వాహనాలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ చర్యలు.

 

వాహనాలకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ చర్యలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణలోని పండ్ల దుకాణాలను రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను రోడ్డుపై జరుగుతున్న యాక్సిడెంట్లను దృష్టిలో ఉంచుకొని వాహనదారుల రాకపోకలకు ఆటంకాలు రాకుండా రోడ్డుకు దూరంగా పెట్టాలని ఒక మార్కును నియమించి ఆ మార్కు బయట పెట్టవద్దని సూచించారు. మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

వారంరోజుల పాటు వన్ వే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలి…

వారంరోజుల పాటు వన్ వే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ నెమ్మదిగా వెళ్లాలి

దామెర ఎస్సై కొంక అశోక్ సూచన

పరకాల,నేటిధాత్రి

 

పరకాల నియోజకవర్గం దామెర మండల పరిధిలోని ఊరుగొండ నుండి ఎన్ఎస్ఆర్ హోటల్ వరకు జాతీయ రహదారిపై రోడ్డు మరమ్మతు పనులు నేటి నుండి ప్రారంభమయ్యాయి.ఈ పనులు వారం రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రోడ్డు పనుల దృష్ట్యా ఈ మార్గంలో వన్-వే విధానం అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.ఈ క్రమంలో వాహనదారులు ఓవర్‌టేకింగ్ చేయకుండా జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.దామెర ఎస్సై కొంక అశోక్ మాట్లాడుతూ,రోడ్డు పనుల సమయంలో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రత్యేకంగా ఊరుగొండ మార్గంలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండి,సూచించిన మార్గదర్శకాలను పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుందని పోలీసులు తెలిపారు.ప్రజల భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ చర్యలకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు….

 

కేంద్రీయ విద్యాలయం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు

◆”-: ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్

◆”-: మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పరిధిలోని కేంద్రీయ విద్యాలయం సమీపంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడం పట్ల ఝరాసంగం మండల్ మాజీ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జగదీశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో పోలీసులు సిమెంట్ బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

ఈ చర్యల వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, నిమ్జ్ పనులు ఇంకా ప్రారంభం కాకముందే ఈ విధమైన రద్దీ నెలకొంటే, పనులు ప్రారంభమైన తర్వాత వాహనాల రాకపోకలు మరింత పెరిగి ప్రమాదాలు అధికమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారంగా ఆ ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని జగదీశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు.

ప్రమాదాల నివారణకే రోడ్డు ముసివేత…

ప్రమాదాల నివారణకే రోడ్డు ముసివేత

◆- : ఝరాసంగం ఎస్సై క్రాంతి పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రమాదాల నివారణ కోసమే ఝరాసంగం మండలం మాచ్నూర్ గ్రామ పరిధిలో గల కేంద్రీయ విద్యాలయం వద్ద రోడ్డును ముసివేయడం జరిగిందని ఝరాసంగం ఎస్సై పాటిల్ క్రాంతి కుమార్ తెలిపారు.

సోమవారం కేంద్రీయ విద్యాలయం వద్ద ఝరాసంగం నుండి జహీరాబాద్ వెళ్లే రోడ్డు జంక్షన్ వద్ద మూసివేసి ఝరాసంగం నుండి జహీరాబాద్ వెళ్లేవారు నిన్జ్ రోడ్డు నుండి కృష్ణాపూర్ వైపు వెళ్లి యూటర్న్ తీసుకోవాలని ఆయన తెలిపారు. ఝరాసంగం వెళ్లేవారు బర్దిపూర్ వైపు వెళ్లి యూటర్న్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుందని ఆయన వివరించారు. జంక్షన్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున ప్రమాదాలు నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు

కాంగ్రెస్ ఖాతాలో చైర్మన్,వైస్ చైర్మన్ పీఠాలు.

కాంగ్రెస్ ఖాతాలో చైర్మన్,వైస్ చైర్మన్ పీఠాలు.

బెల్లంపల్లి నేటిధాత్రి:

 

బెల్లంపల్లి లో చైర్మన్,వైస్ చైర్మన్ పిఠము దక్కించుకున్న కాంగ్రెసు పార్టీ.
బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. మున్సిపాలిటీ 34 వర్డ్స్ ఉండగా 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా పీఠం దక్కించుకున్నారు.అలాగే 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేపట్టారు.
బెల్లంపల్లి లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఇండిపెండెంట్ 4 బిజెపి 1 కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా ఫోరం 19 స్థానాలతో చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవులతో గెలుపొందింది.
ఓట్ల లెక్కింపు రోజే గెలుపొందిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ క్యాంపు తరలించింది. క్యాంపును మహారాష్ట్రకు తరలించగా మూడు రోజులు అనంతరం ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ 14 సీట్లు తో క్యాంపుకు వెళ్లిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లను బుజ్జగింపుల్లో విప్లమై ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
మొత్తం మీద బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్గా దావా స్వాతి వైస్ చైర్మన్గా రగం శెట్టి సత్యనారాయణ ప్రమాణస్వీకారం నిర్వహించారు.
ఈ ప్రమాణస్వీకారాలను సబ్ కలెక్టర్ మనోజ్ , ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

జహీరాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారం: భారీ బందోబస్తు…

జహీరాబాద్ మున్సిపల్ ప్రమాణ స్వీకారం: భారీ బందోబస్తు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ప్రాంగణంలో కూర్చొనే సదుపాయాలు, తాగునీరు, విద్యుత్ వంటి వసతులు కల్పించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొననున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి, కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. టిఆర్ఎస్ బిజెపి కౌన్సిలర్లు హాజరు కాగా కాంగ్రెస్ ఎంఐఎం ఇండిపెండెంట్ హాజరు కాలేనందువల్ల
కాని కోరం లేనందున -చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను రేపటికి అనగా 17-02-2026. నాటికి వాయిదా వేయనైనది .

