కాంతి హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

కాంతి హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్…

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేయండి… ఎమ్మెల్యే మురళి నాయక్…

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రాంతి హాస్పిటల్ ని గురువారం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన మహబూబాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్, డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి,

సుదూర ప్రాంతాల నుంచి వైద్య నిమిత్తం వచ్చే నిరుపేద వారికి అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని, సామాజిక సేవ సాటి మనిషికి సహాయం చేసే అత్యంత గౌరవప్రదమైన వైద్య వృత్తిలో మరింత అభివృద్ధి చెందాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ హాస్పటల్ యాజమాన్యం శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, ,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ పీసీసీ సభ్యులు దాస్రు నాయక్,బండారు దయాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ ,జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-92.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

డయాలసిస్ సేవల కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్న జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయస్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే “బెస్ట్ సెంటర్ అవార్డ్స్” విభాగంలో ఉత్తమ డయాలసిస్ సెంటర్ అవార్డును ఈ ఆసుపత్రికి వరించింది. ఇందులో రోజుకు సగటున 30 మంది పేషంట్లకు డయాలసిస్ చికిత్సలు అక్కడి వైద్యులు అందజేస్తున్నారు. వీరి ఉత్తమ సేవలకు గాను ఈ అవార్డు దక్కడం పట్ల జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని డాక్టర్ గాయత్రి, డీ.సీ.హెచ్.ఎస్ డాక్టర్ సంగారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 2018లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 600 మంది వరకు ఈ సెంటర్లో చికిత్స పొందారు. ప్రస్తుతం 65 మందికి ఇక్కడ డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రస్తుతం 10 బెడ్స్ ఉండగా రోజుకు 30 మందికి మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడి సిబ్బంది కొనసాగిస్తున్నారు.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-79.wav?_=2

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన.

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
(జమ్మికుంట: నేటిధాత్రి)
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి సందర్శించారు ఆస్పత్రులోని రికార్డ్స్ పరిశీలించారు అన్ని వార్డులను సందర్శించి రోగులతో సమస్యలపై మాట్లాడారు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పనితీరును రోగులతో అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లకు భరోసా కల్పించే విధంగా వైద్యం అందించాలని జవాబుదారితనంగా పనిచేయాలని ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగించే విధంగా వైద్యులు అలాగే సిబ్బంది మెదులుకోవాలని ఆస్పటల్ సూపర్డెంట్ కు సూచించారు.

గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ పండ్లు పంపిని.

గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ పండ్లు పంపిని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సమక్షంలో పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పవర్ మరియు టీబేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి రామ్ రాథోడ్ వారితోపాటు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రవీందర్ చవాన్, మాజీ సర్పంచ్ కేశవరం రాథోడ్,

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జహీరాబాద్ మండల అధ్యక్షులు ధర్మరాజు, ఎక్స్ ఆర్మీ రామ్ సింగ్ రాథోడ్, రఘు రాథోడ్, రమేష్ బానోత్ టీచర్, చందర్ పవర్, శీను బానోత్, ధర్మ, సింగ్ పవర్, ఎక్స్ ఆర్మీ పాండు సింగ్ రాథోడ్, రమేష్ పోలీస్, శివాజీ రాథోడ్, అర్జున్ టీచర్, మోహన్ కృష్ణ, తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన.

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

◆ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,

◆ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంకటి శుక్లవర్ధన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.

గిరిధర్‌రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹ సిద్దం.ఉజ్వల్‌రెడ్డి ప్రారంభించారు.

ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ టీ జీఐడీసీ చైర్మన్ మహ్మద్ తన్వీర్,సీడీసీచైర్మన్ ముబీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల అధ్యక్షులు పట్లోల్ల రాంలింగారెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి, కండెం.

 

Congress leaders

 

 

 

నర్సింహులు,నర్సింహారెడ్డి,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,సీనియర్ నాయకులు భీమయ్య,జమిలాలోద్దిన్,అక్తర్ గోరి,జావిద్,జాఫర్‌,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు మల్లారెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అరుణ్ కుమార్,అక్బర్,అశ్విన్ పాటిల్,హర్షవర్ధన్ రెడ్డి,జి.కిరణ్‌కుమార్‌గౌడ్,నథానెయల్,జగదీశ్వర్ రెడ్డి,మల్లికార్జున్,నర్సింహా యాదవ్‌,సునీల్,రాజు,జుబేర్,ఇమామ్‌ పటేల్‌ మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్…

