివ్వమని, మహిళలకు కూడా రుణాలు అందించే దిశగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను మరింత విస్తరిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్..

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న టీజీఐడిసి మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొయినాబాద్ జెపిఎల్ కన్వెన్షన్ లో జరిగిన పస్తాపూర్ వాస్తవ్యులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంగారెడ్డి గారి కుమారుడు శంకర్ రెడ్డి (సి.ఆర్.పి.ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్) & మనీషా రెడ్డి (ఐ.పి.ఎస్.) గార్ల వివాహ విందు వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన టీజీఐడిసి మాజీ చైర్మన్ మహమ్మద్ తన్విర్
వారితో పాటు మాజీ కౌన్సిలర్లు మోతిరామ్ జహంగీర్ యూనస్ రాములు నేత నాయకులు శ్రీకాంత్ బి జి సందీప్ అరుణ్ బాల్రెడ్డి పాల్గొన్నారు.

శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

*శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 29:

చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మాతృమూర్తి కీ!!శే!! లక్ష్మి భారతి ఇటీవల వైకుంఠ ప్రాప్తి పొందారు. బుధవారం పులివర్తి వారి పల్లిలోని వారి స్వగృహమునందు జరిగిన శుభ స్వీకరణ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాతృమూర్తి లక్ష్మి భారతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. లక్ష్మి భారతి అమ్మ
ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో బుధవారము జరిగిన మేదపల్లి గ్రామం కీ.శే.సంఘమేశ్వర్ పట్లోల సువర్ణ ల కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ లు శంకర్, సంఘమేశ్వర్,పరమేశ్వర్,నాయకులు జి.నర్సింలు,సుభాష్ రావు,నర్సింలు,చెంగల్ జైపాల్,బసంత్ పాటిల్, అభిలాష్ రెడ్డి,ప్రవీణ్ కుమార్, బి.దిలీప్,తదితరులు పాల్గొన్నారు.

డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.

డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఉదయం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శన నిమిత్తం రావడం జరిగింది. దీంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎం వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, ఎంపీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ బి.సంగమేశ్వర్, మాజీ సర్పంచులు మాణిక్ ప్రభు పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కేతకి ఆలయ మాజీ ధర్మకర్తలు సంతోష్ పటేల్, సత్యనారాయణ సింగ్, సంగమేశ్వర్, బి.ఆర్.ఎస్ ఝరాసంగం టౌన్ అధ్యక్షులు ఎజాస్ బాబా, నాయకులు ప్రవీణ్ పాటిల్, అశోక్ పాటిల్, వీరన్న పాటేల్, శ్రీనివాస్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి..

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-45.wav?_=3

జయశంకర్ భూపాలపల్లి నూతనంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా నియమితులైన కోట రాజబాబు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ఉమ్మడి రేగొండ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోయిల క్రాంతి కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

గ్రంధాల సంస్థ చైర్మన్ గా కోట రాజబాబు..

గ్రంధాల సంస్థ చైర్మన్ గా కోట రాజబాబు

మహదేవ పూర్ జూలై19 (నేటి ధాత్రి )

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-40.wav?_=4

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజబాపు ను నియమిస్తూ రాష్ట్ర గ్రంధాలయ శాఖ శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సెక్రటేరియట్ ఆర్డర్ కాపీని తీసుకొని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గతం లొ కోట రాజబాబు మహాదేవపూర్ పాత సమితి తాలూకాకు రెండుసార్లు సర్పంచ్ గాను, కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ గా పని చేశారు. మండల స్థాయి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా మన్నలను పొంది కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన వ్యక్తిగా పనిచేస్తూ ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపైన నమ్మకంతో పదవి కట్టబెట్టిన మంత్రికి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా పార్టీ అభివృద్ధికి, ఆశయాలకు కృషి చేస్తానని తెలుపుతూ తోటి మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్.

సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్ కేటాయించడంపై హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-35.wav?_=5

జహీరాబాద్. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేవారిని గుర్తించి పార్టీ అధిష్టానం అందలం ఎక్కిస్తుందని దానికి ఉదాహరణ కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రామలింగ రెడ్డి కి ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం అని, పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి అవకాశాలు ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేసిన పట్లోళ్ల రామలింగ రెడ్డి కి జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వడంపై కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ షౌకత్ అలీ హర్షం వ్యక్తం చేస్తు పార్టీ అధిష్టనానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షౌకత్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఐక్యంగా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో, నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పార్టీ అమలు చెస్తూన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీలకు కేటాయించాలి.

సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీలకు కేటాయించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2-1.wav?_=6

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా పరిషత్ పదవులు బీసీలకే ఇవ్వాలి: బీసీ నాయకుల డిమాండ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని బీసీ నాయకులు జిల్లా స్థాయిలో రాజకీయ న్యాయం జరగాలంటూ బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 26 జెడ్పిటిసి స్థానాలు, 26 ఎంపీపీలు, 271 ఎంపీటీసీలు ఉన్న వేళ, వీటిలో కనీసం 42 శాతం స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. పాలకులు సామాజిక న్యాయంపై మాట్లాడే సమయంలో, జాతీయ జనాభా గణాంకాలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు తగిన వాటా కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. ప్రత్యేకించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీకి ఇవ్వాలని, ఇది బీసీ సామాజిక వర్గానికి గుర్తింపు కలిగించే అంశమని పేర్కొన్నారు. పనులు, పథకాల అమలులో బీసీల పాత్ర కీలకమైందని, గ్రామ స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం ఇచ్చి బీసీల ఎదుగుదలకి మార్గం వేయాలని జిల్లా బీసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డెలిమిటేషన్ ప్రక్రియలో బీసీలకు న్యాయం చేయాలని, రాజకీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని ఎత్తిచూపుతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు కొండాపురం నర్సింలు ముదిరాజ్ మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ శ్రీనివాస్ గౌడ్ రాకేష్ రాజు దత్తు రవీందర్ నారాయణఖేడ్ సాయిలు ఆందోల్ రాజన్న సంగారెడ్డి విశాల్ డిమాండ్ చేశారు.

