దేశ ప్రజల సంక్షేమమే బిజెపి లక్ష్యం. జీఎస్టీ స్లాబ్ లను తగ్గించి..దేశ ప్రజలకు ముందే పండుగ వాతావరణాన్ని కల్పించిన మోడీ
-బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి
-మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న భాజపా శ్రేణులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించేందుకు జీఎస్టీ స్లాబ్ లను భారీగా తగ్గించి దేశ ప్రజలకు ముందే దీపావళి పండుగ వాతావరణాన్ని కల్పించారని బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత, మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తూ..జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు మోరే వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో భాజపా శ్రేణులు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బిజెపి భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి& బిజెపి రాష్ట్ర నాయకులు చెవ్వ శేషగిరి ప్రజలను, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. దేశాన్ని ప్రపంచంలోనే వికసిత్ భారత్ గా మార్చే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీకి మంచి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత దేశ అభివృద్ధి, దేశానికి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి అగ్రరాజ్యమే వణికిపోతుందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. భారతదేశానికి వివిధ దేశాల నుంచి వస్తున్న మద్దత్, ఆదరణను చూసి అమెరికా వంటి దేశాలు కూడా ఈర్ష్య పడుతున్నాయన్నారు. మన దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల పెంచుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీకి దేశ ప్రజల అండదండలు మెండుగా ఉన్నాయన్నారు. జీఎస్టీ స్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వ్యాపారస్తులకు, ఆరోగ్య పరికరాల కొనుగోలు అమ్మకం దారులకు, మధ్యతరగతి ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుమ్మరి లచ్చమ్మ సారయ్య దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు బండారి రవీందర్ జిల్లా నాయకులు పోతుగంటి సాయిలు మండల ప్రధాన కార్యదర్శులు బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు రాస బిక్షపతి మండల కోశాధికారి వంగరవి మండల కార్యదర్శి పులి భాస్కర్ రెడ్డి చిలక మారి రాజేంద్రప్రసాద్ బూత్ అధ్యక్షులు పొడి శెట్టి రవి సామల తిరుపతిరెడ్డి రేపల శ్రీనివాస్ మధుకర్ ముక్క రవీందర్ తదితరులు పాల్గొన్నారు