ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.
ఓటీటీ సినిమాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ‘వార్-2’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్తో కలిసి నటించిన సినిమా ఇది. అలాగే తారక్ బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన సినిమా కూడా. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో సూపర్హిట్ అవుతుందని కాలర్ ఎగరేసి మరీ సవాల్ విసిరారు తారక్. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ (Prasanth Neel) సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారంలో కొత్త షెడ్యూల్ను ప్రారంభించుకోనందని తెలిసింది.
ఓటీటీ సినిమాలు
హైదరాబాద్లో నెలకు పైగా సాగనున్న ఈ సుదీర్ఘ షెడ్యూల్లో తారక్పై భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ షెడ్యూల్ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు నీల్. పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ (Dragon) టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ప్రకటించలేదు.
వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో తరలి వెళ్తున్న మెగా అభిమానుల ర్యాలీని ప్రారంభించిన వెలిచాల
కరీంనగర్, నేటిధాత్రి:
సుదీర్ఘ కాలం పాటు వెండితెరపై విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి మరిన్ని మంచి సినిమాలు తీస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. మెగాస్టార్ కు మరింత మంచి పేరు వస్తుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాదులో జరిగే వేడుకలకు కరీంనగర్ జిల్లా నుంచి చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేశ్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది మెగా అభిమానులు తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లే వాహనాల ర్యాలీని కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలో దేవక్కపల్లిలో వెలిచాల రాజేందర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ తనకు చిరంజీవి అంటే ప్రత్యేక అభిమానం అని పేర్కొన్నారు. ఆయనతో ప్రత్యేక ఆత్మీయత అనుబంధం ఉందన్నారు. మాకుటుంబానికి అత్యంత ఆప్తుడని, గతంలో తమ ఇంట్లో కరీంనగర్లో ఐదు రోజులపాటు ఉన్నారని గుర్తు చేశారు. చిరంజీవితో అనుబంధం ఉండడం అదృష్టం అన్నారు. చిరంజీవి విలక్షణమైన నటనతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారని తెలిపారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని మెగా అభిమానులు చిరంజీవి యువత ప్రతినిధులు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. యువత చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో వందలాది మంది చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు తరలి వెళ్లడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా వేల్పుల వెంకటేష్ ను వెలిచాల రాజేందర్ అభినందించారు. ఈకార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షులు వేల్పుల వెంకటేష్, ఆకుల నర్సన్న, ఆకుల ఉదయ్, బట్టు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్.
హైదారాబాద్,నేటిధాత్రి:
విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్ ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టిన శివ వుల్క్ందకార్ సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి సమక్షంలో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి చేతుల మీదగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శివ వుల్క్ందకార్ కు నియామక పత్రాన్ని అందజేశారు.తదనంతరం ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం,కార్మిక,కర్షక,ఉద్యోగ,విద్యార్థి,యువత,మహిళా నిరుద్యోగుల సమస్యలపై శాంతియుత ఉద్యమాలు,పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజ సేవకుల ఎన్నిక ఏప్పుడు,ఏక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని కోరారు.నూతంగా ఎన్నికైన రాష్ట్ర అద్యక్షుడు శివ వుల్క్ందకార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని క్షేత్రాస్తాయి నుండి పటిష్టమైన నాయకత్వం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు పార్టీని హక్కున చేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతానని అన్నారు. రాష్ట్ర ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేస్తానన్నారు.ప్రజ సేవా చేయడానికి పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశమని, పార్టీ వ్యవస్థాపకురాలు,జాతీయ అధ్యక్షురాలు యస్. రమాదేవి, జాతీయ,రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
హైదరాబాద్లో వరుస దుర్ఘటన `వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్ `హైటెన్షన్ వైర్ తగలడంతో ఇద్దరు యువకుల దుర్మరణం హైదరాబాద్,నేటిధాత్రి:
హైదరాబాద్ రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రామంతాపూర్లోని గోఖలేనగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా రథంపై శ్రీకృష్ణుడి ఉరేగింపు కోసం ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఆదివారం రాత్రి స్థానిక వీధుల్లో యాదవ సంఘం భవనం నుంచి శ్రీకృష్ణుడి ఉరేగింపు చేపట్టారు. ఓవైపు వర్షం పడుతుండగా మరోవైపు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడి రథయాత్ర కొనసాగింది. ఉరేగింపు దాదాపు పూర్తయి తిరిగి రథాన్ని యాదవ సంఘ భవనం వద్ద పెట్టేందుకు వెళ్తుండగా రథాన్ని ముందుకు లాగుతున్న జీపు ఆగిపోయింది. మరో వంద అడుగుల దూరం ఉండటంతో చేతులతో తోస్తూ వెళ్లారు. మరో 50 అడుగుల దూరం ఉండగానే ఆకస్మాత్తుగా రథాన్ని లాగుతున్న వాళ్లు గట్టిగా అరుస్తూ కిందపడి పోయారు. అప్పటికే రథంపై ఉన్న వాళ్లు ఏం జరిగిందో అర్థం కాక పరుగులు పెట్టారు. వేలాడుతున్న విద్యుత్తు తీగ రథానికి తగిలి షాక్ కొట్టింది. దీంతో వెనుక నుంచి తోస్తున్న వాళ్లు 9 మంది అపస్మార స్థితిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు స్థానికులు కొందరికి సీపీఆర్ కూడా చేసినా ఫలితం లేకుండాపోయింది. ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో నలుగురిని చికిత్స కోసం వివిధ దవాఖానాలకు తరలించారు.
