నియోజకవర్గ సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున చిట్యాల, రేగొండ, టేకుమట్ల, ఘన్పూర్ గోరుకొత్తపల్లి, మొగుళ్ళపల్లి, శాయంపేట, భూపాలపల్లి 8 మండలాల సీఎం కప్ నియోజకవర్గ క్రీడలను ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అంతకుముందు విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఆరోగ్యానికి స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ఉన్నత స్థాయికి తీసుకుపోవడంలో ఉపాధ్యాయులు అధికారులు ప్రోత్సహించాలన్నారు, అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కబడ్డీ ఆడి నారు, కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ, ఎంపీడీవో జయశ్రీ తాసిల్దార్ ఇమామ్ బాబా, క్రీడల కన్వీనర్ ఎంఈఓ రఘుపతి, సర్పంచ్ తవు టం లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ మాజీ ఎంపిటిసి దబ్బేట అనీల్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధరి రవి, కాంగ్రెస్ నాయకులు చిలకల రాయకొమురు, బుర్ర లక్ష్మణ్ గౌడ్ , గుర్రపు నరసయ్య ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