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

◆-: ఆల్ఫాబెట్స్ ఆధారంగా కౌన్సిల్ సభ్యులకు బల్లాల ఏర్పాటు

◆-: చైర్మెన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జైత్రం నాయక్, డీఎస్పీ సైదా నాయక్ లు తెలిపారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. మొదట కౌన్సిల్ సభ్యులందరికీ ప్రమాణం చేయించిన అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నిక కేంద్రం పరిసరాల్లో అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిఐలు శివలింగం, హనుమంతు, ఎస్సై వినయ్ కుమార్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన..

ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సీఎం రేవంత్ రెడ్డి గా భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కొడవటంచ ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్న నేపథ్యంలో, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ కొడవటంచ ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనులు, హెలిప్యాడ్ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం భూపాలపల్లి పట్టణంలోని మంజూరు నగర్‌లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణ స్థలం, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

న్యాల్కల్ దర్గా ఉర్సు షరీఫ్ జనవరి 30 నుండి ఫిబ్రవరి 6 వరకు

న్యాల్కల్ దర్గా ఉర్సు షరీఫ్: జనవరి 30 నుండి ఫిబ్రవరి 6 వరకు ఏర్పాట్లు జోరు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో హజ్రత్ పీర్ గైబ్ సాహెబ్ దర్గా 359వ ఉర్సు షరీఫ్ జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6, 2026 వరకు నిర్వహించనున్నట్లు ఉర్సు కమిటీ తెలిపింది.

ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లు, విద్యుత్ లైటింగ్, తాగునీటి సౌకర్యాలు, ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతిభద్రతల చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ ఉత్సవాలకు న్యాల్కల్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది.

ఐనవోలు జాతర సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సురేఖ,ఎమ్మెల్యే నాగరాజు..

ఐనవోలు జాతర సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సురేఖ,ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ, నేటిధాత్రి:

 

ఐనవోలు హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్ అధ్యక్షతన జనవరి నెల 13వ తేదీ నుంచి జరగబోయే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన జాతర సమీక్ష సమావేశంలో అటవీ–పర్యావరణ–దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రివర్యులు కొండ సురేఖతో కలిసి పాల్గొని జాతరలో పటిష్ట ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు…
అనంతరం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గోడ పత్రికను మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా కలెక్టర్, కమిషనర్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
ఐనవోలు మండలం పరిధిలోని వివిధ గ్రామాల నుంచి స్వామివారి ఊరేగింపుకు వచ్చే డీజేలను 20–30 సంఖ్యకు పరిమితం చేస్తూ కట్టడి చేయాలి.
మహిళలు బట్టలు మార్చుకునేందుకు శాశ్వతంగా బాత్రూమ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.
ఆలయ పరిసర ప్రాంతాల్లో హైమాస్ట్ (ఐమాక్స్) లైట్లు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
జాతర సమయంలో నిర్వహించే షాపుల్లో రాత్రి వేళ ఎవరు నిద్రించకుండా చర్యలు తీసుకోవాలి.
దుకాణదారులు వారికి కేటాయించిన స్థల పరిమితిలోనే వస్తువులు పెట్టేలా కట్టడి చేసి, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలి.
ఆలయంలో క్యూఆర్ కోడ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఐనవోలు పరిసర ప్రాంతాల్లో అనుసంధానమయ్యే రోడ్లపై మలుపుల వద్ద సైన్ బోర్డులు, ప్రికాషన్ బోర్డులు ఏర్పాటు చేయాలి.
రోడ్డు ఇరువైపులా ఉన్న ప్రమాదకరమైన చెట్లను తొలగించాలి.
జాతరకు వచ్చే మార్గాల్లో ఉన్న బావులు, మలుపుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
ఐనవోలు గ్రామ చెరువు చుట్టూ పూర్తి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.
ఐనవోలు ఆలయం నుంచి పున్నెల్ క్రాస్ రోడ్డు వరకు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలి.
ఐనవోలు ఆలయ ప్రవేశ ద్వారం మరియు బయటకు వెళ్ళే మార్గాల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
జాతర జరిగే పరిసర ప్రాంతాల్లో డీజేలు పూర్తిగా నిషేధిస్తూ కట్టడి చేయాలి.
జాతర సమయంలో తాగునీటి కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి.
అన్నదానం సమయంలో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి.
జాతర పరిసర ప్రాంతాల్లో గుడుంబా, లిక్కర్, గాంజా వంటి మత్తు పదార్థాలు రాకుండా ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి.
పోలీస్ శాఖ వారు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలి.
వీఐపీ దర్శనం చేసుకోవాలనే భక్తులు 500 రూ ప్రత్యేక దర్శన టికెట్‌తోనే దర్శనం చేసుకోవాలి దానిపై ఆలయ ఈవో పకడ్బంది చర్యలు చేపట్టాలి….
అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించాలని సూచిస్తూ, విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన అధికారులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు…
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పాయ్, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ వై.వి గణేష్, ఆర్డిఓ రమేష్ రాథోడ్, కుడపీవో అజిత్ రెడ్డి, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, కమిటీ సభ్యులు ఆలయ ఈవో సుధాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు….

భూపాలపల్లిలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే…

దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి, మునిసిపల్, పోలీసు అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..
దసరా ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ స్టేడియంలో గతేడాది జరిగిన దసరా ఉత్సవాల్లో కొంతమంది అల్లరి మూకలు గొడవ చేశారని, ఈసారి అలాంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకి సూచించారు. ఉత్సవాలు ప్రజాస్వామ్య పండుగలా అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిఎస్పి సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి మధు అప్పం కిషన్ ముంజల రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version