నేటి ధాత్రి మహబూబాబాద్:

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వేగంగా వైద్యం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు.మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ,ఆసుపత్రిలోని మెడికల్,ఫీవర్,క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, పిరియాడిటిక్ , జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్, తదితర వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పలకరించారు.ఆలన కేంద్రం లో క్యాన్సర్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్, హోమ్ కేర్ లు తదితరులతో మాట్లాడుతూ,వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో కావలసిన అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ స్థితిగతులను తెలుసుకున్నారు.పనులను వేగంగా పూర్తి చేయాలని అందుకు ప్రతినిత్యం కాంట్రాక్టర్లు సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.రోగులకు నిత్యం వైద్య సేవలు అందిస్తూ షిఫ్టులవారీగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

పల్లె ప్రజా దవాఖాన అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా.

పల్లె ప్రజా దవాఖాన-అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా…

గార్ల నేటి ధాత్రి:

ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలు నిధుల వెచ్చించి సుందరమైన సువిశాలమైన అన్నీ వసతులతో కూడిన పల్లె దవాఖానలను కట్టించి,సరిపడ సిబ్బందిని నియమించి,జీతాలు,పనిముట్లు,వైద్య సామాగ్రి,మందులు,మెయింటనెన్సు అలవెన్సులు ఇచ్చి ప్రజలకు కనీస ఆరోగ్య అవసరాలు తీర్చజూస్తుంటే స్థానిక గార్ల మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానతో మాత్రం తమకు ఏమాత్రం ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మీ సేవే మా లక్ష్యమని-మేమున్నాము,మీ రు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకొమ్మని ప్రజలకేనాడు నమ్మకం కల్గించిన పాపాన ఇక్కడి సిబ్బంది పోలేదంటున్నారు.ఈ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ నియామకమైనప్పటి నుండి నేటికీ స్థానికంగా నివాసముండక, అందుబాటులో అసలుండక,ఖమ్మం నుండి నిత్యం అప్ అండ్ డౌన్లు చేస్తుంటారు.విచిత్రమైన విషయం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రిలో ఒక్క డాక్టరు కూడా పనిచేయడం లేదు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ముంచుకోస్తున్న వేళ గ్రామంలో విషజ్వరాలు,డెంగీ కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.ఇక్కడి వైద్యులు, సిబ్బంది డియం అండ్ హెచ్ వో మెడికల్ క్యాంపులనేర్పాటు చేసినపుడు మాత్రమే కనపడి,మిగతా వేళల్లా అపరిచితమే అన్నట్టుంది.వేలకు వేల జీతాలు తీసుకుంటూ,ఏజన్సీ పల్లె ప్రజల అనారోగ్యాలను బేఖాతరు చేస్తూ వైద్య వృత్తికే కళంకం చేస్తున్నారని ప్రజలు నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు.ఏదో ఒక సమయంలో హెల్మెట్ల ధరించుక వచ్చి,రిజిష్టరులో సంతకాలు చేసుకుని వెళుతున్నా,గిరిజన ప్రజలింకా చోద్యం చూస్తూనే ఉన్నారు.ఆస్పత్రి చుట్టూ పిచ్చి మొక్కలు,సిరంజీలు,వైద్య వేస్టులు, కుళాయి లేని నల్లా కనెక్షను నీటితో నిండే నిరంతర మురికి గుంటలతో పరిసరమంతా మురికిమయమైనా ఈ సిబ్బందికి మాత్రం పట్టదు.కురుస్తున్న వర్షాలకు పల్లెలో ఇంటికో ముగ్గురు చొప్పున విషజ్వరాల బారినపడి గతంలో గార్ల, మహబూబాబాద్, ఖమ్మం వంటి పట్టణాలకు గిరిజనులు దారులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సూదిమందుకి గానీ మందుబిళ్ళకి గానీ ఆసరా లేక,ఏనాడూ తిమోఫాస్ వంటి దోమల మందులు పిచికారీ చేయక,దోమతెరల పంపిణీ చేయక,ఫ్రైడే-డ్రైడేలు,శానిటేషన్ నిర్వహించక,పేదలకు నెలవారీ బి.పి,షుగరు మాత్రలు ఇవ్వక,రోగాల నివారణపై ప్రజల చైతన్యపర్చని ఈ దవాఖాన గానీ,ఈ సిబ్బంది గానీ మాకెందుకని పల్లె ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దేనికీకొరగానిదానిగా ఆస్పత్రిని మార్చి,కర్తవ్యాన్ని మర్చిన ఈ సిబ్బందిమాకొద్దని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.అలాగే ఇక్కడి సిబ్బంది పనితీరుపై ప్రజాక్షేత్రంలో సమగ్ర విచారణ జరిపి,వారు ఏమాత్రం పనిచేయక తీసుకున్న జీతాలను,ప్రభుత్వం రికవరీ చేసి,తగు శాఖాపరమైన చర్యలు తీసుకుని,వారిని స్థానచలనం కలిగించాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరా

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…

ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాయల్ టెస్ట్ నిర్వహించిన.

ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాయల్ టెస్ట్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం లో మరో ముందడుగు

కొత్తగూడ,నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కొత్తగూడ మండల ప్రజల చిరకాల కోరిక.. త్వరలో తీరానున్న పెద్ద ఆసుపత్రి కల..!!తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులుడాక్టర్ అనసూయ సీతక్క
ప్రత్యేక దృష్టితో ఉమ్మడి కొత్తగూడ ప్రజల కోసం 30 పడకల ఆసుపత్రి మంజూరు చేసిన సంగతి విధితమే
శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో..ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం లో భాగంగా సాయల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమం లో.. డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,హలవత్ సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, నాయకులు కందుల సందీప్, రవి, తదితరులు పాల్గొన్నారు,.,

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన.!

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

 

ఐనవోలులోని ప్రభుత్వ యునాని వైద్యశాల నీ సందర్శించిన రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ (RDD) డాక్టర్. ప్రమీల దేవి సందర్శించారు. జూన్ 21 న జరిగే
అంతర్జాతీయ యోగ దినోత్సవ
దశబ్ది వేడుకలు – 2025 దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల పాటు నిర్వహించేలా యోగ దశబ్ది వేడుకల ప్రణాళికను రూపొందినట్లు ఐనవోలు యునాని ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆరోగ్య మందిరాలు, వైద్య సబ్బంది, అంగన్వాడీ టీచర్లు,పిల్లలు,పెద్దలు,
గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘ యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ ‘అనే నినాదంతో యోగ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్, ఫార్మాసిస్ట్ శంకర్, యోగ శిక్షకులు అర్చన, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండలం పోతారం గ్రామం లో శ్రీ విరాజ్ హస్పిటల్ పేద్దపల్లి అద్వర్యం లో ఉచ్చిత వైద్య శిబిరం నిర్వయించారు
ఈ వైద్య శిబిరం లో డాక్టర్ రాజ్ కుమార్ దంత వైద్యులు ( మేనేజింగ్ డైరేక్టర్ ) డాక్టర్ చంద్రకుమార్ జనరల్ పిజిషన్
సదానందం మేనేజ్ మేంట్
రాజు మేనేజ్ మేంట్ మరియు మార్కేటింగ్ పాల్గోని గ్రామస్తులకు వైద్య పరిక్షలు నిర్వయించి ఉచితంగా మందులు పంపిణి చేసారు వైద్యులను మాజీ సర్పంచ్ నేత్తేట్ల మహేందర్ మరియు గ్రామస్తులు షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బందీ గ్రామస్తులు యూత్ సబ్యులు పాల్గోన్నారు

ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఏరియా ఆసుపత్రి ని సందర్శించి* ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి విభాగంలో రోగులతో మాట్లాడుతూ వారి సమస్యలను మరియు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

MLA Manik Rao

 

 

అనంతరం సూపరెండింట్ డాక్టర్ శ్రీధర్ ,డాక్టర్ గిరి, ఇతర వైద్యులు & స్టాఫ్ తో మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో స్టాప్ అంకితభావంతో సేవలందించాలని వచ్చే నెలలో తిరిగి ప్రతి విభాగంతో సమావేశం అవుతా అని అన్నారు.ఎమ్మెల్యే గారి తో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,బండి మోహన్, తదితరులు ఉన్నారు .

ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు.

కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు

గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను
అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

కడుపు నొప్పని వస్తే, కాటికి పంపిన బంధన్ హాస్పిటల్ వైద్యం.

బంధన్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం బలి.

హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించి వరంగల్ కి చెందిన మహేందర్ అనే వ్యక్తి మృతి.

అనుభవం లేని డాక్టర్లు వైద్యం చేయడం వల్లే మహేందర్ రావు మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువుల ఆందోళన.

హాస్పిటల్ లోనికి ఎవరిని అనుమతించని పోలీసులు. మృతుడి బంధువులు, పలువురిని హాస్పిటల్ లోనే ఉంచి తాళాలేసిన యాజమాన్యం.

మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు, న్యాయం చేయాలని బంధువుల డిమాండ్.

గతంలో కూడా బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించిన వైనం..

గతంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఉంటే ఈ మృతి జరిగేది కాదంటూ పలువురి ఆవేదన

చోద్యం చూస్తున్న “వైద్యాధికారులు”.! ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించేనా..?

*బంధన్ హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న హనుమకొండ వైద్యశాఖ అధికారులు?.

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? అపెండిక్స్ ఆపరేషన్ లు సైతం చేయరాని ఇలాంటి హాస్పటల్ ను సీజ్ చేయాలని బాధితుల డిమాండ్.

“బంధన్ ఆసుపత్రి” వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు?

నలుగురు డాక్టర్లు కలిసి కోట్లు పెట్టి హాస్పిటల్ లు కట్టడం.., పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమేనా వీళ్ళ టార్గెట్?

నాణ్యమైన వైద్యం అందివ్వడం చేతకాదా.. డబ్బుల సంపాదనే వీళ్ళ ప్రధాన ఎజెండా?

వరంగల్ నేటిధాత్రి:

అమ్మ జన్మనిస్తే.. ఏదైనా ప్రాణాపాయ స్థితి ఏర్పడితే దాని నుంచి కాపాడి.. పునర్జన్మనిచ్చే దేవుళ్లుగా వైద్యులను ఆరాధిస్తుంటారు. అలా గొప్పగా కీర్తించబడే పవిత్రమైన వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు అపఖ్యాతి తీసుకొస్తున్నారు. ఈ కోవకు చెందినవారే హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి వైద్యులు అని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు, వరంగల్ నగరం రంగశాయిపేట కు చెందిన మహేందర్ రావు అనే వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని అందుబాటులో ఉన్న అనుభవం లేని డి ఫార్మా,, బిఏఎంఎస్ చేసిన డాక్టర్లు పరిశీలించి ట్రీట్మెంట్ చేయడం వల్ల వ్యక్తి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ రావుకు గతంలోనే గుండెకు సంబంధించి వైద్యం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని గుండె కు సంబంధించిన డాక్టర్ను పిలవండి అని కుటుంబ సభ్యులు తెలిపిన కానీ, బంధన్ హాస్పిటల్ వాళ్ళు ఈ రోజు ఆదివారం గుండెకు సంబంధించి డాక్టర్ రారు, మేము చూసుకుంటాం అని, కనీసం జనరల్ అనస్థీషియా డాక్టర్ లేకుండానే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు. గ్యాస్ట్రిక్ సమస్య, కడుపునొప్పి, ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తి హాస్పిటల్ కు నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి, డిశ్చార్జ్ కూడా రాసిన డాక్టర్లు, మరి ఏమైందో, ఏమో కానీ అచ్చిరాని వైద్యం చేసి మంచిగున్న వ్యక్తిని నిర్లక్ష్యంగా ప్రాణాలు బలిగొన్నారు అని మృతుడి కుమార్తె మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. పేషెంట్ కు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కొరకు నడుచుకుంటూ బయటికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు బంధువులు.

