దుగ్గొండి మండలం రేకంపల్లి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం
నర్సంపేట,నేటిధాత్రి:
నియోజకవర్గ పేద ప్రజల అభివృద్దే తన లక్ష్యం అని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల దుగ్గొండి మండలంలో పైలెట్ ప్రాజెక్టు రేకంపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ఇజ్జగిరి జయ చేరాలు ఇంటి నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం కార్యక్రమం చేపట్టారు.
MLA Donthi Madhav Reddy
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగానే ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయడం సంతోషంగా ఉందన్నారు.నియోజకవర్గ పేద ప్రజల సంక్షేమమే నా ధ్యేయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు.నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దఫాలో ప్రజలకు 3500 ఇండ్లు మంజూరు పత్రాలు ఇచ్చాము.రెండో దఫాలో మరో 3500 ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్ రావు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గౌడ్,మాజీ సర్పంచ్ ఎర్రల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరు కిరణ్ రెడ్డి, ఒలిగే నర్సింగరావు,ఇంగోలి రాజేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జిలు మట్ట రాజు,రొట్టె రమేష్,మార్కెట్ డైరెక్టర్లు దంజానాయక్, హింగే రామారావు , మండల నాయకులు జంగిల్ రవి, అజ్మీర రవీందర్,నల్ల వెంకటయ్య, పొగాకు వెంకటేశ్వర్లు, బ్లాక్ యూత్ అధ్యక్షులు బొమ్మినేని భరత్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదాసి సాంబయ్య, మండల యూత్ నాయకులు కోరే రాజేష్, సుకినె నాగరాజు, సుకినె శ్రీను, కొరకల ప్రశాంత్, ఈద సురేందర్, కొలుగూరి సుమంత్, గాండ్ల ప్రతిష్,నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ మండలంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసిన స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్.
డోర్నకల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపిన ఎమ్మెల్యే.
మరిపెడ నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గo మరిపెడ మండల కేంద్రంలో ని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభ లో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని, మండలలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 1790 మంది అర్హులైన లబ్దిదారులకు ఆహార భద్రత పథకం కింద కొత్త రేషన్ కార్డులు అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల పట్ల తీవ్ర అన్యాయం చేశాయి. గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వ లేదు. పేదలు ఎన్నిసార్లు ప్రయత్నించినా,వారి సమస్యలను పెదవిపైకి తీసుకురాలేకపోయారు. కాని ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ పాలనలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యల పరిష్కారానికి నడుంబిగించింది అన్నారు. ఆహార భద్రతతో పాటు, రేషన్ కార్డు ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని,ఇది న్యాయమైన హక్కుగా పరిగణించాలని అన్నారు. ప్రజా పాలనలో ఇచ్చిన హామీల ప్రకారం రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, కాస్మోటిక్ చార్జీలు,నాణ్యమైన విద్య అందివ్వడం జరుగుతుందన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరింది అన్నారు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతి వార్డు ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు, రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు రాని లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని,ఇది నిరంతర ప్రక్రియ అని తెలియజేశారు,పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు,ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్,తాసిల్దార్ కృష్ణవేణి,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,ఆర్ఐ శరత్ చంద్ర గౌడ్,అగ్రికల్చర్ ఆఫీసర్ వీరా సింగ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి యువ నాయకులు అభినవరెడ్డి, రామ్ లాల్,అంబరీష,నల్లు శ్రీకాంత్ రెడ్డి,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిలమల్లు, మరిపెడ పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, రవి నాయక్,శ్రీపాల్ రెడ్డి,కాలం శ్రీనివాస్ రెడ్డి,అఫ్జల్, మండల రేషన్ డీలర్ల యూనియన్ అధ్యక్షులు,యూనియన్ సభ్యులు,లబ్ధిదారులు,వివిధ గ్రామాల నుంచి వచ్చిన లబ్దిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లబ్దిదారులు తమకు రేషన్ కార్డు అందించిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.
పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి కొండా సురేఖ
దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ
నేటిధాత్రి, దేశాయిపేట, వరంగల్.
