రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన బాలానగర్ పోలీసులు

“హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి”

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.

 

బాలానగర్ ఎస్సై లెనిన్.

 

తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ప్రారంభించిన “ఆరైవ్ లైవ్” నినాదం ద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో, పల్లె పల్లెనా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ ఆదేశాల అమలులో భాగంగా, బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండెడ్ గ్రామం నందు బాలానగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ లెనిన్ మరియు సిబ్బంది రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు క్రింది విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు:
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి
త్రిబుల్ రైడింగ్ చేయరాదు
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు
రాంగ్ రూట్ డ్రైవింగ్, రాంగ్ ఓవర్టేక్ నివారించాలి
మైనర్లు వాహనాలు నడపరాదు
ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలి
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు వివరించారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రతపై బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థుల్లో రోడ్డు భద్రతపై మంచి అవగాహన ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ…

డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ

 

ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు.

హైదరాబాద్, నవంబర్ 6: గ్రూప్ 1లో ఎంపికైన 115 మంది డీఎస్పీలకు ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు (గురువారం) ఉదయం డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీజీపీఏకు చేరుకున్న డీజీపీకి టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ గౌరవ వందనంతో స్వాగతం పలికారు. రాజేంద్రనగర్‌‌లోని టీజీపీఏలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. 115 మందితో ఇదే అతిపెద్ద డీఎస్పీ బ్యాచ్ అని అన్నారు.
ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు. కొత్తగా రిక్రెట్ అయిన మహిళా డీఎస్పీలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ట్రైనింగ్‌లో స్నేహపూర్వకంగా ఉంటూ.. ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకోవాలని సూచించారు. ఇంటెగ్రిటీ, ఎంపథీ, ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్.. ఈ మూడు ముఖ్యంగా గుర్తించుకోవాలని అన్నారు. ఈ వంద మంది ట్రైనింగ్‌‌లోనే కాదు.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కాంటాక్ట్‌లో ఉండాలని తెలిపారు. పోలీసింగ్‌కు నెట్వర్క్ చాలా ముఖ్యమని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి…

డీప్‌ఫేక్ పెద్ద గొడ్డలిపెట్టు.. అడ్డుకోవాల్సిందే: చిరంజీవి

 

పెరుగుతున్న టెక్నాలజీ ని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

డీప్‌ఫేక్‌పై (DeepFake) మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్పందించారు. డీప్‌ఫేక్‌ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళానని.. డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లు (Hyderabad CP Sajjanar) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని.. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు. ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురుకునే అవకాశం ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

సీరియస్‌గా తీసుకున్నాం: సీపీ సజ్జనార్

మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ అంశాన్ని సీరియస్ తీసుకున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. డీప్‌ఫేక్‌ కేసులో సైబర్ నేరస్తుల మూలాలపై ఫోకస్‌ పెట్టినట్లు చెప్పారు. సైబర్ నేరాల పట్ల ఆందోళనకు గురికావద్దని అన్నారు. ప్రజల్లో ఎంతో అవగాహన తీసుకువస్తున్నామని.. అయినప్పటికీ డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్, ఇతర సైబర్ మోసాలకు గురవుతున్నారని తెలిపారు. పిల్లలు 5 వేలు, 10 వేల కోసం సైబర్ నేరస్తులకు మ్యూల్ అకౌంట్స్ ఇస్తున్నారని.. దీని వల్ల పెద్దలు కూడా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీ వెల్లడించారు.

టాస్క్ ఫోర్స్ ఎస్సై సస్పెండ్‌పై…

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ శ్రీకాంత్ గౌడ్‌ను సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఉప్పలపాటి సతీష్‌పై సీఐడీ, జీఎస్టీ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని.. త్వరలో నిందితులను పట్టుకుంటామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version