పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

 

బంగారం ధర ఇవాళ(గురువారం) భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది.

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి సమయంలో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాల వల్ల పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. గత రెండు వారాల్లో పసిడి ధర భారీగా తగ్గింది. ఈ క్రమంలో బంగారం ధర ఇవాళ(గురువారం) కూడా భారీగా పడిపోయింది. దాదాపు రూ.2 వేలు తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. భారత్‌లో నిన్న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,22,400 ఉంది. ఇవాళ రూ.1,910 మేర తగ్గి రూ.1,20,490 చేరింది. దీంతో పసిడి ప్రియులు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..

దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..

 

దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది.

 భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పండుగకు ముందు రోజున ఇంటికి శుభ్రం చేసి కొత్త రంగులతో ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. పండుగ రోజున మామిడితోరణాలు, ముద్దబంతి పూలతోఇంటి గుమ్మాలను చక్కగా అలంకరించి పండుగను జరుపుకుంటారు. ఆరోజున బంధువులు అందరూ ఒక్కచోటికి చేరుకుని.. మధుర పదార్థాలు వండి దేవతారాధన చేసి నివేదన చేస్తారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించి ఆ తర్వాత దానినే ప్రసాదంగా స్వీకరిస్తారు. సాయంత్రం పూట ఇంటికి అంతటా కూడా దీపాలు వెలిగింది లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తారు. శైవ, వైష్ణవ క్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తారు.
ఇక దీపావళి పర్వదిన రోజున శుభ ముహూర్త సమయం కావున ప్రజలు ఎంతో నమ్మకంగా బంగారం కొనుగోలు చేస్తారు. కనీసం తమకు ఉన్నంతలో డబ్బులు సమకూర్చుకొని పుత్తడి కొనుగోలు చేస్తారు. దీంతో దేశ వ్యాప్తంగా బంగారం షాపులకు బలే గిరాకీ ఉంటుంది. ఫుడ్ డెలివరీ, గ్రోసరీస్ డెలివరీ చేస్తున్నట్టుగానే.. బంగారం కూడా ఈ పండుగ నుంచి డెలివరీ చేయాలని ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. అనుకున్నదే తడవుగా బంగారం కొనుగోలు చేసే తమ యూజర్ల కోసం వినూత్న ఆలోచనతో ఓ ఈ కామర్స్ బిజిజెస్ సంస్థ ముందుకు వచ్చింది.

దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ఉన్న సింబల్‌ను బంగారు నాణేలపై ముద్రించి అమ్మకానికి పెట్టింది. యూజర్లు బ్లింకిట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే లక్ష్మీ దేవి వస్తుంది. GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (0.5గ్రాములు) ధర రూ.6.999.. అలాగే GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (1 గ్రాములు) ధర రూ.13,949గా నిర్ణయించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version