hospital

పేషంట్ కొరకు కార్డియాలజిస్ట్ డాక్టర్ ను పిలవండి, లేదంటే మేము వేరే హాస్పటల్ కు వెళ్తాము అని, అంబులెన్స్ కూడా తెచ్చుకొని, హాస్పిటల్ దగ్గర దాదాపుగా మూడు గంటలు వేచి ఉన్నా కానీ, సదరు బంధన్ డాక్టర్లు నిర్లక్ష్యంతో అనుభవం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడం ద్వారా వ్యక్తి మృతి చెందిన సంఘటన. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసి, తమ తండ్రి మృతికి కారణం అయ్యారు బంధన్ హాస్పిటల్ డాక్టర్లు అని, ఈ హాస్పిటల్ లో ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లు అందుబాటులో లేరని, అనుభవం లేని డాక్టర్లు మాత్రమే వైద్యం చేస్తున్నారనీ నడుచుకుంటూ వచ్చిన మా నాన్నని నిర్లక్ష్యంగా వైద్యం చేసి మరణానికి కారకులయ్యారు అని మృతుడి కుమార్తెలు కన్నీరు పెట్టుకున్నారు. మహేందర్ రావు మృతి విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేశారు. వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి బంధువులతో, హాస్పిటల్ యజమాన్యంతో మాట్లాడారు. బంధన్ హాస్పిటల్ బడా బాబులది కావడం దీని వెనుక రాజకీయ నాయకుల అండ ఉండడంతో, సమస్యను మేము పరిష్కరించుకుంటాం అని చెప్పి, విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసిన తీరు ఆశ్చర్యం. ఏది ఏమైనా కానీ బంధం హాస్పిటల్ లో సరియైన డాక్టర్లు లేకుండానే వైద్యం చేస్తున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అనుభవం లేని డాక్టర్లు అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఫెయిల్యూర్ అయిన ఘటన మరువకముందే, కడుపు నొప్పితో బాధపడుతున్న మరో వ్యక్తి ఈ హాస్పిటల్ లో జాయిన్ అయి, మృతి చెందిన వార్త నగరంలో కలకలం రేపింది. గతంలోనే అపెండిక్స్ ఫెయిల్యూర్ కు సంబంధించి హాస్పిటల్ నిర్లక్ష్యం వలన తనకు అన్యాయం జరిగిందని ఒక జర్నలిస్ట్ హనుమకొండ వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా, సదరు వైద్య శాఖ అధికారులు కానీ, హనుమకొండ డిఎంహెచ్ఓ సైతం స్పందించకుండా, హాస్పిటల్ పై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. అప్పుడే వాళ్లు స్పందించి హాస్పిటల్ లో వైద్యులు ఎవరున్నారు? ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు? క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం.

గతంలో ఒక జర్నలిస్టుకు చేసిన అపెండిక్స్ ఆపరేషన్ సైతం ఫెయిల్యూర్

Hospital

బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలల పాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు జర్నలిస్టు కృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది 21 జూలైన అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జర్నలిస్ట్ కృష్ణకు.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సుమారు నాలుగు గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.  ఒకరోజు తర్వాత హాస్పిటల్ లో వైద్యం సరిగా లేకపోవడం గ్రహించిన కుటుంబ సభ్యులు.. వైద్యులను అడగగా.. ఎవరూ స్పందించకపోవడంతో.. ఆపరేషన్ వికటించిందని భావించి..జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వెంటనే హైదరాబాద్ బేగంపేట మెడికోవర్ హాస్పటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యారు. మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్న రోగిని చూసిన వైద్యులు ఇన్ఫెక్షన్ ఎక్కువ స్థాయికి చేరుకుందని అబ్జర్వేషన్ లో ఉంచి మరో ఆపరేషన్ చేశారు. దానికి పూర్తిగా అయిన ఖర్చు రూ.14 లక్షలు.. దానికి తోడు ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఐతే అంత పెద్దగా కావడానికి కారణం బంధన్ హాస్పటల్ లో జర్నలిస్టు కృష్ణకు 4 గంటల పాటు చేసిన వైద్యంలో

Hospital

జరిగిన తప్పిదమే కారణం అని బాధితుడు కృష్ణ ఆరోపించారు. అయితే బాధితుడు సర్జరీ చేసే సమయంలో రికార్డు అయిన వీడియో ఇవ్వమని పలుమార్లు అడిగిన కూడా బంధన్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ దాట వేయడంతో బాధితుడు తనపై చాలా ప్రయోగాలు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సమాజంలో జరిగే మంచి చెడును విశ్లేషించే పాత్రికేయుడి నైన తనకు సదరు ఆసుపత్రిలో అన్యాయం జరగగా.., ఇక సామాన్యుడి సంగతి ఏమిటని జర్నలిస్ట్ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బంధన్ ఆసుపత్రి వెనక ఉన్న రాజకీయ అండదండలను చూసి బెదరకుండా ఆసుపత్రిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

కల్వకుర్తి  నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం జన్మదినం సందర్బంగా.. శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పారు. రక్తదానము మహాదానం మీరు దానం చేసిన రక్తము ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ప్రాణము పోసి ఆ కుటుంబంలో ఆనందము నింపుతుంది. పరోపకార హృదయంతో మీరు చేసిన ఈ కార్యము ఎందరికో ఆదర్శ ప్రదమైనది. సమాజము పట్ల సేవా భావము కలిగిన మీ మంచి మనసుకు హృదయపూర్వకముగా అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు చేసిన మానవ సేవ మానవళికి ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శివరాం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు యశోద భాయ్, మాజీ కౌన్సిలర్ శానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ రాములు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు రేష్మ, దున్న భాస్కర్, యువ నాయకులు పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం, శివ, ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్.!