అయ్యో దేవుడా ‘‘ఒక ఘటన మరువక ముందే మరోఘటన’’ వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు యువకులు దుర్మరణం
హైదరాబాద్ ,నేటిధాత్రి:
హైదరాబాద్ రామంతాపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకుల్లో విషాదం మరువకముందే బండ్లగూడలో మరో ఘటన చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతిచెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హై టెన్షన్ వైరు తరగలడంతో ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్ అనే యువకుడిని దవాఖానకు తరలించారు. మృతులను టోని (21), వికాస్ (20)గా గుర్తించారు. కరెంటు షాక్తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోసారి ఐటీ దూకుడు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు.. డీఎస్ఆర్ గ్రూప్ సంస్థల్లో కూడా..సోదాలు
హైదరాబాద్ ,నేటిధాత్రి: చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంతోపాటు కార్యాలయాల్లో కూడా గాలిస్తున్నారు. మరోవైపు డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీ టాక్స్ చెల్లింపులలో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారలు తెలిపారు. డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్తోపాటు డీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ ఎంపీ సుధాకర్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సురారంతోపాటు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన ఐదేండ్ల పన్నుల చెల్లింపులపై కంపెనీ యాజమాన్యాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి డీఎస్ఆర్ గ్రూప్లో భాగస్వామిగా ఉన్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు తీవ్రంగా అంతరాయానికి గురయ్యాయి.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో అత్యధికంగా 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 17 సెంటీమీటర్లు, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్ 10.3 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
ఇక నిన్న సిద్దిపేట జిల్లాలోని గౌరారం అత్యధికంగా 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసి రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్లోనూ రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురిసి పలు ప్రాంతాలు నీటమునిగాయి. హైదర్నగర్ 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసింది. మల్కాజిగిరి, కూకట్పల్లి, కాప్రా, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ వంటి ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ ఉప్పల్ రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఊరేగింపులో రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
సెట్విన్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎండి.వేణుగోపాల్రావు, సెట్విన్ కార్పొరేషన్ అధికారులు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
హైదరాబాద్, నేటిధాత్రి : బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ నెం. 12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని అధికారులకు హైకోర్టు ఆదేశించింది. పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈరోజు నెల 18కు వాయిదా వేసింది.
కొన్ని రోజుల క్రితం అధికారులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇక్కడి స్థానికులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దీనిలో భాగంగానే ఇటీవల కుంకుమార్చాన పూజకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్తగా పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. గతంలో ఈ అంశంపై బండి సంజయ్ సైతం స్పందించారు. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్లోని
సాంకేతికదన్నుగా….దోమలపై జీహెచ్ఎంసీ యంత్రాంగం సమరభేరి – ముమ్మరంగా యాంటి లార్వా ఆపరేషన్లు – మానవ జోక్యం లేని ప్రదేశాలలోనూ డ్రోన్ లతో స్ప్రేయింగ్
హైదరాబాద్, నేటిధాత్రి: సాంకేతికతదన్నుగా దోమల నివారణకు జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి కేసులను తగ్గించేందుకు,వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తుంది. కమిషనర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అన్ని జోన్లు, సర్కిల్ ల పరిధిలో యాంటి లార్వా , యాంటి అడల్ట్ మాస్కిటో కార్యక్రమాలు అమలు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన 4846 కాలనీల్లో నీటి నిల్వ ప్రదేశాలు, చెరువులు, బాబులు, కుంటల్లో గాంబుసియా చేపలు, ఆయిల్ బాల్స్ విడుదల చేస్తూ దోమల వృద్ధి జరగకుండా చూస్తున్నారు.
