రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T140655.340.wav?_=1

 

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

రామాయంపేట, అక్టోబర్ 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన రైతు పేగుడ దుర్గయ్య (68) మృతి చెందడంతో గ్రామం మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి.
సుమారు 25 రోజుల క్రితం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లుచిరుగి పొలం వద్దనే కుప్పకూలిన దుర్గయ్యను చుట్టుపక్కల రైతులు గమనించారు. వెంటనే స్పందించిన వారు 108 అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వగా, అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి ఆయనకు రక్తపోటు అత్యధికంగా పెరగడంతో కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించిన కుటుంబ సభ్యులు, మేడ్చల్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయితే 26 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దుర్గయ్య చివరకు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.
రైతు దుర్గయ్య భార్య లక్ష్మి కూడా సుమారు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను విడిచి వెళ్లిపోయిన దుర్గయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల విలాపాలతో తోనిగండ్ల గ్రామం మునిగిపోయింది.
గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు దుర్గయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. “ఆయన ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. కుటుంబం కోసం జీవితాంతం శ్రమించారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేం” అని గ్రామస్థులు కన్నీటి కణాలతో గుర్తుచేశారు.

శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి వైద్యుల సేవలతో కోలుకున్నా బాలుడు..

శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి వైద్యుల సేవలతో కోలుకున్నా బాలుడు..

రామాయంపేట, అక్టోబర్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి,కంటి ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు.జ్వరంతో బాధపడుతూ,ప్రమాదకరంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిన గజ్వేల్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రిత్విక్ నందన్ 7 సంవత్సరాల బాలుడిని విజయవంతంగా చికిత్స చేసి ఆరోగ్యవంతుడిగా మార్చారు. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలుడి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండగా, పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రావు పర్యవేక్షణలో వైద్య బృందం ప్రత్యేక చికిత్సా విధానాలతో సేవలు అందించారు.వైద్యుల కృషి ఫలితంగా బాలుడి ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణ స్థాయికి చేరుకుంది.ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో శుక్రవారం బాలుడిని డిశ్చార్జి చేశారు.ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడికి ఉత్తమ వైద్యం అందించి ప్రాణం కాపాడిన డాక్టర్ ప్రదీప్ రావు మరియు ఆసుపత్రి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పట్టణ ప్రజలు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో శ్రీరాజరాజేశ్వర ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు ఇటువంటి నిబద్ధత కలిగిన వైద్యులు రామాయంపేటకు గర్వకారణమని ప్రశంసించారు.

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

ఓదెల (పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం గుంపుల మానేరు వాగులో మద్యం మత్తులో మునిగి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఎస్సై దీకొండ రమేష్ ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెళ్ళి రవీందర్ (51) హమాలీ వృత్తి చేస్తున్న రవీందర్ తరచుగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య, కుమారుడు మందలించగా గుంపులలో గల రామభద్ర ఆలయ సమీపానికి వెళ్లాడు. అనంతరం తన కుమారుడికి ఫోన్ చేసి అక్కడ ఉన్నానని తెలిపాడు. కుమారుడు దిలీప్, బంధువు రాజు అక్కడికి చేరుకోగా ఒడ్డున బట్టలు ఉండగా, రవీందర్ నీటిలో కనిపించాడు. బయటకు రావాలని కుమారుడు పిలవగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే కుమారుడు బయటకు తీసుకురాగా అప్పటికే స్పృహ తప్పి ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందాడని ధృవీకరించారు. ఈ ఘటనపై దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.

ఆలయాన్ని సందర్శించే ఆసుపత్రిని మర్చిపాయె…

ఆలయాన్ని సందర్శించే ఆసుపత్రిని మర్చిపాయె???
మర్రి చెట్టుకున్న విలువ మనుషుల ప్రాణాలకు లేకపాయే???
పక్కనుండే వెళ్లిపోయినా ప్రజలు ఇక్కట్లను గుర్తు చేయని కోటరీ..
బురద నీటితో ఉన్న ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడకపోవటంలో ఆంతర్యం ఏమిటీ
సమయం లేకనా.. సమాచార లోపమా????