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

డ్యూటీకి డుమ్మా కొట్టిన 15 మంది డ్యూటీ డాక్టర్లు…

డాక్టర్లు,నర్సుల హాజరు రిజిస్టర్ ని పరిశీలించిన కలెక్టర్…

బయోమెట్రిక్,హాజరు బుక్ పంపించాలని సూపర్డెంట్ ని హెచ్చరించిన కలెక్టర్…

రోగులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపిన కలెక్టర్…

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన ని జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ హాస్పటల్ ల్లో విజిట్ చేసే సమయానికి ఈ రోజు డ్యూటీలో ఉండాల్సిన 15 మంది డాక్టర్లు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్ పూర్తి వివరాలు బయోమెట్రిక్ ,హాజరు రిజిష్టర్ తో వివరాలు జిల్లా కార్యాలయానికి పంపి,హాజరు కానీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపిన జిల్లా కలెక్టర్, హాస్పటల్ పరిసరాల్లో రోగులకు అందాల్సిన సేవలు పై అడిగి తెలుసుకుని తాగునీరు ఏర్పాటు చేయాలని మరియు ఒపీ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు…
హాస్పటల్లో డ్యూటీ చేస్తున్న నర్సులు హాజరు రిజిష్టర్ ని పరిశీలించి చికిత్సకు హాస్పటల్ వస్తున్న వారిపట్ల మర్యాదగా ఉండాలని రోగులకు సేవ చేస్తూ తగు గుర్తింపు తెచ్చ

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?

`సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు?

`‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం.

Rohini super speciality hospital hanamkonda

`రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!?

`అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు!

`చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు!

`ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా?

`మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా?

`ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా?

`అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు?

`వైద్య ఆరోగ్య శాఖ పెద్దల సమాధానం అర్థం లేనిది.

`‘‘డిహెచ్‌’’ ను అడిగితే ‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లకు ఆదేశాలిచ్చామంటారు.

`‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లు ‘‘కలెక్టర్‌’’ ఆదేశాలు కావాలంటారు.

`ఈ తికమక వ్యవహారం ఒక్క రోహిణికే ఎందుకు?

`ప్రభుత్వమే భయపడిపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

`‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధులను దుర్వినియోగంపై ‘‘సిఐడి’’ విచారణ ఎందుకు వేసినట్లు?

`‘‘సిఐడి’’ విచారణ చేసి ఆసుపత్రుల లిస్ట్‌ ఇచ్చిన తర్వాత మీన మేషాలెందుకు?

`ఆది నుంచి రోహిణి వివాదాలే! అక్రమాలే!!

`సరైన ‘‘ఫైర్‌ సేఫ్టీ’’ లేక ఏం జరిగిందో తెలుసు.

`‘‘కాలం చెల్లిన మందుల అమ్మకాలతో’’ పట్టుపడిన వైనం తెలుసు.

`ఇప్పుడు ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’. నిధుల గోల్‌మాల్‌ చూస్తున్నాం.

`రోహిణి సీజ్‌ కాకుండా అడ్డుపడుతున్నదెవరు?

`ఎందుకు జాప్యం చేస్తున్నారు?

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదెవరు?