పేదప్రజల అభివృద్ధి సంక్షేమమే తెలంగాణ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జిడబ్ల్యుఎంసి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావేటి కవితలతో కలిసి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ప్రతులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ అధికారులతో కలిసి దేశాయిపేట ఎస్సీ కాలనీలో కలియ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ..
ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని, నియోజకవర్గానికి 3500 ఇల్లు మొదటి విడతలో మంజూరయ్యాయని, రెండో విడతలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను ఏమాత్రం ఆలస్యం చేయడం లేదని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. మధ్య దళారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నదని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉగాది నుండి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్యశ్రీ పరిస్థితిని 10 లక్షల రూపాయలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కల ఇందిరమ్మ ఇల్లు సొంతమయ్యేలా నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడుదల రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 500 కోట్ల రూపాయలతో నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్య పడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల దేవదాయ శాఖకు 176 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని మంత్రి తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి తప్ప గత పది ఏళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. కొండా దంపతులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల వల్లే ప్రజలు ఆశీర్వదించడం వల్ల ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని, తూర్పు నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తూ అన్ని డివిజన్లను పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న షాదిఖానను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. మహిళలు తలచితే ఏదైనా సాధిస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 6 గ్యారంటీలు మహిళల పేరు మీదే నామకరణం చేయడం జరిగిందన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచడంతోపాటు 200శాతం కాస్మెటిక్ చార్జీలను పెంచడం, పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు మెప్మా ద్వారా కుట్టించిన యూనిఫామ్ లు పాఠ్యపుస్తకాలు అందించి ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలలను బలోపేతం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, తూర్పు లోని 5 మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ ద్వారా ఐదు బస్సులను అద్దెపై నిర్వహించుకొనుటకు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వెనుకబడిన తరగతుల వారికి కమ్యూనిటీ హాల్ లకు బదులు మ్యారేజ్ హాల్ లను నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సూచించారు.
District Collector Dr. Satya Sarada.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..
ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలని, పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు సమీక్షలు జరుపుతున్నామన్నారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. బేస్మెంట్ పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే మేస్త్రీలకు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రుణం ఇప్పించడం జరుగుతుందన్నారు. 500 ఎస్ ఎఫ్ టి వరకే నిర్మించుకునేలా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు మాట్లాడుతూ..
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ఆన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరిలో మధ్య దళారుల సమయం లేకుండా చూడాలని, అలాంటి దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శుభం, 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్న రాణి, సీఎంహెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎస్సీ కాలనీ లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు కొయ్యడ సుమలత సమ్మయ్య ఇందిరమ్మ ఇల్లు అమలు కావడం చాలా సంతోషకరంగా ఉంది గత 10 సంవత్సరాల కాలం నుండి గుడిసెలలో అంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి కి భూపాలపల్లి శాసన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇట్టి కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మొలుగూరి రాజు కొయ్యాడ భద్రయ్య ఎడ్ల లింగయ్య జన్నే సుమంత్ గ్రామస్తులు పాల్గొన్నారు
అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో జిల్లా పౌరసరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం రేగొండ, గణపురం, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాలల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే పాల్గొని లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం ఆయా మండలాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని గత పదేళ్లు పాలించినోళ్లు ఒక్క రేషన్ కార్డూ ఇవ్వకపోగా, పేదలను నిరుపేదలుగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. పేదలకు కూడా సన్నబియ్యం అందించాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కాని, ఒక్క కిలో సన్న బియ్యం కాని ఇవ్వలేదన్నారు. అనంతరం కొత్త రేషన్ కార్డులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా మండలాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
సొంత ఇల్లు లేక నిర్మించే పరిస్థితి లేక ఇన్నాళ్లు పూరిగుడిసెల జీవనం కొనసాగించిన పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఒక వరం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలకున్నది ప్రియతమ నాయకురాలు ధనసరి సీతక్కప్రత్యేక చొరవతో కొత్తగూడ మండలంలోని ఇందిరమ్మ ఇల్లు అధికంగా మంజూరు కావడం జరిగింది . అందులో భాగంగా నేడు కొత్తగూడ మండల కేంద్రం లో గాంధీనగర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరి పత్రాలు ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ.. మా పూర్తి జీవితాలలో కూడా సొంత ఇల్లు కట్టుకుంటామని ఆశ లేకుండా బతుకుతున్న మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు సీతక్క గారి దయతో మా సొంతింటి కల నెరవేరబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా సొంత ఇంటి కలలు నిజం చేసిన స్థానిక మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ఈ సందర్బంగా తెలిపారు…
ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాలకు అదనంగా మంజూరు అయిన 280 ఇళ్లను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ఎస్టీ కుటుంబాలకు మజురు చేయాలిని అల కాకుండా అధికార పార్టీ నాయకుల అనుచరులకు కానీ కమిటీలు సూచించిన లిస్ట్ ప్రకారం అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తే బిఆర్ఎస్ పార్టీ తరుపున కచ్చితంగా నిలదీస్తాం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకడబోము అని బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఎస్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు తుర్రం రవి కారం కన్నారావు తెలియజేసారు మొదటి విడతలో అధికార పార్టీ నాయకులే బహిరంగంగా లబ్ధిదారుల జాబితాలో కొంతమంది అనర్హులకు ఇల్లు కేటాయించారు అని విమర్శలు చేసుకున్న ఇళ్లు ఉన్న వారికే ఇళ్లు కేటాయించిన అధికారులు ఏమి పట్టనట్టే వున్నారు కనీసం ఈసారైనా మండలంలో వున్న నిరుపేద ఎస్టీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి అని బిఆర్ఎస్ పార్టీ తరుపున అధికారులకు తెలియజేస్తున్నామని ఈ విషయంలో గిరిజన నాయకులు కూడా కలిగించుకొని బీద గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నామని పత్రికా ప్రకటనలో తెలిపారు
అందుకే పేదల ఇళ్లు కూల్చడం లేదు.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రంగనాథ్ పేర్కొన్నారు.
భావితరాలకు భవిష్యత్ని ఇవ్వడం కోసం హైడ్రా (HYDRA) పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఉద్ఘాటించారు. చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో తాము చాలా దూకుడుగా వెళ్లామని చెప్పుకొచ్చారు. దూకుడుతో వెళ్లడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా అంబర్పేట్ బతుకమ్మ కుంట వద్ద హైడ్రా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, మాజీ ఎంపీ వి. హనుమంతురావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. హైడ్రా అంటే డిమాలీషన్, డెవలప్మెంట్ అని అభివర్ణించారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్ మాత్రమేనని.. త్వరగా ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీ 21 వార్డు మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు శనివారం చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి అయిన సందర్భంగా పట్టణంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృదే ధ్యేయంగా మంత్రి