బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం…

బెంగళూరులో దారుణం.. సీనియర్‌ విద్యార్థినిపై కాలేజ్ స్టూడెంట్ అత్యాచారం!

 

బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆమె జూనియర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితుడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ తనకు సీనియర్ అయిన విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని జీవన్ గౌడగా పోలీసులు గుర్తించారు. తాజాగా అతడిని అరెస్టు చేశారు (Bengaluru Engineering Student Violated).

ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం, బాధితురాలు బీటెక్ చదువుతోంది (7వ సెమెస్టర్). ఆమెకు జీవన్‌తో మూడు నెలల క్రితమే పరిచయం ఏర్పడింది. అక్టోబర్ 10న లంచ్ సమయంలో అతడు బాధితురాలికి పలుమార్లు కాల్ చేసి ఆర్కిటెక్చర్ బ్లాక్ వద్ద కలుద్దామని చెప్పాడు. అక్కడకు వెళ్లిన ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. ఆపై వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి తలుపులు వేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు జరిగిన దారుణం గురించి మొదట స్నేహితులకు చెప్పింది. అనంతరం, తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి అక్టోబర్ 15న పోలీసులకు ఫిర్యాదు అందింది.

దారుణానికి ఒడిగట్టిన తరువాత నిందితుడు ఆమెకు కాల్ చేసి గర్భనిరోధక మాత్ర కావాలా? అని అడిగినట్టు పోలీసులు తెలిపారు. భవనంలో ఘటన జరిగిన అంతస్తుకు సంబంధించి సీసీటీవీ కెమెరా ఫుటేజీ లేదని తెలిపారు. అయితే, డిజిటల్, ఇతర ఫిజికల్ ఆధారాలను ఫారెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

నగరంలో ఆగస్టులో వెలుగు చూసిన మరో ఘటనలో పేయింగ్ గెస్టు హాస్టల్‌లో ఉంటున్న కాలేజీ విద్యార్థినిపై ఓనర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రాత్రి సమయంలో కారులో ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు అష్రాఫ్‌ను అరెస్టు చేశారు.

ఇక కోల్‌కతాలోని దుర్గాపూర్‌లో ఇటీవల వెలుగుచూసిన అత్యాచర ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న యువతిపై ఆమె క్లాస్‌మెట్‌యే ఈ దారుణానికి పాల్పడ్డాడు. తనకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కోల్‌కతాలో మరో దారుణం.. పుట్టిన రోజున యువతిపై అఘాయిత్యం…

కోల్‌కతాలో మరో దారుణం.. పుట్టిన రోజున యువతిపై అఘాయిత్యం

 

 

 

కోల్‌కతాలో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ యువతిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువతి పుట్టిన రోజున సెలబ్రేట్ చేసుకుందామని తీసుకెళ్లి ఈ దారుణానికి తెగబడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతి (20) ఆమె పుట్టిన రోజునే అఘాయిత్యానికి గురయ్యింది. యువతికి పరిచయం ఉన్న ఇద్దరు యువకులు ఆమెను బర్త్‌డే పార్టీ పేరిట తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. కోల్‌కతా నగర శివారులోని రీజెంట్ పార్క్ ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను చందన్ మలిక్, దీప్‌గా గుర్తించారు. దీప్ ప్రభుత్వ ఉద్యోగి అని కూడా తెలుస్తోంది (Kolkata gang rape Regent Park).

పోలీసు వర్గాల కథనం ప్రకారం, బాధితురాలిది హరిదేవ్‌పురా. యువతి పుట్టిన రోజు సందర్భంగా చందన్ ఆమెను బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుందామని దీప్ ఫ్లాట్‌‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారు భోజనం చేశాక బాధితురాలు తన ఇంటికి వెళ్లిపోతానని చెప్పింది. కానీ నిందితులు ఆమెను అడ్డుకుని గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టారు.

మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు తన ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు జరిగిన దారుణం గురించి తెలిపింది. ఆ తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు. చందన్ తనకు కొన్ని నెలల క్రితమే పరిచయమయ్యాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అతడి ద్వారా దీప్‌తో పరిచయమైందని తెలిపింది. అప్పటి నుంచీ తాము ముగ్గురం టచ్‌లోనే ఉన్నామని వెల్లడించింది. దక్షిణ కోల్‌కతాలోని ఓ పూజా కమిటీలో పాలుపంచుకునే అవకాశం కల్పిస్తానని నిందితులు తనతో చెప్పారని పేర్కొంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version