సూర్య భగవాన సేవ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

సూర్య భగవాన సేవ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

గురువారం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన సూర్య భగవాన వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు నుండి కొడవటంచ జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
అనంతరం ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన వాసవి ఆర్య వైశ్య నిత్యాన్న సత్రంను ప్రారంభించి భక్తులకు అన్నదానం సేవలు ప్రారంభించారు.
తదుపరి రాయపల్లి గ్రామంలో బత్తిన అనిత కి చెందిన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుతోజ్ కిష్టయ్య కొడవటంచ ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు మండల అధ్యక్షులు ఈప్పకాయల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version