శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు…

శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్ దంపతులు

భూపాలపల్లి నేటిధాత్రి

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి ఆలయ ప్రాంగణంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
అనంతరం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version