హలో బీసీ చలో ఇందిరా పార్క్ మహాధర్నాకు కదిలిన డిఎస్పి నాయకులు….

హలో బీసీ చలో ఇందిరా పార్క్ మహాధర్నాకు కదిలిన డిఎస్పి నాయకులు.

చిట్యాల, నేటిదాత్రి :

 

 

హాలో బీసీ ఛలో ఇందిరా పార్క్ (హైదరాబాద్ )
జస్టిస్ ఈశ్వరయ్య, చిరంజీవులు రిటైల్డ్ ఐ ఏ ఎస్ డా. విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు 42%బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ– జేఏసీ ఆధ్వర్యంలో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చాలి. అనే డిమాండ్ తో.* హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న మహాధర్నాన్ని విజయవంతం చేయడం కోసం ధర్మ సమాజ్ పార్టీ నాయకులు చిట్యాల మండలం నుండి బయలుదేరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు శీలపాక నాగరాజ్, మండల నాయకులు పుల్ల అశోక్, రత్న రమేష్, చిలుముల కృష్ణ, పర్లపల్లి వంశీ మరియు వంగ రాంబాబు గౌడ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన….

కాంగ్రెస్ ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన.

భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి

* ఈ ప్రభుత్వం ఏ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు

* రైతు రుణమాఫీ మధ్యలోనే ఆపారు

యూరియా సకాలంలో రాలేదు

ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు రాలేదు

రాజీవ్ యువశక్తి మొదలే పెట్టలేదు

మహిళలకు 2500 రానేలేదు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ్ పార్టి భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీ.సీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హడావిడిగా ఎన్నికలు నిర్వహించుటకు సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టి న్యాయం చేస్తే మేం స్వాగతిస్తాం. కానీ న్యాయ నిపుణులతో చర్చించకుండా?సాధ్య , అసాధ్యాయులు అంచనా వేయకుండా? ఎన్నికల జీ.వో తీసుకురావడాన్ని హైకోర్టు స్టె ఇచ్చింది. దీనివల్ల ప్రజలు అధికారులు అసహనానికి గురవుతున్నారు. ప్రజాధనం వృధా అవుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. అసమర్థ పాలనతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇది ప్రజా పాలన కాదు వాయిదా పాలన? అని విసిగిపోతున్నారు. ఏ పని మొదలుపెట్టిన మధ్యలోనే ఆపేస్తున్నారు. రైతు రుణమాఫీ అందరికి జరగలేదు. యూరియా సకాలంలో రాలేదు. రాజీవ్ యువ శక్తి లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అన్ని గ్రామాలకు అందలేదు. బతకమ్మ చీరలు లేవు. సకాలంలో ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ప్రజలకు అవసరమైన ఆయకట్టు రోడ్లు లేవు. అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుటకు కారణం మేధావులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయం తీసుకోక పోవడమే ఇప్పటికైనా సంపూర్ణ పరిపక్వ నిర్ణయాలతో ప్రజలకు సేవ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ప్రభుత్వానికి సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version