ఒక్కొక్క వార్డుకు ఒక ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం కాగా, ఏఎల్ఓ ఆపరేషన్లు, ఫాగింగ్, ఐఈసీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు , సెల్లార్లు, నిర్మాణ క్షేత్రాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇండోర్ పైరిథ్రమ్ స్పేస్ స్ప్రే, లార్వల్ సర్వేలు చేపడుతున్నారు. ఒక్కో జోన్ కు ఒక్కో ఫ్లోట్ ట్రాష్ కలెక్టర్ల ద్వారా గుర్రపు డెక్కలను, కుళ్ళిన మొక్కల వ్యర్థాలను తొలగిస్తూ దోమలు వృద్ధి చెందకుండా చూస్తుంది. మానవ జోక్యం లేని ప్రదేశాలలోనూ డ్రోన్ లతో స్ప్రేయింగ్ దోమలను అరికట్టేందుకు జీహెచ్ఎంసీ అధునాతన సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. డ్రోన్లను ఉపయోగించి స్ప్రేయింగ్ను నీటి ట్యాంకుల్లోనే కాకుండా, మానవ జోక్యం లేని ప్రదేశాలలో చేపడుతూ… దోమల బెడద లేకుండా చేస్తుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం, శనివారం క్రమం తప్పకుండా నగర పరిధిలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో చేపడుతూ విద్యార్థులను చైతన్యం చేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పేరిట కాలనీల లో ఐ ఈ సి కార్యకలాపాలను చేపడుతుంది. అలాగే జీహెచ్ఎంసీ యాప్, ఈ-మెయిల్స్, ట్విట్టర్ ద్వారా పౌరుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. నగర ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలలో నీరు నిల్వకుండా చూడడం ద్వారా డెంగ్యూ , మలేరియా , చికెన్ గున్యా నివారణకు ప్రజలు సహకారం అందించాలని కోరుతున్నారు.
ఆన్లైన్ విజ్ఞప్తుల ఆధారంగా ఫాగింగ్
జీహెచ్ఎంసీ, తమ యాప్ ద్వారా ఫాగింగ్ కోసం అభ్యర్థనలను స్వీకరిస్తోంది. ప్రజలు తమ ప్రాంతాల్లో ఫాగింగ్ అవసరమని భావిస్తే, %వీవ Gనవీజ% యాప్ ద్వారా విజ్ఞప్తి చేసుకున్న వెంటనే ఫాగింగ్ చేపడుతూ దోమలను అరికడుతుంది.
టెక్నాలజీ దన్నుగా లార్వా ఆపరేషన్ల పర్యవేక్షణ
లార్వా వ్యతిరేక కార్యకలాపాలను జియో-ట్యాగ్ చేయబడిన ట్రాకింగ్ ద్వారా ప్రభావవంతంగా చేపడుతున్నారు. జియో-ట్యాగ్ చేయబడిన ఫోటోల ఆధారంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఫలితంగా క్షేత్ర సిబ్బంది లో జవాబుదారీతనం పెంచుతుంది.
ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, ప్రజల సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ లో చేపడుతున్న కార్యక్రమాలు చాలా వరకూ ప్రజలు డెంగ్యూ,మలేరియా, చికెన్ గున్యా బారిన పడకుండా చూస్తున్నాయి.
2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగుడంపల్లి గ్రామానికి చెందిన చాకలి అంజమ్మ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-( 2 లక్ష రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి , ధన్యవాదాలు తెలిపారు
దారుస్సలాంలో అసదుద్దీన్ ఓవైసీ కౌసర్ మొహియుద్దీన్ కు జహీరాబాద్ ఏఐఎంఐఎం నాయకులు సమస్యలపై మెమోరాండం అందించిన
◆:- జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ,
◆:- దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, ఏఐఎంఐఎం క్రియాశీల నాయకుడు, జహీరాబాద్ పట్టణ కార్యదర్శి షేక్ రఫీ మరియు దగ్వాల్ అధ్యక్షుడు ముహమ్మద్ వాజిద్, హైదరాబాద్లోని దారుస్సలాంలో అధ్యక్షుడు మజ్లిస్-ఇ-వర్కర్ పార్లమెంట్ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు అసెంబ్లీ సభ్యుడు మరియు మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల ఇంచార్జ్ కౌసర్ మొహియుద్దీన్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో జహీరాబాద్ రాజకీయ వాతావరణంలో కొత్త కదలిక వచ్చింది. ఈ సెషన్ కేవలం పరిచయ కార్యక్రమం కాదు. జహీరాబాద్లోని వివిధ మున్సిపల్ వార్డుల పరిస్థితి, ప్రజా సమస్యలు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాన్ని చర్చించాల్సి ఉంది, అది జహీరాబాద్ అయినా లేదా కోహిర్ అయినా. వాజిద్ చర్చను లోతుగా చేస్తూ, ఎంపీటీసీ, జడ్పిటిసి గ్రామ పంచాయతీ మరియు వార్డు సభ్యుల పనితీరుపై వెలుగునింపారు మరియు షేఖాపూర్, మాడ్గి, దగ్వాల్ మరియు ఝరాసంగం యొక్క సర్పంచ్లు మరియు ఎన్నికైన ప్రతినిధులు ఈ ప్రాంత అభివృద్ధి మరియు అభివృద్ధిలో అందించిన గత సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు కౌసర్ మొహియుద్దీన్ జమాత్ ఈ అంశాలను తీవ్రంగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. గత ఎన్నికలలో జమాత్ ప్రతినిధులకు ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించినట్లే, ఈసారి కూడా వ్యవస్థీకృత మరియు ఉత్సాహభరితమైన ప్రచారంతో రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని వారు తమ ప్రసంగంలో చెప్పారు. రాబోయే రోజుల్లో జహీరాబాద్ మరియు కోహిర్ ఝరాసంగం లలో ఏఐఎంఐఎం రాజకీయ కార్యకలాపాలు మరింత ముమ్మరం అవుతాయనే వాస్తవానికి ఈ సమావేశం ఒక ముందడుగుగా అభివర్ణిస్తున్నారు.
