నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిగ్రామంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో. లక్ష్మి రాజo.ఈ సందర్భంగా స్థానిక తంగళ్ళపల్లి.ఎంపీడీవో మండలంలో పలు గ్రామాల్లో రెండో విడత జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించి ఏమైనా అడపా దడపసంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు.పరిశీలిస్తున్నార.అని తెలుసుకుంటూ నామినేషన్ల పక్రియలోఎటువంటిచెదురు మధురుసంఘటనలు జరగకుండా పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా కొనసాగించాలని నామినేషన్ల ప్రక్రియ పై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేస్తూ ఏదైనా సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారమే దిశగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నామినేషన్.పక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చూసుకోవాలని సంబంధిత.అధికారులను ఆదేశించారు

భూపాలపల్లిలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…

దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి, మునిసిపల్, పోలీసు అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
దసరా ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ స్టేడియంలో గతేడాది జరిగిన దసరా ఉత్సవాల్లో కొంతమంది అల్లరి మూకలు గొడవ చేశారని, ఈసారి అలాంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకి సూచించారు. ఉత్సవాలు ప్రజాస్వామ్య పండుగలా అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిఎస్పి సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి మధు అప్పం కిషన్ ముంజల రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version