వివేక్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఫ్లై ఓవర్ వంతెనపై త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని,వంతెనకు ఇరువైపుల రోడ్డు విస్తరణకు కోటి యాబై లక్షల రూపాయల నిధులను మంత్రి వివేక్ మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల సత్యనారాయణ,తదితర నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. గడిచిన 18 నెలల అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను విడుదల చేశారు. అందులో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేసిన ఇల్లు ఉన్న వారికే ఇల్లు రావడంతో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగింది. వారి పక్షాన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పే నాయకులే లేకపోయారు. దీనికి నిదర్శనం మండల కేంద్రమైన మొగుడంపల్లి లోని వృద్ధురాని నీ ఉదాహరణగా తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితా ఎలా జరిగిందో అర్ధం అవుతుంది. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం కూడా నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే అవకాశం లేదు. ఫలితంగా పేదలు పేదలుగానే గుడిసెల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. 70 సంవత్సరాల వృద్ధు రాలుని పుట్టక ముందు నుంచి వారి తల్లిదండ్రులు సైతం అదే గుడిసెలో కాపురం చేశారు. ఈసారైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ స్థానిక నాయకుల పక్షపాతమో.. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ మొగుడంపల్లి మండల కేంద్రమైన గుడుపల్లి కు మంజూరైన 35 ఇండ్లలో 18 రిటన్ పంపుతున్నారని దాంట్లో ఎవరికైనా బీదవారి అవసరం ఉన్నవారికి మంజూరు చేయాలని కోరారు. ఇండ్లలో అత్యధికంగా ఉన్న వారికే ఇండ్ల జాబితాలో పేర్లు వచ్చాయన్నారు. గుడుపల్లి గ్రామానికి చెందిన ఖైరున్ బీ, భర్త ఇబ్రహీం షా. వీరికి ఆరు గురు కుమారుడు ఐదు గురు కూతురు ఉన్నారని కానీ పూరి గుడిసెలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ నాయకులకు, అధికారులకు మాత్రం బీద వారి ముసలి వయసు ఉండే చేయించే బాధ్యత పూరి గుడిసె కనిపించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు ఎకరాల కొద్ది భూములు ఉన్న వారికి సైతం ఇల్లు ఇచ్చారు. కానీ అలాంటిది నిరుపేదకు -మాత్రం మొండి చేయి చూపించారు. ఇది కేవలం ఒక గుడుపల్లి గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ చెందిన నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వైద్య ఖర్చులకోసం నిరుపేద ఎదురుచూపు, నేటి ధాత్రిమొగుళ్లపల్లి: విద్యుత్ షాక్ తో ఒళ్లంతా కాలి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ఒక యువకుడు వైద్య ఖర్చులకోసం అప్పన్న హస్తం అందించే మహానుభావుడు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నే అనిల్ అలియాస్ అంజి. ముట్లపల్లి సబ్ స్టేషన్ లో అన్ మ్యాన్డ్ కార్మికుడిగా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు గత రెండు రోజుల క్రితం విద్యుత్తు పోలుపై నుండి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు తొలుతగా వరంగల్లోని గార్డెన్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుండి ఎంజీఎం కు పంపించారు మళ్లీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. రికార్డ్ అయితే డొక్కాడని అంజి కుటుంబం వైద్య ఖర్చులకోసం తెలిసిన బంధువుల వద్ద అప్పులు తెచ్చి చికిత్స అందిస్తున్నారు అయితే అవి సరిపోక మరిన్ని డబ్బులు కావాలని హాస్పటల్ సిబ్బంది తెలుపగా వైద్య డబ్బుల కోసం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు గాయపడిన అంజికి భార్య తల్లి తండ్రి ఉన్నారు తండ్రి అనారోగ్యంతో మంచంలో పడి గత కొన్ని సంవత్సరాలుగా లేవలేని స్థితిలో ఉండగా ప్రస్తుతం గాయపడిన అంజి కన్న తండ్రికి సేవలు అందించేవాడు ప్రస్తుతం అంజి వెన్నుముక దెబ్బతిని లేవనెల స్థితిలో దావకానలో మెరుగైన వైద్యం కోసం దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు భార్య కూలి పని చేసుకుంటూ ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న దిన స్థితిలో అంజి కుటుంబం తల్లడిల్లుతుంది యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడి ప్రజల నుండి ఆర్థిక సహాయం అర్జిస్తున్నాడు మనసున్న మహారాజులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జన్నే అంజి వైద్యం కోసం సహాయం అందించాలని అంజి కుటుంబ సభ్యులు ప్రజలను వేడుకుంటున్నారు, అంజికి ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు ఫోన్ పే ద్వారా పంపించగలరు 8790519548.
పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద ప్రైవేటు పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు 25% ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్ 12 (1) సి విద్య హక్కు చట్టం ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని రాశారు కేంద్ర ప్రభుత్వం 2009 నుండి అమలులోకి తేవడం జరిగింది ఈ విద్య హక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేటు పాఠశాల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు కట్ల శంకరయ్య దూడపాక దుర్గయ్య అంబేద్కర్ వాదులు ఇమ్మడి వెంకటేశ్వర్లు దూడపాక శ్రీనివాస్ మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి సైదుల్ గడ్డం సదయ్య చిలువేరు దయాకర్ ఊరడి మురళి రత్నం రామకృష్ణ శనిగరపు ఆనందం ఎండి లాలు పాల్గొన్నారు
జనగామ నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇండ్లలో నిరుపేదలకు అందని ద్రాక్ష ల ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ విమర్శించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను సమకూర్చి ప్రభుత్వానికి ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు పేరుతో కట్టిస్తున్నారని విమర్శించారు మరియు నిరుపేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందడం లేదని జనగామ నియోజకవర్గంలో చాలా తక్కువ మందికి ఇచ్చారని చేర్యాల మున్సిపల్ పరిధిలో కేవలం 34 మందికే ఇవ్వడం వీరి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది అని విమర్శించారు దానిలో కాంగ్రెస్ కార్యకర్తలు కు ఇందిరమ్మ ఇండ్లు అధికం వెనుకబడిన చేర్యాల ప్రాంతం పై మీరు చూపిస్తున్న ప్రేమ ఇదేనా అని విమర్శించారు మరియు చేర్యాల రెవెన్యూ డివిజన్ 100 రోజుల్లో తీసుకువస్తానని వెళ్లిన ముఖ్యమంత్రి ఇక్కడి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎటు పోయిందని విమర్శించారు చేర్యాల రెవెన్యూ డివిజన్ తీసుకొని తప్పక వస్తానని రెండోసారి ఎంపీ ఎలక్షన్లో మాట ఇచ్చిన చామల కిరణ్ కుమార్ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడి ప్రజలకు చూపిస్తున్నాడని విమర్శించారు ఇప్పటికైనా వెనుకబడిన చేర్యాల ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలు అందరికీ ఇవ్వాలని అన్నారు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇంకా కాలయాపన చేయవద్దని అన్నారు
పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం అభినందనీయం…
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు
ఆర్కేపి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ పేదల కోసమే…
యువత జనం కోసం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి :
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఠాగూర్ స్డేడియం సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసించే 40 మంది విద్యార్థులకు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారంతో డబ్బులు సేకరించి మున్సిపాలిటీ కమీషనర్ గద్దె రాజు చేతుల మీదుగా స్కూల్ బ్యాగ్ లు అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందించడం అభినందనీయమని కమీషనర్ అన్నారు. ఈ సంధర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కు సంబంధించిన సమస్యలు కమిషనర్ కు వివరించగా కమీషనర్ రాజు సమస్యల పరిష్కారం కోసం స్కూల్ చుట్టూ కంచె, గేట్ ఏర్పాటు చేస్తామని అన్నారు.యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ మాట్లాడుతూ.. యువత స్వచ్ఛంద సేవా సంస్థ కు సహాయం చేస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆర్కేపీ యువత జనం కోసం పేదల కోసమే పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో దాతలు గణేష్ యువత ఉపాధ్యక్షుడు వెరైటీ తిరుపతి , కార్యదర్శి కరుణాకర్ పేరేంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
సిరిసిల్ల పట్టణనికి చెందిన చేనేత కార్మికుడు కొండి సత్యం కుమార్తె కొండి వర్షిత తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల కళాశాలలోఎం.పీ.సీ గ్రూపులో వేయికి గాను సుమారు 976 మార్కులతో కళాశాల తృతీయ స్థానంలో మార్కులు సాధించడం జరిగినది. నిరుపేద విద్యార్థి అయిన వర్షితకు పై చదువుల కోసం ప్రముఖ ఎన్నారై సిరిసిల్ల అశోక నగర్ చెందిన గడ్డం భానుచంధర్(NRI)s/o సత్తయ్య మరియు వివేక వర్ధిని స్కూల్ 10వ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థి కొండి వర్షిత 40 వేల రూపాయలు పై చదువుల కోసం సహాయం అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు గుగ్గిల్లా అభినయ్ గౌడ్,బద్దెనపల్లి మాజీ సర్పంచ్ గుగ్గిళ్ల అంజయ్య,మాజీ ఎంపీటీసీ సిలువెరీ ప్రసూన-నర్సయ్య, కొండ రాజేశం, కొండ రమేష్ లు పాల్గొన్నారు..