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

అయినవోలు మండల కేంద్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఐలోని మల్లికార్జున స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన శివాలమర్రి గా పేరుపొందిన 200ఏళ్ల నాటి మర్రిచెట్టు నేలకొరిగింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను మరియు దేవాదాయ శాఖ అధికారుల సమాచారం మేరకు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హుటాహుటిన టెక్సబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి అట్టి శివాల మర్రి స్థలాన్ని సందర్శించారు. అన్ని శాఖల సమన్వయంతో నేలకొరిగిన ప్రతిష్టాత్మకమైన శివాలమర్రి ని మళ్లీ పున ప్రతిష్టాపన చేస్తామని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అదే అయినవోలు మండలంలో కురుస్తున్న గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా వర్షం నీరు రెండు గేట్ల వద్దనే నిలిచిపోయి లోపలికి వెళ్లేందుకు రోగులు ఇబ్బందులు పడుతున్నారని పత్రికల్లో కథనాలు ప్రచురితం అవుతున్న కూడా ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. మర్రిచెట్టు నేలకొరిగింది అనగానే హుటాహుటిన బయలుదేరి వచ్చిన ఎమ్మెల్యే అదే మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడే ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయాన్ని స్థానిక నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారా. అంటే రోగులకు ఇక్కట్లు తలెత్తుతున్నాయన్నా కూడా ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి చూడలేదు అంటే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చెప్పాలి.ఏది ఏమైనా ఒక చెట్టుకు ఇచ్చిన విలువ మనుషుల ప్రాణాలను కాపాడే ఒక ఆసుపత్రికి ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు…

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి

 

 

 

మాజీ ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బస్టాండ్ కూడలిలో బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించారు.అనంతరం స్థానిక ప్రభుత్వ దవాఖానలో రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ పరకాల అభివృద్ధి పదంలోకి వచ్చింది అంటే అది ధర్మారెడ్డి గతంలో పట్టణానికి తీసుకువచ్చిన 100 పడకల ఆసుపత్రి,ప్రభుత్వ కార్యాలయాలు,టెక్సటైల్ పార్క్ ఇవన్నీ నిదర్శమని మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీల తరుపున నియోజకవర్గ ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,మహిళా నాయకురాళ్లు,యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T122009.181.wav?_=2

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: దైవ దర్శనానికి వెళ్తూ దుర్ఘటనకు గురైన కుటుంబంలో విషాదం నెలకొంది. జహీరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. పస్తాపూర్ ఆనంద్నగర్ కాలనికి చెందిన దండు వెంకటేశం (45), ఆయన అక్క కొడుకు సాయికుమార్ (20) ప్రాణాలు కోల్పోయారు. జహీరాబాద్ నుంచి న్యాల్కల్ మండలంలోని ముంగి ఆశ్రమానికి బయలుదేరిన ఈ కుటుంబం రైల్వే గేట్ దాటిన కాసేపటికే దుర్ఘటన చోటుచేసుకుంది.

 

బీదర్ నుంచి జహీరాబాద్ వస్తున్న లారీ అజాగ్రత్తగా అతివేగంగా దూసుకొచ్చి, ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన బలానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వెంకటేశం సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడిన వారు వరలక్ష్మి అలియాస్ భవాని (వెంకటేశం భార్య), నాగేశ్వరరావు (బావ), పిల్లలు రిషికేశ్, హరిచందన, జాన్వీ వీరు అందరూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

సంఘటన సమాచారం అందుకున్న వెంటనే సీఐ శివలింగం, ఎస్ఐలు నవీన్ కుమార్, కాశీనాథ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుని మృత్యువుతో పోరాడుతున్న సాయికుమార్ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అంబులెన్స్లో తరలిస్తుండగా అతను దుర్మరణం పాలయ్యాడు. ఇరుక్కున్న క్షతగాత్రులను తాళ్లు, ఇనుప రాడ్ల సహాయంతో బయటికి తీశారు. అనంతరం మృతదేహాలను పట్టణంలోని ఏరియా ఆసుపత్రి మార్చురికి తరలించారు.

సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి…

సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి

కామ్రేడ్ చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సొంత ఇంటి కోసం 200 గజాల స్థలం ఇవ్వాలి
కార్మికుడి సంవత్సర జీవితంలో మూడు నెలలు ఇన్కమ్ టాక్స్ కట్టడానికే సరిపోతున్నది అందువలన కనీసం అధికారులలాగా పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ను మాఫీ చేయాలని కోరుతున్నాం.
సింగరేణిలో రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక భూగర్భగనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం
సేఫ్టీ ట్రైపాడ్ సమావేశాలు గత 18 నెలల నుండి జరగకపోవడం వలన రక్షణ విషయంలో వెనుకబడినట్లుగా భావిస్తున్నాం. నూతన బదిలీ విధానం కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం
మెరుగైన క్యాడర్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతప్రమోషన్ పాలసీని తీసుకురావాలని కోరుతున్నాము
ఏరియా ఆసుపత్రులలో నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం రిఫరల్ సిస్టంను మార్చలని మైన్ యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్కు గురైన కార్మికుడిని ముందుగా డిస్పెన్సరీకి తీసుకువెళ్లడం తర్వాత ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లడం తర్వాత రిఫరల్ చేయడంతో చాలా సమయం వృధా అయి విలువైన ప్రాణాలను కోల్పోతున్నందున ప్రమాదం జరిగిన వెంటనే ఏరియా ఆసుపత్రి నుండే డైరెక్టుగా రిఫరల్ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
40/ లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం
ఎన్నో ఏళ్లుగా కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేరుల సమస్యను వెంటనే తీర్చాలని కోరుతున్నాం
పై సమస్యల పరిష్కారానికి తగు చర్యను వెంటనే తీసుకొని సింగరేణి కార్మిక లోకానికి న్యాయం చేయాలని కోరుతున్నాం వివిధ కారణాల వలన ఉద్యోగాలను కోల్పోయిన డిస్మిస్డ్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అన్ని డివిజన్లో ఉన్న వాళ్లకు వన్ టైం సెటిల్మెంట్ లో ఇవ్వాలి సింగరేణి కార్మికుల ఎన్నికలలో వాగ్దానం చేసి ఇప్పటివరకు వాటిని అమలు చేయలేకపోతున్నారు వెంటనే అమలు చేయాలి చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు

పరకాలలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం….

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-61-1.wav?_=3

పరకాలలో ఘనంగా అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం

రోగులకు పండ్లు పంపిణీ చేసిన అసోసియేషన్ నాయకులు

పరకాల నేటిధాత్రి
186వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు పరకాల పట్టణ అవుట్ డోర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎంఓ డాక్టర్.బాలకృష్ణ తో కలిసి అసోసియేషన్ సభ్యులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్ కి పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీధర్ రూరల్ అధ్యక్షులు కె.కృష్ణ ప్రధాన కార్యదర్శి బండారి గిరిప్రసాద్ ల్,కోశాధికారి గూడెల్లి శివ ల్,ఉపాధ్యక్షులు పసుల బిక్షపతి,ఆకుల వెంకటేష్,క్యాతం రాజు,సుమన్,రమేష్,సాయికిరణ్,వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్..

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 26:

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) సిబ్బందికి అమర హాస్పిటల్ లో శనివారం మెగా మెడికల్ చెకప్ ప్రారంభమయ్యింది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వులు మేరకు, టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ లోని పోలీసులు, అటవీ శాఖ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పూర్తి స్థాయి మెడికల్ చెకప్ లు చేపట్టారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గౌరినేని రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారుఈ సందర్భంగా