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి

వేద ఆశీర్వచనం అందజేసిన టిటిడి కాంట్రాక్ట్ అర్చకులు…

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 16:

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టిటిడి ఎక్స్ ఆపిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానములలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.. మంచి మనసున్న డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వందమందికి పైగా టిటిడిలో కాంట్రాక్ట్ ఆర్చకులు పనిచేస్తున్నామని తమకు గుర్తింపు కార్డులు,లడ్డు కార్డు, హెల్త్ కార్డులు అందించాలని అర్చకులు దివాకర్ రెడ్డి ని కోరారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అర్చకుల విన్నపాలను టిటిడి పాలకమండలిలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్.

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్ గా శ్రీపతి రాములు గౌడ్ నియామకం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు స్టేట్ చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ,సంస్థ నియమ,నిబంధనలు పాటిస్తూ,సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని,ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని,ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని,పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గా ప్రసాద్

నేటి ధాత్రి చర్ల

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలను తీసుకుని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రగతికి ఆయన కృషి ఎంతో అభినందనీయమని తెలియజేశారు

పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

తోలి ఏకాదశి సందర్భంగా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో గల శ్రీ పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పరమేశ్వరుని దర్శనం చేసుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,ప్రభాకర్ రెడ్డి,యం.జైపాల్,నరసింహా రెడ్డి,భరత్ రెడ్డి,శ్రీనివాస్, నాగు,మారుతీ,అనిల్,దిలీప్, తదితరులు ఉన్నారు.

టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన విశ్రాంత సంగీత ఉపాద్యాయులు శంకర్ జోషి గారి మనమరాలు జన్మదిన వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు సతీ సమేతంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో టి. రవికుమార్,చెంగల్ జైపాల్, తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి.

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాచాల

వనపర్తి నెటిదాత్రి :

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని. అది నచ్చని వారు ఇలాంటి దాడులకు దిగుతున్నారని వారికి భయపడబోనని.ప్రజల సమస్యలపై పోరాటాన్ని ఆపేది లేదని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు
గురువారం రాత్రి 12 గంటల సమయంలో తన స్వగ్రామమైన వడ్డెవాటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై రాళ్లతో దాడి చేశారని, కారు డ్రైవర్ చాకచక్యంతో కారు ముందుకు వేగంగా పోనివ్వడంతో తృటిలో తనకు ప్రాణాపాయం తప్పిందన్నారు డాడీ సంఘటన పై శుక్రవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కలిసి ఫిర్యాదు చేశామని రాచాల యూగంద ర్ గౌడ్ తెలిపారు
దాడి చేసిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టొద్దని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ని కోరారు.

BC Political.

ఎన్ని దాడులు చేసినా అదిరేది లేదు, బెదిరేది లేద.నిప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా తాను సిద్ధమని రాచాల స్పష్టం చేశారు.
రాచాల వెంట బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు పాండురంగ యాదవ్, వివి గౌడ్, నరసింహ యాదవ్, స్వప్న, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, అరవింద చారి, బత్తుల జితేందర్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, నాగరాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, బీసీ కుల సంఘాల జెఎసి నాయకులు రాములు యాదవ్, సత్యం యాదవ్, వెంకటన్న గౌడ్, నజీర్, తిరుపతన్న గౌడ్, కొత్త గంగాధర్ తదితరులు ఉన్నారు

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి:

 

ములుగు జిల్లా మంగపేట మండలం ప్రొద్దుమూర్ గ్రానానికి చెందిన బద్ది పాపారావు ఇటీవల రోడ్ ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబం తీవ్ర దుఃఖం లో వున్నారు.రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగించే ఇంటి పెద్ద అనుకోని ప్రమాదం లో చనిపోవడం ,మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం ఏం చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న వారి కుటుంబ పరిస్థితి ని స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయగా దశదినకర్మల నిమిత్తం (4000 రూపాయలవిలువైన)50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు స్థానికులు చే వారి కుటుంబానికి అందజేశారు.అడగగానే సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు మరియు ట్రస్ట్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మాను పెళ్లి. వేణు,కలల రాంబాబు,గుగ్గిల సురేష్,బద్ది రఘుబాబు,మానపల్లి రోహిత్. బద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శివనగర్ అంగన్వాడీ (అండర్ బ్రిడ్జి )కేంద్రంలో కాంగ్రెస్ లీగల్ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పిల్లలు గర్భిణీల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా నాయకురాలు రావుల విజయ రాంచందర్, రాధిక,నాయకులు పట్టూరి సుధాకర్, తిరునగిరి వెంకన్న, తొగరు కృష్ణ, రాజు, శ్రీధర్, మధు, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు వాణిశ్రీ, ఉమాదేవి,నిర్మల,అనూష,ఇశ్రాల్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి.

నూతన రాష్ట్ర మంత్రిని సన్మానించిన

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,సచివాలయంలో బుధవారం కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాలు, గనులు భూగర్భ శాస్త్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గడ్డం.వివేక్ వేంకట స్వామి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి , జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version