ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేయాలి

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ధాన్యం కొనుగోళ్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా పూర్తి చేయాలని, అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, అన్ లోడింగ్ వేగవంతం చేయడం, గోదాంలలో నిల్వ చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతి, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పరిస్థితులు, ధాన్యం నిల్వ సామర్థ్యం వివరాలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ చేయాలని, నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రైస్ మిల్లులకు టార్గెట్ ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల్లోగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
రైస్ మిల్లులు, గోదాంలు, అపెరల్ పార్క్ లో హమాలీల సంఖ్యను పెంచి, అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. తుది దశలో ఉన్న కేంద్రాల్లో కొనుగోళ్లు మరింత వేగవంతం చేసి.. పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లాలో గన్నీ బ్యాగుల కొరత లేదని, కేంద్రాల వారీగా ఎన్ని గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయో ముందే తెలుసుకుని, సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు సరిపడా వాహనాలను సమకూర్చాలని, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు ఈ దిశగా వాహనాలు సమకూర్చేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

జిల్లా ఉన్నతాధికారులను అప్రమత్తం ఉండాలి

జిల్లా ఉన్నతాధికారులను అప్రమత్తం ఉండాలి

శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఎంపేడు, కుందన్‌పల్లి, బండపల్లి తదితర గ్రామాల్లో పంట పొలాల్లో అగ్నిప్రమాదం సంభవించి, మంటలు దావానంలా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తున్న విషయం తెలిసిన వెంటనే శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జిల్లా ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు.
ఈ ఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీ సింగరేణి జీఎం కి, జిల్లా ఫైర్ అధికారులకు ఫోన్ చేసి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఫైర్ ఇంజన్లను ఘటన స్థలానికి పంపించాలని సూచించారు. అవసరమైతే సింగరేణి సహాయాన్ని కూడా వినియోగించాలని సూచించారు.
వేసవి తీవ్రత కారణంగా అగ్ని మరింత విస్తరించి సమీప గ్రామాలకు నష్టం కలిగించే అవకాశం ఉన్నందున అధికారులు అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించారు.a

గుండంపల్లి మల్లాపూర్ రోడ్డుకు సంబంధించిన పనులను ప్రారంభించిన అధికారులు

గుండంపల్లి మల్లాపూర్ రోడ్డుకు సంబంధించిన పనులను ప్రారంభించిన అధికారులు
మల్లాపూర్ మే 22 నేటి దాత్రి

గుండంపల్లి – మల్లాపూర్ మధ్యలో పి ఆర్ రోడ్డుకు సంబంధించిన డిమార్కేషన్ ఎన్యుమరేషన్ పనులను అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య , పి ఆర్ ఏ ఈ రాఘసుధ ఫారెస్ట్ ఆఫీసర్ సాయిరామ్ , వీడీసీ గంగాధర్, రాజేందర్ , గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.” దీనికి సహకరించిన జువ్వాడి నర్సింగారావు, కృష్ణారావు కి ఫారెస్ట్ అధికారులకు గుండంపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

దళిత ఉద్యమ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి

దళిత ఉద్యమ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎస్సీ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దళిత ఉద్యమ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని, దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ ఎస్సీ కులాల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఇందిరా మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ఆర్టిఏ మెంబర్ సుంకరి రామచంద్రయ్యా ఉద్యోగులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి నియోజకవర్గంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం విక్రయించుకునే విధంగా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తరలింపు, మిల్లులకు పంపిణీ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
రైతులు ధాన్యం అమ్మకాల విషయంలో ఎటువంటి ఆలస్యం ఎదుర్కోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, హమాలీలు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు.
ఈ సమావేశంలో సివిల్ సప్లై అధికారులు రాములు, కిరణ్ కుమార్ ఆర్టీవో సందాని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలి

క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలి

వేగంగా అన్ లోడింగ్ చేయడంపై దృష్టి సారించాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

https://youtu.be/HqtpYhJHQ2g?si=oZYxySLlhExF-Dyj

 

 

 

 

ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్ల వేగవంతం, వాహనాల ద్వారా ధాన్యం తరలింపు, అన్ లోడింగ్ చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ, రైతులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై శుక్రవారం ఉదయం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రవాణా, మెప్మా, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతుందని, కొనుగోళ్ళు ముగిసే వరకు సంబంధిత అధికారులు అందరూ క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, మిల్లులు, గోదాంలను తనిఖీ చేస్తూ సమస్యలు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇప్పటివరకు సేకరించిన గ్రేడ్ ఎ రకం, కామన్ రకం ధాన్యం వివరాలపై అధికారులను అడిగి ఆరా తీశారు. వర్షాలు పడితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, తూకం వేసిన ధాన్యం బస్తాలను సరిపడా వాహనాలు సమకూర్చి వెంట వెంటనే మిల్లులకు, గోదాంలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తరలించిన వాహనాల్లోని ధాన్యం హమాలీల సంఖ్య పెంచి అన్ లోడ్ చేయాలని సూచించారు.

రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించిన ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు.

రాజీవ్ గాంధీ సేవలు దేశానికి మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి

రాజీవ్ గాంధీ సేవలు దేశానికి మార్గదర్శకం కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి

రాము మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా మొగుళ్లపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు స్మరించుకుంటూ ఆధునిక భారతా నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు దేశానికి సాంకేతికత విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు దేశంలో బీదరికాన్ని పురార తోలి సమ సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని కొనియాడారు యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే చెందుతుందని నేటి యువత రాజీవ్ గాంధీ మార్గంలో నడవాలని సూచించారు స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి మరియు గ్రామీణ అభివృద్ధి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మూల బీజాలు వేశారు దేశంలో నూతన విద్యా విధానాన్ని 1986 లో ప్రవేశపెట్టారు గ్రామీణ ప్రాంతాల ప్రతిభవంతులైన విద్యార్థుల కోసం జవహర్లాల్ నవోదయ విద్యాలయానికి ప్రారంభించారు భారతదేశంలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారు

ఝరాసంగం మెడికల్ షాపుల బంద్

ఝరాసంగం మెడికల్ షాపుల బంద్

జహీరాబాద్ నేటి దాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల యజమానులు చేపట్టిన బంద్‌కు మద్దతుగా ఝరాసంగం మండలంలోని మెడికల్ దుకాణాలు బుధవారం స్వచ్ఛందంగా మూతపడ్డాయి.ఆన్‌లైన్ మందుల విక్రయాలు,ఫార్మసీ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో మెడికల్ షాపులు మూతపడటంతో సాధారణ రద్దీ తగ్గింది.అత్యవసర అవసరాల కోసం వచ్చిన ప్రజలు మందులు లభించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిచోట్ల మాత్రమే అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.ఫార్మసీ రంగానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.

వేద పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణ..!

వేద పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణ..!

అన్ని వర్గాల వారు అర్హులే

విద్య, భోజనం, వసతి అన్నీ ఉచితమే

ఆఫ్లైన్ విధానంలో స్వీకరణ

వేదంతో పాటు పాఠశాల విద్య

జహీరాబాద్ నేటి దాత్రి:

సంగారెడ్డి జిల్లా బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ వైదిక పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వ్యవస్థాపకులు పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్, ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వేద విద్యను అభ్యసించేందుకు 5వ తరగతి ఉత్తీర్ణులై, 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అర్హులని పేర్కొన్నారు. వేదం పఠించే విద్యార్థులకు ఉచిత బోధనతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఆరేళ్లపాటు శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.ప్రవేశ, వర, ప్రవర కోర్సులు (అర్చక, పౌరోహిత్య, షోడశ సంస్కార విద్య) ద్వారా వేదాంత విజ్ఞానం బోధిస్తారని తెలిపారు. విద్యార్థులకు వేదాంతం, న్యాయం, యోగదర్శనం, ధ్యానం, భజన, గ్రంథపఠనం తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వేద విద్యతోపాటు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు బర్దిపూర్ ఆశ్రమ కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.మరిన్ని వివరాలకు:
📞 8639258008, 9177259329

దివంగత 28 న మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలలో..