ఒకటి కాదు. రెండు కాదు..ఒకసారి కాదు. రెండు సార్లు కాదు..అనేకసార్లు హన్మకొండలో వున్న రోహిణీ ఆసుపత్రి మీద ఆరోపణలున్నాయి. వివాదాలు చెలరేగాయి. మోసాలు, ద్రోహాలు, పాపాలు చేసినట్లు రుజువులు కూడా అయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అడ్డగోలు సంపాదనలు, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కుంభకోణాలపై సిఐడి చేత విచారణలు చేపట్టాయి…దర్యాప్తులు కూడా చేయించాయి. అందులోనూ రోహిణీ ఆసుపత్రి పేరు జాబితాలో వుంది. ఈ ఆసుపత్రిలో సిఎంఆర్‌ఎఫ్‌ రీఎంబర్స్‌ మెంటులో పెద్దఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కుల నిధుల గోల్‌మాల్‌కు పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి పాల్పిడినట్లు తేలింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల విషయంలో 28 ఆసుపత్రులు తప్పుడు, అనుమానాస్పద బిల్లులు సమర్పించి, కోట్ల రూపాయల నిధులను కొట్టేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. అందులో ప్రముఖ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి కూడా వుంది. క్రిమినల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌`2010 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆసుపత్రులను సీజ్‌ చేశారు. కాని హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి వైపు వైద్యశాఖ ఉన్నతాదికారులు కన్నెత్తిచూడడం లేదు. సిఐడి జరిపిన విచారణలో పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తేలినా, ఎందుకు అధికారులు స్పందించడంలేదు. అలసత్వం ఎందుకు చేస్తున్నారు. రోహిణీని సీజ్‌ చేయడంలో ఎందుకు ముందు,వెనుకాడుతున్నారు. రోహిణీ ఎన్ని పాపాలు చేసుకుంటూ పోతున్నా జిల్లా అదికార యంత్రాంగం పట్టించుకోదా? నేరాలు రుజువైనా చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? వెంటనే ఆ ఆసుపత్రులను రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అదికారులు దిక్కరిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలను కూడా అదికారులు బేఖాతరు చేస్తున్నారా? రోహిణీ చేస్తున్న మోసాలు చూసి చూడనట్లు వదిలేద్దామనుకుంటున్నారా? ప్రజల ప్రాణాలు తోడేస్తున్నా, ప్రభుత్వ నిధులు కాజేస్తున్నా పట్టించుకోరా? రోహిణీ ఆసుపత్రిపై ఎన్ని వివాదాల చుట్టుముట్టినా ఇప్పటి వరకు వదిలేశారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు రిపోర్టును కూడా పక్కన పెడతారా? లేదా జాబితా నుంచి రోహిణీ ఆసుపత్రి పేరు తొలగిస్తారా? ఏం చేయాలనుకంటున్నారు? ఇలా రోహిణీలాంటి ఆసుపత్రులు బరితెగించి ప్రభుత్వ సొమ్మును కోట్లలో మెక్కుతుంటే కూడా వదిలేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దర్యాప్తును చెత్తబుట్టకు పరిమితం చేస్తారా? అలాంటప్పుడు వ్యవస్దలెందుకు? విచారణలెందుకు? ఆ దర్యాప్తులెందుకు? నివేదికలు ఎందుకు? ఆసుపత్రులు ఎన్ని తప్పులు చేసినా వదిలేసినప్పుడు, ప్రభుత్వం అనవసరంగా వాటిపై నిఘాలు పెట్టడం ఎందుకు? ప్రజల పన్నులతో వ్యవస్దలను నిర్మాణం చేయడమెందుకు? ప్రాణాలు పోయాల్సిన రోహిణీ లాంటి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలౌతున్నప్పుడు చూసీ, చూడనట్లు వదిలేశారు. గతంలో అనేక తప్పుల మీద తప్పులు చేసినా ఉపేక్షిస్తూనేపోయారు. ఇప్పటికే అనేకసార్లు ప్రజా సంఘాలు రోహిణీ మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, నిరసలు చేపట్టారు. అప్పుడూ చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన విచారణలో రోహణీ ఆసుపత్రి దోషి అని తేలింది. నిదుల గోల్‌ మాల్‌ చేసినట్లు వెల్లడైంది. అయినా అదికారుల్లో చలనం లేదు. కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. రోహిణీ ఆసుపత్రి సీజ్‌ చేయడానికి అదికారులు ధైర్యం చేయడంలేదు. ప్రభుత్వానికన్నా పెద్ద వ్యక్తులు ఎవరైనా వున్నారా? వాళ్లేమైనా ప్రభుత్వ అధికారులను ఆపుతున్నారా? తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు చేస్తూ పోతోంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? రోహిణీ మరింత దోపిడీకి వైద్య వర్గాలు సహకరిస్తున్నట్లు కాదా? రోహిణీ ఆసుపత్రిని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఆ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు అదికారులు కుంటి సాకులు