పోటీలు ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మంచిర్యాల జిల్లా స్థాయి అండర్ 15 అమ్మాయిల, అబ్బాయిల ఆత్యా పాత్యా పోటీల సెలక్షన్స్ రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బుదవారం జరిగాయి. సెలక్షన్స్ పోటీలను జిల్లా అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, ఉపాధ్యక్షులు దేవేందర్, సంతోష్ ,జిల్లా సెక్రటరీ పెద్దపల్లి ఉప్పలయ్య,ట్రెసరర్ దొంతుల వర్ష, నేషనల్ రెఫరీ విశాల, జాతీయ స్థాయి క్రీడాకారులు పాగే రాము, శ్రీ వల్లి, పీ,డీ మల్లిక, పి,ఈ,టి లు సానియా, రఘు లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లాలోని జైపూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల బాయ్స్, మందమర్రి కస్తూరిబా పాఠశాల అమ్మాయిలు, మంచిర్యాల స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ అబ్బాయిలు, రామకృష్ణాపూర్ గురుకుల విద్యార్థినులు పోటీలలో పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఐదుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలను సెలక్షన్ చేస్తామని అన్నారు. ఇక్కడ ఎంపికైన వారు ఈనెల 10న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల సెలక్షన్స్ లో పాల్గొంటారని తెలిపారు.
హైదరాబాద్ మెట్రో సేవల విస్తరణ కొనసాగుతోంది. ఇప్పుడు ఫేజ్ 2 ద్వారా నగరానికి మరింత మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది. భారీ మెగా ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి.
నేటి ధాత్రి
ముఖ్యాంశం – ఫేజ్ 2 పూర్తి వివరాలు, పనుల స్థితి, ప్రయోజనాలు.
MetroPhase2
1️⃣ ఫేజ్ 2-A: ప్రాథమిక విస్తరణ (76.4 కిమీ)
ఐదు కారిడార్లు:
నాగోల్ – శంషాబాద్ (RGIA)
రైడుర్గ్ – కోకాపేట్
MGBS – చంద్రాయణగుట్ట
మియాపూర్ – పటాన్చేరు
LB నగర్ – హయత్ నగర్
మొత్తం పొడవు: 76.4 కిమీ కొత్త స్టేషన్లు (LB నగర్ – హయత్ నగర్ – 7.1 కిమీ): చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, RTC కాలనీ, హయత్ నగర్
పనుల ప్రారంభం: జనవరి 2025లో భూమి అందజేత కోసం ఇప్పటికే 500కి పైగా ఎస్ఖావేషన్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
2️⃣ ఫేజ్ 2-B: నూతన కారిడార్లు (86.1 కిమీ)
JBS – మెడ్చల్ (24.5 కిమీ, 18 స్టేషన్లు)
JBS – శామిర్పేట (22 కిమీ, 14 స్టేషన్లు)
RGIA – ఫ్యూచర్ సిటీ (Skill University) (39.6 కిమీ, ఇందులో 1.5 కిమీ అండర్గ్రౌండ్)
మొత్తం ప్రాజెక్టు విలువ: ₹19,579 కోట్లు
3️⃣ పథకాల సమగ్ర స్థితి & వ్యయ నిర్వహణ
ఫేజ్ 2-A మొత్తం వ్యయం: ₹24,269 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం: ₹7,313 కోట్లు (30%)
కేంద్ర ప్రభుత్వం: ₹4,230 కోట్లు (18%)
JICA/ADB/NDB రుణాలు: ₹11,693 కోట్లు (48%)
PPP మోడల్ ద్వారా: ₹1,033 కోట్లు (4%)
ప్రతి కిలోమీటరుకి ఖర్చు: సుమారుగా ₹318 కోట్లు — ఇది ఇతర నగరాల్లోని అండర్గ్రౌండ్ నిర్మాణాల కంటే తక్కువ స్థాయిలోనే ఉంది.