దివంగత 28 న మాజీ ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలలో

కవులు సాహితీవేత్తలు జర్నలిస్టులు పాల్గొనాలి

.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటీదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో ఈనెల 28న దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో వనపర్తి మొదటి ఎమ్మెల్యే గోల్కొండ దిన పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి 130 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ,జిల్లాలోని సాహితీవేత్తలు,కవులు,రచయిత లు కళాకారులు విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఉదయం 10 గంటల నుండి రెండు గంటల వరకు వేడుకలు ఉంటాయని మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన నివాసంలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం పుస్తకాల ఆవిష్కరణ ఉంటుందని అన్నారు .సురవరం ప్రతాపరెడ్డి సేవలు తెలంగాణ రాష్ట్రం సమాజం ఆమోదించదగినవని సాహిత్య న్యాయవాద రంగంలోఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. దళితులను బలహీనవర్గాలను సమాజానికి ఎదురొడ్డి నిలిచేలా తెలంగాణకు ఆదర్శప్రాయంగా నిలిచారని అన్నారు. విలేకరి వృత్తిలో ఉన్నవారు సురవరం ప్రతాపరెడ్డిని మార్గదర్శిగా తీసుకోవాలని హితవుపలికారు. వనపర్తి లో సురవరం ప్రతాపరెడ్డి పేరున బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో నూతన గ్రంథాలయం నిర్మాణం, కాంస్యవిగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు. రెండవ అంతస్తు నిర్మాణంలో డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రతాపరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వీయ రచన మన కల నిజం పుస్తకావిష్కరణ ఉంటుందని అనంతరం సురవరం సాహిత్య,రాజకీయ, జీవిత విశేషాలపై పలువురు వక్తలు ప్రసంగిస్తారని సాహితీ వేదిక సభ్యులు ఎన్.బలరాం తెలిపారు. ఈ సమావేశంలో సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ డాక్టర్ వీరయ్య సభ్యులు బైరోజు చంద్రశేఖర్ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక్ బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ స్టార్ రహీం తోట శ్రీను జోహెబ్ తదితరులు పాల్గొన్నారు విలేకరులకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తోట మామిడి పండ్లు పంపిణీ చేశారు

నేటి యువత గంజాయి, మారకద్రవ్యాలకు బానిస కావొద్దు.

నేటి యువత గంజాయి, మారకద్రవ్యాలకు బానిస కావొద్దు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం నాడు ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన సదస్సును నిర్వహించారు . టాస్క్ఎస్సై రామ్లాల్ వారి టీం తో సహా మారకద్రవ్యాలపై యువత అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా గంజాయి మొక్కలను పెంచినట్టయితే వారికి సమాచారం అందించాలని యువత బానిసై ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారని ప్రజలు వీటి గురించి తెలుసుకొని వారి యొక్క పిల్లలని కాపాడుకోవాలని ఈ గంజాయిని వాడడం ద్వారా నరాల్లోకి రక్తంలో కలిసి ఊపిరిదితులు చెడిపోవడం, ఈ మత్తు దాదాపు 30 గంటలు ఉంటుందని దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారో వారికే తెలియదని మద్యపానం కన్నా హానికరమని తెలిపారు. ఎవరైనా ఈ మొక్కలను పెంచిన, గంజాయిని అమ్మిన వారికి సమాచారం అందించాలని లేదా 100కు డయల్ చేసి సమాచారాన్ని అందించాలని ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కలిగించారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పిఎసిఎస్ చైర్మన్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పిఎసిఎస్ చైర్మన్

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాదారం పిఎసిఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి మద్దతు ధర పొందాలని సూచించారు, అలాగే రైతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వజీర్, డిపి సదానందం,సీఈఓ రాజేందర్,నవీన్,రైతులు, తదితరులు పాల్గొన్నారు.

వృథాగా తాగునీరు.. పట్టించుకోని అధికారులు!

వృథాగా తాగునీరు.. పట్టించుకోని అధికారులు!

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండల పరిధిలోని ముదిగుంట గ్రామస్తులకు తాగునీరు అందించే ప్రధాన వాటర్ ట్యాంకు వద్ద మెయిన్ పైపులైన్‌కు అమర్చిన పంపు కులాయి మరమ్మతులకు గురై తాగునీరు విపరీతంగా వృథా అవుతోంది. కులాయిని ఆన్, ఆఫ్ చేసే ‘కీ’ పూర్తిగా పాడైపోవడంతో.. ట్యాంకు నింపుతున్న సమయంలో లీటర్ల కొద్దీ నీరు వృథాగా రోడ్డు పాలు అవుతోంది. ఒకవైపు వేసవి కాలంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు.. కళ్లెదుటే ఇంతలా తాగునీరు వృథాగా పోతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరం నీరు కారుతుండటంతో ఆ ప్రాంత పరిసరాలన్నీ బురదమయంగా మారి,పక్కనే ఉన్న నాలీ ఏటి కాలువను తలపిస్తోంది.కాబట్టి గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి,తక్షణమే కొత్త కులాయిని అమర్చి తాగునీటి వృథాను అరికట్టాలని ముదిగుంట గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలి

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలి
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని కొండపైన దుకాణాల వర్తక సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ “మన గుడి మన వ్యాపారం” పేరిట యాదాద్రి పరిరక్షణ కమిటీ నిరసనకు దిగింది కమిటీ సభ్యులు, ప్రజలు, యువకులు కొండపైన కొబ్బరికాయలు విక్రయిస్తూ నిరసన వ్యక్తం చేశారు వర్తక సంగం పేరుతో నిర్వహిస్తున్న దుకాణాలను రద్దు చేసి టెండర్ల ద్వారా దుకాణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఆలయ అభివృద్ధి సమయంలో కొండపై తొలగించిన దుకాణాల ను వర్తక సంఘం పేరిట ఏర్పాటు చేసి కొన్నాళ్లగా టెండర్లు వేయకుండా రెన్యువల్ చేస్తున్నారని కమిటీ సభ్యులు ఆరోపించారు

హనుమకొండలో నేడు 24 గంటల మెడికల్ షాపుల బంద్!

హనుమకొండలో నేడు 24 గంటల మెడికల్ షాపుల బంద్!

#దేశవ్యాప్త బంద్‌కు మద్దతుగా హనుమకొండలో స్వచ్ఛందంగా మూతబడనున్న ఔషధ దుకాణాలు

#చిన్న వ్యాపారుల పరిరక్షణకే ఔషధ దుకాణాల బంద్: అసోసియేషన్ ప్రతినిధులు

#హనుమకొండ డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ను కలిసిన కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు

హన్మకొండ, నేటిధాత్రి:

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా హనుమకొండ జిల్లాలో ఔషధ దుకాణాలు స్వచ్ఛందంగా మూతబడునున్నాయి. హనుమకొండ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమకొండ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. చిన్న కెమిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల మరియు మారుతున్న నిబంధనల వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు వివరించారు.
అధికారుల సానుకూల స్పందన
సమస్యలను సావధానంగా విన్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్ కిరణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమ గోడును విని, సానుకూలంగా స్పందించినందుకు జిల్లా కార్యవర్గ సభ్యులు డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

*ఘనంగా ‘మత్స్యకార సేవ’ కార్యక్రమం..

*ఘనంగా ‘మత్స్యకార సేవ’ కార్యక్రమం..

*వర్చువల్‌గా పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

*​తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి హాజరైన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్..

*​పాల్గొన్న తుడా చైర్మన్, ఎస్పీ,జేసీ, పలువురు శాసనసభ్యులు మరియు కార్పొరేషన్ చైర్మన్ లు

తిరుపతి(నేటిధాత్రి:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మత్స్యకార సేవ
విడియో కాన్ఫరెన్స్ మీటింగ్‌లో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తో కలిసి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సందేశాన్ని, మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు వివరించారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తిరుపతి జిల్లాకు చెందిన పలువురు శాసన

నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకున్న పోలీసులు

నకిలీ పత్తి విత్తనాల ముఠాను పట్టుకున్న పోలీసులు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు,భీమారం,మండల కేంద్రాల్లో నకిలీ పత్తి విత్తనాల ముఠాను సోమవారం పట్టుకున్నట్లు పోలీసులు వారు తెలిపారు.వారు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేరు వేరు కేసుల్లో సుమారు
386 కిలోల ప్రభుత్వ నిషేధిత బిటి 3 పత్తి విత్తనాల పట్టుకున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన ఏసీపీ కార్యలయంలో వివరాలు వెల్లడించారు.రెండు కేసుల్లో అయిదు గురు సభ్యులు ముఠాగా ఏర్పడి ఆంధ్ర ప్రాంతం నుండి నకిలీ పత్తి విత్తనాలు తీసుకువచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ముగ్గురిని అదుపులోకి తీసుకొని మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.నకిలీ పత్తి విత్తనాల వల్ల భూమి సారవంతం కోల్పోయి పంటలు నష్టం వాటిల్లే ప్రమాదముందని,పర్యావరణం పై ప్రభావం చూపెడుతుందని అందువల్ల నకిలీ విత్తనాలు వాడవద్దని ఆయన రైతులకు సూచించారు.గతంలో కూడా నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలసి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని రైతులు ఎవరూ మోసపోవద్దని ఆయన వివరించారు.తెలంగాణ ప్రభుత్వం,పోలీసులు నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరిస్తామని పీడీ యాక్ట్ కేసులు కుడా నమోదు చేస్తామని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని శాఖ పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.రెండు కేసుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసులను డిసిపి భాస్కర్ అభినందించి వారికి రివార్డులు కూడా అందిస్తామని పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యమే రైతు ప్రాణం తీసింది

కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యమే రైతు ప్రాణం తీసింది

రైతు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

కాంటాలు, బస్తాల కోసం నెలరోజులుగా రైతుల నిరీక్షణ

కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శ

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన రైతు గాజుల పెద్ద వెంకటేశ్వర్లు కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యమే వల్లనే నేడు రైతు ప్రాణం తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతు మృతికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 45 డిగ్రీల ఎండలో కాంటాలు, బస్తాల కోసం ఎదురుచూస్తూ రైతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. అలంకానిపేట కొనుగోలు కేంద్రంలో వడ్ల కాంటా కోసం, కాపులకనపర్తి కేంద్రంలో మక్కజొన్నల అమ్మకాల కోసం వెంకటేశ్వర్లు నెలరోజులుగా తిరుగుతూ తీవ్ర ఒత్తిడికి గురై మృతి చెందారని తెలిపారు.
ప్రతిపక్షాలు, రైతులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. సాగు విస్తీర్ణం, పంట దిగుబడులపై ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లే కొనుగోలు కేంద్రాలు సరిపడా ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి, చిల్లర దందాల కారణంగానే కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు.
ధాన్యం తరలింపు, గోదాముల నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం చలనం చూపడం లేదన్నారు. రెండు నెలలుగా మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిచేయలేకపోయిన ప్రభుత్వం రైతులను అన్ని దశల్లో ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వీడి కొనుగోలు కేంద్రాలను పెంచి, రైతుల ధాన్యాన్ని వెంటనే తరలించే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మానవ అక్రమ రవాణా లైంగిక వేధింపులకు గురి కావద్దు

మానవ అక్రమ రవాణా లైంగిక వేధింపులకు గురి కావద్దు

అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల

భూపాలపల్లి నేటిధాత్రి

మహిళలను డబ్బులు, ఉద్యోగాల ఆశ చూపించి మహిళలను, చిన్నపిల్లలను లొంగతీసుకుంటారు కానీ ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా బాధితులు, లైంగిక దోపిడీ అనే అంశం పై శనివారం పట్టణంలోని సఖి సెంటర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరైన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి అఖిల మాట్లాడుతూ జిల్లాలో వెనకబాటుతనం ఉందని, దాన్ని ఆసరాగా చేసుకొని నేరస్థులు మోసాలు చేస్తారని అన్నారు. ప్రజల్లో విరివిగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేరాలు జరగకుండా కట్టడి చేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి. శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సి.డి.పి.ఓ. రాధిక, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గాయత్రీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ అసిస్టెంట్ జి. సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు…

మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం నర్సింహులపల్లి గ్రామంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో హాస్పిటల్ మెయిన్ చీఫ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ సామాజిక బాధ్యత అని భావిస్తున్నామని. పండుగల సెలవులు అనే తేడా లేకుండా 24 గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని. అవసరమైతే రోగులను పరీక్షించి కరీంనగర్లోని మేడి కవర్ ఆసుపత్రికి తరలించి ఆధునిక వైద్యం అందిస్తామని తెలుపుతూ. మేడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత శిబిరం నిర్వహించగా అందులో సుమారు 150 మందికి పైగా రోగులకు పరీక్షించి నిపుణులైన వైద్యులచే సేవలు అందించామని. అలాగే అవసరమైన వారికి షుగర్ బీపీ. ఈసీజీ. ట్రూడికో. వంటి కీలక పరీక్షలు నిర్వహించి తక్షణo నిర్ధారణ చేశామని. పరీక్షలు చేయించుకున్న వారికి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఉచితంగా న్యాన్యమైన వైద్య సేవలు అందించిన మెడికల్ ఆసుపత్రి యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత శిబిరంలో మెడికల్ మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్. అబ్దుల్ వకీల్. శ్రీకాంత్. లక్ష్మీ రాజం. వార్డు మెంబర్లు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version