శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

*శుభ స్వీకరణ కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్..

చంద్రగిరి(నేటి ధాత్రి) జూలై 29:

చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మాతృమూర్తి కీ!!శే!! లక్ష్మి భారతి ఇటీవల వైకుంఠ ప్రాప్తి పొందారు. బుధవారం పులివర్తి వారి పల్లిలోని వారి స్వగృహమునందు జరిగిన శుభ స్వీకరణ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాతృమూర్తి లక్ష్మి భారతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. లక్ష్మి భారతి అమ్మ
ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే నాని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

వివాహా వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో బుధవారము జరిగిన మేదపల్లి గ్రామం కీ.శే.సంఘమేశ్వర్ పట్లోల సువర్ణ ల కుమారుని వివాహా వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వేడుకల్లో మాజీ సర్పంచ్ లు శంకర్, సంఘమేశ్వర్,పరమేశ్వర్,నాయకులు జి.నర్సింలు,సుభాష్ రావు,నర్సింలు,చెంగల్ జైపాల్,బసంత్ పాటిల్, అభిలాష్ రెడ్డి,ప్రవీణ్ కుమార్, బి.దిలీప్,తదితరులు పాల్గొన్నారు.

డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.

డిసిఎంఎస్ చైర్మన్ ఎం, శివకుమార్ కేతకిలో ప్రత్యేక పూజలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఉదయం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి దర్శన నిమిత్తం రావడం జరిగింది. దీంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎం వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, ఎంపీపీ మాజీ వైస్ ప్రెసిడెంట్ బి.సంగమేశ్వర్, మాజీ సర్పంచులు మాణిక్ ప్రభు పటేల్, శ్రీనివాస్ రెడ్డి, కేతకి ఆలయ మాజీ ధర్మకర్తలు సంతోష్ పటేల్, సత్యనారాయణ సింగ్, సంగమేశ్వర్, బి.ఆర్.ఎస్ ఝరాసంగం టౌన్ అధ్యక్షులు ఎజాస్ బాబా, నాయకులు ప్రవీణ్ పాటిల్, అశోక్ పాటిల్, వీరన్న పాటేల్, శ్రీనివాస్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి..

నూతన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ను కలిసిన కోయిల క్రాంతి

భూపాలపల్లి నేటిధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-45.wav?_=1

జయశంకర్ భూపాలపల్లి నూతనంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా నియమితులైన కోట రాజబాబు గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ఉమ్మడి రేగొండ మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోయిల క్రాంతి కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

గ్రంధాల సంస్థ చైర్మన్ గా కోట రాజబాబు..

గ్రంధాల సంస్థ చైర్మన్ గా కోట రాజబాబు

మహదేవ పూర్ జూలై19 (నేటి ధాత్రి )

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-40.wav?_=2

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజబాపు ను నియమిస్తూ రాష్ట్ర గ్రంధాలయ శాఖ శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సెక్రటేరియట్ ఆర్డర్ కాపీని తీసుకొని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గతం లొ కోట రాజబాబు మహాదేవపూర్ పాత సమితి తాలూకాకు రెండుసార్లు సర్పంచ్ గాను, కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ గా పని చేశారు. మండల స్థాయి కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా మన్నలను పొంది కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన వ్యక్తిగా పనిచేస్తూ ప్రస్తుతం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపైన నమ్మకంతో పదవి కట్టబెట్టిన మంత్రికి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎల్లవేళలా పార్టీ అభివృద్ధికి, ఆశయాలకు కృషి చేస్తానని తెలుపుతూ తోటి మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్.

సినియారీటిని గుర్తించి రామలింగ రెడ్డి కి ఆత్మ చైర్మన్ కేటాయించడంపై హర్షం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-35.wav?_=3

జహీరాబాద్. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసేవారిని గుర్తించి పార్టీ అధిష్టానం అందలం ఎక్కిస్తుందని దానికి ఉదాహరణ కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రామలింగ రెడ్డి కి ఆత్మ కమిటీ చైర్మన్ నియామకం అని, పార్టీ కోసం కష్టపడే వారికి పార్టీ అన్ని రకాలుగా అండగా ఉండి అవకాశాలు ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కృషి చేసిన పట్లోళ్ల రామలింగ రెడ్డి కి జహీరాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వడంపై కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ షౌకత్ అలీ హర్షం వ్యక్తం చేస్తు పార్టీ అధిష్టనానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా షౌకత్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఐక్యంగా ముందుకు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో, నియోజకవర్గంలో పార్టీ విజయం కోసం పార్టీ అమలు చెస్తూన్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీలకు కేటాయించాలి.

సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బీసీలకు కేటాయించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2-1.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా పరిషత్ పదవులు బీసీలకే ఇవ్వాలి: బీసీ నాయకుల డిమాండ్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని బీసీ నాయకులు జిల్లా స్థాయిలో రాజకీయ న్యాయం జరగాలంటూ బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 26 జెడ్పిటిసి స్థానాలు, 26 ఎంపీపీలు, 271 ఎంపీటీసీలు ఉన్న వేళ, వీటిలో కనీసం 42 శాతం స్థానాలు బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. పాలకులు సామాజిక న్యాయంపై మాట్లాడే సమయంలో, జాతీయ జనాభా గణాంకాలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు తగిన వాటా కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. ప్రత్యేకించి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీకి ఇవ్వాలని, ఇది బీసీ సామాజిక వర్గానికి గుర్తింపు కలిగించే అంశమని పేర్కొన్నారు. పనులు, పథకాల అమలులో బీసీల పాత్ర కీలకమైందని, గ్రామ స్థాయినుంచి జిల్లా స్థాయి వరకు నాయకత్వం ఇచ్చి బీసీల ఎదుగుదలకి మార్గం వేయాలని జిల్లా బీసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. డెలిమిటేషన్ ప్రక్రియలో బీసీలకు న్యాయం చేయాలని, రాజకీయ వేదికలపై కూడా ఈ అంశాన్ని ఎత్తిచూపుతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు కొండాపురం నర్సింలు ముదిరాజ్ మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ శ్రీనివాస్ గౌడ్ రాకేష్ రాజు దత్తు రవీందర్ నారాయణఖేడ్ సాయిలు ఆందోల్ రాజన్న సంగారెడ్డి విశాల్ డిమాండ్ చేశారు.

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి..

*తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని కలిసి

వేద ఆశీర్వచనం అందజేసిన టిటిడి కాంట్రాక్ట్ అర్చకులు…

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 16:

తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్, టిటిడి ఎక్స్ ఆపిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ని తిరుమల తిరుపతి దేవస్థానములలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందించారు.. మంచి మనసున్న డాలర్స్ దివాకర్ రెడ్డి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వందమందికి పైగా టిటిడిలో కాంట్రాక్ట్ ఆర్చకులు పనిచేస్తున్నామని తమకు గుర్తింపు కార్డులు,లడ్డు కార్డు, హెల్త్ కార్డులు అందించాలని అర్చకులు దివాకర్ రెడ్డి ని కోరారు. ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అర్చకుల విన్నపాలను టిటిడి పాలకమండలిలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్.

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్ గా శ్రీపతి రాములు గౌడ్ నియామకం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు స్టేట్ చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ,సంస్థ నియమ,నిబంధనలు పాటిస్తూ,సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని,ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని,ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని,పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గా ప్రసాద్

నేటి ధాత్రి చర్ల

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలను తీసుకుని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రగతికి ఆయన కృషి ఎంతో అభినందనీయమని తెలియజేశారు

పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

తోలి ఏకాదశి సందర్భంగా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో గల శ్రీ పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పరమేశ్వరుని దర్శనం చేసుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,ఈ కార్యక్రమంలో చంద్రకాంత్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,ప్రభాకర్ రెడ్డి,యం.జైపాల్,నరసింహా రెడ్డి,భరత్ రెడ్డి,శ్రీనివాస్, నాగు,మారుతీ,అనిల్,దిలీప్, తదితరులు ఉన్నారు.

టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.

జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ లో ఈ రోజు జరిగిన విశ్రాంత సంగీత ఉపాద్యాయులు శంకర్ జోషి గారి మనమరాలు జన్మదిన వేడుకల్లో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు సతీ సమేతంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో టి. రవికుమార్,చెంగల్ జైపాల్, తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి.