ఎస్పీ పీ శ్రీనివాస్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వార్షిక మెడికల్ చెకప్ చేయడానికి ఈ ఏడాది అమర హాస్పిటల్ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది యావన్మందికి రెండు రోజులు పాటు మెడికల్ చెకప్ చేస్తున్నారని తెలిపారు. అమర ఎండీ రమాదేవి మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. పుష్ప సినిమాలో ఉన్నది సినిమా హీరో అయితే, రియల్ హీరోలు టాస్క్ ఫోర్స్ సిబ్బందే నని కొనియాడారు. మున్ముందు అవసరమైన ఇతర చికిత్సలు కూడా అందజేస్తామని చెప్పారు. అమర చైర్మన్ డాక్టర్ గౌరినేని ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం గా ఉండటమే జీవితంలో నిజమైన విజయం సాధించడమని తెలిపారు. మెడికల్ చెకప్ లో భాగంగా రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ లాంటి టెస్ట్ లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు జి. బాలిరెడ్డి. వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్, ఆర్ఐలు కృపానంద, సాయి గిరిధర్, సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఇంకా ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బందితో పాటు హాస్పిటల్ జీఎం ఆనంద్, సీఈఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి ఆవరణలో రోగులపై కొండ ముచ్చుల దాడి..

ఆసుపత్రి ఆవరణలో రోగులపై కొండ ముచ్చుల దాడి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T123430.605.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం మధ్యాహ్నం కొండ ముచ్చులు దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి, రోగులకు రక్షణ కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.

కాంతి హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే.

కాంతి హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్…

నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించడానికి కృషి చేయండి… ఎమ్మెల్యే మురళి నాయక్…

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపాలిటీ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రాంతి హాస్పిటల్ ని గురువారం ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన మహబూబాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్, డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి,

సుదూర ప్రాంతాల నుంచి వైద్య నిమిత్తం వచ్చే నిరుపేద వారికి అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించాలని, సామాజిక సేవ సాటి మనిషికి సహాయం చేసే అత్యంత గౌరవప్రదమైన వైద్య వృత్తిలో మరింత అభివృద్ధి చెందాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ హాస్పటల్ యాజమాన్యం శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, ,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ పీసీసీ సభ్యులు దాస్రు నాయక్,బండారు దయాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేష్ ,జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

డయాలసిస్ లో బెస్ట్.. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి దక్కిన అరుదైన గౌరవం!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-92.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

డయాలసిస్ సేవల కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్న జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి అరుదైన గౌరవం దక్కింది. జాతీయస్థాయిలో ప్రతి ఏటా నిర్వహించే “బెస్ట్ సెంటర్ అవార్డ్స్” విభాగంలో ఉత్తమ డయాలసిస్ సెంటర్ అవార్డును ఈ ఆసుపత్రికి వరించింది. ఇందులో రోజుకు సగటున 30 మంది పేషంట్లకు డయాలసిస్ చికిత్సలు అక్కడి వైద్యులు అందజేస్తున్నారు. వీరి ఉత్తమ సేవలకు గాను ఈ అవార్డు దక్కడం పట్ల జిల్లా ఇన్చార్జి వైద్యాధికారిని డాక్టర్ గాయత్రి, డీ.సీ.హెచ్.ఎస్ డాక్టర్ సంగారెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు సేవలు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 2018లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 600 మంది వరకు ఈ సెంటర్లో చికిత్స పొందారు. ప్రస్తుతం 65 మందికి ఇక్కడ డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. ఈ సెంటర్లో ప్రస్తుతం 10 బెడ్స్ ఉండగా రోజుకు 30 మందికి మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు డయాలసిస్ వైద్య సేవలను ఇక్కడి సిబ్బంది కొనసాగిస్తున్నారు.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-79.wav?_=6

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన.

జమ్మికుంట ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
(జమ్మికుంట: నేటిధాత్రి)
జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి సందర్శించారు ఆస్పత్రులోని రికార్డ్స్ పరిశీలించారు అన్ని వార్డులను సందర్శించి రోగులతో సమస్యలపై మాట్లాడారు సిబ్బంది అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పనితీరును రోగులతో అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లకు భరోసా కల్పించే విధంగా వైద్యం అందించాలని జవాబుదారితనంగా పనిచేయాలని ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం కలిగించే విధంగా వైద్యులు అలాగే సిబ్బంది మెదులుకోవాలని ఆస్పటల్ సూపర్డెంట్ కు సూచించారు.

గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ పండ్లు పంపిని.

గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ పండ్లు పంపిని.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలో గురు పౌర్ణమి సందర్భంగా జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సమక్షంలో పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ పవర్ మరియు టీబేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి రామ్ రాథోడ్ వారితోపాటు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ రవీందర్ చవాన్, మాజీ సర్పంచ్ కేశవరం రాథోడ్,

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జహీరాబాద్ మండల అధ్యక్షులు ధర్మరాజు, ఎక్స్ ఆర్మీ రామ్ సింగ్ రాథోడ్, రఘు రాథోడ్, రమేష్ బానోత్ టీచర్, చందర్ పవర్, శీను బానోత్, ధర్మ, సింగ్ పవర్, ఎక్స్ ఆర్మీ పాండు సింగ్ రాథోడ్, రమేష్ పోలీస్, శివాజీ రాథోడ్, అర్జున్ టీచర్, మోహన్ కృష్ణ, తదితరులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన.

సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

◆ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,

◆ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్‌రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

 

జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంకటి శుక్లవర్ధన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ సెంటర్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.సురేష్‌కుమార్ శెట్కార్,రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.

గిరిధర్‌రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹ సిద్దం.ఉజ్వల్‌రెడ్డి ప్రారంభించారు.

ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ టీ జీఐడీసీ చైర్మన్ మహ్మద్ తన్వీర్,సీడీసీచైర్మన్ ముబీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల అధ్యక్షులు పట్లోల్ల రాంలింగారెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి, కండెం.

 

Congress leaders

 

 

 

నర్సింహులు,నర్సింహారెడ్డి,మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,సీనియర్ నాయకులు భీమయ్య,జమిలాలోద్దిన్,అక్తర్ గోరి,జావిద్,జాఫర్‌,అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగిరెడ్డి,సీనియర్ నాయకులు మల్లారెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,అరుణ్ కుమార్,అక్బర్,అశ్విన్ పాటిల్,హర్షవర్ధన్ రెడ్డి,జి.కిరణ్‌కుమార్‌గౌడ్,నథానెయల్,జగదీశ్వర్ రెడ్డి,మల్లికార్జున్,నర్సింహా యాదవ్‌,సునీల్,రాజు,జుబేర్,ఇమామ్‌ పటేల్‌ మరియు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్…

నేటి ధాత్రి మహబూబాబాద్:

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వేగంగా వైద్యం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు.మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ,ఆసుపత్రిలోని మెడికల్,ఫీవర్,క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, పిరియాడిటిక్ , జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్, తదితర వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పలకరించారు.ఆలన కేంద్రం లో క్యాన్సర్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్, హోమ్ కేర్ లు తదితరులతో మాట్లాడుతూ,వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో కావలసిన అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ స్థితిగతులను తెలుసుకున్నారు.పనులను వేగంగా పూర్తి చేయాలని అందుకు ప్రతినిత్యం కాంట్రాక్టర్లు సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.రోగులకు నిత్యం వైద్య సేవలు అందిస్తూ షిఫ్టులవారీగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్

వనపర్తి నేటిధాత్రి:

కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ భూమి పూజ పేరుతో హంగామా చేశారని ఎమ్మెల్యే అన్నారు
కొత్తకోట లో గతంలో కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన ఆరుపడకల ఆసుపత్రిలోనే ఇప్పటికీ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయనిఅన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామనిఅన్నారు హాస్పటల్ నిర్మాణాన్ని పూర్తి చేయించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే జి మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు.

పల్లె ప్రజా దవాఖాన అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా.

