బాలానగర్ లో.. సీఎం కఫ్ క్రీడలు ప్రారంభం
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలు ఎంఈఓ శంకర్ గురువారం ప్రారంభించారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తామన్నారు. గ్రామీణ స్థాయిలోని ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో పాల్గొనవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లెనిన్ గౌడ్, నందమోని రాజేశ్వరి దత్తాత్రేయ, వార్డు సభ్యులు, వివిధ పాఠశాలల పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
