కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్సార్.

* కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్సార్.**

*మొగుళ్లపల్లి నేటి ధాత్రి

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో మండలానికి చెందిన లబ్ధిదారులకు 61 మందికి 61,07,076/- రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు* పంపిణీ చేశారు.అనంతరం మండలంలోని ములకలపల్లి, మోట్లపల్లి, మెట్టుపల్లి,మొగుళ్లపల్లి, ఇసిపేట,రంగపురం గ్రామాలలో పి.ఎ.సి.ఎస్ మరియు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన సన్న ధాన్యానికి మద్దతు ధర 2389/- రూపాయలతో పాటుగా బోనస్ 500 రూపాయలు ఇస్తుందని తెలిపారు, వ్యవసాయ శాఖ అధికారులు కోత మిషన్ల యొక్క ఆర్పిఎం 18 నుండి 20 వరకు మరియు బ్లోయర్ ఆన్ లో ఉంచే విధంగా కోత మిషన్ యజమానులకు తెలియజేయాలని ఇలా చేయడం వల్ల ధాన్యంలో తాలు ఉండదని తెలిపారు రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. మధ్యవర్తి జోక్యం లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని రైతులకు సమయానికి డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అలాగే కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు సక్రమంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్న వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, డిసిఓ , చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి గారు వైస్ చైర్మన్ ఎండి రఫీ మాజీ సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు స్థానిక సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గణపురం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్ఆర్

గణపురం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్ఆర్

గణపురం నేటి ధాత్రి

గణపురంమండలంలోని జంగుపల్లి, బస్వరాజుపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే విక్రయించుకోవాలని సూచించారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు దళారుల బెడద ఉండదని, పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. రైతులకు తక్షణ చెల్లింపులు, రవాణా సౌకర్యం వంటి ప్రయోజనాలు అందుతాయని వివరించారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి కోతలు లేకుండా సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భగీరథ మహర్షి జీవిత విధానం, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి సేవలు ఆదర్శంగా తీసుకోవాలి అని ఎమ్మెల్యే సత్యనారాయణ
గురువారం ఐడిఓసి కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు కల్లు గీత కార్మికుల కోసం రక్షక కవచం శిక్షణ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భగీరథ మహర్షి జీవిత విధానం, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అలాగే కల్లు గీత కార్మికుల భద్రత ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, వారికి అవసరమైన రక్షణ పరికరాలు వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర సంబంధిత అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్లు ప్రజా సంఘాలు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్…

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా కుటుంబాలపై భారం తగ్గించడమే ఈ పథకాల ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందిస్తాం అని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ప్రజలకు ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, బుర్ర కొమురయ్య వైస్ ఛైర్మన్, అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్ శారద ఉడుత మహేందర్ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్సార్

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

మంగళవారం రేగొండ మండలంలోని భాగుర్తిపేట క్రాస్ నుండి బుద్ధారం గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా పనుల నాణ్యత,వేగం గురించి అధికారులను అడిగి తెలుసుకుని,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే పనులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్థులు పాల్గొన్నారు.
అనంతరం మండలంలోని కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి స్వాగతం పలికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి…

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లిలో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని రైతులు, మహిళలు, యువత, కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కర్ణాకర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విలేకర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మేడిగడ్డను సందర్శించి ప్రాజెక్టులోని లోపాలను ప్రజలకు వివరించనున్నారని తెలిపారు. నస్తూరుపల్లిలో జరిగే సభకు సుమారు లక్షమంది హాజరవుతారని అంచనా వేశామని పేర్కొన్నారు. సభలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ కావ్య తదితరులు పాల్గొంటారని చెప్పారు. రైతు భరోసా నిధులను సభ వేదికగా విడుదల చేసి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి చేరుతుండటాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండిపడ్డారు. తుమ్మిడి హెట్టి వద్ద డ్యామ్ నిర్మించాలని నిపుణులు సూచించినప్పటికీ, కేసీఆర్ నిర్ణయంతో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించారని ఆరోపించారు.

రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన పనులను డిజైన్ మార్చి దాదాపు లక్ష కోట్లకు పెంచి మేడిగడ్డ వద్ద కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు కమిషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టుల డిజైన్ మార్చి రైతులకు అన్యాయం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారు అని వారు ఆరోపించారు

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చివరిగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు దేవన్ ,పిసిసి సభ్యులు మధు, కౌన్సిలర్లు సహదేవ్ , రాధ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాట్ల శ్రీనివాస్ కురిమిళ్ళ శ్రీనివాస్ ఆకుల మహేందర్, తోట రంజిత్ పుల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

టేకుమట్ల టు భూపాలపల్లి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

టేకుమట్ల టు భూపాలపల్లి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణకు వినతి పత్రం ఇచ్చిన మారేపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
టేకుమట్ల మండల కేంద్రం నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజల జిల్లా కేంద్రానికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా తక్షణమే డి ఎం తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తానని అన్నారు చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐ సి డి ఎస్ ఆఫీస్ ఉందని తక్షణమే ఉపయోగం లోకి తేవాలని గతంలో ఇక్కడే అంగన్వాడి కార్యకర్తల ఆయా కార్యకర్తల మీటింగ్లు సమావేశాలు జరిగేవని ఈ ఆఫీసును జిల్లా కేంద్రానికితరలించడం వలన అంగన్వాడీ కార్యకర్తలు ఆయా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ఇక్కడికి తరలించాలని ఆయన దృష్టికి తీసుకుపోగా తరలిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కి పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించాడు…

అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించాడు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

దేశంలోనే ప్రజలందరికీ కులాలకు మతాలకు అతీతంగా రిజర్వేషన్లను హక్కులను కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు ఏప్రిల్ 14 మంగళవారం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరయ్యారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహోన్నత వ్యక్తి దేశ ప్రజల అందరికీ పౌర హక్కులు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు, పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన-స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, అంతస్తులోను, అవకాశములోను – సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ ఐక్యమత్యం, అఖండతను, తప్పక తీసుకొచ్చే-సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకుని, రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబరు 26వ తేదిన ఆమోదింపబడి, చట్టబద్దం కల్పించారు ఆ మహానీయులకు కృతజ్ఞతలు
42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికను సవరించడం జరిగింది. “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యం”
దేశ ఐకమత్యం”కు బదులు “దేశ ఐక్యత-అఖండత”గా మార్చడం జరిగింది.
అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎమ్మెల్యే గండ్రసత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మార్క్ ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలాగే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు

ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుం దని మధ్యవర్తుల ప్రభావం తగ్గుతుందన్నారు ఇది రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఈ కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు ,ప్రజలు పాల్గొన్నారు.

అలీవ్ సంస్థ మహిళలకు ఉచిత శిక్షణ ఎమ్మెల్యే జీఎస్సార్

అలీవ్ సంస్థ మహిళలకు ఉచిత శిక్షణ ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

సోమవారం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ర్యాంపు పథకంలో భాగంగా అలీవ్ సంస్థ మహిళలకు ఉచిత శిక్షణ నైపుణ్య సాధన సమృద్ధి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉచిత శిక్షణల ద్వారా మహిళలు వివిధ రంగాల్లో నైపుణ్యాలను సంపాదించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ ప్రతిభను మెరుగుపరుచుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. శిక్షణ అనంతరం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజి కిష్టయ్య స్థానిక సర్పంచ్ వారణాసి మౌనిక అంజి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు మొగుళ్లపల్లి..

చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు మొగుళ్లపల్లి

నేటి ధాత్రి భూపాలపల్లి

జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో శనివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉపసర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు హాజరై పాలక వర్గ సభ్యులు అలాగే స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పాలకవర్గం కోరిక మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ అన్నారు రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ తెలిపారు

యువత వ్యసనాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దు…

యువత వ్యసనాలకు బానిసలై భవిష్యత్ నాశనం చేసుకోవద్దు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ నుండి డా బిఆర్ అంబేడ్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ డ్రగ్స్ సమస్య సమాజానికి పెద్ద ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బానిసల కోసం ప్రభుత్వం ప్రత్యేక డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. మన జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయబడుతుందని వెల్లడించారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్‌లో ఆరో రోజు మాదకద్రవ్యాల నివారణపై ఈ ర్యాలీ నిర్వహించబడిందన్నారు. డ్రగ్స్ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. చదువుకున్న యువత చెడు అలవాట్లకు లోనవకుండా తమ జీవితాలను సవ్యంగా మలుచుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాజంలో డ్రగ్స్ నివారణలో యువత పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా “ఈగల్ టీం” ఏర్పాటు చేసిందని, ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ డ్రగ్స్ నివారణకు పోలీసు శాఖ ద్వారా గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని. జిల్లాలో గంజాయి రవాణా దారులు గంజాయి విక్రేతలపై కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. యువత డ్రగ్స్ పై అవగాహన లేకుండా సరదా కోసం తీసుకుంటూ కొద్దికొద్దిగా ఆ రొంపిలోకి దిగుతున్నారని వారికి అవగాహన వచ్చేసరికి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలో డ్రగ్స్ నివారణకు పోలీస్ శాఖ తరపున పటిష్ట నిగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎలాంటి సమాచారం ఉన్న ప్రజలు భాధ్యతగా పోలీసులకు అందజేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుందని అన్నారు.
అనంతరం 2 కే రన్ లో విజేతలకు ప్రశంషా పత్రాలు అందచేశారు.
ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.మధుసూదన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పావని, కౌన్సిలర్లు, అధికారులు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్ళల్లో ఆనందం ఎమ్మెల్యే జీఎస్సార్…

