ముస్లింలకు రంజాన్ తోఫా బట్టల పంపిణీ…

ముస్లింలకు రంజాన్ తోఫా బట్టల పంపిణీ

24వ వార్డు సిపిఐ కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు సిపిఐ కౌన్సిలర్ వేముల జ్యోతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో
రంజాన్
తోఫా ( లాల్చి క్లాత్, చుడీదార్ క్లాత్, పట్టు చీర, బట్టలను
ముస్లిం సోదరులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందులు, మజీద్ రిపేర్ల కొరకు నిధులు, ఈద్గా కబ్రిస్తాన్లకు నిధులు, ఇమామ్ మోజల్లకు గౌరవ వేతనాలు, అనేకమైన కార్యక్రమాలు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ సందర్భంగా 24వ వార్డు సిపిఐ కౌన్సిలర్ వేముల జ్యోతి-శ్రీకాంత్ కొనియాడారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ ఇర్ఫాన్, 24 వ వార్డు అధ్యక్షులు కేవీ అశోక్ గౌడ్, మైనార్టీ నాయకులు మజీద్ కమిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక…

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక

వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు17 సిపిఐ1 మొత్తం 18 మంది కౌన్సిలర్ల గెలుపొందడం జరిగింది ఆర్డిఓ హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ జోన ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిలర్ సభ్యులు అందరూ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది అనంతరం 2వార్డ్ కౌన్సిలర్ సభ్యుడు బుర్ర కొమురయ్యను ఏకగ్రీవంగా భూపాలపల్లి పురపాలక సంఘం చైర్మన్ గా ఎన్నుకున్నారు అలాగే వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎక్సెప్షన్ నెంబర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుల దేవన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version