వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ…

వన్య ప్రాణుల దాహార్తి కోసం నీటివసతి ఏర్పాటు-టీజీ ఎఫ్ డీసీ

జైపూర్, నేటి ధాత్రి :

 

ఎండలు మండి పోతున్న ఈ వేసవిలో అడవులు,ప్లాంటేషన్ లలో సంచరించే వన్య ప్రాణుల దాహం తీర్చ డానికి తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) ఆధ్వర్యంలో నీరు నిల్వ ఉండేలా వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి.మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం ముదిగుంట అటవీప్రాంతం లో టీజీ ఎఫ్ డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాంటేషన్ లలో ఒక కాలువ లో ఒక చోట నీటి ఊటను ప్లాంటేషన్ వాచర్ శంకర్ గమనించారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే టీజీ ఎఫ్ డీసీ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ దీనికి ఒక కార్య రూపం దాల్చారు.గురువారం ప్లాంటేషన్ వాచర్ శంకర్,కొంత మంది కూలీల సహాయం తో జంతువులు తాగడానికి వీలుగా నీటి ఊట నీరు వృధాగా పోకుండా కొంత మేరకు మట్టి పూడిక తీయించి అడ్డు కట్ట వేయడం తో నీరు నిల్వ గా ఆగిపోయింది.ఈ సందర్బంగా ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ మూగ జీవాలైన వన్య ప్రాణులు వేసవిలో తాగు నీరు దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటాయని, వాటి దాహర్తి తీర్చడం కోసం చిరు ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం…

అంకుశాపురం గ్రామ సర్పంచ్ క్యాతరాజు కవితకు అరుదైన గౌరవం

-హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘన సన్మానం
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంకుశాపురం గ్రామ నూతన సర్పంచ్ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. గురువారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఆ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నూతనంగా అంకుశాపురం గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన బీసీల ముద్దుబిడ్డ క్యాతరాజు కవిత-లింగమూర్తి దంపతులను మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ డిజిపి పూర్ణచందర్ రావు, సమాజ్ అధినేత సూర్యరావు, తొలి వెలుగు ఎడిటర్ రఘులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత-లింగమూర్తి దంపతులు మాట్లాడారు. ప్రజాసేవ చేసేందుకు తాము రాజకీయ రంగ ప్రవేశం చేశామని, తమను సన్మానించి..రాజకీయంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version