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్ళల్లో ఆనందం ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు శనివారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి రూరల్ మండలంలోని గొర్లవేడు గ్రామములో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న ఎడ్ల స్వప్న గృహ ప్రవేశం నిర్వహించుకోగా ఎమ్మెల్యే జీఎస్సార్ ముఖ్య అతిథిగా హాజరై, ఇళ్లు ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలో తీరుతుందన్నారు.అర్హులందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అప్పాని శ్రీనివాస్ వైఖరి నిరసిస్తూ ధర్నా చేపట్టిన కాలనీ వాసులు

అప్పాని శ్రీనివాస్ వైఖరి నిరసిస్తూ ధర్నా చేపట్టిన కాలనీ వాసులు

హనుమాన్ ఆలయ నిర్మాణానికి అడ్డుపడుతున్న శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మున్సిపాలిటీ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి అడ్డుపడుతున్న బిఎంఎస్ నాయకుడు అప్పాని శ్రీనివాస్ వైఖరిని నిరసిస్తూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కాలనీ కి సమాంతరంగా టెంపుల్ అభివృద్ధి జరిగింది అని భక్తుల తాకిడి పెరగడం తో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకుని పోవడం తో టెంపుల్ పునర్నిర్మాణం కోసం 50 లక్షలు నిధులు కేటాయించడం జరిగింది అనంతరం ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో బిఎంఎస్ నాయకుడు అప్పాని శ్రీనివాస్ ప్రతిసారి అడ్డు తగిలి సింగరేణి స్థలం గుడికి ఎలా కేటాయిస్తారని సింగరేణి జిఎంకు లెటర్ ల ద్వారా నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్నారు తన ఆఫీసు కోసం అంబేద్కర్ సెంటర్లో ఎకరం భూమిని తీసుకోవచ్చు కానీ హనుమాన్ భక్తుల కోసం గుడి కట్టుకుందాం అంటే కట్టుకోనీయకుండా అడ్డుపడటం శోచనీయమన్నారు సింగరేణి స్థలంలో అక్రమంగా తన కోటర్ వెనుక గోడను అనుకొని గేటు నిర్మించుకొని రహదారి ఏర్పాటు చేసుకొని గుడి కడితే తన రహదారికి ఎక్కడ అడ్డు వస్తుందో అని నెపంతో నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారన్నారు బిజెపి నాయకునిగా ఉండి గుడులను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు ఈరోజు నుండి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని కాలనీవాసులు అన్నారు.. ఇకనైనా తన వైఖరి మార్చుకోకపోతే తన ఇంటి ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు క్యాతరాజు సతీష్, కరాటే శ్రీనివాస్ అశోక్ రాకేష్ ,ముఖేష్ అభిలాష్ రాజు, పరమేశ్వరి బోడ పద్మ, శారద, తో పాటు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు

మేటర్నల్ సేఫ్టీ తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది ఎమ్మెల్యే జీఎస్సార్

మేటర్నల్ సేఫ్టీ తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ వీక్ మదర్ హుడ్ డే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మహిళలు గర్భధారణ సమయంలో ప్రసవానంతర కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యమన్నారు.మాటర్నల్ సేఫ్టీ అనేది తల్లి శిశువు ఆరోగ్యానికి పునాది అని తెలిపారు.గర్భిణీ స్త్రీలు సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం,పోషకాహారం తీసుకోవడం,వైద్యుల సూచనలు పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రసవం సాధ్యమవుతుందని చెప్పారు.
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రతి మహిళ వినియోగించుకోవాలని,ఆరోగ్య సిబ్బంది అందిస్తున్న సూచనలను గౌరవించాలని కోరారు.గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య సదుపాయాలను ఉపయోగించుకుని సురక్షిత మాతృత్వాన్ని సాధించాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు,సిటీ స్కాన్ ఏర్పాటు చేశామని, ఎమ్.ఆర్.ఐ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.అనంతరం కలెక్టర్ తో కలిసి ఆసుపత్రిలో ప్రతి వార్డు సందర్శించి పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు కల్పించాలని,ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూపరెండెంట్ కి సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ డి.ఎం.ఎచ్.ఓ డా. మధుసూదన్ ఆసుపత్రి సూపరెండెంట్ డా.రాజేంద్ర ప్రసాద్ వైద్య అధికారులు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

కొత్త రేషన్ దుకాణం ప్రారం భించిన ఎమ్మెల్యే/….

కొత్త రేషన్ దుకాణం ప్రారం భించిన ఎమ్మెల్యే

గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి :

శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన బడుగు అశోక్ నూతన రేషన్ దుకాణంను ఎమ్మెల్యే గండ్ర సత్యనార యణరావు ప్రారంభించా రు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు నిత్యావసర సరుకు లను సమయానికి, పారద ర్శకంగా ప్రభుత్వంఅందిస్తుంది గ్రామస్థాయిలో రేషన్ దుకా ణాల ఏర్పాటు ద్వారా ప్రజల కు సులభంగా సరుకులుఅందే విధంగా చర్యలు తీసుకుంటు న్నామని పేర్కొన్నారు.ఈ కొత్త రేషన్ షాప్ ద్వారా మాందా రిపేట గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా అధికా రులు కృషి చేయాలని సూచించారు.ప్రజలు కూడా రేషన్ సరుకులను సద్వి నియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ ,శాయంపేట మండలం ఎమ్మార్వో , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

 

 

నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్..

నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజల రవాణా ఇబ్బందులను రాకుండా చూడడమే ప్రభుత్వ ఒక్క బాధ్యత అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు టేకుమట్ల మండల కేంద్రంలో టేకుమట్ల అంకుషాపూర్ సోమనపల్లి సుబ్బక్కపల్లి నవాబుపేట మొగుళ్లపల్లి పరకాల ఆర్టీసీ బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, రైతులు సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను పడుతున్నారని నూతనంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు
ఈ కొత్త బస్సు సర్వీసు ద్వారా మారుమూల గ్రామాలకు పట్టణ ప్రాంతాలతో అనుసంధానం పెరుగుతుంది విద్యార్థులకు మేలు సకాలంలో బస్సులు లేక ఇబ్బంది పడుతున్న పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది ప్రజా సంక్షేమం ప్రభుత్వ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఈ కార్యక్రమంలో
మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్ మాజీ జెడ్పిటిసి పులి తిరుపతి రెడ్డి అన్ని గ్రామాల సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ నాయకులు పాల్గొన్నారు

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

మొగుళ్లపల్లి సర్పంచ్ చాట్ల విజయ రవీందర్

 మొగుళ్లపల్లి ,నేటిధాత్రి:

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక తాము పాలకులం కాదని సేవకులం అన్న భావనతో ప్రజల ఆంక్షలు అవసరాలకే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా రాష్ట్రమంతా గ్రామ సభలు నిర్వహిస్తున్నాయి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల పైబడి పూర్తి అయిందని రాష్ట్రంలోని ఆర్థిక సవాళ్లు అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు ప్రజాపాలన ప్రణాళికసమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మొగుళ్లపల్లి తహసిల్దార్ పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూపాలపల్లినియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కృషి ఎంతగానో ఉందని ప్రజా . ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.
ఇందిరమ్మ పాలనలో ప్రజలకు పథకాలు అందుతున్నాయని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు వార్డ్ సభ్యులుఅధికారి, మహిళా సంఘాలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

దొడ్డి కొమురయ్య ఆశయాలు కొనసాగించాలి…

దొడ్డి కొమురయ్య ఆశయాలు కొనసాగించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఐ.డి.ఓ.సి లో దొడ్డి కొమురయ్య జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిరాతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని తెలిపారు. వెట్టి చాకిరీ, దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన ఆయన సాహసం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు కౌన్సిలర్ అప్పం కిషన్ యాదవ సంఘం నాయకుడు సుధాకర్ సదానందం యాదవ్ బీసీ సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.

* రైతులకు ఆదాయం పెంచే దిశగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం*

* రైతులకు ఆదాయం పెంచే దిశగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం*

నేటిధాత్రి: మొగుళ్ళపల్లి

మొగుళ్లపల్లి మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు. ఈకార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి సురేందర్ గౌడ్ మాజీ సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు సర్పంచ్ చాట్లవిజయ రవీందర్ పలు గ్రామాల సర్పంచులు పాలక మండలి సభ్యులు సొసైటీ మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి వేడుకలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకే దారి చూపాయని పేర్కొన్నారు. ఆయన పోరాట స్పూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, ముఖ్యంగా బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడ్ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిరా జిల్లా ఫోర్స్ అధికారి రఘు గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు.

