ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం నరసింహ పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను. కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో నిరుపేదలు వైద్యం చేయించుకో.లేని పరిస్థితిలో ఉండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ అత్యవసర సమయంలో చికిత్స చేయించుకోలేని వారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్న దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. ఇందులో గ్రామంలోని. గ్యడరావేణి. భవానికి 21.000. రూపాయలు. గ్యాడరావేణి. పరశు.రాములకు.60.000. చెక్కులను లబ్ధిదారులకు. నాయకులు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహం గౌడ్.గ్రామ శాఖ అధ్యక్షులు రెడ్డి మల్ల నరసయ్య. చేతుల మీదుగా అందివ్వడం జరిగింది. చెక్కులు రావడానికి కృషిచేసిన. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్. బీసీ సెల్ అధ్యక్షులు. కావేటిమల్లేశం. ఉప సర్పంచ్ వేల్పుల శరత్. నాయకులు జనార్దన్ రెడ్డి. లింగారెడ్డి. ధ్యాగాఎల్లయ్య. సోమిరెడ్డి శ్రీనివాస్. చిట్యాల శంకరయ్య. తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

 

 

 

తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గ్రామంలోని. ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రాగా వాటిని కాంగ్రెస్ పార్టీ నాయకుల మరియు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఇoదుకు.గాను. గ్రామంలోని .ఎగుర్ల.రేనవ్వ కి.25.000/-. రూపాయలు. ధూమ్ పేట భూలక్ష్మికి.21.000/-. రూపాయలు. సి మల్లారెడ్డి కి.9.500/-రూపాయల చెక్కులను. అందచేయడం జరిగింది లబ్ధిదారులు మాకీ చెక్కులు రావడానికి సహాయం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. లబ్ధిదారుల అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొన్నాల పరిసరాములు. ఎలుకపల్లి శ్రీనివాస్. కళ్లెంమధు.బైరి పరుశరాములు. పోతరాజు దేవయ్య. అబ్బురాజిరెడ్డి. రాయినిపట్లయాదగిరి. సంబునరసయ్య. మంద కిట్టయ్య .కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి..

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి

◆”-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారి ఆదేశాలతో

◆”-: లబ్దిదారులకు ₹ 18,35,500 /- సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని, నిరుపేదలు అనారోగ్యానికి గురై తన సొంత ఖర్చులతో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న అనంతరం ఖర్చు అయిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తుందని మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా:చంద్రశేఖర్ తెలిపారు.నియోజకవర్గంలోని జహీరాబాద్,న్యాలకల్, కోహిర్, ఝారసంఘం, మొగుడంపల్లి,మండలాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంచార్జ్ డా చంద్రశేఖర్ సూచన మేరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అద్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు వీరా రెడ్డి, రాజ్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,సత్వర్ పిఎసిఎస్ ఛైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పేపల్లి మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,శేఖర్ ,విష్ణు , ఫైజ్, తదితరులు అందజేశారు..సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాజీ మంత్రి డా:చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం భాంజిపేట గ్రామానికి చెందిన వీరమల్ల సుధాకర్ రెడ్డి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సందర్భంగా జరిగిన వైద్య ఖర్చుల నిమిత్తం వారి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరిగింది.ఈ మేరకు మంజూరైన చెక్కును నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో బాధితుడు సుధాకర్ రెడ్డి కుమారుడు వీరమల్ల రాజిరెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆరెళ్లి నరేష్ , కట్ల నిరంజన్ రెడ్డిపాల్గొన్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

2,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

2,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జహీరాబాద్ పట్టణం ఫరీద్ నగర్ కాలనీ కి చెందిన బాను బీ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-(రెండు లక్షల రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి , లబ్ధిదారురాలి కుటుంబసభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా లబ్ధిదారురాలు & వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి, కౌన్సిలర్ పర్వీన్ జహాన్ – యాకూబ్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు .

మర్రిపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని మర్రిపల్లి గ్రామంలో కుడుతాల రాజు,రంపీస రాజేశ్వర్ రావులకు గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కుంట రాజుకుమార్ తో కలిసి
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పొన్నాల ప్రతాప రెడ్డి,వార్డ్ మెంబర్ గాజు శివాజీ,నాయకులు ఇట్టబోయిన ఐలయ్య,గాజు చిన్న రాజయ్య,భాషబోయిన సంజీవ,పొన్నాల రాజు,గాజు రాజు,వంగ రాజేష్,సోనబోయిన కొమురయ్య,అల్లాపురం ప్రదీప్,నర్సంపేట బ్లాక్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ పాల్గొన్నారు.

