లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

లియోనల్ మెస్సీ గోట్ టూర్.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే..

ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ భారత్‌ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.ప్రపంచ ఫుట్‌బాల్‌ సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న నాలుగు ప్రముఖ నగరాల్లో పర్యటిస్తారు. గోట్ ఇండియా టూర్‌ 2025లో భాగంగా ఆయన కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు. మెస్సీతో పాటు లూయిస్ సూరెజ్, అర్జెంటినా మిడ్ ఫీల్డర్ రోడ్రిగో డే పాల్‌లు కూడా భారత్‌లో పర్యటించనున్నారు. మెస్సీ మూడు రోజుల భారత్ టూర్ షెడ్యూల్ ఇలా ఉంది..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version