40% సబ్సిడీతో పిఎసిఎస్ కు డ్రోన్ ప్రారంభం

రైతులకు 40 శాతం సబ్సి డీతో ప్రభుత్వం డోన్లను పిఎ సిఎస్ ద్వారా అందించింది. అన్నదాతల అత్యధిక పరికారాలను వ్యవసాయంలో వాడటాన్ని ప్రోత్సహిస్తుంది వ్యవసాయంలో అత్యధిక పరికరాల వాడకo పెరుగు తుంది దీంతో పనులు చకా చకా అవుతాయి పంటల్లో చీడపీడల నివారణకు పి చికారి చేయడానికి డ్రోన్లు వినియోగం ఇటీవల ఎక్కు వవుతుంది రోజంతా చేసే పనినిలో కొన్ని గంటల్లో చేసే స్తాయి అయితే డ్రోన్ లో అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు ఫలితం గా ప్రస్తుతం చాలామంది రైతు లకు పీఏసీఎస్ అందుబాటు లో ఉంచి ప్రభుత్వం రైతులకు అందిస్తుంది రైతులందరూ వ్యవసాయంలో వినియోగిం చుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ స్థానిక సర్పంచ్ చింతల ఉమ రవిపా ల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి మం డల కాంగ్రెస్ పార్టీ నాయ కులు,రైతులు పాల్గొన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం డ్రోన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లో మార్క్ఫెడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొను గోలు కేంద్రాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు ప్రారంభిం చారు ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం సూచించిన నిబం ధనల ప్రకారం మొక్కజొ న్నలను తీసుకువచ్చి మద్దతు ధరకు ఇక్కడి కొనుగోలు కేం ద్రంలో అమ్ముకోవాలని రైతు లు తమ పంటను మధ్యవ ర్తుల వద్ద అమ్మకుండా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొను గోలు కేంద్రాలనే విక్రయించు కోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను చేసుకోవాలని రైతులకు సూచించారు అలా గే రైతులకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ కేంద్రాల ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని మధ్య వర్తుల ప్రభావం తగ్గుతుంద న్నారు ఇది రైతుల ఆదా యాన్ని పెంచే దిశగా ముఖ్య మైన అడుగుగా భావిస్తు న్నారు.

40% సబ్సిడీతో పిఎసిఎస్ కు డ్రోన్ ప్రారంభం

రైతులకు 40 శాతం సబ్సి డీతో ప్రభుత్వం డోన్లను పిఎ సిఎస్ ద్వారా అందించింది. అన్నదాతల అత్యధిక పరికారాలను వ్యవసాయంలో వాడటాన్ని ప్రోత్సహిస్తుంది వ్యవసాయంలో అత్యధిక పరికరాల వాడకo పెరుగు తుంది దీంతో పనులు చకా చకా అవుతాయి పంటల్లో చీడపీడల నివారణకు పి చికారి చేయడానికి డ్రోన్లు వినియోగం ఇటీవల ఎక్కు వవుతుంది రోజంతా చేసే పనినిలో కొన్ని గంటల్లో చేసే స్తాయి అయితే డ్రోన్ లో అధిక ధర కారణంగా అన్నదాతలు కొనలేకపోతున్నారు ఫలితం గా ప్రస్తుతం చాలామంది రైతు లకు పీఏసీఎస్ అందుబాటు లో ఉంచి ప్రభుత్వం రైతులకు అందిస్తుంది రైతులందరూ వ్యవసాయంలో వినియోగిం చుకో వాలని సూచించారు

మున్సిపాలిటీ అభివృద్ధికి పారిశుద్ధ్యం ముఖ్యము ఎమ్మెల్యే జీఎస్సార్….

మున్సిపాలిటీ అభివృద్ధికి పారిశుద్ధ్యం ముఖ్యము ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 20వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్‌ రాహుల్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు బట్టు కరుణాకర్ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి వార్డులో శుభ్రత పనులను చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణాల అభివృద్ధికి పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని సూచించారు.
పట్టణంలోని ప్రతి వార్డులో మున్సిపల్ అధికారులు సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్య పనులను వేగవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా శుభ్రమైన వాతావరణం అవసరమని, మురుగు కాలువలు, చెత్త నిల్వలు లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది క్రమం తప్పకుండా శుభ్రత పనులు చేపట్టాలని, ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ అందించే సదుపాయాలను వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు శ్రమతో పనిచేస్తూ వార్డులో చెత్తను తొలగించడం, కాలువలను శుభ్రపరచడం వంటి పనులు నిర్వహించారు. ఎమ్మెల్యే మరియు ఇతర ప్రజాప్రతినిధులు మున్సిపల్ కార్మికులను అభినందించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగి, శుభ్రమైన భూపాలపల్లి నిర్మాణానికి దోహదపడుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు వార్డు కౌన్సిలర్స్ రాజు నాయక్ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు…

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి ఆలయ ప్రాంగణంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
అనంతరం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి…

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సి.ఆర్ నగర్ బాంబుల గడ్డ కమ్యూనిటీ హాల్లో జరిగిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.ఈరోజు నుండి మార్చి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, కార్యాలయాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ళ వేగవంతమైన పరిష్కారం, రికార్డుల సక్రమ నిర్వహణ, ప్రజలకు సమయానుకుల సేవలందించడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్స్,జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయ లక్ష్మీ మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ మూడో వార్డు కౌన్సిలర్ అరుణ్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల పరిధిలోనీ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. గ్రామాల్లోసీసీ రోడ్లు, వీవో మహిళా సమాఖ్య భవనాలు మరియు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్య క్రమం ఘనంగా నిర్వహించ బడింది.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సంబంధిత అభి వృద్ధి శాఖ అధికారుల సమక్షంలో పనుల శంకు స్థాపన పలకలు ఆవి ష్కరణ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.గ్రామాల్లో రహదారి సౌకర్యాల మెరుగు దల, మహిళా సంఘాల బలోపేతం మరియు విద్యా ర్థులకు సురక్షిత విద్యా వాతా వరణం కల్పించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారు లు సమన్వయంతో పనిచే యాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ,మండల ముఖ్య నాయకులు , సర్పంచులు, ఉపసర్పంచ్ లు , గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు,మాజీ ప్రజాప్రతినిధులు మరియు సంబంధితశాఖ అధికారు లు ,కార్యకర్తలు పాల్గొన్నారు

సూర్య భగవాన సేవ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

సూర్య భగవాన సేవ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన సూర్య భగవాన వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు నుండి కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
అనంతరం ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన వాసవి ఆర్య వైశ్య నిత్యాన్న సత్రంను ప్రారంభించి భక్తులకు అన్నదానం సేవలు ప్రారంభించారు.
తదుపరి రాయపల్లి గ్రామంలో బత్తిన అనిత కి చెందిన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు మండల అధ్యక్షులు ఈప్పకాయల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక…

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక

వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు17 సిపిఐ1 మొత్తం 18 మంది కౌన్సిలర్ల గెలుపొందడం జరిగింది ఆర్డిఓ హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ జోన ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిలర్ సభ్యులు అందరూ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది అనంతరం 2వార్డ్ కౌన్సిలర్ సభ్యుడు బుర్ర కొమురయ్యను ఏకగ్రీవంగా భూపాలపల్లి పురపాలక సంఘం చైర్మన్ గా ఎన్నుకున్నారు అలాగే వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎక్సెప్షన్ నెంబర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుల దేవన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని మరియు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభం శుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం అత్యంత హేయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిందితులకు త్వరలోనే చట్టపరంగా కఠిన శిక్షపడేలా చూడాలని జిల్లా ఎస్పీకి సూచించారు.

ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

శుక్రవారం భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ సుభాష్ కాలనీలో గల ఎలుగుల సురేష్ , ఎలుగుల చందు ఇరువురు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద ఉంటున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీకు నాణ్యమైన వైద్యం అందించుటకు నావంతు సహాయ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నియోజకవర్గ సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

నియోజకవర్గ సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

చిట్యాల, నేటిదాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున చిట్యాల, రేగొండ, టేకుమట్ల, ఘన్పూర్ గోరుకొత్తపల్లి, మొగుళ్ళపల్లి, శాయంపేట, భూపాలపల్లి 8 మండలాల సీఎం కప్ నియోజకవర్గ క్రీడలను ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అంతకుముందు విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఆరోగ్యానికి స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకుపోవడంలో ఉపాధ్యాయులు అధికారులు ప్రోత్సహించాలన్నారు, అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కబడ్డీ ఆడి నారు, కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, ఎంపీడీవో జయశ్రీ తాసిల్దార్ ఇమామ్ బాబా, క్రీడల కన్వీనర్ ఎంఈఓ రఘుపతి, సర్పంచ్ తవు టం లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ మాజీ ఎంపిటిసి దబ్బేట అనీల్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధరి రవి, కాంగ్రెస్ నాయకులు చిలకల రాయకొమురు, బుర్ర లక్ష్మణ్ గౌడ్ , గుర్రపు నరసయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

29వ వార్డులో పుల్ల మహేష్‌కు మద్దతుగా ఎమ్మెల్యే గండ్ర

29 వార్డులో పుల్ల మహేష్ ను గెలిపించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 29వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేషు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 29వ వార్డు స్థానిక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పుల్ల మహేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి ఇతర వార్డులో వాళ్లు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు కావున స్థానికుడు పుల్ల మహేషు కావున ప్రజలందరూ మహేష్ చెయ్యి గుర్తుపై ఓటు వేయాలని ఓటర్ మహాశీలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

బీర్తీ కమలను ఆశీర్వదించండి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బీర్తీ కమల మధునయ్య కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్తీ కమలను మధునయ్య 17వ వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కావున వార్డు ప్రజలు అందరూ ఆలోచించి బీర్తీ కమల చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి వార్డు అభివృద్ధికి అందరూ సహకరించండి అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 17వార్డు ఇన్చార్జి టౌన్ యూత్ అధ్యక్షుడు పృథ్విరాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

5.6వార్డులలో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్…

5.6వార్డులలో కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5, 6 వార్డులలో ఎన్నికల ప్రచారంని నిర్వహించిన ఎమ్మెల్యే జిఎస్సార్ అనంతరం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 5, 6 వార్డులకు సంబంధించిన వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఇంతర ముఖ్య నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు స్థాయిలో పార్టీ కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి, వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉడుత సరోజన రాయమల్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ ఉడుత మహేందర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు

సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి పర్యటన విజయవంతం కావాలి

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భూపాలపల్లికి రానున్నారని, వారి పర్యటనను భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈమేరకు (శనివారం) ఎమ్మెల్యే జీఎస్సార్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, వివిధ మండలాల అధ్యక్షులతో కలిసి గణపురం మండలం చెల్పూరు గ్రామ శివారులోని కర్నాలకుంట చెరువు పక్కన ఉన్న ఖాళీ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ నాయకులకు, పోలీసులకు పలు సూచనలు చేశారు. సభా వేదిక ఏర్పాటు, హెలీ ప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గణపురం సిఐ కరుణాకర్ రావు, ఎస్సై అశోక్ తో చర్చించారు.

కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం కలియ తిరుగుతూ, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచనలు చేశారు. అనంతరం అక్కడ జరిగిన రేగొండ కొత్తపల్లిగోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. రెండు మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

నూతన విద్యుతులైను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 5వార్డు యాదవ కాలంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును ఇటీవల కోరడం జరిగింది వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాలనీవాసుల కోరిక మేరకు నూతన విద్యుత్ స్తంభాలు విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలను వేయించడం జరిగింది అలాగే సీట్ లైట్లను ఏర్పాటు చేసి వాటిని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపల్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను కావున భూపాలపల్లి ప్రజలు ఆలోచించి రాబోవు మున్సిపల్ ఎన్నికలలో 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లిని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందిరమ్మ ఇండ్లు రైతులకు సన్నబడ్లకు 500 బోనసు ఇలా అనేక సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు కావున ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ అభ్యర్థులను ఆశీర్వదించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉడత సరోజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బౌత్ విజయ్ ఉడత మహేందర్ కాలనీవాసులు పాల్గొన్నారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంజూరునగర్ లోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ మరికొంత మంది నాయకులతో కలిసి పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యానికి రాజ్యాంగ నిర్మాణానికి తమ ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, రాష్ట్రం దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చల్లూరు మధు అప్పన్ కిషన్ గాజర్ల అశోక్ తిరుపతి విజయ్ తదితరులు పాల్గొన్నారు

టిడిపి నుంచి కాంగ్రెస్ వరకు బద్దంపల్లి సర్పంచ్ బద్దం రాంరెడ్డి

సేవే మార్గం.. సేవే లక్ష్యంగా..

-టిడిపి ప్రస్థానం నుంచి బద్దంపల్లి సర్పంచ్ వరకు రాంరెడ్డి రాజకీయ ప్రస్థానం
మొగుళ్ళపల్లి నేటి దాత్రి

 

ఆయన పేరు వింటేనే నమ్ముకున్న వ్యక్తులకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండే మనస్తత్వమని, 1982లో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రభంజనంలో ప్రారంభమైన టిడిపిలో మాజీ ఎంపీపీ కీ: శే: బత్తిని భూమయ్య గౌడ్ నేతృత్వంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని బద్దంపల్లి గ్రామానికి చెందిన బద్దం రాంరెడ్డి తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. అప్పటి నుంచి టిడిపిలోనే కొనసాగుతూ నమ్ముకున్న వ్యక్తులకు ఏ ఆపద వచ్చినా తాను ముందుండి ఆదుకునే మనస్తత్వం ఆయన సొంతం. 1982 నుంచి 2023 వరకు టిడిపి పార్టీ అధికారంలో ఉన్న, లేకపోయినా నమ్ముకున్న సిద్ధాంతమే తన ఊపిరిగా టిడిపి పార్టీకి విశేష సేవలందించాడు. బద్దంపల్లి గ్రామానికి చెందిన కీ: శే: బద్దం రాజక్క-బుచ్చిమల్లు దంపతులకు ఐదవ సంతానంగా జన్మించిన బద్దం రాంరెడ్డి ప్రజలకు సేవ చేసే అదృష్టం కోసం ఎదురు చూశాడు. ఈ క్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన టిడిపిని వేదికగా చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా టిడిపి తెలంగాణలో కనుమరుగై పోయినప్పటికీ పార్టీ కోసమే పని చేశాడు. ప్రజా ప్రతినిధిగా అవకాశం రాకపోయినా నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించేవాడు. 1982 నుంచి టిడిపి పార్టీలో క్రియాశీల నాయకునిగా ఎదిగిన ఆయన ఎంతోమంది యువకులకు ఆదర్శనీయం. 1982 నుంచి టిడిపి బలపర్చిన అభ్యర్థుల గెలుపులో ఆయన పాత్ర కీలకం. కాగా టిడిపిలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు 2023లో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణ రావు భారీ మెజార్టీతో గెలిచేలా వ్యూహాలు పన్నాడు. అనంతరం 2025 నవంబర్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ బద్దంపల్లి గ్రామ సర్పంచ్ గా ప్రజలు బద్దం రాంరెడ్డిని ఏకగ్రీవ సర్పంచ్ గా ప్రజలు ఎన్నుకున్నారు. నికార్సైన వ్యక్తిత్వం..మంచి మనస్తత్వం కలిగిన బద్దం రాంరెడ్డి ఈ సందర్భంగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ.నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ బద్దంపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు.

ఎంఎల్ఏ గండ్ర సత్యనారాయణ రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం భూపాల్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అప్పయ్య పల్లి గ్రామ సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్ అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి హాస్పిటల్ ఖర్చులకోసం
నోముల రమేష్1,000,00/- లక్ష రూపాయల చెక్కును అందించడంజరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని అన్నారు

కొడవటంచ ఆలయ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

కొడవటంచ ఆలయ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

రేగొండ మండలం
కొడవటంచ ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశించారు బుధవారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకి స్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని గుత్తేదారులకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ ఆలయం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. పనుల్లో జాప్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

పార్టీ గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి

పార్టీ గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కడి శివ చరణ్ రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జీ సయ్యద్ ఖలీద్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ యూత్ కాంగ్రెస్ భూపాలపల్లి నియోజకవర్గం అధ్యక్షులు నగునూరి రజినీకాంత్ ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటేష్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి మహిపాల్ రెడ్డి హాజరై యూత్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోసిక సాయి చరణ్ ప్రధాన కార్యదర్శులు చుంచుల మహేశ్ తోట రంజిత్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ బడితల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పొలసాని కోటేశ్వర్ రావు మండల అధ్యక్షులు కొలుగూరు అనిల్ అల్లకొండ కుమార్ కోయిల క్రాంతి సాధు నాగరాజు వెంకటేశ్, జిల్లా నాయకులు ఉప్పగల్ల కిషోర్ అప్పల శ్రీనివాస్ పృథ్వీ బొమ్మ కిరణ్ కీర్తి రాజు పున్నం ప్రవీణ్ కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం…

నిరుపేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

పేదలు, నిరుపేదల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి గణపురం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 77 మంది లబ్ధిదారులకు రూ.22,59,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మీడియాతో మాట్లాడుతూ…పేదలు, నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల కష్టాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని, భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య దాట్ల శ్రీనివాస్ సుంకరి రామచంద్రయ్య తోట రంజిత్ స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

గీత కార్మికుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం

గీత కార్మికుడి కుటుంబానికి లక్ష రూ. ఆర్థిక సాయం.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండలం కేంద్రానికి చెందిన గుర్రపు గట్టయ్య గత మూడు సంవత్సరాల క్రితం తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు కింద పడటంతో అయినా* వెన్నుపూస బొక్క విరగడంతో మంచానికే* పరిమితమయ్యాడు రెక్క ఆడుతూనే డొక్కాడని పరిస్థితి గీత కార్మికులది*
దిక్కుతోచని స్థితిలో కుటుంబ ఉండగా ఆ కుటుంబానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో1,00,000 లక్ష రూపాయలు ప్రకటించి బుధవారం రోజున చిట్యాల గౌడ సొసైటీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ ఆధ్వరంలో లక్ష* రూపాయలు గీతా కార్మికుడు గుర్రపు గట్టాయకు డైరెక్టర్లతో కలిసి లక్ష రూపాయలు నగదు అందజేశారు,ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం ఈ ప్రభుత్వంలోని గీత కార్మికులకు సేఫ్టీమోకులు అందించడంజరుగుతుందన్నారు గట్టయ్య స్థితిగతులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనకు* *ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని లక్ష్మణ్ గౌడ్ తెలిపారు*ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పెరుమండ్ల రాజు. డైరెక్టర్లు రాజు. బుర్ర రాజు. నరేష్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు కారల్ మార్క్స్ కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మున్సిపాలిటీ ల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, కమ్యూనిటీ హాల్స్ తదితర పనులు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన భూపాలపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజలు కూడా సహకరించి అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా పుల్లూరిరామయ్యపల్లిలో జరిగిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మంత్రికి ప్రత్యేక పూజలు, ముగ్గుల పోటీలలో ఎమ్మెల్యే పాల్గొన్నాడు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో బోగి పర్వదినం సందర్భంగా కొత్తపల్లి(బి) గ్రామానికి చెందిన క్యాతం ఐలయ్య – వసంత మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే అట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన ముగ్గుల పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముగ్గులు మన సంస్కృతి, సంప్రదాయాలకు మహిళల సృజనాత్మకతను ప్రతిబింబించే కళారూపమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన సంప్రదాయాలు భావి తరాలకు చేరుతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో మహిళల భాగస్వామ్యంతో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరింత విస్తరించాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

*పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం*

*కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే*

శాయంపేట నేటిధాత్రి:

 

పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆడబిడ్డల వివాహా లకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకా లను అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అర్హులైన 57 మంది లబ్ధిదారు లకు రూ.57,06,612 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మరియు వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 32 మందికి రూ.10,50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోం దని, సామాజిక సమానత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికా రులు చిత్తశుద్ధితో పనిచేయా లని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు శాయంపేట నియోజక వర్గంలో అమలు చేయను న్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతకుముందు మండలంలో ని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ కార్య క్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

కొత్త రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

కొత్త రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో నూతన రేషన్ షాపును ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ తో కలిసి రేషన్ షాపులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ అందించే ఉచిత సన్న బియ్యం పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పిల్లి రాజయ్య ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆదివారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఎలబోయిన ఎర్ర మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఎనిమిదవ రోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం అంబటి లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతిచెందగా మూడవరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి చిత్రపటానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుకపెళ్లి రమేష్, ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు కొడారి రవీందర్ సీనియర్ నాయకులు మార్నేని ఉపేందర్ రావు దోమల రాజయ్య కొడాలి రవీందర్ ప్రభాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ రమా రవీందర్ తదితరులు పాల్గొన్నారు._

వీబీజీఆర్‌జీ చట్టం రద్దు చేయాలి – ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఉపాధిని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పేదల కడుపు నింపే లక్ష్యంతో అమల్లోకి తెచ్చిన ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. గాంధీ పేరును తొలగించి ఆయన ప్రతిష్ఠను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని యెడల పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాను చాటేలా, ప్రతీ ఒక్క కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే మన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి అంశాల్లో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకువెళ్లాలని సూచించారు. క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్….

యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్

– భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలో క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్ 2025 – 26 ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే జీఎస్సార్ సీఎం కప్ క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి కొద్దిదూరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాల్లో ప్రతి క్రీడాకారుడిని రాష్ట్రస్థాయి వేదిక వరకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంకు ద్వారా క్రీడలను జీవితంగా మార్చుకునే అవకాశాన్ని యువతకు అందిస్తామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారుల భవిష్యత్తు వృధా కాకూడదని, యువత క్రీడల్లో ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

యాసంగి పంటలకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

యాసంగి పంటలకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి రూరల్ మండలం పంబాపూర్ గ్రామంలోని భీమ్ ఘనపూర్ చెరువు నీటిని యాసంగి పంటల సాగు కొరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చెరువులో పూలు చల్లి, గేట్ వాల్వ్ తిప్పి నీటిని దిగువ గ్రామాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతులకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. చిట్టచివరి ఎకరా వరకు సాగు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో దిగువ గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ..

పి ఆర్ టి యుటిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ.

#ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘం పిఆర్డియు టి ఎస్.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్న ఏకైక సంఘం పిఆర్టియు టీఎస్ అని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బుధవారం నందిగామ ఉన్నత పాఠశాలలో పిఆర్టియు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తూ మండలంలో విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పిఆర్ టి యు సంఘం ముందు వరుసలో ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య భాస్కర్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్ రెడ్డి, ఎంఈఓ అనురాధ, ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ పాలకుర్తి విజయ్, అంతర్జాతీయ మానవ హక్కుల జిల్లా అధ్యక్షురాలు గడ్డం సుభద్ర, పిఆర్ టి యు ప్రధాన కార్యదర్శులు ఉడుత రాజేందర్, బానోతు కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు చంద్రశేఖర్, రామస్వామి, వెంకటేశ్వర్లు, కృష్ణ, జాకీర్ హుస్సేన్, వెంకటయ్య, సంధ్యారాణి, సుచరిత, వెంకటకృష్ణ, సదా చారి తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి…

ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహాలను సందర్శించిన మంత్రి

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ బాలికల పాఠశాల వసతి గృహాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు సందర్శించారు.ఈ సందర్భంగా వారు పాఠశాలలలోని తరగతి గదులు, వసతి గృహాల గదులు, వంటశాల, భోజన ఏర్పాట్లు, విద్యార్థినులకు అందిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ ఆఫీసు లోని ఐ.డి.ఓ. సి లో జరిగిన వరంగల్ , హన్మకొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ఎస్సీ,ఎస్టీ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాలల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థినులు నిర్భయంగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వసతి గృహాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పాఠశాలలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థినుల సంక్షేమమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

కొడవటంచలో అన్నదాన సత్రములను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

కొడవటంచలో అన్నదాన సత్రములను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలో ఎస్ డీ ఎఫ్ నిధులు రూ.90 లక్షలతో నూతనంగా నిర్మించిన పూజారుల వసతి గృహము అన్నదాన సత్రముల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలేకాక సామాజిక సేవకు నిలయాలుగా ఉండాలని తెలిపారు. పూజారుల సౌకర్యార్థం వసతి గృహము ఏర్పాటు చేయడం అభినందనీయమని, అలాగే భక్తులకు అన్నదానం అందించే సత్రం ద్వారా సేవాభావం మరింత పెరుగుతుందన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి, పూజారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సదుపాయాలు మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బిక్షపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

కార్యక్రమానికి విచ్చేయుచున్న
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ నేటి ధాత్రి తో మాట్లాడుతూ మండల గ్రామపంచాయతీ పరిధిలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారు ఉదయం 8 గంటలకు వచ్చి వారి వారి కల్యాణ లక్ష్మి చెక్కులను తీసుకోగలరని ,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
కోరారు
స్థలం : * గణపురం గ్రామపంచాయతీ కార్యాలయం *

ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్..

ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాషి కాలనీ చర్చిలో పాస్టర్ రాజవీర్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తు జన్మదిన వేడుకలకు హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను ముందుగా అందరికీ మేరీ హ్యాండ్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

అయ్యప్ప మహా పడిపూజ మహా అన్న ప్రసాద కార్యక్రమం..

అయ్యప్ప మహా పడిపూజ మహా అన్న ప్రసాద కార్యక్రమం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతుల

భూపాలపల్లి నేటిధాత్రి

 

గురువారం మధ్యాహ్నం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ – మహా అన్న ప్రసాద కార్యక్రమం అత్యంత కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు – పద్మ గారు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌహార్దాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే అయ్యప్ప స్వాములతో కలసి భిక్ష చేశారు.

ఘనంగా సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం..

ఘనంగా సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

https://youtu.be/G7hDJxL7XBE?si=_ZnV2GVLdYoOlJWo

 

రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక సింగరేణి అని, బొగ్గు ఉత్పత్తి ద్వారా రాష్ట్ర, దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ కీలకపాత్ర పోషిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం సింగరేణి కాలరీస్ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేకు కార్మికులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. జీఎం కార్యాలయ ప్రాంగాణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే, జీఎం పూల వేసి నివాళులర్పించి, జెండావిష్కరణ చేశారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన కేకు కోసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సింగరేణి సంస్థ వెన్నెముకలా నిలుస్తుందని, కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సింగరేణి సంస్థ ఆధునికీకరణ, సాంకేతిక అభివృద్ధి దిశగా ముందుకు సాగుతూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సింగరేణి మరింత ప్రగతి సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ సుస్థిర భవిష్యత్తు కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, శ్రమశక్తిని చాటుతూ సంస్థను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితమవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ఎమ్మెల్యే శాలువాలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు

హుస్సేన్ పల్లి గ్రామాభి వృద్ధికి నిరంతరం పని చేస్తా…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-20T134537.363.wav?_=1

 

హుస్సేన్ పల్లి గ్రామాభి వృద్ధికి నిరంతరం పని చేస్తా

జీఎస్సార్ కలిసిన గ్రామ సర్పంచ్ ఎడ్ల స్వరూప – సుధాకర్ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

హుస్సేన్ పల్లి గ్రామాభివృద్ధికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహ కారంతో నిరంతరం పని చేస్తా నని హుస్సేన్ పల్లి గ్రామ సర్పంచ్ ఎడ్ల స్వరూప – సుధా కర్ రావు అన్నారు. ఎమ్మెల్యే ను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కు ఎమ్మెల్యే శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా మమ్ములను గెలిపించినం దుకు ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మా ణానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్ర మంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బు చ్చిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్‌ కు గురైన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే…

విద్యుత్ షాక్‌ కు గురైన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం మాందా రిపేట గ్రామంలో ఇటీవల ప్ర మాదవశాత్తు దారంగుల పాణి విద్యుత్ షాక్‌కు గురై ఆసు పత్రిలో చికిత్స పొంది, ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటు న్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు స్వయంగా బాధి తుడి ఇంటికి వెళ్లి పరామ ర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసు కున్నారు. బాధిత కుటుం బానికి అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై సంబం ధిత అధికారులు సమగ్ర విచా రణ చేపట్టి తగిన చర్యలు తీ సుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం ఎమ్మెల్యే ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలిం చారు. ఇళ్లపై నుండి ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ ను చూశా రు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఉన్నతాధికా రులకు ఫోన్ చేసి సమస్యను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగింది.

నేరేడుపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటన..

నేరేడుపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటన

సర్పంచ్ అభ్యర్థి మడికొండ ఇందిరా రాజును గెలిపించాలని పిలుపు

శాయంపేట, నేటిధాత్రి:

 

గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరముందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఆయన శాయంపేట మండలంలోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసింగారం, కాట్రపల్లి, సాధనపల్లి, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం, వసంతాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, ఇతర నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అయ్యాయి. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలపరచడం ద్వారా ఈ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది,” అని పేర్కొన్నారు. ప్రజల పాలనలో ప్రజల భాగస్వామ్యమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక నాయకులు పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన..,

నేరేడుపల్లి గ్రామంలో ప్రజలకు “సీరియల్ నంబర్ 5లో ఉన్న లేడి పర్సు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి మడికొండ ఇందిరా రాజును గెలిపించండి” అని గ్రామస్థులను కోరారు.

గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాలన అవసరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.

అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ విజయం అవసరం..

అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ విజయం అవసరం

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరా వు

శాయంపేట నేటిధాత్రి:

గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్ లుగా గెలిపించుకోవాలనిభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు. ఉదయం మండలంలోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసింగారం, కాట్రపల్లి, సాధనపల్లి, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం, వసం తాపూర్ గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధుల గెలుపు కొరకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి ముఖ్య నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల లోనే చాలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నాయ కులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు కలిసికట్టుగా పనిచేయా లన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభు త్వం కృషి చేస్తోంద న్నారు. భూపాలపల్లి నియోజకవ ర్గంలోని అన్ని గ్రామాలలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.

సర్పంచ్ లు గ్రామాలల్లో అభివృద్ధి చేయాలి..

సర్పంచ్ లు గ్రామాలల్లో అభివృద్ధి చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

గణపురం రేగొండ సర్పంచ్ లు గ్రామాలల్లో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కొత్తగా ఏకగ్రీవమైన సర్పంచ్ లకు సూచించారు. గురువారం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను గణపురం మండలం బుద్దారం ఏకగ్రీవ సర్పంచ్ విడిదినేని శ్రీలత – అశోక్, పన్నెండు మంది ఏకగ్రీవ వార్డు సభ్యులు మరియు రేగొండ మండలం కొత్తపల్లి(బీ) గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ బూతం రజిత – రమేష్ లు మర్యాదపూర్వకంగా పూల బొకేలు అందించి కలిశారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ లకు శాలువాలు కప్పి, స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజల ఐక్యతతో, అభివృద్ధి లక్ష్యంతో ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకోవడం సంతోషమన్నారు. ఈ నిర్ణయం గ్రామ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టి పారదర్శక పరిపాలనతో గ్రామాభివృద్ధికి సేవ చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగు నీరు, విద్యా, ఆరోగ్య రంగాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా అందించేందుకు సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలన్నారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో అవసరమైన చోట (ఎమ్మెల్యే) పూర్తి సహకారం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలొ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో చిట్యాల టేకుమట్ల మండలంలోని సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పాల్గొనిపంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు అలాగే పేద ప్రజలు ఎవరైనా ఎలాంటి పైరవీలకు తావు లేకుండ స్వచ్ఛందంగా అమలు చేస్తామన్నారు ఎవరికి ఏ ఆపద ఉన్న స్వచ్ఛందంగా వచ్చి చెప్పుకోవాలన్నారు, ఇది ప్రజా పాలన ప్రభుత్వమని కొనియాడారు, 18 గంటలు కష్టపడి పని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ నియోజకవర్గ ప్రజల కోసమే అహర్నిశల కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,జిల్లా కాంగ్రెస్అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుర లక్ష్మణ్ గౌడ్ , జిల్లా నాయకులు చిలుకల రాయకొమురు, వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల అల్లకొండ కుమార్ టేకుమట్ల చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T154510.495.wav?_=2

 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కేంద్రాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి

భూపాలపల్లి ఎమ్మెల్యేగండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏండ్లుగాఎన్నడూ లేని
విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యానికి రూపాయలు 500 బోనస్ ప్రకటించారని అన్నారు రైతుల పండించిన పంటను 17% తేమ మించ కుండా ప్రభుత్వం ద్వారా కేటా యించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల న్నారు రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టు బాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారు లకు ఎమ్మెల్యే సూచించారు.

లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శాయంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.62,07,192 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేద, నిరుపే ద కుటుంబాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభు త్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుం దని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేటమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 16 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.5,70, 600 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకో లేక ఆర్ధిక ఇబ్బందులు పడు తున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమ యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అనంతరం రైతులకు మొక్కజొన్న సబ్సిడీ విత్తనా లను అందజేశారు. ఈ కార్యక్ర మాలల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా, మం డల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ జన్మదిన వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T120045.382.wav?_=3

 

ఘనంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ జన్మదిన వేడుకలు

పిప్పాల రాజేందర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి

 

నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది
కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ అన్నారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో కేక్ కట్ చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానుల, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను జరుపకోవడం చాలా సంతోషం రానున్న రోజులలో మరిన్ని ఉన్నంతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పిప్పాల రాజేందర్ అన్నారు
ఈ కార్యక్రమంలో దాట్ల శ్రీనివాస్ మహేష్ రెడ్డి సంజన స్వామి పైడిపల్లి రమేష్ క్యాతరాజు సాంబమూర్తి పానుగంటి శీను అంబాల శ్రీనివాస్ మహిళా కాంగ్రెస్ నాయకులు మాలతి పద్మ పుష్ప యూత్ నాయకులు సురేష్ గణేష్ ప్రకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ జన్మదిన వేడుకలు…

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు సెగ్గంపల్లి హనుమాన్ ఆలయం సెంటర్ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కౌన్సిలర్ అభ్యర్థి భౌతు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేకు కటింగ్ చేసి స్వీట్లు పంచి పెద్ద ఎత్తున సంబరాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జ రాజబాపయ్యా,దుర్గం రవి, ప్రసాద్,దుర్గం అనిల్ , సాగర్, రాజు ఆకుదారి విజయభాస్కర్ ,రంజిత్ ,మధు, తదితరులు పాల్గొన్నారు

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతులు పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకో వాలి

ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని మోసపోవద్దు

సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన, గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని గండ్ర సత్యనారా యణరావు సూచించారు. పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పత్తి కొనుగో లు కేంద్రాన్ని ఎమ్మెల్యే లిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వేరు వేరుగా మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు.

8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నా రని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాల న్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయా లనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొను గోలు చేసేలా రైతులకు సహక రించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపో యిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుం దని, అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివే దిక అందించేలా సహకరిం చాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించా రు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు

టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి…

టీకాలతో పశువుల్లో రోగనిరోధక శక్తి

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

రేగొండ మండల కేంద్రంలో పశువులకు సకాలంలో గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలో పశు వైద్య పశు సంవర్ధక శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. పశువులకు టీకాలు వేయించటం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల ప్రభావం తగ్గుతుందన్నారు. గాలికుంటు వంటి వ్యాధులు పశువుల పాలు, ఉత్పత్తితో పాటు రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ప్రతీ ఒక్క రైతు తన పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని మంత్రి సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ…. పశు సంపద తోడు ఉంటేనే వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మన ఇళ్లల్లో పశుసంపద ఉంటే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు పశువులకు సరైన పోషకాలు కలిగిన దాణా మరియు మేత అందిస్తే పాల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటాయన్నారు. ముఖ్యంగా చూడి పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించడం తప్పనిసరి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ జిల్లా అధికారి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి గండ్ర సత్యనారాయణరెడ్డి పున్నమి రవి తదితరులు పాల్గొన్నారు

బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్…

బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో వచ్చే నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగే బుగులోని వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవములు(జాతర) – 2025 గోడ పత్రికను ఈరోజు ఉదయం గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.

 

రెండో తిరుపతిగా పేరుగాంచిన బుగులోని వెంకటేశ్వరస్వామి వారి జాతర కు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. భక్తి, సేవ, సాంస్కృతిక పరంపరలను ప్రతిబింబించే ఈ జాతర ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలు ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యార్థం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రూ.200 లక్షల నిధులు కేటాయించినట్లు, అట్టి అన్ని పనులు పూర్తి కావస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అప్పం కిషన్ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జీఎస్సార్….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T135721.287.wav?_=4

 

అప్పం కిషన్ ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధవారం భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ పుట్టిన రోజు సందర్భంగా కిషన్ ని ఆశీర్వదించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్సార్ మాట్లాడుతూ కిషన్ నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ సత్కారం

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

చిట్యాల, నేటిదాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది…ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయరాదని ఉన్న జీవోను రద్దు చేయించి ముగ్గురు పిల్లలు ఆ పైన ఉన్న కూడా స్థానిక సంస్థల పోటీ చేయొచ్చు అనే జీవోను ఇప్పించినందుకు గాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో *చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య,మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండెపరెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మట్టికి రవీందర్, *సీనియర్ నాయకులు సిరిపురం కుమారస్వామి ,కొర్రి సాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

పోలియో రహిత సమాజా నికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత

ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..

బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రెస్ మీట్ లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వెల్లడిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టి తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంటను పండించి రైతులను డోకా చేశారు.
317 జీవోను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే.
మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది.
రైతుబంధు పేరుతో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాల్లకు,ప్రైవేట్ కాలేజీలకు ప్రజా సొమ్మును పంచిపెట్టినది బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది.
అమరవీరుల కుటుంబాలను,ఉద్యమకారులను గుర్తించకుండా వారిని మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వమే.
పదేళ్ల కాలంలో సర్పంచులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైనది బిఆర్ఎస్ ప్రభుత్వం.
మహిళలకు పావలా వడ్డీకే 10 లక్షల రుణం ఇస్తానని ఇవ్వకుండా దూకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పి మోసం చేసింది కెసిఆర్
తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని డోకా చేసింది బిఆర్ఎస్ పార్టీ.
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వము.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తానని డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
పది సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగులను డోకా చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం.
గ్రూప్.1 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం.
పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో హడావిడి చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి ధరణిని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు భూములను అక్రమంగా కాజేసినారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

భూపాలపల్లిలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…

దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి, మునిసిపల్, పోలీసు అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
దసరా ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ స్టేడియంలో గతేడాది జరిగిన దసరా ఉత్సవాల్లో కొంతమంది అల్లరి మూకలు గొడవ చేశారని, ఈసారి అలాంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకి సూచించారు. ఉత్సవాలు ప్రజాస్వామ్య పండుగలా అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిఎస్పి సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి మధు అప్పం కిషన్ ముంజల రవీందర్ తదితరులు పాల్గొన్నారు

దండు రమేష్ కు రాష్ట్ర ఈ జీ సి కౌన్సిలర్ గా సన్మానం

దండు రమేష్ కు రాష్ట్ర ఈ
జీ సి కౌన్సిలర్ గా సన్మానం

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ బుధవారం రోజు జయశంకర్ భూపాలపల్లి భారత్ ఫక్షన్ హాల్ లో జరిగే దండు రమేష్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర ఈ. జి.సి. కౌన్సిల్ మెంబర్ గా నియమించిన సంధర్బంగా “సన్మాన మహోత్సవ” కార్యక్రమానికి
ముఖ్య ఆతిథులుగా విచ్చేస్తున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, నాగరిగారి ప్రీతం తెలంగాణ రాష్ట్ర ఎస్.సి.కార్పొరేషన్ చైర్మన్,గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి శాసనసభ్యులు, అయిత ప్రకాష్ రెడ్డి , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుటుంభ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా మనవి

మహారాణి బతుకమ్మ పాట సిడి ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర…

మహారాణి బతుకమ్మ పాట సిడి ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల, నేటిధాత్రి :

 

 

చిట్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన మహారాణి బతుకమ్మ పాటను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిడి ఆవిష్కరణ చేశారు
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేష్ ఎన్నో సామాజిక ఉద్యమ గీతాలు రాస్తూ ప్రజల మన్నలను పొందుతున్నాడని,
తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా విశిష్టమైనదని పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనదని ప్రపంచంలో ఎక్కడ లేదని తెలంగాణలో పండుగ వస్తే ఆనందంతో ఆడబిడ్డలు మెరిసిపోయే అంబరాన్ని తాకే సంబరాలు జరుపుకుంటారని పేర్కొన్నారు బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాల గురించి శాయంపేట మండలంలోని మాందారి పేట గ్రామానికి చెందిన గాయకులు మిద్దెపాక మధుకర్, అంబాల గ్రామానికి చెందిన గాయని
జేరిపోతుల సంధ్య, చాలా చక్కగా పాడారని అభినందించారు, ఈ పాట ఎమ్ ఎస్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ లో చూడవచ్చని చెప్పారు
ఈ కార్యక్రమంలో నటులు జన్నె యుగేందర్,గాయకులు పుల్ల ప్రతాప్, మిట్టపల్లి బాలు,దొగ్గేల దేవేందర్,గేయరచయిత బానోతు రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు

రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు…

రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు

నిధులు తెచ్చే దమ్ము లేక ప్రజలను శిలాఫలకలు వేసి ఏమార్చుతున్నావ్

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ ను ఒప్పించి కొప్పుల గ్రామం నుండి పరకా ల నేషనల్ హైవే మధ్యన చలి వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్టిహెచ్డిఎఫ్ 2023-24 నుండి రూ.574 లక్షలు మరియు కొప్పుల గ్రామం నుండి పరకా ల వరకు బిటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.585 లక్షలు మం జూరు చేయించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిం చడం జరిగింది. పనులు జరుగు తుంటే వాటిని వేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సిగ్గుచేటు.నేను నిధులు తెచ్చిన అంటూ మేము వేసిన శిలా పలకాల పక్కనే శిలాఫలకాలు వేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం ఏంటని ఏద్దేవా చేసిన భూపా లపల్లి మాజీఎమ్మెల్యే మండ లంలో పర్యటించిన భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లా డుతూ జోగంపల్లి గ్రామం నుండి మైలారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు హుస్సేన్ పల్లి నుండి మైలారం వరకు వయా పెద్ద చెరువు కట్ట మీదుగా కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా పనులు చేస్తున్నారు.కాంగ్రెస్ నాయ కుల వ్యవసాయ భూమి ఉందని రోడ్డు పక్కన ఉన్న చెరువుని ఆక్రమిస్తూ రోడ్డు వేస్తున్నారు.కాంగ్రెస్ నాయకు లకు సహకరించని అధికారు లను ట్రాన్స్ఫర్ చేయిస్తూ వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు.అదే విదంగా ఎస్సిలకి సంబంధించిన స్మశాన వాటికను కూడా ఆక్రమించుకు న్నారు.అంటే అధికార పార్టీ నాయకులు ఏదీ చేసిన మాఫ్ అనే ధోరణి నడుస్తుంది.
కావున ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం కొప్పుల గ్రామంలో వేసిన శిలా ఫలకాలను చూసి శిలాఫల కాల మోజులో ప్రజలను ఏమార్చుతున్నారు అంటూ చురకలు అంటించాడు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు వినతి పత్రం ఇచ్చిన..!

ఎమ్మెల్యే జిఎస్ఆర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రములో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాల వర్డన్ వెంటనే సస్పెండ్ చేయాలి మహిళా వార్డెన్ సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామేర కిరణ్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పెండింగ్ లో ఉన్న మేస్ కాస్మోటిక్స్. స్కాలర్ షిప్స్ & ఫిజురియంబర్స్ వెంటనే విడుదల చేయాలీ
జిల్లా కేంద్రములో విద్యార్థులు సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్వరం ప్రధాన కార్యదర్శి కుమార్ రాజ్ కుమార్ పాల్గొనడం జరిగింది

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా….

పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తా

ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

గ్రామీణ ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా సౌకర్యం కల్పించడం, విద్యార్థులు, కార్మికులు, రోగులు సులభంగా ప్రయాణించేలా చేయడం లక్ష్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలంతో పాటు గణపురం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొత్తం రూ.390 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో కమలాపూర్ నుండి పెద్దాపూర్ వరకు రూ.20 లక్షలు, ఎస్ యం కొత్తపల్లి నుండి దొమ్మటిపల్లి చెరువు వరకు రూ.100 లక్షలు, గొర్లవీడు గ్రామంలో జడ్పీ రోడ్డు నుండి మల్లయ్యపల్లి వరకు రూ.20 లక్షలు, ట్రాన్స్ఫార్మర్ నుండి మొరంచవాగు వరకు రూ.20 లక్షలు.
గణపురం మండలం రంగారావుపల్లి నుండి దశరథం తండా వరకు రూ. 20 లక్షలు, వీర్లపల్లి(బంగ్లాపల్లి) నుండి చక్రవర్తిపల్లి వరకు రూ.20 లక్షలు, బంగ్లాపల్లి ఎస్సీ కాలనీ నుండి మామిడి తోట వరకు రూ.20 లక్షలు, సీతారాంపూర్ నుండి కొండాపూర్ వరకు రూ.20 లక్షలు, అప్పయ్యపల్లి తూపురం నుండి కొండంపల్లి వరకు రూ.20 లక్షలు, గణపురం చీరలపల్లి చింతల నుండి లబ్బదండ వాగు వరకు రూ.130 లక్షలతో వ్యవసాయ పొలాలకు వెళ్లే అంతర్గత రోడ్ల నిర్మాణపనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

గొర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో గ్రామ దాతల సహకారంతో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా, సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎక్కడైతే శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయో, అక్కడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత గురించి పోలీసులు ఎల్లవేళలా పనిచేస్తున్నట్లు తెలిపారు. దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నిందితులను తొందరగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయన్నారు. గొర్లవీడు గ్రామస్తులు దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచి విషయమన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు కూడా ముందుకువచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించి ముఖ్య పాత్ర పోషించిన భూపాలపల్లి పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T125952.524.wav?_=5

మృతురాలు కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర సత్తన్న

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రానికి
చెందిన దేసు ప్రదీప్ వారి సతీమణి అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతి చెందగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు ఈరోజు ఉదయం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల పరమశించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే వెంట జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు పోశాల మహేష్ గౌడ్ మండల నాయకులు నేరెళ్ల రాజు యువజన నాయకులు కార్తీక్ కార్యకర్తలు ఉన్నారు

ఆ రహదారిలో ప్రయాణం.. నరకంతో సమానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T141236.528-1.wav?_=6

 

ఆ రహదారిలో ప్రయాణం.. నరకంతో సమానం

అడుగడుగునా భారీగుంత లు వాటిలో వర్షపు నీళ్ళు

తీవ్ర ఇబ్బందులు పడుతు న్న వాహన చోదకులు

 

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామం నుండి గంగిరేణిగూడెం గోరీకొత్తపల్లి రేగొండ భూపాలపల్లి కాలే శ్వరం వెళ్ళుటకు నర్సంపేట నుండి వయా మల్లంపల్లి ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యార్థం గత పది సంవత్సరాల క్రితం అప్పటి శాసనసభ స్పీకర్ మధుసూదననాచారి కాట్రపల్లి నుండి గంగిరేణిగూడెం వరకు ఒక కోటి 16 లక్షలతో ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను బీటీ రోడ్డు వేసి తీర్చడం జరిగింది.