పల్లె ప్రజా దవాఖాన-అమ్మతోడు వైద్యం లేదు ఏ కోసనా…

గార్ల నేటి ధాత్రి:

ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలు నిధుల వెచ్చించి సుందరమైన సువిశాలమైన అన్నీ వసతులతో కూడిన పల్లె దవాఖానలను కట్టించి,సరిపడ సిబ్బందిని నియమించి,జీతాలు,పనిముట్లు,వైద్య సామాగ్రి,మందులు,మెయింటనెన్సు అలవెన్సులు ఇచ్చి ప్రజలకు కనీస ఆరోగ్య అవసరాలు తీర్చజూస్తుంటే స్థానిక గార్ల మండలంలోని పెద్దకిష్టాపురం గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానతో మాత్రం తమకు ఏమాత్రం ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మీ సేవే మా లక్ష్యమని-మేమున్నాము,మీ రు ధైర్యంగా వచ్చి వైద్యం చేయించుకొమ్మని ప్రజలకేనాడు నమ్మకం కల్గించిన పాపాన ఇక్కడి సిబ్బంది పోలేదంటున్నారు.ఈ దవాఖానలో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడ నియామకమైనప్పటి నుండి నేటికీ స్థానికంగా నివాసముండక, అందుబాటులో అసలుండక,ఖమ్మం నుండి నిత్యం అప్ అండ్ డౌన్లు చేస్తుంటారు.విచిత్రమైన విషయం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆస్పత్రిలో ఒక్క డాక్టరు కూడా పనిచేయడం లేదు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ముంచుకోస్తున్న వేళ గ్రామంలో విషజ్వరాలు,డెంగీ కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.ఇక్కడి వైద్యులు, సిబ్బంది డియం అండ్ హెచ్ వో మెడికల్ క్యాంపులనేర్పాటు చేసినపుడు మాత్రమే కనపడి,మిగతా వేళల్లా అపరిచితమే అన్నట్టుంది.వేలకు వేల జీతాలు తీసుకుంటూ,ఏజన్సీ పల్లె ప్రజల అనారోగ్యాలను బేఖాతరు చేస్తూ వైద్య వృత్తికే కళంకం చేస్తున్నారని ప్రజలు నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు.ఏదో ఒక సమయంలో హెల్మెట్ల ధరించుక వచ్చి,రిజిష్టరులో సంతకాలు చేసుకుని వెళుతున్నా,గిరిజన ప్రజలింకా చోద్యం చూస్తూనే ఉన్నారు.ఆస్పత్రి చుట్టూ పిచ్చి మొక్కలు,సిరంజీలు,వైద్య వేస్టులు, కుళాయి లేని నల్లా కనెక్షను నీటితో నిండే నిరంతర మురికి గుంటలతో పరిసరమంతా మురికిమయమైనా ఈ సిబ్బందికి మాత్రం పట్టదు.కురుస్తున్న వర్షాలకు పల్లెలో ఇంటికో ముగ్గురు చొప్పున విషజ్వరాల బారినపడి గతంలో గార్ల, మహబూబాబాద్, ఖమ్మం వంటి పట్టణాలకు గిరిజనులు దారులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ సూదిమందుకి గానీ మందుబిళ్ళకి గానీ ఆసరా లేక,ఏనాడూ తిమోఫాస్ వంటి దోమల మందులు పిచికారీ చేయక,దోమతెరల పంపిణీ చేయక,ఫ్రైడే-డ్రైడేలు,శానిటేషన్ నిర్వహించక,పేదలకు నెలవారీ బి.పి,షుగరు మాత్రలు ఇవ్వక,రోగాల నివారణపై ప్రజల చైతన్యపర్చని ఈ దవాఖాన గానీ,ఈ సిబ్బంది గానీ మాకెందుకని పల్లె ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దేనికీకొరగానిదానిగా ఆస్పత్రిని మార్చి,కర్తవ్యాన్ని మర్చిన ఈ సిబ్బందిమాకొద్దని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.అలాగే ఇక్కడి సిబ్బంది పనితీరుపై ప్రజాక్షేత్రంలో సమగ్ర విచారణ జరిపి,వారు ఏమాత్రం పనిచేయక తీసుకున్న జీతాలను,ప్రభుత్వం రికవరీ చేసి,తగు శాఖాపరమైన చర్యలు తీసుకుని,వారిని స్థానచలనం కలిగించాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరా

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…

ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version