తంగళ్లపల్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని. అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకుపేదవాళ్లకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే.పరిస్థితి లేకపోవడంతో ప్రజలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకునే వీలును తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కల్పించాలని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయాన్ని ఇది చెక్కుల పంపిణీ ఎక్కువ అందించామని. ప్రజల అభివృద్ధి ప్రజా పరిపాలన లక్ష్యం అని ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు ఏ ఆటంకం వచ్చిన ప్రభుత్వం ముందుండి సహాయ సహకారాలు అందిస్తుందని అలాగే ప్రభుత్వ ప్రజల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా మారిందని తెలియజేస్తూ. సారంపల్లి గ్రామంలో పలువురి లబ్ధిదారులకు.2.32.500. రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు. ఇoదుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి.0 ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కి. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు గుగ్గిళ్ళ భరత్. ఉప సర్పంచ్ వంశీ. వార్డు మెంబర్లు. ఖాదర్ గడ్డమీద శ్రీనివాస్. హనీఫ్. జింక ఆనందం. కుమారస్వామి. అభిషేక్. అంజయ్య. కిషన్. వినీష్. సంతోష్. కరుణాకర్. శ్రీనివాస్. నాయకుడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఎంఎల్ఏ గండ్ర సత్యనారాయణ రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం భూపాల్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అప్పయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్ అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి హాస్పిటల్ ఖర్చులకోసం
నోముల రమేష్1,000,00/- లక్ష రూపాయల చెక్కును అందించడంజరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని అన్నారు

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన పెండెం రామానంద్…

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణానికి చెందిన వడ్లకొండ సాంబయ్య ఇటీవల అనారోగ్య కారణాలతో కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం పొందాడు.కాగా అందుకు ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం పథకం కింద స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును సోమవారం ఆ వార్డు ఇంచార్జ్ కొంకిస అరుణ గౌడ్ చేతుల మీదుగా టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ కౌన్సిలర్ పెండెం లక్ష్మీరామానంద్, మాజీ వార్డు సభ్యులు కొయ్యడి సంపత్ గౌడ్,గండి గిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…

నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

పేదలు, నిరుపేదల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి గణపురం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 77 మంది లబ్ధిదారులకు రూ.22,59,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడుతూ…పేదలు, నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల కష్టాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని, భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య దాట్ల శ్రీనివాస్ సుంకరి రామచంద్రయ్య తోట రంజిత్ స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

*పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం*

*కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే*

శాయంపేట నేటిధాత్రి:

 

పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆడబిడ్డల వివాహా లకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకా లను అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అర్హులైన 57 మంది లబ్ధిదారు లకు రూ.57,06,612 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మరియు వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 32 మందికి రూ.10,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోం దని, సామాజిక సమానత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికా రులు చిత్తశుద్ధితో పనిచేయా లని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు శాయంపేట నియోజక వర్గంలో అమలు చేయను న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు మండలంలో ని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ కార్య క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

2,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

2,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జహీరాబాద్ పట్టణం శ్రీ రామ్ నగర్ కాలనీ కి చెందిన మడపతి స్వరూప గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-(రెండు లక్షల రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి , ఈరోజు ఎమ్మెల్యే గా క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారురాలుకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా లబ్ధిదారురాలు & వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్, సీనియర్ నాయకులు ప్రభు,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,హౌసింగ్ బోర్డు వార్డ్ అధ్యక్షులు వెంకటేశం, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T170759.628.wav?_=1

 

 

*పేద ప్రజల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం..

*డాక్టర్ వి.ఎం. థామస్…

 

గంగాధర నెల్లూరు(నేటిధాత్రి)

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి
అర్హులైన లబ్ధిదారులు గంగాధర్ నెల్లూరు మండలం చిన్న 48,500 రూపాయలు, కొత్త వెంకటాపురం ప్రేమ్ నాథ్ నాయుడు 1,27,969 రూపాయలు, ముక్కుల్తూరు వినోద్ కుమార్ 62,021 రూపాయలు, వేల్కూర్ మునెమ్మ 20,000 రూపాయలు, కడపగుంట ఆదిలక్ష్మి 76,495 రూపాయలు, కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లి గోవింద్ స్వామి 38,541 రూపాయలు,
సిడి,
కండ్రిగ దాసరి గణేశం 1,09,660 రూపాయలు, అమ్మపల్లి భారతి 9,000 రూపాయలు, ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి చంద్రశేఖర్ 1,60,826 రూపాయలు, పెనుమూరు మండలం సాతంబాకం విజయ 87,384 రూపాయలు, మొత్తం 7,40,316 లక్షల రూపాయల చెక్కులను
లబ్ధిదారులకు
ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు(ఎమ్మెల్యే) డాక్టర్ వి.ఎం. థామస్ పంపిణీ చేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన-తిరుపతి నాయక్..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన-తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట పరిధిలోని శాంతినగర్ లో గల ముదిరాజ్ కులానికి చెందిన రామకృష్ణ ముప్పై రెండు వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును పంపిణీ చేసిన కోత్తపల్లి మండలం మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్.
ఈసందర్భంగా తిరుపతినాయక్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వపరంగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారని, ఆపదలో ఉన్నవారికి ఈపథకం ఉపయోగపడుతుందని, వీరికి రావడానికి కృషిచేసిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

3,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

3,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ యం ఎన్ జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామానికి చెందిన కిష్టాపురం సత్యమ్మ అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3,00,000/-(మూడు లక్షల రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే,మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం గారికి ,నాయకులకు లబ్ధిదారులి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు..

పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*పేదల పాలిటి పెన్నిధి.. ముఖ్యమంత్రి సహాయ నిధి..

*చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు..

*18 మంది బాధితులకు సి.యం.రిలీప్ ఫండ్ చెక్కులను అందించిన ఎంపీ దగ్గుమళ్ళ

చిత్తూరు(నేటిధాత్రి)నవంబర్

ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదల పాలిట పెన్నిధిగా నిలుస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు. ఆపదలో ఉన్న ఆప్తులకు ఈ విధంగా ఆపన్న హస్తాన్ని అందించడం ఆనందంగా ఉందన్నారు. పేదలకు చేయూతనివ్వడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలియజేశారుచిత్తూరులోని పార్లమెంటు కార్యాలయంలో గురువారం సుమారు18 మంది బాధితులకు 10,89,041 రూపాయల చెక్కులను విడి విడిగా అందించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటికే ఎంతోమంది ఆప్తులకు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తోడ్పాటునందించడం జరిగిందన్నారుసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఓ వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తాజాగా సుమారు18 మంది బాధితులకు విడి విడిగా 10,89,041 రూపాయల చెక్కులను అందించి వారి కష్టసుఖాలలో పాలుపంచుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా పనిచేస్తూ
వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలో నడుస్తూ
తాను కూడా ప్రజాసేవే పరమావధిగా భావించి
తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఈ సందర్భంగా వివరించారు.
చెక్కులు అందుకున్న బాధితులు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు

ఆశాజ్యోతి మన ప్రియతమ జహీరాబాద్ నాయకుడు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T125836.551.wav?_=2

 

ఆశాజ్యోతి మన ప్రియతమ జహీరాబాద్ నాయకుడు

◆:- రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నే కాకుండా రాష్ట్ర స్థాయిలో అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పేదల పెన్నిధి ,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి మృదుస్వభావి, స్నేహశీలి గంభీరమైనటువంటి మంచి వాగ్దాటి పటిమ కలిగిన నాయకుడు అంతకుమించి ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి అలుపెరగని పోరాట పటిమ కలిగిన ధీరుడు మొహముపై చెరగని చిరునవ్వుతో సామాన్య కార్యకర్త నుండి మహా మహా నాయకుల వరకి మనలో ఒకరిగా ఉంటూ మన సాధకబాధకాలను అతి తక్కువ కాలంలోనే పట్టు సాధించి వాటి సాధనలో కృతనిచ్చయుడై ఎన్నో సమస్యలని పరిష్కారం చూపించిన, కేవలం వారం రోజులలోనే సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ ఓ సి లు బాధితులకు అందే విధంగా కృషిచేసిన ఆత్మీయుడు . అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజాసేయస్సే తన శ్రేయస్సుగా భావిస్తూ అలుపెరగని పోరాట పటిమను చూయిస్తున్న ఉజ్వల రెడ్డి

గంగాధరలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ తో భరోసా

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

ప్రమాదాల్లో గాయపడి, అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం భరోసానిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ఎనభై మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నలబై ఆరు లక్షల అరవై మూడు వేల రూ.ల ఆర్థిక సహాయం మంజూర అయింది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు గురువారం గంగాధర మండలం మధురానగర్ లోని ప్రజా కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ తో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపురెడ్డి, తోట కరుణాకర్, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, ముచ్చ శంకరయ్య, శ్రీనివాస్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

లింగంపేట లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం లోని లింగంపేట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు లింగంపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శీనన్న సహకారంతో చెక్కులు మంజూరు చేయడం జరిగింది.
కొత్తపెళ్లి లావణ్య, గుడిసె రాములు, బండారు నరసవ్వ, మేకల పవిత్ర, యన్నం భవాని లబ్ధిదారులకు మొత్తం రూపాయలు 1,92,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కృష్ణ, ఇందూరి రాజు, బండారి శేఖర్, తర్రే గణేష్, ఇరుమల్ల నాగరాజు, గుడిసె నర్సయ్య, ఈగ రాజేశం, మేకల వెంకటేశం, పాశం లక్ష్మీనారాయణ, కొత్తపెళ్లి రామచంద్రం, శేఖర్, భూమయ్య, గుంట మనోజ్, శ్రీనివాస్, లింగాల ప్రభాకర్, తర్రే లక్ష్మీ రాజం, బుర్ర సురేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కును అందించిన ఎంపీ షెట్కర్

సీఎం సహాయ నిధి చెక్కును అందించిన ఎంపీ షెట్కర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

శంకరం పేట్ (A) మండలం మూసాపేట్ గ్రామానికి చెందిన గోసాయిపల్లి సాయమ్మ, భర్త సంగయ్యకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయిన 2.5 లక్షల రూపాయల ఎల్ ఓ సి చెక్కును జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ రెండవసారి బాధితుడికి అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం వైద్య ఖర్చులు చెల్లిస్తూ ఆర్థికంగా ఆదుకుంటుందని బుధవారం ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ జైహింద్ రెడ్డి, అశోక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version