 

 

వామ్మో ఈ రహదారిలో ప్రయాణించా లంటే నరకం కనిపిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిన వాళ్ళు గుల్ల కావడం కాయం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తున్న ఈ మార్గం ఎక్కడో కాదు. ప్రజలకు ఈ రహదారి ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ప్రయాణం సాగిస్తు న్నారు పాలకుల నిర్లక్ష్యానికి గురై కనీసం కాలి బాటలో కూడా నడవలేని దుస్థితి నెలకొం ది.గత 20 నెలలుగా అధికారం లోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం దేశానికి పట్టుకొమ్మ లైన గ్రామాలను విస్మరించిం ది.కనీస అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది గ్రామా ల్లో పారిశుద్ధ్యంలోపించి అనేక రోగాలబారిన ప్రజలు పడుతు న్న గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించక కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్ఛేనిధులు రాకుండా రాష్టంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని కాట్రపల్లి మాజీ ఎంపీటీసీ షేక్ అని ఫాగౌస్ విమర్శించాడు.

 

కావున రాష్ట్ర ప్రభుత్వం త్వర గా 42%బీసీ రిజర్వేషన్ అమ లు చేసి దొంగనాటకాలు ఆడ కుండా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వారు అన్నారు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం ఒక్క సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీని కుడా గెలుచుకో లేని దుర్భార స్థితిలో ఉందని కాంగ్రేస్ భయపడుతుందని , ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఇప్పటికైనా స్థానిక శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకొని ఈ రహదారిని మర మ్మత్తు చేయించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ ప్రజలు బాబు పెద్ద రమేష్ బాబు సాంబయ్య పాక చిన్న రాజయ్య బాబు చిన్నన్న బాబు తిరుపతి బాబు శ్రీను బైకని సాంబయ్య అరే తిరుపతి పోతరాజ్ ఐలయ్య నూనెటి రమేష్ ఎల్లవుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీఎస్సార్

పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
అధైర్యపడొద్దు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, బుద్దారం గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ముందుగా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి కోమల కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమల అంతిమ యాత్ర లో పాల్గొని పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్దారం గ్రామంలో పెరుమాండ్ల మొగిలి, బండి శాంతమ్మ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే వారి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటానని, దైర్యంగా ఉండాలని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు

గణపురంలో నూతన పోలీస్ సర్కిల్ ప్రారంభం…

గణపురం నూతన పోలీస్ సర్కిల్ ను ప్రారంభం కలెక్టర్, ఎస్.పీ గార్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

శాంతి భద్రతల బలోపేతమే ప్రభుత్వం లక్ష్యం ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

గణపురం నేటి ధాత్రి

గురువారం గణపురం మండలం కేంద్రంలోనిపోలీస్ స్టేషన్లో నూతన పోలీస్ సర్కిల్‌ను జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ ,ఎస్పీ కిరణ్ కరే గార్లతో కలిసి ప్రారంభించిన భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ “ప్రజల శాంతి భద్రతల బలోపేతం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందనీ,నూతన సర్కిల్ ఏర్పాటుతో చట్ట పరిరక్షణ మరింత సమర్థవంతంగా జరుగుతుంది” అన్నారు.ఈ సర్కిల్ పరిధిలో గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి మండలాల పోలీస్ స్టేషన్లు ఉండనున్నాయని తెలిపారు.ఈ నూతన సర్కిల్ కి చెన్నమనేని కరుణాకర్ రావు ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ప్రభుత్వం నియమించింది అని ఇన్స్పెక్టర్ కి ఎమ్మెల్యే జీఎస్సార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రైల్వే శాఖ మంత్రి ని కలిసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-1.wav?_=7


రైల్వే శాఖ మంత్రి ని కలిసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లాలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్
బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు వరంగల్ పశ్చిమ నాయిని రాజేందర్ రెడ్డి స్టేషన్ గణపూర్ కడియం శ్రీహరి,వర్ధన్నపేట కె.నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి గారినీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
కొత్త రైల్వే స్టేషన్ లైను ద్వారా పరిశ్రమలు ఏర్పాటకి అవకాశం ఏర్పడుతుందని, బొగ్గు గనులకి నిలయమైన భూపాలపల్లి జిల్లాలో కొత్త రైల్వే స్టేషన్ అవసరం ఎంతగానో ఉందని బొగ్గు రవాణా,వ్యవసాయ ఉత్పత్తుల రవాణా,రహదారి ప్రమాదాల నివారణకు దోహదపడుతుందన్నారు
ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ,త్వరలోనే తగిన నిర్ణయాలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు అని అన్నారు

భూపాలపల్లి లో ఇండియన్ గ్యాస్ ఏజన్సీఅదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-1.wav?_=8

భూపాలపల్లి లో ఇండియన్ గ్యాస్ ఏజన్సీఅదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.

భూపాలపల్లి నేటిధాత్రి

వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీలు మెరుగైన సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. భూపాలపల్లిలో సోమవారం అనంత పద్మనాభ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అదనపు ఎక్స్టెన్షన్ కౌంటర్ ను ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి మండలంలోని ఎస్ఎం కొత్తపల్లి లోని అనంత పద్మనాభ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కంకటరాజ వీరు గౌడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్కడి నుండి భూపాలపల్లి వినియోగదారుల కు గ్యాస్ సఫఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు భూపాలపల్లిలో అదనపు కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు కౌంటర్ ద్వారా వినియోగదారులకు సకాలంలో గ్యాస్ అందే విధంగా ఉంటుందని, అదనపు కౌంటర్ ను ఏర్పాటు చేసిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రాజవీర్ గౌడ్ ను ఎమ్మెల్యే ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అప్పం కిషన్, కంకటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫొటోస్.

శ్రీ పర్వత పర్వతవర్దిని రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T143751.150.wav?_=9

శ్రీ పర్వత పర్వతవర్దిని రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే

భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పర్వతవర్దిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యే.!

ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించాలి.

ఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామంలో పది సంవత్సరాల క్రితం మాజీ సర్పంచ్ దొంతుల చందర్ హయాములో ఎస్సీ కమ్యూనిటీ హాలు బేస్ మెంట్ లెవల్ పిల్లర్లు పోసి వదిలిపెట్టారు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం శిలాఫలకం 5.10.20.23
తారీకు నాడు వేసినారు సి డి ఎఫ్ నిధులు నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేసినారు మరి ఆ రోజు నుండి ఇప్పటివరకు లోపం ఎవరిది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను అని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు ఇప్పటికైనా నవాపేట దళితుల పైన గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే స్పందించి ఎస్సీ కమ్యూనిటీ హాలు కోసం అధికారులనుపిలిపించుకొని రిఎస్ట్మెంట్ వేసి 20 లక్షల రూపాయల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే సిసి రోడ్డు నిర్మాణం కూడా కాంటాక్ట్ ను పిలిపించి సిసి రోడ్డు పనులు జరిగే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రాజ పోశయ్య. రాజయ్య సురేష్ రాజు రవి రాములు భద్రయ్య రాము దుర్గయ్య లక్ష్మయ్య పోశయ్య కుమారు చేరాలు సూర్యకిరణ్ సాంబయ్య సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం

వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో వైఎస్సార్ ప్రజా పాలనకు నిలువెత్తు నిదర్శనమని, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సంక్షేమమే విధానంగా ప్రభుత్వం నడవాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు రాష్ట్రాన్ని సంక్షేమ యుగం వైపు తీసుకెళ్లిన మహానేత వైయస్సార్ అని ఎమ్మెల్యే అన్నారు. రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ, వారి అడుగుజాడల్లో రాష్ట్రంలో ప్రజా పాలన సాగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

 

 

 

గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యేభావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయ ఆవరణలో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… విరివిరిగా మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. అంతేకాకుండా, విరివిగా వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పండుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.

గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన

గణపురం పీఏసీఎస్ కార్యాలయంలో మొక్కలు నాటిన

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి

గణపురంమండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) కార్యాలయ ఆవరణలో చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, మొక్కలను నాటి, నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… విరివిరిగా మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. అంతేకాకుండా, విరివిగా వర్షాలు పడి పంటలు కూడా పుష్కలంగా పండుతాయన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం అనంతరంగణపురం మండల కేంద్రంలోని స్వర్ణ భారతి మండల సమాఖ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూసీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతారని తమ ప్రభుత్వం నమ్ముతోందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదేవిధంగా, రాష్ట్రంలో కోటి మంది మహిళలనుకోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు.ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని గుర్తుచేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి స్టాల్స్ ఏర్పాటు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని.!

*వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

* మొగుళ్ళపల్లి నేటిధాత్రి:*

 

 

మొగుళ్లపల్లి మండలం పర్లపెల్లి గ్రామంలో జీవనజ్యోతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిఎం సివిల్ సప్లై చంద్రబోస్ ఎమ్మార్వో సునీత రెడ్డి ఎంపీడీవో సుభాష్ చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ వారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు రైతు సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు అంబాల రవి వర్మ సీసీలు ప్రవీణ్ శ్రీనివాస్ బాపురావు వరి ధాన్యం కొనుగోలు కేంద్రనిర్వహికులు జీవనజ్యోతి గ్రామైక్య సంఘ ఓబీలు మరియు ఎస్ హెచ్ జి సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపంచాయతీ కార్యదర్శి అమాలి సంఘాలు మహిళా సంఘాలు గ్రామ ప్రజలు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version