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాచాల

వనపర్తి నెటిదాత్రి :

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని. అది నచ్చని వారు ఇలాంటి దాడులకు దిగుతున్నారని వారికి భయపడబోనని.ప్రజల సమస్యలపై పోరాటాన్ని ఆపేది లేదని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు
గురువారం రాత్రి 12 గంటల సమయంలో తన స్వగ్రామమైన వడ్డెవాటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై రాళ్లతో దాడి చేశారని, కారు డ్రైవర్ చాకచక్యంతో కారు ముందుకు వేగంగా పోనివ్వడంతో తృటిలో తనకు ప్రాణాపాయం తప్పిందన్నారు డాడీ సంఘటన పై శుక్రవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కలిసి ఫిర్యాదు చేశామని రాచాల యూగంద ర్ గౌడ్ తెలిపారు
దాడి చేసిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టొద్దని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ని కోరారు.

BC Political.

ఎన్ని దాడులు చేసినా అదిరేది లేదు, బెదిరేది లేద.నిప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా తాను సిద్ధమని రాచాల స్పష్టం చేశారు.
రాచాల వెంట బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు పాండురంగ యాదవ్, వివి గౌడ్, నరసింహ యాదవ్, స్వప్న, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, అరవింద చారి, బత్తుల జితేందర్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, నాగరాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, బీసీ కుల సంఘాల జెఎసి నాయకులు రాములు యాదవ్, సత్యం యాదవ్, వెంకటన్న గౌడ్, నజీర్, తిరుపతన్న గౌడ్, కొత్త గంగాధర్ తదితరులు ఉన్నారు

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం.

దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మెన్ బాడిశ నాగరమేష్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి:

 

ములుగు జిల్లా మంగపేట మండలం ప్రొద్దుమూర్ గ్రానానికి చెందిన బద్ది పాపారావు ఇటీవల రోడ్ ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబం తీవ్ర దుఃఖం లో వున్నారు.రోజు వారి పనులకు వెళ్లి జీవనం సాగించే ఇంటి పెద్ద అనుకోని ప్రమాదం లో చనిపోవడం ,మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం ఏం చేయలేని నిస్సహాయ స్థితి లో ఉన్న వారి కుటుంబ పరిస్థితి ని స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయగా దశదినకర్మల నిమిత్తం (4000 రూపాయలవిలువైన)50 కేజీల బియ్యం,నిత్యవసర సరుకులు స్థానికులు చే వారి కుటుంబానికి అందజేశారు.అడగగానే సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ కు మరియు ట్రస్ట్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియచేసారు .ఈ కార్యక్రమంలో మాను పెళ్లి. వేణు,కలల రాంబాబు,గుగ్గిల సురేష్,బద్ది రఘుబాబు,మానపల్లి రోహిత్. బద్ది సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శివనగర్ అంగన్వాడీ (అండర్ బ్రిడ్జి )కేంద్రంలో కాంగ్రెస్ లీగల్ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ శామంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పిల్లలు గర్భిణీల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా మహిళా నాయకురాలు రావుల విజయ రాంచందర్, రాధిక,నాయకులు పట్టూరి సుధాకర్, తిరునగిరి వెంకన్న, తొగరు కృష్ణ, రాజు, శ్రీధర్, మధు, అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు వాణిశ్రీ, ఉమాదేవి,నిర్మల,అనూష,ఇశ్రాల్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి.

నూతన రాష్ట్ర మంత్రిని సన్మానించిన

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,సచివాలయంలో బుధవారం కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాలు, గనులు భూగర్భ శాస్త్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గడ్డం.వివేక్ వేంకట స్వామి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి , జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం.

డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్‌కు ఘన స్వాగతం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

shine junior college

 

 

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవంలో భాగంగా అమెరికాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా నుండి తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా, సంగారెడ్డి జిల్లా ఝ రా సంగం మండలం మెదపల్లి బీ ఆర్ఎస్ సీనియర్ నేత పరమేశ్వర్ పాటిల్ ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ యువనాయకులు ఎస్.కె. షోయల్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్, ఝరాసంగం మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్, యువ నాయకులు నవీన్ పాటిల్ శివకుమార్, సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

డీసీఎంఎస్ చెర్మన్ శివకుమార్ గారికి ఘనంగా స్వాగతం.