“పొలం ఇప్పించి.. న్యాయం చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు”
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన చిన్న యాదమ్మకు అదే గ్రామంలో సర్వేనెంబర్ 677లో, 38 గుంటల పట్టా పొలం ఉంది. అదే గ్రామానికి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు యాదమ్మకు మాయ మాటలు చెప్పి పట్టా పొలాన్ని ప్రజా ప్రతినిధుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఆమెకు 966 సర్వే నెంబర్ లో.. ఆమెకు ఒక ఎకరా గైరాన్ పొలం ఆమె పేరా చేశారు. తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశారని నిలదీస్తే.. తమకు రూ.5 లక్షలు ఇస్తే తిరిగి పొలం ఇస్తామని.. చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రతినిధుల ఆధీనంలో ఉన్న తన పట్టా పొలాన్ని తనకు ఇప్పించాలని కలెక్టర్ కు వినతిపత్రంలో బాధితురాలు కోరింది.
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని నిర్దిష్ట సమయంలో ఇండ్లను పూర్తి చేయాలని ఆయన అన్నారు కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని ముదిగుంట గ్రామంలో పేద ప్రజలకు ఉచితంగా అందే పథకాలను కొంతమంది కాంగ్రెస్ నాయకులు పేద ప్రజల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినికిడి. గ్రామంలోని తోటి కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా విషయం వెలుగులోకి వచ్చింది.ఎవరైతే పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారో వారిని గుర్తించి మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి అక్రమాలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు.
◆ – తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
◆ – కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని దేవరం పల్లి,చీలపల్లీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను,మరియు దేవరం పల్లీ గ్రామంలో డా౹౹సిద్దం.
ఉజ్వల్ రెడ్డి గారీ సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోర్ ని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.
ఉజ్వల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఝరాసంఘం మండల అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్ గారితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని,రాబోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని,గతం కంటే ఎక్కువగా పెట్టుబడి సహాయం రైతు భరోసా కింద రూ.12000 ఎకరా నికి అందిస్తున్నామని తెలిపారు.
N. Giridhar Reddy.
మహిళలకు ఆర్టీసీబస్సులలో ఉచిత ప్రయాణం,ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకు గ్యాస్ సిలిండర్,సన్న రకం బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,జహీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి,మాజీ కేతకి దేవాలయం చైర్మన్ మల్లన్న పాటిల్,మాజీ యూత్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్,మాజీ యం.పి.టి.సి హఫీజ్,మాజీ సర్పంచ్ నవాజ్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,శామ్ రావు పాటిల్,అశ్విన్ పాటిల్,సంగమేశ్,శ్రీకాంత్ రెడ్డి,రంగా అరుణ్ కుమార్,అక్బర్,నథానెయల్,మల్లీకార్జున్,నర్సింహా యాదవ్,ఇమామ్ పటేల్,ఝరాసంఘం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగుతుంది *వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ మొగుళ్ళపల్లి నేటిధాత్రి:
తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలన్న ఆలోచన మేరకు 9 రోజుల్లో పెట్టుబడి సాయం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం నిధులు విడుదల చేసిన ప్రజా ప్రభుత్వం వానాకాలం సీజన్లోపంటకు పెట్టుబడి రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో పూర్తిచేసి ప్రజా ప్రభుత్వంలో రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని చిట్యాల వ్యవసాయం మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ అన్నారు .ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులో 9 వేలకోట్ల రూపాయలు కోట్లరూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి వర్గానికి అందరికి ధన్యవాదాలు తెలిపారు.గతంలో ఎకరాకు పది వేల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించామని నిధుల విడుదల చేశామన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.