ప్రయాణదారుల అంచనా: రోజుకు 8 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా
4️⃣ ప్రాజెక్ట్ టైమ్లైన్ & ప్రస్తుత స్థితి
ఫేజ్ 2-A పనులు: 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యం
ఫేజ్ 2-B: DPRs పూర్తయ్యాయి, ప్రభుత్వ సమీక్షకు పంపబడ్డాయి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: కేంద్ర శాఖలతో చర్చలు జరిపి ప్రాజెక్టును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు
5️⃣ ఫేజ్ 2 ప్రయోజనాలు
నగర అంతటా రవాణా వేగం పెరుగుతుంది
ట్రాఫిక్ రద్దీ నుంచి ఉపశమనం
కార్బన్ ఉద్గారాల్లో తగ్గింపు
RGIA, JBS, మెడ్చల్, శామిర్పేట, ఫ్యూచర్ సిటీ వంటి ప్రధాన కేంద్రాలకు మెట్రో కనెక్టివిటీ
ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు మరింత మెరుగైన ప్రయాణ సౌలభ్యం
MetroPhase2
Outro (4:30–5:00)
“మీ అభిప్రాయమేమిటి? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఏ కారిడార్కి ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి అనిపిస్తోంది? కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి – నెటిధాత్రిలోనే అన్ని తాజా వార్తలు!”
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఏఎంపీఎల్)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ ఆర్డర్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి…
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఏఎంపీఎల్)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి మరో భారీ ఆర్డర్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆర్డర్ విలువ రూ.1,800 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని కంపెనీ డైరెక్టర్ అతిమ్ కాబ్రా సూచనప్రాయంగా వెల్లడించారు. ఆత్మ నిర్బర్ భారత్లో భాగంగా భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన 230 సుఖోయ్-30 యుద్ధ విమానాల ఆధునీకరణతో పాటు పెద్దఎత్తున క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ (క్యూఆర్ఎ్సఏఎం) అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన కీలక ఎలకా్ట్రనిక్ ఉపకరణాల సరఫరా కాంట్రాక్టు తమకు దక్కే అవకాశం ఉందని కాబ్రా తెలిపారు. కాగా కంపెనీ ఇప్పటికే విరూపాక్ష రాడార్ కార్యక్రమంలో కీలకంగా ఉంది.
నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారానికి మహిళలకు కొన్ని వేల ఏళ్ల నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆడవాళ్లు తమ దగ్గర ఎంత బంగారం ఉన్నా.. ఇంకా కావాలంటారే తప్ప వద్దు అనరు. శుభకార్యాల్లో బంగారం విషయాలే ప్రధాన టాపిక్ అవుతాయి. భారతీయ సంస్కృతిలో ఓ భాగం అయిన బంగారం ధరలు పేద, మధ్య తరగతి వాళ్లకు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 99వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్లో నేటి బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,850 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,610 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,140 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
కొత్తగూడ, నేటిధాత్రి:
గ్రామ కమిటీ అధ్యక్షుల మరియు క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు గౌరవ శ్రీ మల్లిఖార్జున ఖర్గే గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ… ములుగు నియోజకవర్గ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు… కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ర్యాలీ నిర్వహించి జేజేలు పలుకుతూ… కార్యకర్తలను చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడ మండల అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు , మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు సోషల్ మీడియా విభాగం యువజన నాయకులు తరలి వెళ్లారు.
చలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం కు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ గ్రామ అధ్యక్షుల సమ్మేళన బహిరంగ సభకు బయలుదేరిన,జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పటేల్ గారు,శ్రీనివాస్ రెడ్డి, రామలింగారెడ్డి,మాక్సూద్ అహ్మద్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, గ్రామ అధ్యక్షులు పాల్గొని సభకు బయలుదేరడం జరిగింది.
హైదరాబాద్ వారాహి బ్యాంకేట్ హాల్ లో జరిగిన మాజి ఆత్మ చైర్మన్ పెంటా రెడ్డి గారి మనుమడి జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన జహీరాబాద్ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.