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చెర్మన్ శివకుమార్ గారికి ఘనంగా స్వాగతం పలికిన మెదపల్లి తాజా మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

shine junior college

ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు భారత రాష్ట సమితి రజతోత్సవం లో భాగంగా బి ఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు ఆదేశానుసారం అమెరికాలో జరిగిన రజతోత్సవంలో భాగంగా పాల్గొని తిరిగి స్వదేశానికి విచ్చేసిన సందర్భంగా మెదపల్లి తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ మరియు ,ఝరాసంగం మండల బి ఆర్ యస్ పార్టీ యువనాయకులు sk షోయల్ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది .ఇట్టి కార్యక్రమం లో జహీరాబాద్ మాజీ ఎంపీపీ విజయకుమార్.
ఝరసంగం మండల బి ఆర్ యస్ పార్టీ ఉపాధ్యక్షులు మాణికప్రభు పాటిల్ .యువనాయకులు నవీన్ పాటిల్ శివకుమార్ .సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ యువజన సంయుక్త కార్యదర్శి పోలీస్ ప్రవీణ్ పాటిల్.తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్.

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన రివల్యూషన్ యూత్…

సిఎండి బలరాం నాయక్ ను కలిసిన జర్నలిస్టులు..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

 

shine junior college

సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ సిఎండిని కలిసిన మందమర్రి రివల్యూషన్ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అనిల్ భగత్ ఉపాధ్యక్షుడు అక్బర్ లు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ లోని సింగరేణి భవన్ వేదికగా సిఎండి బలరాం నాయక్ ను కలిసి సీనియర్ పాత్రికేయులు మునీర్ విగ్రహం ఏర్పాటు అలాగే గని కార్మికులకు అందించే అవార్డులు మునీర్ పేరిట అందించాలనీ కోరారు. కోల్ బెల్ట్ లో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలతో నల్ల నేలలో నెలకొన్న సామాజిక సమస్యల పై అక్షర రూపం ఇస్తున్న జర్నలిస్టులకు మునీర్ పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు ప్రతి సంవత్సరం అందించాలని కోరారు. మునీర్ మృతి సమాజానికి తీరని లోటు అని, మునీర్ విగ్రహం ఏర్పాటు కోసం త్వరలో కోల్ బెల్ట్ లో మునీర్ అబిమానులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ భగత్ అక్బర్ లు తెలిపారు. బండ కింద బ్రతుకులకు బరోసా ఇచ్చిన మునీర్ మృతి నల్ల నేలకు తీరని లోటు అని సింగరేణి చరిత్రలో మునీర్ ప్రజల హృదయాలో సజీవంగా ఉంటారని, సీనియర్ పాత్రికేయులు మునీర్ జర్నలిస్టులకు ఆదర్శం అని బలరాం నాయక్ అన్నారు. ప్రవీణ్, సాయి, దీపక్, జాఫర్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్.

కేటీఆర్ గారికి మద్దతుగా హైదరాబాద్ తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు. డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,బి ఆర్ ఎస్ నాయకులు

◆ రాష్ట్ర మాజి మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో CBI ఎదుట హాజరవుతున్న సందర్భంగా వారికి మద్దతుగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కి చేరుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప‌రిపాల‌న‌లో విఫ‌ల‌మైన కాంగ్రెస్ పార్టీ కావాల‌నే ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను త‌ప్పుడు కేసుల్లో ఇరికించి విచార‌ణ పేరుతో ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఫార్ములా – ఈ రేసు కేసులో మ‌ళ్లీ కేటీఆర్‌ గారికి ACB నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,నాల్కల్ మండల మాజీ జడ్పిటిసి స్వప్న భాస్కర్,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్,మాజీ పట్టణ అధ్యక్షులు మోహియుద్దీన్,మాజీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్,మొగుడంపల్లి మండల పార్టీ జనరల్ సెక్రెటరీ గోపాల్,జహీరాబాద్ మండల బీసీల అధ్యక్షులు అమిత్ కుమార్,మాజీ సర్పంచ్ లు బస్వరజ్,ప్రభు పటేల్ నాయకులు ప్రవీణ్ కుమార్,అశోక్ పాటిల్,రాథోడ్ భీమ్రావు నాయక్, వసీం తదితరులు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version