చెబుతున్నారు. అంటే అధికారులు కూడా తప్పులు చేసి వుండాలి. లేకుంటే ఆసుపత్రి వర్గాలకు భయపడుతూనైనా వుండాలి. ఇందులో ఏది నిజమో అధికారులే చెప్పాలి. రోహిణీని ముట్టుకునే శక్తి లేనప్పుడు ఆ ఆసుపత్రిని జాబితాలో ఎందుకు చేర్చారు? చిన్నా చితకా ఆసుపత్రులను హడావుడిగా రాత్రికి రాత్రి మూసేశారు. రోహిణీ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాలంటే అదికారులు భయపడుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? లేక ధైర్యం చాలడం లేదని చేతులెత్తేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడిన తర్వాత ఎంత పెద్ద ఆసుపత్రి అయితే ఏమిటి? దాని వెనక ఎంత పెద్దవాళ్లు వుంటే ఏమిటి? అదికారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపోవడం విచారకరం. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే రోహిణీ ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ను ప్రశ్నిస్తే, డిఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని చెబుతున్నారు. డిఎంఅండ్‌హెచ్‌వోలతో మాట్లాడితే కలెక్టర్‌ ఆదేశాలు ఇంకా రాలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వమే ఆ ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కలెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించలేదు. సిఐడి నివేదికలో ఏమైనా పొరపాట్లు వున్నాయా? తేల్చమని కలెక్టర్లను కోరలేదు. అలాంటప్పుడు ఆసుపత్రులను సీజ్‌ చేయడానికి కలెక్టర్‌ ఎందుకు? కలెక్టర్‌ను ఎందుకు బద్‌నాం చేస్తున్నారు? అది కూడా సరే అనుకున్నా, కలెక్టర్‌ దృష్టికి జిల్లా వైద్యాధికారులు తీసుకెళ్లారా? అంటే అదీ లేదు. కాని కలెక్టర్‌ పేరు చెప్పి జాప్యం చేస్తున్నారు. ఇలాంటి తికమక వ్యవహారాలు ఒక్క రోహిణీకే ఎందుకు? తెలంగాణలో ఇప్పటి వరకు సీజ్‌ చేసిన ఏ ఆసుపత్రి విషయంలో అదికారులు ఇలా మీన మేషాలు లెక్కించలేదు. కనీసం ఆయా ఆసుపత్రులకు వారం రోజులకన్నా ఎక్కువ గడువు ఇవ్వలేదు. కాని రోహిణీకి మాత్రమే ఈ మినహాయింపు ఎందుకు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వ వైద్యాదికారులే ఆసుపత్రి వర్గాలకు భయపడుతుంటే, సామాన్యులకు న్యాయంచేసేదెవరు? సామాన్యులకు అండగా నిలిచేదెవరు? ఆది నుంచి రోహిణీ విషయంలో అన్నీ వివాదాలే. గతంలో ఫైర్‌ సేప్టీలేకపోవడంతో ఆసుపత్రిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆసుపత్రిలో మంటలు చెలరేగి రోగులుకూడా చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అంటే ఆసుపత్రి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వుందో ఆ సంఘటనతో తేలిపోయింది. అప్పుడే ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాల్సి వుంది. కాని అప్పుడూ అదికారులు ధైర్యం చేయలేదు. కనీసం ఆసుపత్రికి నోటీసులు కూడా జారీచేయలేదు. తర్వాత అదే ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను మెడికల్‌ షాపుల ద్వారా రోగులకు అంటగడుతూ వచ్చారు. ఆ విషయంలో కూడా రోహిణీ ఆసుపత్రిలో అక్రమ సంపాదన పైత్యం వెలుగు చూసింది. అదే ఆసుపత్రిలో వైద్యానికి వచ్చిన రోగులకు గడువు ముగిసిపోయిన, కాలం చెల్లిన మందులను అదే ఆసుపత్రి వైద్యానికి ఇస్తే ఏం జరగుతుందో తెలియందా? అంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆసుపత్రిపై ప్రభుత్వ వర్గాలకు ప్రేమ ఎందుకు? అధికారులకు ఆసుపత్రి మీద మమకారమెందుకు? ఏ ఆసుపత్రిలోనైనా ఇంత దుర్మార్గం వుంటుందా? వైద్యానికి వచ్చిన రోగులకు పాడైపోయిన మందుల చేత వైద్యం చేసే ఆసుపత్రులు ప్రపంచంలో ఎక్కడైనా వుంటాయా? ఆ ఆసుపత్రికి రోగులంటే ఎంత నిర్లక్ష్యమో! ఇక్కడే తేలిపోయింది. పట్టుబడిరది. అయినా చర్యలు తీసుకున్నది లేదు. ఆసుపత్రిని సీజ్‌ చేసిందిలేదు. ఇప్పుడు కూడా ఆసపత్రిపై చర్యలు తీసుకుంటారన్ననమ్మకం లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌ జరిగిందని తెలిసి ప్రభుత్వం వేసిన సిఐడి విచారణకు క్రెడిబిలిటీ లేనట్లేనా? రోహిణీ ఆసుపత్రికి మినహాయింపు ఇచ్చినట్లేనా? రోహిణీ ఎన్ని పొరపాట్లు చేసినా అదికారులు ఉపేక్షించుకుంటూ పోతూనే వుంటారా? ఎవరు సమాధానం చెబుతారు?

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి రోగులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు నేహా ఫరీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version